దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్ విడుదల

 

విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శినా నాయక్  తెలిపారు. మొత్తం 11 రోజుల పాటు 11 అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.దుర్గగుడి స్థానాచార్య శివప్రసాద్ శర్మ వివరాల ప్రకారం అమ్మవారి అలంకారాలు ఈ విధంగా ఉంటాయి

సెప్టెంబర్ 22 న బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ.

23 న గాయత్రీ దేవి గా 
24 న అన్నపూర్ణాదేవి గా 
25 న కాత్యాయని దేవి గా 

26 న మహాలక్ష్మి గా 
27న లలితా త్రిపుర సుందరి దేవి గా
28న  మహాచండి దేవి గా

29 న సరస్వతి దేవి గా 
30 న దుర్గాదేవి గా 
1న మహిషాసుర మర్దిని దేవిగా
2 న రాజరాజేశ్వరి దేవి గా భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ.

అక్టోబర్ 2 వ తేదీ 9:30 కు పూర్ణాహుతి తో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణ నది లో హంస వాహన తెప్పోత్సవం జరగనున్నాది. సెప్టెంబర్ 29 వ తేదీ మూలనక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుండి 4:30 మధ్య సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu