వసుధారకి చుక్కలు చూపించిన రిషి!

స్టార్ మా టీవీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతోన్న సీరియల్ 'గుప్పెడంత మ‌న‌సు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -681 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం జరిగిన ఎపిసోడ్ లో.. ప్రాజెక్ట్ టూర్ సాకుతో రిషి, వసుధారలను దూరంగా పంపిస్తుంటారు జగతి, మహేంద్రలు. ఆ విషయన్ని రిషి కి తెలియకుండా జాగ్రత్త పడుతారు.... జగతి, మహేంద్రలు రెడీ అవుతారు. ఆ తర్వాత వెళ్దాం పదా జగతి లేట్ అవుతుందని మహేంద్ర యాక్టింగ్ చేస్తాడు. అటుగా వస్తున్న రిషిని చూసి.. ఇంకా ఎక్కువ హడావిడి చేస్తూ, "లేట్ అవుతుంది" అని అంటాడు మహేంద్ర. ఇక అందరూ బయల్దేరే టైంకి అబ్బో కడుపు నొప్పి అంటూ మహేంద్ర తన పర్ఫామెన్స్ ని మొదలెడతాడు. అది చూసిన జగతి.. ఏమైంది మహేంద్ర అంటూ తను కూడా నటిస్తుంది. "ఏమైంది డాడ్.. పదా హాస్పిటల్ కి వెళ్దాం" అని కంగారుపడుతాడు రిషి. ఏం లేదు రిషి.‌. కడుపు నొప్పిగా ఉంది. నేను టూర్ కి రాలేను. జగతి నువ్వు ఒక్కదానివి వెళ్ళని మహేంద్ర అనగా.. "నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి" అని జగతి అంటుంది. మేడం మీరు డాడ్ ని చూసుకోండి.. నేను వెళ్తా టూర్ కి అని రిషి టూర్ కి  బయల్దేరుతాడు.  రిషి వెళ్ళాక.. "ఎలా ఉంది నా కడుపు నొప్పి నాటకం" అంటూ జగతితో సరదాగా మాట్లాడుతాడు మహేంద్ర. మరోవైపు జగతి, మహేంద్రలు ఇంకా రావట్లేదని వసుధార ఎదురు చూస్తూ.. వాళ్ళకి ఫోన్ చేస్తుంది.  వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో, మళ్ళీ రిషికి ఫోన్ చేస్తుంది. రిషి కూడా ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే వసుధార ముందు వచ్చి రిషి కార్ ఆపుతాడు. "జగతి మేడం, మహేంద్ర సర్ రాలేదా సర్" అని వసుధార అడుగుతుంది. "లేదు నేనే టూర్ కి వస్తున్నా" అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఇక కార్ ఎక్కిన దగ్గర నుండి టామ్ అండ్ జెర్రీ తీరుగా ఇద్దరు గొడవపడుతుంటారు. "సర్.. మొహం ఆలా పెట్టకపోతే కొంచెం నవ్వొచ్చు కదా" అని వసుధార అంటుంది. "హీ.. హీ  నాకు ఇలానే నవ్వడం వచ్చు.. నా మొహం ఇలానే ఉంటుంది"  అని వెంటకారంగా రిషి మాట్లాడుతాడు. కాసేపటికి "ఒక ప్రక్కన కార్ ఆపుతాను. ఇద్దరం కలిసి  కాఫీ తాగుదాం" అని రిషి అంటాడు. రిషి అంతకముందు వసుధారతో కార్ లో ప్రయాణిస్తున్నప్పుడు తను ఎలా ప్రవర్తించిందో అన్నింటిని గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కృష్ణని అడ్డుతొలగించే ప్రయత్నంలో ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -75 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. కృష్ణ ఇంటి నుండి బయటికి వెళ్లిపోదామని బట్టలు సర్దుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మురారి.. "ఏంటి కృష్ణా.. ఎక్కడికి వెళ్తావ్.. వద్దు" అని అంటాడు. "లేదు ACP సర్.. నేను మా ఊరు వెళ్ళిపోతాను. నేను చదువుకోవాలి. మా అమ్మ నాన్నల కలని నెరవేర్చాలి. నాకు ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఎప్పుడు ప్రేమగా చూసే అత్తయ్య కూడా.. ఈ రోజు నువ్ చదువుకోవద్దు అని చెప్పారు" అని కృష్ణ అనగానే.. లేదు కృష్ణ నేను అమ్మతో మాట్లాడుతా అని మురారి అంటాడు. ఇప్పుడు వెళ్తే మా ఊరికి బస్సులు ఉంటాయో, ఉండవో.. మీరు దింపేసి వస్తారా అని కృష్ణ అనగానే.. "నేను ఏం అంటున్నాను. నువ్వు ఎం అంటున్నావ్" అని మురారి అంటాడు. ఆటో వాడికి డబ్బులు ఇవ్వాలంటే. నా దగ్గర చేంజ్ లేవు. అయిదువందలకి చేంజ్ ఇస్తారా అని కృష్ణ అనగా.. "ఏంటి కృష్ణ ఇలా మాట్లాడుతున్నావ్" అని చెయ్యి పట్టుకొని మురారి ఆపే ప్రయత్నం చేస్తాడు. మీరు వదలండి అని కృష్ణ అనగానే బయటికి వెళ్తాడు మురారి.  బయట ఉన్న మురారి దగ్గరికి ముకుంద వచ్చి.. "పాపం కృష్ణ.. తనకు చదువుకోవాలని ఉంది. తన కలని నెరవేర్చే బాధ్యత నీదే. నా కోపం నీ మీదే, కృష్ణ మీద కాదు" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏంటి ముకుంద ఈ రోజు కృష్ణ గురించి ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తుందని అనుకుంటాడు మురారి. మరోవైపు రేవతి దగ్గరికి కృష్ణ వచ్చి.. "అత్తయ్యా.. నేను చదువుకుంటాను" అని అడుగుతుంది. "లేదు కృష్ణ నువ్వు చదవడం వీలు కాదు. ఇంకో రెండు సంవత్సరాల తర్వాత చదువుకో" అని అంటుంది. ఇప్పుడు ఎందుకు వద్దు రెండు సంవత్సరాల తర్వాత ఎందుకు అత్తయ్య అని కృష్ణ అడుగగా.. నీకు కొత్తగా పెళ్లి అయ్యింది. మురారిని దగ్గర ఉండి చూసుకోవాలని అనగానే.. "మురారిని ఎవరైనా ఎత్తుకుపోతారా" అని కృష్ణ అంటుంది. అప్పుడు ముకుంద ఎత్తుకుపోతుందని మనసులో అనుకుంటుంది రేవతి. ఇప్పుడు చదువు వద్దని రేవతి చెప్పగా సరేనని కృష్ణ అంటుంది. మరోవైపు మురారి ఆలోచిస్తూ.. అసలు కృష్ణ గురించి ముకుంద మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. అమ్మ ఎందుకు కృష్ణని చదువుకోవద్దని అంటుంది. నా గురించి ముకుంద గురించి అమ్మకి తెలిసిపోయిందా అని అనుకుంటాడు. కృష్ణని చదువు పేరుతో ఎలాగైనా దూరం పంపించేస్తే మురారితో ఉండొచ్చని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

