వసుధార ఇచ్చిన 'క్లూ' ని కనిపెట్టలేకపోయిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ అత్యధిక  టిఆర్పీతో దూసుకుపోతుంది. అయితే వసుధార మెడలో ఎవరు తాళి కట్టారోననే సస్పెన్స్ గత కొన్నిరోజులుగా సాగుతుంది. కాగా ఎంత ప్రయత్నించినా రిషి తెలుసుకోకపోగా.. అసలు నిజం దాస్తూ వసుధార పట్టుదలతో ఉంది. రోజుకో ట్విస్ట్ తో కథనం సాగుతుంది. ఎపిసోడ్ -687 లోకి అడుగు పెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. జగతిని తీసుకొని రిషి బయలుదేరుతాడు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని రిషి అడుగగా.. వసుధార ఇంటికి వెళ్తున్నామని జగతి చెప్తుంది. అక్కడికి అయితే నేను వచ్చేవాడిని కాదని రిషి తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి వసుధార ఉండే ఇల్లు వస్తుంది. ఇంటి ముందు రిషి కార్ అపి.. "మీరు వెళ్ళండి మేడం.. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను" అని అనడంతో జగతి ఒక్కతే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన జగతిని వసుధార చూస్తుంది. "రండి మేడం.. అది రిషి సర్ కార్ సౌండ్ లా ఉంది మేడం.. మహేంద్ర సర్, రిషి సర్ కార్ తీసుకొచ్చారా" అని వసుధార అడుగుతుంది. లేదు రిషీనే వచ్చాడని జగతి చెప్తుంది. మేడం ఇప్పుడే వస్తాను అంటూ.. రిషి దగ్గరికి వెళ్తుంది వసుధార. అలా బయటకు వస్తున్న వసుధారని రిషి చూస్తాడు. చూసి చూడనట్డుగా  నటిస్తాడు. వసుధార వచ్చి లోపలికి రండి సర్ అని పిలుస్తుంది. అలా తను అనగానే.. నాకు తలనొప్పిగా ఉంది.. నిన్న నీకు వచ్చినట్లే ఈ రోజు నాకు తలనొప్పి వచ్చిందని రిషి అంటాడు. వసుధార కావాలనే కొంటెగా చూస్తూ.. "సర్ ఒకవేళ వస్తే 5 మినిట్స్ తర్వాత రండి" అని చెప్పేసి వసుధార వెళ్ళిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఎందుకు వాళ్ళ ఆయన్ని దాచేస్తుందా.. అని ఆవేశంగా లోపలికి వెళ్తాడు. లోపల అలా వెతుకుతుంటాడు. అది చూసి వసుధార నవ్వుతుంది. "సర్ మీకు కావలిసిన మనిషి లోపల గదిలో  ఉన్నాడు" అని అనగానే.. రిషి ఆత్రంగా పరుగులు తీస్తాడు. కాని లోపలికి వెళ్లేసరికి ఎవరు ఉండరు. అద్దంలో తనకు తాను కనిపిస్తాడు. అదేంటి నాకు నేను కనిపిస్తున్న ఎవరు లేరేంటి?  అని కోపంగా నన్ను పిచ్చివాణ్ణి చేస్తుందేంటి అని బయటికి వచ్చేస్తాడు. అక్కడే ఉన్న చక్రపాణి, జగతిలు ఆపే ప్రయత్నం చేసినా వినకుండా రిషి వెళ్ళిపోతాడు. ఇక జగతి కోపంతో, ఎందుకిలా చేస్తున్నావ్ వసుధార.. నిజం చెప్పేయొచ్చు కదా అని అంటుంది. లోపల అద్దం ఉంది మేడమ్. అందులో తను ఒక్కడే కన్పించినప్పుడు.. నేనేనా తన భర్తని అని కనిపెట్టొచ్చు కదా మేడం.. ఇక రిషి సర్ కనుక్కోలేడు కానీ నేనే నిజం తెలిసేలా చేస్తానని వసుధార చెప్తుంది. వసుధార వాళ్ళ ఇంట్లో జరిగిందంత మహేంద్రకి చెప్తుంది జగతి. ఆ తర్వాత పదా.. వెళ్ళి వసుధారతో మాట్లాడదామని ఇద్దరు వెళ్తారు. మరోవైపు రిషి కోపంగా కాలేజీకి వెళ్తాడు. కాలేజీలో లైబ్రరీకి వెళ్ళి.. "లోపలికి ఎవరిని రానివ్వకు" అని ఆఫీస్ బాయ్ కి చెప్పగానే.. సరే సర్ మీకు ప్రశాంతత కావాలి .. అంతేగా అని లైబ్రరీ డోర్ వేసి వెళ్ళిపోతాడు. అప్పటికే లైబ్రరీలో వసుధార ఉంటుంది. అయితే ఆఫీస్ బాయ్ తనని చూడకుండా డోర్ వేస్తాడు. లోపల వసుధార ఉన్నట్లు రిషికి తెలియదు. రిషి ఉన్నట్లు వసుధారకు తెలియదు. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కనకం అత్యాశకి దుగ్గిరాల కుటుంబం సెట్ అవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ -20 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. ఇంట్లో అందరు కనకం చెప్పినట్టే వింటామని మాట ఇవ్వడంతో తన ఆనందానికి అవధులు లేకుండాపోతాయి. మరోవైపు రాజ్ ని కాకుండా రాహుల్ ని ప్రేమిస్తున్నాననే విషయాన్ని కనకంకి చెప్పాలా? వద్దా? అనే సతమతంలో స్వప్న ఉండగా.. కనకం వాళ్ళ అక్కకి కాల్ చేస్తుంది. కనకం వాళ్ళ అక్కకి మిస్డ్ కాల్ ఇవ్వగా.. అక్క మీనాక్షి  తిరిగి ఫోన్ చేస్తుంది. ఇక సంతోషంగా ఫీల్ అవుతున్నట్టుగా.. జరిగిన విషయాలన్నీ చెప్తుంది. చివరికి పెళ్లిచూపులు మీనాక్షి ఇంట్లో జరిగేలా కనకం ప్లాన్ చేస్తుంది. ఇక పెళ్లి చూపులకు అయ్యే ఖర్చు గురించి కావ్య ఆలోచిస్తుంటుంది. వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, మనల్ని కట్నం అడగరు.. కానీ పెళ్లి మాత్రం ఘనంగానే చెయ్యాలి నాన్న అని కృష్ణమూర్తితో కావ్య అంటుంది. "నువ్వు నీ అమ్మ, అక్కల.. గొంతమ్మ  కోరికలు తీర్చడానికి చాలా కష్ట పడుతున్నావ్.. మీ ముగ్గురి పెళ్ళిళ్ళకని కొంత డబ్బు డిపాజిట్ చేసాను కదా ఆ డబ్బులతో దాని పెళ్లి చేద్దాం" అని అంటాడు కృష్ణ మూర్తి. అప్పువి దాని చదువుకు ఉపయోగపడుతాయి. నా డబ్బులు, అక్కవి రెండిటితో పెళ్ళి చేద్దామని కావ్య అనగా.. "నా డబ్బులతో వద్దు.. నాకు పెళ్లి అయ్యాక చేతిఖర్చులకు కావాలి" అని స్వప్న చెప్తుంది. అలా స్వప్న చెప్పగానే.. "కావ్య తన డబ్బులు కూడా కలిపి నీ పెళ్లి చేస్తానంటుంది.. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావ్" అని స్వప్నని కోప్పడతాడు కృష్ణమూర్తి. మరోవైపు రాజ్ చెంపపై కావ్య కొట్టడాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ.. తనపై కోపం పెంచుకుంటాడు. ఇప్పుడు ఆ చేదు అనుభవం ఎందుకు తలుచుకోవడం.. ఇప్పుడు నా జీవితాన్ని షేర్ చేసుకొనే స్వప్న దగ్గరికి వెళ్తున్నాను కదా అని అనుకుంటూ రాజ్ సిగ్గుపడతాడు. పెళ్లి చూపులకు మంచి రోజు ఉందో లేదో పంతులిని రాజ్ వాళ్ళ అమ్మ ఇంకా కుటుంబసభ్యులు అడిగి తెలుసుకుంటారు. అందరూ కలిసి వెళదామని అనుకుంటారు. "నువ్వు ఆల్రెడీ అమ్మాయిని చూసావ్ కదా రాజ్.. అమ్మ వాళ్ళు వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకుంటారు. నీకు ఈ రోజు సెలబ్రిటీ యాడ్ గురించి ప్రోగ్రామ్ ఉంది కదా" అని రాజ్ వాళ్ళ నాన్న చెప్తాడు. అలా చెప్పడంతో రాజ్ నిరాశపడతాడు. రాహుల్ కన్నింగ్ గా అలోచించి.. "ఆ వర్క్ నేను చూసుకుంటాను.. నువ్వు హాయిగా పెళ్లి చూపులకు వెళ్ళు" అని చెప్తాడు. దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు. ఎలా రెడీ కావాలంటూ కనకం హడావిడి చేస్తుంది. ఇక అన్నీ వాళ్ళ రేంజ్ లో ఆర్డర్ చెయ్యాలని స్వప్న ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత కనకం, స్వప్నలు అందంగా ముస్తాబై.. మీనాక్షి ఇంటికి బయల్దేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క మహారాణి మా అమ్మ

