నార్సింగిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

 

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్‌ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఓ వ్యక్తిని బ్యాగ్‌తో అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు తరలించిన గోధుమ రంగు హెరాయిను గుర్తించారు. నిందితుడు హెరాయిన్ వినియోగిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తానే హెరాయిన్ కంజూమ్ సఫ్లయ్ చేస్తున్నట్లు కేటుగాడు ఒప్పుకున్నడు