ఆఫీస్ లో మొదటిరోజే సత్తాచాటిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -14 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. స్వప్నని ఇంప్రెస్ చేయాలని అదేపనిగా పొగిడేస్తుంటాడు రాహుల్. ఇక స్వప్న ఇంటికి వెళ్తాను అని చెప్పగా.. "మీకు అభ్యంతరం లేకపోతే నా కార్ లో తీసుకెళ్తాను. మీలాంటి సౌందర్య దేవతని ఆరాధించే అవకాశం కల్పించండి" అని అనగా సరేనని చెప్తుంది. ఇక రాహుల్ తన కార్ లో వెళ్తున్నంత సేపు ఏదో ఒక ప్రశ్న అడిగి స్వప్నని ఇబ్బంది పెడతాడు. ఇక స్వప్న తన ఇంటికి తీసుకెళ్తే ఎక్కడ దొరికిపోతానో అని టెన్షన్ పడుతుంది. కార్పోరేటర్ ఇంటిదగ్గర దిగుదామని మనసులో ఆలోచించుకొని.. అక్కడ కార్ ఆపమని రాహుల్ కి చెప్పి అక్కడ దిగేస్తుంది.  మరోవైపు రాజ్ గుడికి వెళ్ళి అక్కడ కావ్యతో గొడవపడుతాడు. అక్కడ గుడిలోని పూజారి వచ్చి ఇద్దరికి సర్దిచెప్తాడు. పూజారి చెప్పాడని వదిలేస్తున్నా అని రాజ్ అనగా.. నేను కూడా పూజారి చెప్పారనే వదిలేస్తున్నానని కావ్య అంటుంది.  ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్తాడు రాజ్. CEO గా మొదటిరోజు మేనేజర్ ని పిలిచి మాట్లాడతాడు. డల్లాస్ ప్రాజెక్ట్ ఏం అయిందని మేనేజర్ మూర్తిని అడుగగా.. "అది మనకు రాలేదంట సర్.. మీకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాలని అనుకున్నాను. కానీ మీరు వచ్చాక మొదటి ప్రాజెక్టే  ఇలా చేజారిపోతుందని అనుకోలేదు" అని చెప్తాడు. అప్పుడు రాజ్.. "అవునా మూర్తి గారు, మీరే కదా మేనేజర్.. ఫస్ట్ నుండి ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపింది మీరే, తక్కువ కోట్ చేసింది మీరే కదా మరి మనకెందుకు రాలేదు" అని అడుగుతాడు.  ఆ తర్వాత  డల్లాస్ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని రాజ్ తమ్ముడికి కాల్ వస్తుంది.  ఆ విషయం రాజ్ కి చెప్పగానే.. మూర్తి కంగారుపడతాడు. మనకెలా వస్తుందని ఆశ్చర్యపోతాడు. వెంటనే రాజ్.. "మూర్తిగారు మీరు మోసం చేశారు. మీరు ఇలా ఫ్రాడ్ చేస్తున్నారని తెలిసే మీకన్నా తక్కువ కోట్ చేశాను" అని చెప్తాడు. ఆ తర్వాత రాజ్ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు. "నువ్వు ఒక స్వరాజ్ ఇండస్ట్రీస్ లోని ఒక కంపెనీకి మేనేజర్ వి నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే, స్వరాజ్ ఇండస్ట్రీస్ కి CEO ని, ఇన్ని కంపెనీస్ ని మేనేజ్ చేసే నాకెంత ఉండాలి. నువ్వు చేసిన మోసానికి తగిన శిక్ష పడాలి" అని ఫ్లోర్ క్లీనింగ్ చేపిస్తాడు రాజ్. అలా మొదటిరోజే ప్రాజెక్ట్ దక్కించుకోవడమే కాకుండా.. మోసం చేస్తున్న మేనేజర్ మూర్తిని పట్టిస్తాడు.  స్వప్న వాళ్ళ ఇంటికెళ్ళి కనకంకి  దుగ్గిరాల కుంటుంబానికి నచ్చేశానని చెప్తుంది. వారింటికి కోడలిగా వెళ్ళబోతున్నాను అని స్వప్న చెప్పగానే.. కనకం ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నెటిజన్ల కామెంట్లతో హాట్ టాపిక్ గా మారిన 'బీబీ జోడి'

స్టార్ మా టీవీలో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమవుతున్న   డ్యాన్స్ షో 'బిబి జోడి'. సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్డులుగా శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న ఈ డ్యాన్స్ షో.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విడుదల అయిన ప్రోమోలో మితిమీరిన రొమాన్స్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెహబూబ్, శ్రీసత్య కలిసి చేసిన డ్యాన్స్ లో రొమాన్స్ డోస్ ఎక్కువగా ఉంది. ఇది ఒక లెవల్ అంటే.. ఆ డ్యాన్స్ చూసి రాధ.. " నైట్ లైట్స్ ఆఫ్ చేసి ఇలా ఒక సెటప్ వేస్తే ఎంత బాగుంటుందో " అని చెప్పింది. ఒక జడ్జ్ స్థానంలో ఉండి ఇలా చెప్పడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.  ఆ తర్వాత సదా తనదైన శైలిలో.. "ఏం మాట్లాడాలి దీని గురించి.. వెరీ హాట్" అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఒక ఎపిసోడ్‌లో శ్రీముఖి వేసుకున్న పొట్టి డ్రెస్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా వీళ్ళ పర్ఫామెన్స్ హాట్ టాపిక్ గా మారింది.  ఇంత అసభ్యకరమైన రొమాన్స్ తో కూడిన డ్యాన్స్ ని చూపిస్తూ.. సభ్యసమాజానికి  ఏం మెసెజ్ ఇస్తారంటూ ప్రేక్షకులు కామెంట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే శని, ఆదివారాలలో టీవీలో ప్రసారమయ్యే ఈ డ్యాన్స్ ని కుటుంబసభ్యులతో చూడకుండా ఉండటమే బెటర్ అని విమర్శకులు భావిస్తున్నారు. 

'ప్రతీ రోజూ వాలెంటైన్ డేలా ఉండాలి' అన్న శ్రేయ!

వాలెంటైన్స్ డేని సెలెబ్రేట్ చేసుకోవడానికి బుల్లితెర కూడా రెడీ ఐపోయింది. ఈ సందర్భంగా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ప్రోమోస్ ని విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈ డేని లవర్స్ కి మరింత స్పెషల్ గా ఉండడం కోసం ‘ఓ రెండు ప్రేమ మేఘాలు’ పేరుతో స్పెషల్ షో నెక్స్ట్ వీక్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది.  తాజాగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో మొత్తం సీరియల్ జోడీస్, రియల్ జోడీస్ అందరూ కనిపించారు. నూకరాజు-ఆసియా, నిఖిల్ విజయేంద్రసింహా-సుప్రీతా ఇలా చాలా మంది కనిపించారు. హోస్ట్ గా ప్రదీప్ కూడా రండి ప్రేమలో పడదాం అంటూ ఎంటర్టైన్ చేసాడు.   సీరియల్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినవారు సైతం వారి వారి జంటలతో పాల్గొన్నారు. నూకరాజు ఆసియాకి రింగ్ పెట్టాడు. తన గుండెల మీద పొడిపించుకున్న పచ్చబొట్టుని తడిమి చూసింది ఆసియా..ఎన్ని కష్టాలు వచ్చినా నీ చేయి వదిలిపెట్టను అని నూకరాజు తన మనసులో భావాన్ని చెప్పాడు.   అలా వాళ్ళు స్టేజ్ పైనే ప్రపోజ్ చేసుకున్న తర్వాత.. యాదమ్మ రాజు యూఎస్ లో ఉన్న తన భార్య స్టెల్లాతో వీడియో కాల్ లో మాట్లాడాడు. లైవ్ లోనే యాదమ్మ రాజు స్టెల్లాకి లవ్ యూ చెప్పాడు. ఆ మాటకు తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది స్టెల్లా. ఇక ప్రోమో చివరిలో శ్రేయ ఆమె హస్బెండ్ వచ్చారు..స్టేజి మీదే లిప్ కిస్ ఇచ్చుకున్నారు. "ప్రతీ రోజూ వాలెంటైన్ డేలా ఉండాలి" అని చెప్పింది శ్రేయ .

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పైకి పుష్ప మూవీ ఫేమ్ జగదీష్

పుష్ప మూవీలో అల్లు అర్జున్ పక్కన మూవీ మొత్తం కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగదీష్ అందరికీ గుర్తే. సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఎంత హైలైట్ అయ్యిందో జగదీష్ రోల్ కూడా అంతే హైలైట్ అయ్యింది. కొంత గ్యాప్ తీసుకున్న జగదీష్ ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫామ్ మీదకు రావడానికి సిద్దమయ్యాడు. 'సత్తిగాని రెండు ఏకురాలు' టైటిల్ కాగా "అమ్ముతడా..సస్తడా" అనేది టాగ్ లైన్. ఈ మూవీలో జగదీష్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అభినవ్ దండా దర్శకత్వం వహించగా పుష్ప', మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ మూవీని హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు ప్రాంతంలో చిత్రీకరించారు.  త్వరలో ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ మీద ఈ మూవీ రాబోతోంది. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ వారు మాట్లాడుతూ "విభిన్న కథా చిత్రాలను ఆదరించే మా ప్రేక్షకుల కోసం ఈ మూవీని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఓటిటి ప్లాట్ఫార్మ్ ద్వారా  కొత్త ప్రయోగాలు చేసి ఆడియన్స్ ని మరింత మెప్పించే అవకాశం ఉంది. దాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం. కంటెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ అందించడమే ఆహా లక్ష్యం. ఇది ఒక పవర్ ఫుల్ స్టోరీ అందులోనూ ఈ మూవీలో మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేయబోతోంది. ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని మా అభిప్రాయం. లీడ్ రోల్ జగదీష్ తో పాటు ఊహించని మలుపులు, మంచి కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి.  వెన్నెల కిషోర్, బిత్రి సతి, మోహన శ్రీ సురగా, రాజ్ తిరందాసు, అనీషా దామా వంటి ఎంతోమంది ఈ సినిమాలో కనిపించబోతున్నారు. " అని చెప్పారు.

అదుపుతప్పిన రాజ్ ని కాపాడిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ రోజుకో మలుపుతో బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఎపిసోడ్‌- 13లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్‌లో.. తన చెవికమ్మ కోసం రాజ్ ఇంటికి వెళ్తుంది స్వప్న. అక్కడ రాజ్ వాళ్ళింట్లో అందరూ కలిసి స్వప్నని ఇంటర్వ్యూ మాదిరి ప్రశ్నలు అడుగుతుంటారు. వాళ్ళు అడిగిన ప్రతీదానికి సమాధానం చెప్తుంది. కావ్య వాళ్ళింట్లో చెప్పిన ప్రతీది తన మాటలాగా ఇక్కడ రాజ్ కుటుంబసభ్యులతో చెప్తుంది. అక్కడ కావ్య మాటలన్నీ స్వప్న నోటివెంట విన్న వాళ్ళంతా చప్పట్లు కొడతారు. రాజ్ వాళ్ళ అత్త రుద్రాణి సైతం.. "ఇన్ని తెలివితేటలు ఉన్న ఈ పిల్ల.. మా ఇంటికి కోడలిగా వస్తే ఇక అంతే సంగతులు.. ఎలాగైనా తనని ఈ ఇంటి కోడలు కాకుండా చూడాలి" అని అనుకుంటుంది. స్వప్నని అడిగే ప్రతీ ప్రశ్నకి కావ్య చెప్పిన సమాధానాలే చెప్తూ ఉంటే.. అక్కడ అందరూ కావ్య వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతున్నట్టుగా ఉంటుంది. మొత్తానికి స్వప్న బాగా నటించి రాజ్ కుంటుంబానికి దగ్గర అవుతుంది. అయితే రాజ్ తన ఫోన్ నెంబర్ స్వప్నకి చెప్పాలనుకుంటాడు. అంతలోపే రాజ్ వాళ్ళ బాబాయ్ వచ్చి.. "రాజ్ నువ్వు గుడికి వెళ్ళాలి" అని కంగారుపెడతాడు. దీంతో స్వప్నకి ఫోన్ నెంబర్ చెప్పకుండానే రాజ్ గుడికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే రాహుల్ ఇదే అవకాశమని స్వప్నని ఇంప్రెస్ చేయాలని అన్నీ తనకి అనుకూలంగా మాట్లాడుతాడు.  మరోవైపు గుడికి వెళ్ళిన రాజ్..  గుడి లోపల ప్రదక్షిణలు చేస్తుంటాడు. అప్పటికే గుడిలోకి వచ్చి అర్చన చేపించి ప్రదక్షిణలు చేస్తుంటుంది కావ్య. రాజ్ వెనకాల కావ్య.. ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇంతలో గుడిలో ఆడుకుంటున్న పిల్లలు రాజ్, కావ్యలకి డాష్ ఇచ్చి వెళ్ళిపోతారు. అలా ఒక్కసారిగా పిల్లలు ఇద్దరినీ తాకేసరికి.. ఇద్దరూ పడిపోతుంటారు. అలా పడిపోతున్నప్పుడు కావ్య వెంటనే అదుపులోకొచ్చి ఆగుతుంది. ఆ తర్వాత తనముందే హోమంలో పడిపోతున్న రాజ్ ని ఒక చేతితో పట్టుకొని కాపాడుతుంది. కానీ రాజ్ తనని సేవ్ చేసిందని కూడా చూడకుండా కావ్యని తిడుతుంటాడు. అసలు ఏం అయ్యిందో కూడా తెలుసుకోకుండా కావ్యని మాటలు అంటాడు. ఇద్దరూ అలా‌ కాసేపు  ఒకరినొకరు మాటా మాటా అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

