లావణ్య  మస్తాన్ సాయి వివాదంలో కొత్త ట్విస్ట్ ...డిఐ శ్రీనివాస్ పై వేటు

డ్రగ్  పెడలర్ లావణ్య సినీ హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదం కొనసాగుతుండ గానే మరో డ్రగ్ పెడలర్ మస్తాన్ సాయి ఎంటరయ్యారు. మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య అప్పగించింది. తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో లావణ్య మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో లావణ్య శ్రీనివాస్ తో మాట్లాడినట్టు పోలీసుల విచారణలో తేలడంతో శ్రీనివాస్ పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.చాలాకాలంగా వీరువురు ఫోన్ లో తరచూ మాట్లాడేవారు. లావణ్య కేసుకు సంబంధించిన సమాచారం శ్రీనివాస్ అందించే వాడని తెలుస్తోంది.  శ్రీనివాస్ ను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఏ కేసు విషయంలో వీరిరువురు మాట్లాడినట్టు  అనేది తెలియరాలేదు.