జగనొచ్చాడు బాబోయ్!

Publish Date:Nov 16, 2013

Advertisement

 

 

 

జగన్ చదువుకునేటప్పుడు అన్ని పరీక్షలూ కాపీకొట్టే పాసైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ కాపీకొట్టే గుణాన్ని జగన్ రాజకీయాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఏ పని చేస్తే అదేపని, అదే తరహాలో చేసేస్తున్నాడు. బాబు దీక్షచేస్తే జగన్ దీక్ష చేశాడు. బాబు ఢిల్లీ వెళ్ళొచ్చాడని ఇప్పుడు జగన్ కూడా ఢిల్లీ వెళ్ళాడు.

 

రాష్ట్ర విభజన జరక్కుండా చూడాలని పలువురు జాతీయ నేతలను కలసి బతిమాలడం జగన్ పర్యటనలో పైకి చెబుతున్న ఎజెండా. అయితే జగన్ జాతీయ నేతలను కలవాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. అయితే జగన్‌ని కలవటానికి మాత్రం జాతీయ నేతలు ఆసక్తి కనబరచడం లేదు. లక్షల కోట్ల అవినీతి ఆరోపణలలో కొట్టుమిట్టాడుతూ, పదహారు నెలలపాటు జైల్లో వుండొచ్చిన జగన్‌తో మాట్లాడ్డానికి కూడా అనేకమంది జాతీయ నాయకులు ఇష్టపడటం లేదు. వాళ్ళంతా జగనొచ్చాడు బాబోయ్ అనుకుంటున్నారు.



పైకి సమైక్యవాదినని చెప్పుకుంటున్నప్పటికీ, సోనియాకీ, జగన్‌కి మధ్య రహస్య ఒప్పందాలు జరిగిన విషయం తేటతెల్లమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోనియాకి నమ్మినబంటు లాంటి జగన్‌ని కలవటం ఎందుకన్న అభిప్రాయం జాతీయ నాయకులలో కలిగింది. అయితే కలవటానికి వచ్చినవాడిని వద్దు పొమ్మనడం బాగోదన్న ఉద్దేశంతోనే తటపటాయిస్తున్నారు.  జగన్ తమను కలవటానికి వచ్చినా, ఏదో మాటవరసకి పలకరించడమే తప్ప అతనిని సీరియస్‌గా తీసుకోకూడదని జాతీయ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.



జగన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు గతంలో కలసిన నాయకులందర్నీ కలవటంతోపాటు మరికొంతమంది నాయకులను కూడా కలసి తన ‘సంఖ్యాబలం’ పెంచుకునే ఉద్దేశంలో వున్నట్టుంది. అయితే ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు లభించినంత ప్రాధాన్యం జగన్‌కి లభించకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పరీక్షల్లో కాపీకొట్టి పాసవ్వొచ్చేమోగానీ, రాజకీయాల్లో కాపీకొడితే ఫెయిలవటం ఖాయమని జగన్‌కి జ్ఞానోదయం  కలిగేలా చెప్పేదెవరు?

 

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.