రేవతి పంతంతో ఏడ్చేసిన‌ కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్  భిన్నమైన కథతో మొదలై.. అత్యంత వీక్షకాదరణ పొందుతూ ఎపిసోడ్ -74 లోకి అడుగు పెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో..మురారి గురించి ఆలోచిస్తూ ముకుంద పరధ్యానంలో ఉండగా, అంతలోనే అలేఖ్య వచ్చి.. ఏంటి ముకుంద అలా ఉన్నావ్.. నీకు ఆదర్శ్ రావడం ఇష్టం లేదా.. కనీసం నీ గురించి పూజ చేసిన కృష్ణ, మురారి లకు థాంక్స్ కూడా చెప్పలేదని అంటుంది. ముకుంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. "ఏం మాట్లాడుతున్నావ్. మరి పూజలో కృష్ణ, మురారికి బదులు మీరు ఇద్దరు కూర్చొని పూజ చెయ్యొచ్చు కదా.. అలా చేయలేదు ఏంటి? అంటే ఆదర్శ్ రావడం మీకు ఇష్టం లేదా" అంటూ ముకుంద కౌంటర్ వేస్తుంది. అటు ఇటు పోయి నా మీద పడిందేంటని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలేఖ్య. మరోవైపు కృష్ణ తను రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా వస్తాయోనని టెన్షన్ పడుతుంది. మురారిని టెన్షన్ పెడుతుంది. అలా కృష్ణ టెన్షన్ పడడం చూసిన మురారి.. "కింద అమ్మ పూజ చేస్తుంది.. అక్కడికి వెళ్లి దేవుడికి మొక్కుకో" అని కృష్ణ తో చెప్తాడు. సరే అని కిందకి వెళ్తుంది. అక్కడ రేవతితో "నాకు ముందు హారతి ఇవ్వండి" అనగా భవాని చూసి.. "హేయ్ తింగరి పిల్ల.. ఏంటా హడావిడి" అని కోప్పడుతుంది. ఈ రోజు నా రిజల్ట్స్ అందుకే ముందు హారతి నాకు ఇవ్వమంటున్నానని కృష్ణ అనగానే.. రేవతి వచ్చి హారతి ఇస్తుంది. ఇంతలోనే మురారి వచ్చి నిన్నటి నుండి టెన్షన్ పడుతుంది పెద్దమ్మ అంటాడు. ACP సర్ నా రిజల్ట్స్ చూడండి అని అనగానే సరే అని ల్యాప్ ట్యాప్ తీసుకొచ్చి రిజల్ట్స్ చూస్తాడు. కృష్ణ డిస్టిక్ ఫస్ట్ లో పాస్ అవుతుంది. ఆ విషయాన్ని చెప్పకుండా సరదాగా కృష్ణని ఆటపట్టిస్తాడు మురారి. "కృష్ణ నువ్వు ఫెయిల్ అయ్యావ్" అని మురారి చెప్పగా... "నేను ఫెయిల్ అయ్యానా" అని అనుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అంతలోనే డిస్టిక్ ఫస్ట్ లో పాస్ అయ్యావ్ కంగ్రాట్స్ అని ఒక్కసారిగా అరుస్తాడు మురారి. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కృష్ణ. ముకుంద కంగ్రాట్స్ చెప్పి.. "ఇంకా వేరే స్టేట్స్ వెళ్లి చదువుకోవాలి" అని అనడంతో.. రేవతి ఒక్కసారిగా వీళ్ళేదు.. ఎక్కడికి వెళ్లనవసరం లేదు. ఈ ఇంటి కోడళ్ళు ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు"  అని గట్టిగా చెప్తుంది రేవతి. దాంతో బాధపడుతూ కృష్ణ తన గదిలోకి వెళ్తుంది. అలా వెళ్ళిన కృష్ణ ఏడ్చుకుంటూ ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి బ్యాగ్ సర్దుతుంటే.. మురారి వచ్చి ఇదేంటని అడగడంతో.. ఇంట్లో నుండి వెళ్లిపోతున్నానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జగతి, మహేంద్రల ప్లాన్ నెరవేరుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. టెలివిజన్ రంగంలో అత్యంత ఎక్కువ TRP తో దూసుకెళ్తున్న ఈ సీరియల్ ఎపిసోడ్ -680 లొకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో.. వసుధార ప్రాజెక్ట్ గురించి  రిషికి వివరిస్తుంది. ఎలాగైనా వసుధార నుంచి నిజం తెలుసుకోవాలని రిషి ట్రై చేస్తుంటాడు. అయితే వసుధార ఏ మాత్రం తెలియనివ్వదు.  మరొకవైపు రిషి, వసుధార లను కలిపే ప్రయత్నంలో జగతి, మహేంద్రలు చక్రపాణి దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. ఇద్దరిని దూరంగా ఎక్కడికైనా పంపిద్దాం. అప్పుడు వాళ్ళకి ఎక్కువ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు.. కానీ కాలేజీలో ఉన్నంత వరకే కదా... అలా ఇద్దరిని దూరంగా పంపిస్తే, ఒకరి గురించి ఒకరికి పూర్తిగా అర్ధం అవుతుందని జగతి చెప్తుంది. దానికి చక్రపాణి సరే అంటాడు. ఆటో కోసం వెయిట్ చేస్తున్న వసుధార దగ్గరికి రిషి వచ్చి.. లిఫ్ట్ ఏమైనా కావాలంటే అడుగు అనేసరికి.. "నాకెందుకు సర్ లిఫ్ట్. నేను ఇప్పుడు ప్రాజెక్ట్ హెడ్ ని శాలరీ బాగానే వస్తుంది. నేను క్యాబ్ లో వెళ్ళగలను. అయినా కొన్నాళ్ళకు కార్ కూడా కొంటాను.  మీలాగే లిఫ్ట్ కూడా ఇస్తాను" అని వసుధార అంటుంది. పొగరుకేం తక్కువ లేదని రిషి అనుకుంటాడు. ఏం అంటున్నారు సర్ అని వసుధార అడుగుతుంది. ఏం లేదని చెప్తాడు. రిషి మనసులో "ఇద్దరం ప్రేమించుకున్నాం.. నన్ను మిస్ అయ్యానన్న బాధ కనిపించడం లేదేంటి మరిచిపోయిందా? అని అనుకుంటాడు. రమ్మని పిలవచ్చు కదా అని వసుధార, వస్తానని అనొచ్చు కదా అని రిషి అనుకుంటారు. సరే వస్తాను అని వసుధార, ఒకే రా అని రిషి ఇద్దరు ఒకేసారి అనుకుంటారు. ఇద్దరు కార్ లో వెళ్తూ మాట్లాడుకుంటారు. రిషితో టూర్ గురించి ఎలా చెప్పాలని జగన్, మహేంద్ర టెన్షన్ పడుతారు. రిషి ఇంటికి వస్తాడు. "ఏమైనా చెప్పాలనుకుంటున్నారా డాడీ" అని భోజనం చేస్తూ రిషి అడుగుతాడు. ప్రాజెక్ట్ గురించి విలేజ్ టూర్ ప్లాన్ చేసామని మహేంద్ర అంటాడు. గుడ్ అని రిషి  అంటాడు. రిషి, వసుధారలని దూరంగా పంపించి, వాళ్ళు అనుకున్న ప్లాన్ ని జగతి, మహేంద్రలు అమలు చేస్తారో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నిబ్బానిబ్బి వేషాలు మానేయండి..వార్నింగ్ ఇచ్చిన యూట్యూబర్ నిఖిల్

