ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వీసీ సజ్జనార్

 

టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున  సజ్జనర్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న సంగతి తెలిసిందే.

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక కొత్త మార్పు శకం ప్రారంభమైంది. ఆర్టీసీ బ్రాండ్‌ను మళ్లీ ప్రజల్లో స్థాపించేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆయన అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ‘మన ఆర్టీసీ’ అనే నినాదం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపే ప్రయత్నం చేశారు.

ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసి, ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపరిచారు. ఆదాయ వనరులను పెంచే దిశగా సరుకు రవాణా సేవలను విస్తరించి, ప్రత్యేకంగా కార్గో సేవలను ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, దాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో సజ్జనార్ కీలక పాత్ర పోషించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu