మళ్ళీ లాక్‌డౌన్...అసలు నిజం ఇదే!

Publish Date:Mar 26, 2026

Advertisement

 

దేశవ్యాప్తంగా మరోసారి 'లాక్‌డౌన్' అనే పదం మార్మోగుతోంది. సరిగ్గా ఆరేళ్ల క్రితం 2020, మార్చి 24న భారత్‌లో అమలైన కఠిన లాక్‌డౌన్ రోజులను గుర్తు చేస్తూ, మంగళవారం రోజంతా గూగుల్ వంటి సెర్చింజన్లలో నెటిజన్లు దీని గురించి ఆరా తీశారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరించడంతో ఈ గందరగోళం మొదలైంది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని మోదీ, అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలను ప్రస్తావించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి గతంలో కోవిడ్ సమయంలో ప్రజలు చూపిన ఐక్యత, సహనం మరియు సంసిద్ధతను ఇప్పుడు కూడా ప్రదర్శించాలని కోరారు. అయితే, ఆయన 'కోవిడ్' అనే పదాన్ని వాడటంతో, అది కొత్త లాక్‌డౌన్‌కు సంకేతమని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలైంది.

దీనికి తోడు అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు కూడా ఈ రూమర్లకు ఆజ్యం పోశాయి. ఇంధన పొదుపు కోసం ఐఈఏ చేసిన 10 సూచనలను 'కోవిడ్ తరహా చర్యలు'గా అభివర్ణించింది. అందులో ఉన్న 'స్వచ్ఛంద అనే పదాన్ని తొలగించి, ప్రభుత్వం వీటిని 'తప్పనిసరి చేయబోతోందంటూ కొందరు తప్పుడు పోస్టులు పెట్టారు. దీంతో సామాన్యులు ఆందోళనకు గురై అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో భారీగా వెతకడం ప్రారంభించారు.

గతంలో లాక్‌డౌన్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వలస కూలీల కష్టాలు, ఆకస్మికంగా ఆగిపోయిన రవాణా వ్యవస్థ వంటి చేదు జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మళ్ళీ వస్తుందా? అనే చర్చ కూడా సాగింది. అయితే ప్రభుత్వం నుండి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదని, కేవలం పాత పరిస్థితులతో ప్రస్తుత సంక్షోభాన్ని పోల్చడం మాత్రమే జరిగిందని స్పష్టమవుతోంది.

ప్రస్తుతానికి దేశంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని, కేవలం ఇంధన వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రజలు కూడా ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై షేర్ చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 

By
en-us Political News

  
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.