వాలెంటైన్స్ డే రాబోతోంది. ఈ డే వచ్చే ముందు వారం అంతా రోజ్ అని, చాక్లెట్ డే అని రకరకాలుగా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. లవర్స్ ఉన్న వాళ్ళు ఓకే అదే సింగల్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ? మరి నిఖిల్ విజయేంద్ర సింహ కూడా అదే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తోంది.  ఈ వాలెంటైన్స్ డే మీద ఒక ఫన్నీ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "ఈ దిక్కుమాలిన వాలెంటైన్ వీక్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. రోజ్ డే, టెడ్డీ డే, గాడిద గుడ్డు డే, కొత్తిమీర డే, కరివేపాకు డే అనేది మొదలవుతుంది..దయచేసి ఆ ఫోజలు, ముద్దులు పెట్టుకునే వీడియోస్, లవ్ స్టోరీస్ పెట్టకండి...మా మనోభావాలు దెబ్బతింటాయి. ఈ నిబ్బానిబ్బి వేషాలు వేయడం మానేయండి. మాకు తెలుసు మీ ప్రేమ గురించి, మీరు చేసుకునే యానివర్సరీల గురించి ఏదైనా చేసుకోండి. కానీ నేను సింగల్ కాబట్టి నా లాంటి సింగిల్స్ ఎవరైనా ఇదే ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తూ ఉంటే కామెంట్ చేయండి..నాకు కూడా తోడు, నీడ, జాడ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతాను" అని చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో కింద సురేఖావాణి కూతురు సుప్రీతా "బాగా మండుతున్నట్టు ఉంది అనుకుంటా" అని రిప్లై ఇచ్చింది. సినిమా నటి అర్చన అలియాస్ వేద నవ్వుతున్న ఎమోజిస్ పెట్టింది.  "ఐతే ఏమిటి నువ్వు తొందరగా పెళ్లి చేసుకో ..లేదా ఒక అమ్మాయిని ఇంప్రెస్స్ చెయ్యి..వాళ్ళేదో సెలెబ్రేట్ చేసుకుంటే నీకెందుకు బాధ ? నువ్వు సింగల్ అంటే ఎవరూ నమ్మరు" అని కొంతమంది కామెంట్స్ చేస్తే " అది వాలెంటైన్స్ డే కాదు అది బ్లాక్ డే ఎంతోమంది జవాన్లు చనిపోయిన రోజు..వాళ్ళను గౌరవిద్దాం...వాళ్లకు రుణపడి ఉందాం" అంటూ కొంతమంది రిప్లై ఇచ్చారు.

జ్యోతక్క ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం

కొత్త ఏడాది ఇలా మొదలయ్యిందో లేదో బుల్లితెర స్టార్స్, యూట్యూబర్స్ అంతా కొత్త కొత్త ముచ్చట్లు చెప్తున్నారు. కార్లు, బైక్లు, ఇళ్ళు కొనుక్కుంటున్నారు..ఇప్పుడు జ్యోతక్క కూడా  కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. దానికి సంబంధించిన ఒక వీడియోని తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.  రీసెంట్ ఆమె తన అత్తారింటికి సంబంధించిన ఒక వీడియోని పోస్ట్ చేసి ఆ ఇంటి ఇంటీరియర్ మొత్తం కూడా పాడైపోయింది అని చెప్పి బాధపడింది. ఇప్పుడు ఆ ఇల్లు మొత్తాన్ని మళ్ళీ ఫ్రెష్ గా రెనోవేషన్ చేయించి ఆ ఇంట్లోకి మళ్ళీ గృహప్రవేశం చేశారు జ్యోతక్క అండ్ ఫామిలీ.. ఈ సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని వీడియో తీయించింది శివజ్యోతి. ఇంటికి వచ్చిన ముత్తైదువులు కాళ్లకు పసుపు రాయడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మొత్తం చూపించింది. ఇంట్లో పూజ కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు.  తర్వాత జ్యోతక్క ఫేవరేట్ దేవుడు వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్లారు. తీన్మార్ వార్తలతో  ఫేమస్ ఐన శివ జ్యోతి తెలంగాణ యాసలో మాట్లాడుతూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి ఫుల్ ఎంటర్టైన్ చేసింది.  జ్యోతక్కకు ఏమాత్రం ఖాళీ దొరికినా తన భర్తతో కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళిపోతుంది..అక్కడి వీడియోస్ ని కూడా అప్ డేట్ చేస్తూ ఉంటుంది.

మా ప్రేమ కథలో ఒక ఏడాది గడిచిపోయింది!

సింగర్ రేవంత్  గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇప్పుడు రేవంత్ తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని భార్య అన్వితతో కలిసి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. వాళ్ళు కలిసి దిగిన పిక్స్ తో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. రేవంత్ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకరు. బిగ్‌బాస్‌ హౌస్ లోకి వెళ్లే టైంకి అన్విత  ప్రెగ్నెంట్ అనే విష‌యాన్ని రేవంత్ చెప్పాడు. ఈ టైంలో భార్య‌కు అండ‌గా నిల‌బ‌డాల్సిన స‌మ‌యంలో ఆమెకు దూరంగా ఉన్నానంటూ చాలా సార్లు హౌస్ లో ఎమోష‌న‌ల్ అయ్యాడు.   తర్వాత అన్విత సీమంతం వేడుక‌ల‌ను బిగ్‌బాస్ హౌజ్‌లో నిర్వ‌హించారు. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 9 విన్న‌ర్‌గా నిల‌వ‌డంతో ఆయన టాలెంట్ లైం లైట్ లోకి వ‌చ్చింది. బాహుబ‌లి, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందంతో పాటు ప‌లు సినిమాల్లో పాట‌లు పాడాడు రేవంత్‌.  ఎవ్రీ స్టోరీ ఈజ్ ఏ లవ్ స్టోరీ అని ఫోటో టైటిల్ పెట్టుకున్నాడు. " మా ప్రేమ కథలో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నా ప్రియతమా" అని కాప్షన్ పెట్టాడు రేవంత్. బిగ్ బాస్ హౌస్ ఉన్నన్ని రోజులు చాలామంది కంటెస్టెంట్స్ రేవంత్ కి నెగటివ్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే రేవంత్ మాట్లాడే విధానం అగ్రెసివ్ గా ఉంటుందని తాను చెప్పేదే కరెక్ట్ అనుకుంటాడని ఎన్నో కారణాలు చెప్పారు. కానీ ఫైనల్ గా టైటిల్ మాత్రం రేవంత్ విన్ అయ్యాడు.  ఇక రేవంత్ కి నెటిజన్స్ అంతా "హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ" అని కామెంట్స్ లో విష్ చేశారు.  

రాత్రి ఉండేది ఎందుకో మీకు తెలుసా...అందుకే

జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. కొన్ని మర్చిపోతాం కొన్ని మర్చిపోలేక అవస్థలు పడుతూ సరిగా తిండి తినక నిద్రపోలేక పని మీద శ్రద్ద పెట్టకుండా చివరికి నీరసించిపోతాం. మన కష్టాల్ని, కన్నీళ్లను రాత్రి సమయాల్లో ఎక్కువగా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాం. ఇది ప్రతీ ఇంట్లో జరిగేదే ప్రతీ మనిషి జరిగేదే. మరి ఇదే విషయం మన చిత్తూర్ చిరుతకు కూడా జరిగింది. అందుకే రాత్రి పూట ఎక్కువగా బాధపడుతుందంట. మరి రాత్రి ఎందుకు ఉందో తెలుసా అంటూ రీసెంట్ గా ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది.  "జరిగినవన్నీ మర్చిపోయి బతకడానికి పగలు ఉంటే మర్చిపోయినవన్నీ గుర్తు చేసుకుని ఏడవడానికి రాత్రి ఉంటుంది" అంటూ ఒక వేదాంతం చెప్పింది గీతూ. ఇక ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ కీర్తి భట్ కూడా "యా డైలీ" నేను ఏడుస్తా అన్నట్టుగా రిప్లై ఇచ్చింది. "ఏడ్చేసిన తర్వాత ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ ఐపోయాక అనవసరంగా  ఏడ్చా నేనే ఏదో ఓవర్ థింక్ చేశా" అని మళ్ళీ ఫీలవుతా అంది గీతూ. ఇక నెటిజన్స్ కామెంట్స్ చూస్తే " అవును జరిగిపోయిన బీబీ కోసం, గెలవని కప్పు కోసం ..ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు లోపలి వెళ్లిపోయాయి గీతూ...నువ్ ఏం చెప్పినా వినాలపిస్తుంది..." అని అంటున్నారు. బిగ్‌బాస్ హౌస్ లో  గీతూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. టాప్-5 కంటెస్టెంట్‌నని బలంగా నమ్మిన ఈమె 9 వ  వారంలో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఎలిమినేట్ అవుతున్నప్పుడు బీబీ స్టేజి మీద కన్నీరుమున్నీరుగా ఏడ్చేసింది. ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఇలా కన్నీళ్లు పెట్టే లేడీస్ ఒక్కరైనా ఉంటారు.

ఫస్ట్ టైం మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొనుక్కున్న మోనిత

సోషల్ మీడియా హవా పెరిగాక కూరగాయలు కొనడం, బేరం చేయడం కూడా ఒక పెద్ద సబ్జెక్టు ఐపోయింది. మరి అంత పెద్ద సబ్జెక్టుని నేర్చుకోవడానికి బయల్దేరింది అమ్మడు మోనిత అదేనండి శోభా శెట్టి. కార్తీక దీపం ఐపోయినా మోనిత పేరే వస్తోంది కానీ అసలు పేరు ఎవరికీ గుర్తు రావడం లేదు. మరి సీరియల్ కి శుభం కార్డు పడ్డాక వంటలక్క వాళ్ళ ఊళ్ళో ఛిల్ల్ అవుతుంటే డాక్టర్ బాబు ఈవెంట్స్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తుంటే మన మోనిత మేడం మాత్రం ఫస్ట్ టైం కూరగాయలు కొనడానికి వెళ్ళింది. వెయ్యి రూపాయలకు ఎన్ని కూరగాయలు వస్తాయో కూడా తెలియదని చెప్తూ మూతికి మాస్క్ వేసుకుని కూరగాయలు అన్నీ కొనేశాక మాస్క్ తీసి వాళ్ళను సర్ప్రైజ్ చేస్తానని చెప్పింది. అలాగే కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లి కూరగాయలు కొన్నది. కూరగాయలు, బిర్యాని మసాలా ప్యాకెట్లు, హెయిర్ క్లిప్స్, బాగ్ , చీర కొనుక్కుంది...8 నిమ్మకాయలు 20 రూపాయలకు తీసుకుని షాకయ్యింది..ఇంట్లో కూర్చుని సూపర్ మార్కెట్ కి ఆర్డర్ పెట్టుకుంటే ఒక్కో నిమ్మకాయ 25 రూపాయలు పడుతుంది ఇలా వచ్చి కూరగాయలు కొనుక్కోవడం మంచి ఎక్స్పీరియన్స్ అని ఫీల్ అయింది. మధ్యలో కొంతమంది ఫాన్స్ కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే పాప్కార్న్ కొనుక్కుంది..మార్కెట్ లో  ఒక కూరలమ్మి గుర్తుపట్టి పిలిచి సీరియల్ బాగుందని చెప్పింది...ఆమె దగ్గర కూడా కూరలు కొనుక్కుంది మోనిత. ఇక ప్రతీ  ఆదివారం  ఇలా మార్కెట్ కి వెళ్లి కూరలు కొనుక్కుంటాను  అని చెప్పింది.

