ఒంగోలును వదిలే ప్రసక్తి లేదు

 తనకు రాజకీయ జీవితాన్నిఇచ్చిన ఒంగోలును వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బాలినేని కుండబద్దలు కొట్టేశారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో అయిన వాళ్లే కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం విలేకరులతో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికలలో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేస్తున్న వారిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఒంగోలు వాసులకే  తాను జవాబుదారిగా ఉంటానని అన్నారు.