యాంకర్ విష్ణుప్రియ ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా హంగామా చేయడం లేదు. వాళ్ళ అమ్మ దూరమైన దగ్గర నుంచి విష్ణుప్రియ కొంచెం డౌన్ ఐనట్టు కనిపిస్తోంది. వాలెంటైన్స్ డే తర్వాతి రోజు వాళ్ళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. "అమ్మ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..నువ్వు నాకు పంచిన ప్రేమను, ఇచ్చిన బలాన్ని  ఎప్పటికీ ఎవరూ భర్తీ చేయలేరు. ఐ లవ్‌ యూ అమ్మ.. మిస్ యూ ఫరెవర్ ...నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క మహారాణి మా అమ్మ " అంటూ విష్ణు తాను గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటల్ని, తల్లితో  గడిపిన స్వీట్ మొమెంట్స్ ని , అల్లరిని యాడ్ చేసి ఒక వీడియో అప్ లోడ్ చేసింది. లాస్ట్ మంత్  అనారోగ్యంతో  విష్ణుప్రియ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. విష్ణుప్రియ ఒక యూట్యూబర్‌గా జర్నీ స్టార్ట్ చేసి 'పోవే పోరా' షోతో  మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా..  బుల్లితెర నటిగానూ అలరిస్తోంది. ఇటీవల విడుదలైన "వాంటెట్ పండుగాడు" మూవీలోనూ నటించింది విష్ణుప్రియ. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తోంది. విష్ణుప్రియ పెట్టిన పోస్ట్ కి రీతూ చౌదరి, అష్షు బాధపడుతూ ఎమోజీస్ పెట్టారు.

నాలుగు నెలలు చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడ్డా..అప్పుడు కన్నకొడుకుల చూసుకుంది

సుమ అడ్డా షో ప్రతీ వారం లాగే గత వారం కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.  లాస్ట్ వీక్ షోకి బ్రహ్మాజీ, కళ్యాణ్ రామ్, ఆషిక వచ్చారు. ఇక సుమ వీళ్ళతో చెడుగుడు ఆడేసింది. ప్రోగ్రాంకి వచ్చిన స్టూడెంట్స్ కి కొంటె ప్రశ్నలు అడిగి వాళ్లకు బ్రహ్మాజీ, కళ్యాణ్ రామ్ సైన్ చేసి ఇచ్చిన టోపీలు, టీ షర్టులు ఇచ్చింది. ఇక తర్వాత కళ్యాణ్ రామ్ చేతి మీద "స్వాతి" అనే టాటూ చూసి చాలా బాగుంది అని అనేసరికి బ్యాక్ స్క్రీన్ మీద కళ్యాణ్ రామ్ ది ఒక ఓల్డ్ పిక్ చూపించారు. చేతి మీద టాటూ వేయించుకోవడం వెనక ఉన్న కథ ఏమిటి అని సుమ అడిగేసరికి..కళ్యాణ్ రామ్ చాలా విషయాలు చెప్పాడు. " మా పెళ్ళైన రెండు మూడేళ్ళ తర్వాత నేను చెప్పుకోలేని ఒక అనారోగ్యంతో చాలా బాధపడ్డాను. దాదాపు మూడు నుంచి నాలుగు నెలల వరకు బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వచ్చింది. ఈ విషయం బయట ఎవరికీ కూడా తెలియదు. అప్పుడు వచ్చిన నా అనారోగ్యం ఎలాంటిది అంటే కచ్చితంగా నా పక్కన ఒక మనిషి ఉండాల్సిందే..అలాంటి పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు నా భార్య స్వాతి నా బాధను తన బాధలాగా ఫీల్ అయ్యింది. ఆ టైములో నన్ను తన కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంది. తనకు నేను ఏమివ్వగలను.  ఇప్పుడంటే సిక్స్ ప్యాక్ బాడీ వచ్చింది...సినిమాలు చేస్తున్నా.. బాగా రికవరీ అయ్యాను. అంతా తనవల్లనే కదా. అప్పుడు తనకు నేను ఏదైనా చేయాలి అనిపించింది. టెన్త్ యానివర్సరీ టైములో నేను ఏం కావాలి అని  స్వాతిని అడిగాను. తనకేమీ వద్దు కావాల్సినవన్నీ ఉన్నాయి అని చెప్పింది. అప్పుడు నాకు సూదులంటే భయం. అది గుచ్చుకుంటే వచ్చే నొప్పిని భరించలేను. అప్పుడు అనిపించింది నాకు తాను నా బాధను ఎలా ఐతే భరించిందో...నేను కూడా అలా సూదులతో పొడిపించుకుని టాటూ వేయించుని తన బాధను నేను కూడా భరించాలి అని డిసైడ్ అయ్యాను. అందుకే టెన్త్ యానివర్సరీకి ఆమెకు గిఫ్ట్ గా తన పేరును నా చేతి మీద పచ్చబొట్టుగా వేయించుకున్నా" అని చెప్పాడు. ఇక సుమ కూడా ఇదే విషయాన్ని బ్రహ్మాజిని అడిగింది "మీ ఆవిడ పేరును మీరు పచ్చబొట్టుగా వేయించుకోలేదా అని" "నా పేరునే మా ఆవిడ ఎక్కడంటే అక్కడ పొడిపించుకుంది ఇలాంటి దేవుడు మళ్ళీ దొరకడు" అని చెప్పాడు నవ్వించాడు బ్రహ్మాజీ.

శ్రీసత్యకు ప్రొపోజ్ చేసిన మెహబూబ్..నా లైఫ్ లో ప్రేమ, పెళ్లి అనేవే లేవు!

ఇటీవలి కాలంలో ప్రాంక్ వీడియోస్ ట్రెండ్ బీభత్సంగా నడుస్తోంది. ఏ చిన్న టాపిక్ మైండ్ లోకి వచ్చినా సరే అది ప్రాంక్ వీడియోగా తీసేసి యూట్యూబ్ లో పెట్టేసి ఫుల్ డబ్బులు సంపాదించేస్తున్నారు.  ఇప్పుడు మెహబూబ్ కూడా అదే పని చేసాడు. బిగ్ బాస్ సీజన్ 6 పూర్తయ్యాక ఆడియన్స్ ని ఎటూ డైవర్ట్ కానివ్వకుండా బీబీ జోడి పేరుతో డాన్స్ షో ప్లాన్ చేసి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఒక షో చేస్తున్నారు మేకర్స్. ఇందులో మెహబూబ్ - శ్రీసత్య ఒక జోడి. వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటుంది కూడా. వీళ్ళ డాన్స్ చూస్తే ఇద్దరి మధ్యన ఏదో ఉంది అన్న ఆలోచన రాకుండా ఉండదు. ఇదే అదనుగా వాలెంటైన్స్ డే రోజున మెహబూబ్ శ్రీసత్యకు రోజెస్ ఇచ్చేసి ప్రొపోజ్ చేసేసాడు.  అల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో పెంటయ్యింది. ఇప్పుడు కూడా అవ్వుద్ది అని సత్య మెహబూబ్ మీద ఫుల్ సీరియస్ ఐపోయింది. మెహబూబ్ లవ్ ని యాక్సెప్ట్ చేయకపోయేసరికి చేయి కోసుకోవడానికి ట్రై చేసాడు మెహబూబ్. దానికి అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్లు సంకేత్, ప్రియాంక, సత్య కంగారు పడ్డారు.  జీవితంలో ఎవ్వరినీ ప్రేమించకూడదని డిసైడ్ అయ్యాను. నా పాస్ట్ లైఫ్ అలాంటిది. ఎవరూ కూడా అలాంటి లైఫ్ ఉండాలని కోరుకోరు అని చెప్పింది సత్య. అందుకే నా లైఫ్ లోకి  ఇంకెవరినీ రానివ్వను, పెళ్లి కూడా చేసుకోను అని  ఖరాఖండిగా చెప్పేసింది. సిట్యువేషన్ సీరియస్ నెస్ ని డిమాండ్ చేస్తోంది అనుకున్న మెహబూబ్ అసలు విషయాన్ని రివీల్ చేసి శ్రీసత్యకు ట్విస్ట్ ఇచ్చాడు. ఇదంతా ప్రాంక్ వీడియో అని తెలిసేసరికి బుంగ మూతి పెట్టేసింది సత్య. "మెహబూబ్  నీకు ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా "అంటూ మండిపడింది. ఇప్పుడు ఈ లవ్ ప్రొపోజల్ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో మంచి వ్యూస్ ని సంపాదించుకుంటోంది.

పెళ్లిళ్లు అలా జరిగాయంటూ కామెడీ చేసిన సుమ!

సుమ అడ్డా షో ఈ వారం కూడా అలరించడానికి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ రఘు కుంచె, ఆర్పీ పట్నాయక్, శ్రీకృష్ణ, సాకేత్ కొమాండూరి ఎంట్రీ ఇచ్చారు.  "పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల " సాంగ్ ని పాడుతూ స్టేజి మీదకు వచ్చారు  రఘు కుంచె. "జనాల ముందు అబ్బాయిలు బాగా నటిస్తారా అమ్మాయిలా" అని సుమ అడిగేసరికి ఒక స్టూడెంట్ లేచి "మేము సైట్ కొడుతున్నాం అని తెలిసి కూడా అమ్మాయిలు బాగా నటిస్తారు" అని ఆన్సర్ చేసేసరికి "లేకపోతే ఇలా ఊపుకుంటూ వచ్చేస్తారు మరి " అని రఘు కుంచె కౌంటర్ వేశారు. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని నలుగురు గెస్టులను అడిగింది సుమ..."మాది లవ్ మ్యారేజ్ ట్రైన్ అలా వస్తోంది నేనే వెళ్ళా" అని సాకేత్ చెప్పాడు. మీది లవ్ ఆర్ అరేంజ్డ్ అని శ్రీకృష్ణను అడిగింది..అరేంజ్డ్ అని అతను ఆన్సర్ చేసాడు.  "నాకు ఎక్స్పీరియెన్స్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజ్ లేదు" అని సుమ కౌంటర్ వేసింది దానికి సాకేత్ "శ్రీకృష్ణ పరిగెడుతున్నాడు వెనక నుంచి ట్రైన్ వచ్చింది" అని కామెడీ చేసాడు.  "ఆర్పీ గారు ప్లాటుఫారం మీద ఉన్నప్పుడు ఒక ట్రైన్ వస్తోందన్న అనౌన్స్మెంట్ వచ్చింది. అది ఇలా వచ్చి ఆగగానే ట్రైన్ ఆయన్ని చూసి, ఈయన ట్రైన్ చూసి నవ్వడం జరిగింది" అని ఫన్నీగా పెళ్లి గురించి చెప్పింది సుమ. ఇక్కడ ట్రైన్ అంటే భార్య అని ఇండైరెక్ట్ గా చెప్పారంతా. ఇక ఇందులో కపిల్ శర్మ షోలో చూపించినట్టుగా మధ్యమధ్యలో కొన్ని పాత్రలు వచ్చిపోతుంటాయి. ఇలా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ఫుల్ గా నవ్వించబోతోంది. సుమ క్యాష్ షోకి, ఆలీతో సరదాగా షోకి వచ్చినంత రేటింగ్ ఈ సుమ అడ్డా షోకి మాత్రం రావడం లేదు.

పుట్టినరోజు నాడు పొట్టిబట్టల్లో శివజ్యోతి సందడి

జ్యోతక్క అలియాస్ శివజ్యోతి పుట్టినరోజు బాగా సెలెబ్రేట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ శివజ్యోతి. తీన్మార్ వార్తల ద్వారా తెలంగాణ  యాసతో శివజ్యోతి మస్త్ పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ లో శివజ్యోతి ఏడుపుల రాణిగా కూడా పేరు తెచ్చుకుంది. ఏ చిన్న బాధ కలిగేదైనా, సంతోషకర విషయమైనా జ్యోతక్క ఏడ్చేస్తుంది.  ఆమె ఏడుపు మీద అప్పట్లో ఎన్నో ట్రోల్, మీమ్స్ కూడా వచ్చాయి. అందుకే అందరూ ఈమెను ముద్దుగా జ్యోతక్క అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఇక ఇప్పుడు శివజ్యోతి తన 30 ఇయర్స్ బర్త్ డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈమె దశ తిరిగిపోయింది. ఈమె యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటుంది. తనతో పాటు తన భర్త గంగూలీని కూడా ఆడియన్స్ లో మంచి ఫేమస్ పర్సన్ గా చేసేసింది. బుల్లితెర మీద షోస్ లో, ఈవెంట్స్ లో వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తూ సందడి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది శివజ్యోతి. తనకు 30 ఏళ్ళు వచ్చాయంటూ ఆనందంలో మునిగిపోయింది. పుట్టినరోజు నాడు పింక్ కలర్ పొట్టి డ్రెస్ వేసుకుని చిన్న పిల్లలా సందడి చేసింది. 30 ఇయర్స్ అంటూ బెలూన్స్ ను చేతిలో పట్టుకుని దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ అంతా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే మరో యాంకర్ వింధ్య విశాఖ, రవికృష్ణ కూడా మెసేజెస్ పెట్టారు. కొంతమంది నెటిజన్స్ మాత్రం జ్యోతక్క డ్రెస్ మీద కామెంట్స్ చేశారు. "అప్పుడు సావిత్రి అంటే సంప్రదాయం ..ఇప్పుడు నీవేమో పొట్టి డ్రెస్సులు...అక్కా ఏమిటి బ్లూ టిక్ ఉన్నవాళ్లకు మాత్రమే రిప్లై ఇస్తావా నీ ఫాన్స్ కి రిప్లై ఇవ్వవా " అంటూ కామెంట్ చేస్తున్నారు.  

'నీకు వారసుడు కావాలంటే దిల్ రాజుని అడగండి' కార్తిక్ కి నరేష్ సలహా

ఎక్స్ట్రా జబర్దస్త్ ఈవారం నవ్వించడానికి చక్కగా ముస్తాబై వచ్చేసింది. ఇందులో కెవ్వు కార్తిక్ టీమ్ చేసిన స్కిట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ టీమ్ లో నాటీ నరేష్ పెదరాయుడు వేషంలో వచ్చాడు. "నాన్న గారు నాకు పెదరాయుడు అనే పేరు ఎందుకు పెట్టారు" అని నరేష్ కార్తిక్ ని అడిగేసరికి " కనీసం పేరైనా పెద్దగా ఉండాలని" ఆన్సర్ ఇచ్చాడు కార్తీక్. దాంతో షాకయ్యాడు నరేష్..ఇంతలో "పెదరాయుడు నాకు నువ్వు వారసుడిని ఇవ్వాలిరా" అని అనేసరికి "దిల్ రాజు గారిని అడగండి ఐతే అని నరేష్ చెప్పిన ఆన్సర్ కి కార్తిక్ అవాక్కయ్యాడు. ఎందుకంటే వారసుడు మూవీని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళల్లో దిల్ రాజు కూడా ఒకరు. ఇక ఈ టీమ్ లో శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో టీచర్ గా వచ్చాడు.  తన దగ్గర ఉన్న రౌడీ మూకకు ఏ,బి,సి,డిలు నేర్పమని కార్తిక్ చెప్పేసరికి "ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే..సి వచ్చి డి పై వాలే..మీరంతా వచ్చి నాపై వాలండి " అనే సాంగ్ ని పాఠంలా చెప్పి నవ్వించాడు శాంతి స్వరూప్. ఇక ఫైనల్ లో పెదరాయుడు మూవీ నుంచి "బావవి నువ్వు..భామను నేను" సాంగ్ కి రష్మీ, శాంతి స్వరూప్, ఖుష్భు కలిసి డాన్స్ చేశారు. మధ్యలో బులెట్ భాస్కర్ వచ్చి ఖుష్భుతో జాయిన్ అయ్యి డాన్స్ చేసాడు. వీళ్లంతా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొచ్చి మరీ ఎంటర్టైన్ చేశారు. ప్రతీ వారం ఫైనల్ లో బులెట్ భాస్కర్-ఖుష్భు డాన్స్ ఉండాల్సిందే..అలా ఈ వారం కూడా డాన్స్ చేసి దుమ్ము లేపారిద్దరూ.

హరితో కలిసి అష్షు డాన్స్...పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్న!