వాలెంటైన్స్ డే స్పెషల్....సడెన్‌గా చేతిలో మాత్రం బాబుని పెట్టొద్దు!

వాలెంటైన్స్ డే త్వరలో రాబోతోంది. ఇక బుల్లితెర ఈ వాలెంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్నో కలర్ ఫుల్ షోస్ ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమో ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా తీసుకొచ్చారు. "చెప్పు బుజ్జి కన్నా" అనే కాన్సెప్ట్ తో ఈ షో ప్రసారం కాబోతోంది. ఈ సందర్భంగా రష్మీని మళ్ళీ టార్గెట్ చేసాడు హైపర్ ఆది. "ఫెబ్ 14 కదా నేను ఒకళ్ళకి గట్టిగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను" అని రష్మీ అనేసరికి "నాకు ఇచ్చేయండి నేను వెళ్లి అతనికి ఇచ్చేస్తాను" అని ఆది అనేసరికి రష్మీ ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చింది.  "ఇంతకు బాబుకేమన్నా గిఫ్ట్ ఇచ్చావా మరి..బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఏదో ఒక రోజు సడెన్గా బాబుని ఇవ్వడాలు వంటివి చేయద్దు " అన్నాడు ఆది. బుల్లితెరపై లవ్ ట్రాక్ తో బాగా పాపులారిటీ సంపాదించిన జంట ఏదీ అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్పే మాట రష్మీ, సుధీర్ జోడి అని. జబర్దస్త్ లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఇక బుల్లితెరపై అన్ని చానల్స్ లో కూడా పాకి పోయింది అని చెప్పాలి. ఇక వీరిద్దరూ కలిసి ఒక్కసారి తెరపై కనిపించారు అంటే చాలు ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు. కానీ అభిమానులు మాత్రం వీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారని గట్టిగా ఫిక్స్ అయ్యారు.బుల్లితెరపై లవ్ ట్రాక్ తో బాగా పాపులారిటీ సంపాదించిన జంట ఏదీ అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్పే మాట రష్మీ, సుధీర్ జోడి అని. జబర్దస్త్ లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఇక బుల్లితెరపై అన్ని చానల్స్ లో కూడా పాకి పోయింది అని చెప్పాలి. ఇక వీరిద్దరూ కలిసి ఒక్కసారి తెరపై కనిపించారు అంటే చాలు ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు. కానీ అభిమానులు మాత్రం వీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారని గట్టిగా ఫిక్స్ అయ్యారు.  బుల్లితెరపై వేళ్ళ  లవ్ ట్రాక్ ఫుల్ ఫేమస్. వీరిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు మురిసిపోతూ ఉంటారు. అభిమానులు మాత్రం వీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కొన్ని కారణాల వలన రష్మీ-సుధీర్ జోడి స్క్రీన్ మీద కనిపించడం మానేసింది. ఐనా సరే వీళ్ళ తోటి కమెడియన్స్ మాత్రం వీళ్ళను మాత్రం అస్సలు వదలడం లేదు. ఏ చిన్న సందర్భం దొరికిన వీళ్ళను బాగా వాడేస్తున్నారు. వీళ్ళ మీద సెటైర్స్ వేసి రేటింగ్ ని పెంచుకుంటున్నారు.

నడుము చూపిస్తూ డాన్స్...ఎల్కేజీలో పడేయండి అంటున్న ఫ్యాన్

దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఒక యూట్యూబర్. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ, ఫొటోస్ పెడుతూ ఎప్పటికప్పుడు వైరల్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె తన నడుముని చూపిస్తూ ఒక డాన్స్ వీడియోని తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది.  "మీరు చెక్ చేశారా నన్ను" అని కాప్షన్ పెట్టేసరికి నెటిజన్స్ మాములుగా రెచ్చిపోలేదు. "తీసుకెళ్లి ఎల్కేజీలో పడేయండి" అని ఒక ఫ్యాన్ ఆమెకు  ఫన్నీగా కామెంట్ చేస్తే ఇంకొందరు మాత్రం "మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తా అన్నారు అది ఇదేనా..షన్నుకి దూరంగా వెళ్ళింది దీనికోసమేనా ? ఇలాంటి విన్యాసాలు సినిమాలో ఛాన్స్ కోసం  చేస్తున్నారా లేకపోతే ప్రపంచంలో అబ్బాయిలను  చెడగొట్టడానికి. చేస్తున్నారా ? షన్ను ఉంటే బాగుండు. నిన్ను దేవతలా చూసుకునేవాడు కానీ నువ్ బ్రేకప్ చెప్పి తప్పు చేసావ్.  ఇలాంటి డ్యాన్సులు చేస్తే ఇంట్లో ఏమీ అనరా నిన్ను ? " అంటూ తిడుతున్నారు. దీప్తి సునైన బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్.  10 వారాల పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా  హౌస్లో ఉంది దీప్తి.  ఈమె షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీసుల్లో నటించింది.  దీప్తి -షణ్ముఖ్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరూ కలిసి అనేక డాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అలా ప్రేమలో పడి చివరికి 2021లో బ్రేకప్ చెప్పుకున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ మరో  కంటెస్టెంట్ సిరితో సన్నిహితంగా ఉండడం నచ్చక  దీప్తి బ్రేకప్ చెప్పిందనే వాదన ఉంది. 

