తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

 తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజలుగా పలు ప్రాంతాలలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ముఖ్యంగా ఏపీలో భానుడు నిప్పులు  చెరుగుతున్నాడు. ఈ  హీట్ వేవ్  మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.  ఏపీలో వడదెబ్బకు నిన్న ఒక్క రోజే నలుగురు మరణించారు. నెల్లూరు జిల్లాలో నిన్న అత్యధికంగా 46.4  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.