అష్షు రెడ్డి ఎలా కావాలంటే అలా జీవించే అమ్మాయి. నచ్చింది చేస్తుండే కానీ కామెంట్స్ ని అస్సలు పట్టించుకోడు. ఒక పక్కన బోల్డ్ గా కనిపిస్తూనే నాలో కూడా మానవత్వం ఉందని నిరూపించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఎక్స్ప్రెస్  హరితో కలిసి అషు హెల్పింగ్ హ్యాండ్స్ అనే హోమ్ కి వెళ్లారు. అక్కడే కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. "మన దగ్గర అపరిమితమైన ప్రేమ ఉన్నప్పుడు ఎవరికైతే ప్రేమ దొరకదో వాళ్ళతో పంచుకోవాలి...ఈ ఏడాది ఇలా నేను నా వాలెంటైన్స్ డేని సెలెబ్రేట్ చేసుకున్నాను" అని పిల్లలతో కలిసి దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. పిల్లలతో కలిసి "చింపిరి జుట్టుదాన్ని" సాంగ్ కి హరి, అష్షు కలిసి డాన్స్ చేశారు.  "ఇలాంటి మంచి మంచి పనులు చెయ్యి...ఎవరూ నెగిటివ్ కామెంట్స్ పెట్టరు...అందరూ మెచ్చుకుంటారు. గుడ్ వర్క్, గ్రేట్ వర్క్" అని కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటే కొంతమంది మాత్రం " ఆర్మీ జవాన్లు వీరమరణం చెందిన రోజున పిల్లలతో కలిసి ఇలాంటి డాన్సులు చేయడం అవసరమా" అంటున్నారు. అష్షు ఏ పని చేసినా అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంటుంది.

అందరం మళ్ళీ కలవాలని ఉంది!

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచెస్ ఓపెన్ చేసి కిర్రాక్ ఆర్పీ మంచి సెన్సేషన్ అయ్యాడు. ఇక ఇతని బ్రాంచ్ ఓపెనింగ్ కి జబర్దస్త్ టీం కూడా ఎంట్రీ ఇచ్చి టేస్ట్ చేసి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇక అదిరే అభి కూడా ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కి వచ్చి తన ఓల్డ్ ఫ్రెండ్స్ ని కలిసి హ్యాపీగా ఫీలయ్యాడు. కొద్ది రోజుల క్రితం అదిరే అభి "మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది…అరుచుకుంటూ నవ్వే జడ్జీలు,టైమింగ్ తో పంచులేసే టీం లీడర్లు, కామెడిని ఔపోసన పట్టిన కంటెస్టెంట్లు, అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు, సమయం ఆగేది కాదు. కుశల ప్రశ్నలు, ఆపన్నహస్తాలు, జోకుల మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు. బాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం, అనసూయ రష్మిల అందం, స్కిట్ల మాయాజాలం..." అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.  ఈ అంశం గురించి  కిరాక్ ఆర్పీ బ్రాంచి ఓపెనింగ్ లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు "జబర్దస్త్ మొదలై టెన్ ఇయర్స్ ఐపోయిన సందర్భంలో అప్పటి రోజులు గుర్తొచ్చి నేను జబర్దస్త్ గురించి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఒకసారి స్కూలింగ్ ఐపోయాక ఎవరి కెరీర్ లో వాళ్ళు సెటిల్ ఐపోతారు. కానీ ఎప్పుడో ఒకసారి రీయూనియన్ అవుతూ ఉంటారు. అలాంటి ఒక సందర్భంలోంచి వచ్చినదే మా జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రీయూనియన్ ఐతే బాగుండు అన్న ఆలోచన. అందరం కలవడం ఐతే బాగుంటుంది కానీ ఆ తర్వాత జరిగేది విధి లిఖితం" అని చెప్పాడు. మరి చూడాలి అలా జబర్దస్త్ కంటెస్టెంట్స్ చాలా మంది లేరు. అందరూ కలిసి మళ్ళీ ఒక కొత్త టీంగా ఏర్పడి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారా లేదా..మల్లెమాల యాజమాన్యం వాళ్లకు అవకాశం ఇస్తుందా లేదా...వేచి చూడాలి.

ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్ రైజర్..హోస్ట్ గా హేమచంద్ర, లేడీ జడ్జిగా గీతామాధురి