శృతిమించి రాగాన పడుతున్న బీబీ జోడీస్ డాన్స్ షో

బీబీ జోడి ఈ వారం మరీ హద్దులు దాటి శృతిమించి రాగాన పడినట్టు కనిపిస్తోంది. ఒక్కో వారం ఒక్కో థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ షో.. డాన్స్‌లో కొత్త కొత్త ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తూ పర్ఫెక్ట్ స్టెప్స్ తో అలరిస్తున్నారు. కానీ కొన్ని డాన్స్ స్టెప్స్ మాత్రం ఏ సర్టిఫికెట్ కి సంబంధించినవే ఉంటున్నాయి..ఇక జడ్జెస్ కామెంట్స్ కూడా అడల్ట్ బేస్డ్ వే వినిపిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ ఐన లేటెస్ట్ ప్రోమో చూస్తే అది అర్ధమవుతుంది. ఈవారం బీబీ జోడిలో "కొరియోగ్రాఫర్స్ రౌండ్" ని అనౌన్స్ చేసింది శ్రీముఖి.  మెహబూబ్-శ్రీసత్య, అఖిల్-తేజస్వి జంటల మధ్య కెమిస్ట్రీ చూస్తే ఎవ్వరికైనా సెగలు పెట్టాల్సిందే అన్నట్టుగా ఉంటున్నాయి. డ్రెస్సింగ్ స్టైల్ కానీ డాన్స్ స్టెప్స్ కానీ అంతకు మించి అన్నట్టుగా ఉంటున్నాయి. బాహుబలి’ సినిమాలోని మనోహరి పాటకు మెహబూబ్-శ్రీసత్య జోడి చేసిన డాన్స్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చూస్తే మాత్రం రియల్ జోడి ఏమో అన్నట్టుగా ఉంటుంది. ఇక వీళ్ళ డాన్స్ కి జడ్జి రాధ "నైట్ టైంలో లైట్స్ అన్నీ డిం చేసేసి అలా వింటుంటే చాలా బాగుంటుంది కదా శ్రీముఖి" అన్నారు. తర్వాత  అఖిల్ - తేజు జోడి ‘లై’ సినిమాలోని ‘బొమ్మోలే ఉందిరా పోరి’ పాటకు డాన్స్ చేశారు. డాన్స్ లో భాగంగా తేజు వెనక్కి తిరిగి ఒక హిప్ మూవ్మెంట్ చేసింది. దానికి జడ్జి తరుణ్ మాస్టర్ పేపర్ చింపి మరీ బాగుందని చెప్పారు. వీళ్ళ డాన్స్ భంగిమలేమో గాని ఏదో బూతు డాన్స్ చూస్తున్న ఫీలింగ్ ఐతే రాక మానదు. కొంచెం పద్దతిగా, నీట్ గా చేసే జంట ఏదైనా ఉంది అంటే అది ఆర్జే కాజల్ జోడి.  ఇక వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కి నెటిజన్స్ మాత్రం ఫుల్ ఫిదా ఐపోతున్నారు. ఎవ్రీ వీక్ వీళ్ళలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్స్‌ప్రెష‌న్స్ క్వీన్ పూర్ణ ఫుల్ చిల్ అవుతోంది!

పూర్ణ హ్యాపీగా పెళ్లి చేసుకుని తల్లి కాబోతోంది..రీసెంట్ గా ఈమె సీమంతం వేడుకలు కూడా జరిగాయి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండాలో పూర్ణ కూడా అంతే హ్యాపీగా ఆడిపాడుతోంది. ఆ డాన్స్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ సునీత రావుతో కలిసి ఫుల్ ఛిల్ల్ అవుతోంది. "టంటం" అనే సాంగ్ కి ఇద్దరూ సేమ్ స్టెప్స్ తో సేమ్ ఎక్స్ప్రెషన్స్ తో చేశారు. సునీతరావు కూడా ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంది   "ఓహ్ మై గాడ్ మేము కలిసి డ్యాన్స్ చేసి చాలా కాలం అయ్యింది..ఒక కొరియోగ్రాఫర్‌గా చాలా సంతోషకరమైన విషయం ఒకటి నీతో షేర్ చేసుకోవాలి..అదేంటంటే నా కొరియోని పర్ఫెక్ట్ గా చేస్తావు అందంగా మార్చేస్తావు. నీలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎవరికీ రావు. నువ్వే నా ఎక్స్ప్రెషన్స్ క్వీన్...మై బెస్టీ. నిన్ను చూసి చాలా రోజులయ్యింది .అమ్మవు అయ్యాక చూడడం చాలా సంతోషంగా ఉంది.నీకు నీ జూనియర్ కి నా ముద్దులు, హగ్గులు" అని కామెంట్ పెట్టింది.  ఇక పూర్ణ  ఆది తీస్‌మార్‌ ఖాన్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నాని "దసరా" మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.  ఇక ఈమె ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో జడ్జిగా చేసి బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.

రాజ్ కి స్వప్న మరింత దగ్గర అవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‌'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్- 12 లోకి అడుగుపెట్టింది. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో.. స్వప్న అందంగా ముస్తాబై రాజ్ ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని వస్తుంది. తను ఇంటి నుండి‌వచ్చేప్పుడు మొబైల్ మర్చిపోయి వస్తుంది. కావ్య, అప్పు ఇద్దరు కలిసి‌ స్వప్న ఫోన్ ఇవ్వడానికి రాజ్ ఇంటి గేట్ వరకు వస్తారు. వాచ్ మెన్ వీరిద్దరిని‌ రానివ్వకుండా ఆపేస్తారు. మేము చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చామని కావ్య చెప్పగా.. అప్పు తన రౌడీయిజాన్ని చూపిస్తుంది. స్వప్న మనసు గెలుచుకోడానికి రాజ్ తన కుటుంబ సభ్యులని పరిచయం చేస్తాడు. రాజ్ వాళ్ళ‌ అత్తయ్య రుద్రాణికి  అసలు నిజం తెలిసి, స్వప్నని‌‌ ఇండైరెక్ట్ గా అనుమానిస్తుంటుంది.‌ రుద్రాణి మాట్లాడిన ప్రతీసారీ, తనకి నిజం తెలిసిందేమోనని స్వప్న డౌట్ పడుతుంది. మరోవైపు రాజ్ తన కుంటుంబాన్ని పరిచయం చేస్తాడు. తను బాగా రిచ్ అని నిరూపించుకోవడానికి యాక్ట్ చేస్తుంటుంది స్వప్న.  రాజ్ కి వాచ్ మెన్ కాల్ చేసి బయట ఒక అమ్మాయి వచ్చి అల్లరి చేస్తుందని చెప్తాడు. దీంతో రాజ్ గేట్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ కావ్య ఉంటుంది.  "నువ్వా మళ్ళీ వచ్చావా? మళ్ళీ  ఏం గొడవ చేయడానికి వచ్చావ్" అని రాజ్ అంటాడు. "చెప్పేది వినకుండా.. అసలు పట్టించుకోకుండా ఏది పడితే అది ఊహించుకోకండి. మేం ఒక పని మీద వచ్చాం" అని కావ్య చెప్తుంది. ఈ గొడవని ఇంట్లో నుండి స్వప్న చూస్తుంది. తొందర తొందరగా బయటకు వచ్చి రాజ్ ని లోపలికి తీసుకొస్తుంది స్వప్న. రాజ్ నేను వాళ్ళని పంపిస్తా అని చెప్పి కావ్య దగ్గరకి వచ్చి.. "వెళ్ళిపో.. ఇక్కడికెందుకు వచ్చావ్" అంటూ కోప్పడుతుంది స్వప్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.