బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌కి కోర్డు అరెస్ట్ వారెంట్ జారీ

 

 

 

ఎన్నికల సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారి మీద చట్టం దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతాపార్టీ నాయకుడు  గిరిరాజ్ సింగ్‌కు బొకారో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ అరెస్ట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కు బొకారో సబ్ డివిజనల్ జుడీషియల్ కోర్టు మేజిస్ట్రేట్ అమిత్ శేఖర్ స్పందించి అరెస్ట్ కు ఆదేశించారు. జార్ఖండ్ లో గిరిరాజ్‌కు వ్యతిరేకంగా రెండు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. తొలుత బొకారో, ఆతర్వాత దియోఘర్ జిల్లాలో కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం జార్ఖండ్‌లోని రాంచీలో ఎన్నికల ప్రసంగం చేసిన ఆయన నరేంద్ర మోడీకి ఓటు వేయనివాళ్ళు పాకిస్థాన్‌కి వెళ్ళిపోవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశంలో సంచలనం కలిగింది. ఈ విషయంపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఇప్పటికే గిరిరాజ్ ఎన్నికల ప్రసంగాలు చేయకూడదని నిషేధించింది.