కేసీఆర్తో హరీష్ రావు భేటీ .. ఎందుకంటే?
posted on Jun 9, 2025 4:33PM
.webp)
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్కు ఆయన వివరించనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీశ్రావు నేడు హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ విచారణలో ప్రాజెక్టు రీడిజైనింగ్కు దారితీసిన పరిస్థితులు, బ్యారేజీల నిర్మాణం, నిధుల సమీకరణ వంటి పలు కీలక అంశాలపై హరీశ్ రావు కమిషన్కు తన వాదనలు వినిపించారు. ప్రాజెక్టు లేఅవుట్ను చూపిస్తూ ఆయన వివరణ ఇచ్చారు.