ఇండియన్ ఐడల్ సీజన్ 1   ఆహా ఓటిటి వేదిక మీద దుమ్మురేపింది. ఇక ఇప్పుడు తెలుగు సంగీత ప్రేక్షకులను అలరించడానికి సీజన్ 2 రాబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా కర్టెన్ రైజర్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్‌ ఠాకూర్‌ వచ్చారు. ఇక ఈ షో సెట్ కూడా చూపించారు. ఇక అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ "రీసెంట్ గానే అన్ స్టాపబుల్ సీజన్ 2 పూర్తయ్యింది. నిజం చెప్పాలంటే ఎక్కడికి వెళ్లినా జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ గారు థాంక్యూ సో మచ్.  త్వరలో ఆహా యాప్ ని మలయాళం, కన్నడలో కూడా లాంఛ్ చేయబోతున్నాం." అని చెప్పారు. ఇక సీజన్ 2  హోస్ట్ గా హేమచంద్ర ఎంట్రీ ఇచ్చారు. "తెలుగు ఆడియన్స్ తో అతనికున్న దోస్తీ, పాటలతో అందరిని ఫిదా చేసే స్వరం అతని ఆస్తి" అంటూ ఆహా ఒక కాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. జడ్జెస్ విషయానికి  "ఎవరి  పేరు  చెప్తే  స్పీకర్లు  వూఫర్లు గడగడా వణుకుతాయో, ఆయనే  మన  మొదటి  జడ్జ్" అంటూ తమన్ కి వెల్కమ్ చెప్పింది ఆహా. తర్వాత "ఎన్నో  పాటలకి  ప్రాణం  పోసి  మన  హార్ట్స్ లో ఎప్పటికీ  నిలిచిపోయే  మెలోడీస్  ని మాస్ నంబర్స్ ని మనకి అందించిన  కార్తీక్, మన  సెకండ్  జడ్జ్" అని కాప్షన్ పెట్టి అతని ఫోటోని రిలీజ్ చేసింది. వీళ్ళతో పాటు గత సీజన్ లో లేడీ జడ్జిగా నిత్యా మీనన్ కనిపించింది.  ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి గీతా మాధురి ఎంట్రీ ఇచ్చింది. "కమర్షియల్ సినిమా అయినా, లవ్ స్టోరీ అయినా, మాస్ బీట్ అయినా మెలోడీ అయినా, తన పాటలకి కనెక్ట్ అవ్వని వారుండరు" అని ఆహా ఆమెకు సంబంధించిన ఒక కాప్షన్ పెట్టి ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. ఇక ఈ సీజన్ లో ఇద్దరు చేంజ్ అయ్యారు. ఈ సరికొత్త ప్యానల్ తో సరికొత్త ఫార్మాట్ తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

వాళ్ళ హనీమూన్ క్యాన్సిల్ అవ్వడానికి ముకుందనే కారణమా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -80 లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో.. హనీమూన్ ని ఎలాగైనా క్యాన్సిల్ చెయ్యండని మురారితో కృష్ణ అంటుంది. ఇక ఇద్దరు హనీమూన్ ని ఎలా క్యాన్సిల్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. మరోవైపు నందు తన బట్టలు, బొమ్మలు సర్దుకొని కిందకి వస్తుంటుంది. తనని ముకుంద చూసి.. ఎక్కడికి వెళ్తున్నావ్ నందు అని అడుగుతుంది. ఆ తర్వాత ముకుంద ఇంట్లో అందరిని పిలుస్తుంది. రేవతి వచ్చి.. "నందు ఎక్కడికి వెళ్తున్నావమ్మా" అని అడుగగా.. కృష్ణ, మురారిలు ఊరు వెళ్తున్నారు.. కదా వాళ్ళతో నేను వెళ్తానని నందు చెప్తుంది. మురారి వచ్చి.. "నందు మేము ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా" అని అంటాడు. ఇంట్లోవాళ్ళందరూ నందు కోసం తనతో అలా అంటున్నాడేమోనని భావిస్తారు. కానీ మురారి.. నేను నిజంగానే అంటున్నాను. మేము హనీమూన్ కి వెళ్ళట్లేదు. కృష్ణ చదువు ఇప్పటికే లేట్ అయింది. దానికి కావలసిన డాకుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి.. తన గదిలోకి వెళ్ళిపోతాడు. దీంతో అందరూ ఆలోచనలోపడగా.. ముకుంద మాత్రం హ్యాపీగా ఉంటుంది. ముకుందని రేవతి గమనిస్తూ.. తనే హనీమూన్ క్యాన్సిల్ చేసిందా.. వాళ్ళ హనీమూన్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ముకుందనేనా అని అనుకుంటుంది. మురారి గదిలోకి వెళ్ళేసరికి.. కృష్ణ వాళ్ళ నాన్న ఫోటోని చూస్తూ బాధపడుతుంటుంది. ఇంతలోనే మురారి రాకని గమనించి.. నాన్న ఇంట్లో అందరూ మంచివాళ్ళే ఒక్క ఏసీపి సారే తిక్క శంకరయ్య అని మురారికి వినపడేటట్లు అంటుంది. అది విని ఏంటని మురారి అడుగుతాడు. సర్.. మీరు ఎప్పుడొచ్చారని అంటుంది. ఏదో తిక్క శంకరయ్య అంటున్నావ్ కదా అప్పుడొచ్చా అని మురారి అనగానే.. అలానే అంటానని మురారిని ఆటపట్టిస్తుంది కృష్ణ.. నేను తిక్క శంకరయ్యనా అని మురారి అనగానే.. లేదు సర్ ఆ ముకుందనే తిక్క శంకరమ్మ.. ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లు.. ఎవరితో మాట్లాడదు అని కృష్ణ అంటుంది. ఇంతలోనే మురారికి ఫోన్ చేస్తుంది ముకుంద. అతను లిఫ్ట్ చెయ్యడంతో‌‌.. "నేను నీ కోసం చెయ్యలేదు. కృష్ణకి ఇవ్వు" అని ముకుంద అంటుంది. మురారి టెన్షన్ తో కృష్ణకి ఇస్తాడు.  కృష్ణతో ముకుంద ఫోన్ లో ఏదో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ‌

