రోడ్డు ప్రమాదంలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యేకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం నాయకుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  మార్కాపురం తెలుగుదేశం ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద బోల్తా పడింది. ఈ సంఘటనతో తీవ్రంగా గాయపడిన కందుల నారాయణ రెడ్డిని యర్రగొండపాలెంలోని ఓ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.