కరోనా వ్యాప్తి విజృంభణ.. 24 గంటల్లో 3వేల పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3095 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దేశంలో ఇలా మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇది వరుసగా రెండో రోజు. కరోనా కట్టడికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి అని కేంద్రం పేర్కొంది.