ఏడడుగులు వేసిన రిషి, వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -686లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో.. రిషి గురించి వసుధార ఆలోచిస్తుంటుంది. రిషి సర్ కి కోపమొచ్చిందని ఫోన్ చేద్దామని చేస్తుంది. అలాగే అటువైపు నుండి రిషి కూడా ట్రై చేయడంతో ఇద్దరికీ బిజీ అని వస్తుంది. వసుధార ఎవరితో మాట్లాడుతుందని కోపంతో.. ఫోన్ స్విచ్ అఫ్ చేస్తాడు. "నీకు పెళ్లయినా మన మధ్య ఈ బంధమేంటి.. ఇంకెంత కాలం ఈ గుండె గదిలో ఉంటావ్.. ఖాళీ చేసి వెళ్ళిపో వసుధార ప్లీజ్" అని అనుకుంటూ రిషి బాధపడుతుంటాడు. మరోవైపు ఈ బాధ ఎంతో కాలం ఉండదు. నా మీద కోపం తో నిజం తెలుసుకోలేక పోతున్నారు. దీనికి త్వరలోనే ముగింపు ఇస్తానని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత పుష్ప కాలేజీకి పని మీద వస్తుంది. పుష్ప దగ్గర  చక్రపాణి నెంబర్ తీసుకుంటాడు రిషి. ఆ తర్వాత చక్రపాణికి ఫోన్ చేసి నిజం తెలుసుకోవాలనుకుంటాడు.. వెంటనే ఫోన్ చెయ్యడంతో చక్రపాణికి బదులుగా వసుధార లిఫ్ట్ చేసి మాట్లాడడంతో.. "కాలేజీకి రావట్లేదా" అంటూ మాట్లాడి కట్ చేస్తాడు. రాజీవ్ తాళి కట్టలేదు.. మరి ఎవరు కట్టారు.. ఇంత తక్కువ సమయంలో ఎలా కుదిరినట్లు? ఏదో లింక్ మిస్ అవుతున్నానని రిషి అనుకుంటాడు  రిషి మూడాఫ్ లో ఉండి ఒక దగ్గర కూర్చుని ఉంటాడు.. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార.. రిషి ఏ స్టైల్ లో కూర్చున్నాడో అదే విధంగా కూర్చుంటుంది. తనని రిషి చూసి.. "నువ్వు ఎప్పుడు వచ్చావ్" అని అంటాడు.. మీ వెనకాల ఎప్పటికీ ఉంటాను సర్ అని అంటుంది.. వెనకాల కాదు పక్కన ఉండాలని రిషి మనసులో అనుకుంటాడు.. సర్ వెనకాల ఉన్నవాళ్ళు పక్కకు కూడా వస్తారు.. అలాగే ముందుకు కూడా వస్తారని వసుధార అనగానే.. "మాథ్స్ లో లాజిక్ లు ఉంటాయి గాని జీవితంలో కాదు" అని రిషి అంటాడు. సర్ విశాల హృదయంతో ఆలోచించండి అని వసుధార చెప్పగా.. చెప్పడం ఈజీనే కానీ ఆ తర్వాత వచ్చే బాధనే భరించడం కష్టమని రిషి అంటాడు. సరే వెళ్ళని రిషి అనగా.. మీరు రానిదే నేను వెళ్ళనని వసుధార అంటుంది. "అందరూ మనల్నే చూస్తున్నారు నువ్వు వెళ్ళు.. నేను రాను" అని రిషి అంటాడు. వసుధార మొండిగా ఏడు లెక్క పెట్టేసరికి మీరు రావాలని అనగానే.. "మొండిదానివి" అని చెప్పి రిషి వచ్చేస్తుంటాడు. రిషితో కలిసి వసుధార నడుస్తూ.. ఏడు అడుగులు వేస్తున్నామని అనుకుంటుంది.. ఆ సీన్ చూడముచ్చటగా ఉంటుంది. మరో వైపు జగతి, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. రిషి రావడంతోనే.. ఏదో ఆర్గుమెంట్ చేస్తున్నట్లు జగతి చేస్తుంటుంది. దీంతో మహేంద్ర కు అర్థం కాక అలా చూస్తు ఉండిపోతాడు.. మహేంద్ర నువ్వు వస్తావా? రావా? అని‌ జగతి అడుగగా.. "ఎక్కడికి మేడం నేను తీసుకెళ్తాను రండి" అని రిషి అనగానే.. జగతి సంతోషపడుతుంది. రిషిని జగతి ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.

కనకం బ్లాక్‌మెయిల్‌తో కరిగిపోయిన కుటుంబసభ్యులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి'. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా మారుతూ వస్తుంది. స్వప్నకి రాజ్ తో పెళ్లి చేయాలని కనకం ప్రయత్నిస్తుంటుంది. కానీ స్వప్న రాజ్ ని కాకుండా రాహుల్ తో ఊహల్లో ఉంటుంది. దీంతో ఈ సీరియల్ మరింత  హైప్ ని క్రియేట్ చేస్తోంది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ -19లో..  రాజ్ ఇచ్చిన బొకే స్వప్న కిందపడేస్తుంది. రాహుల్ ఇచ్చిన డైమండ్ రింగ్ చూస్తూ మురిసిపోతుంది. మరోవైపు కనకం ఇంటికి వచ్చి డల్ గా కూర్చొని ఉండడం తో.. ఏంటి కనకం అంత ఎత్తు నుండి కిందపడ్డావా.. వాళ్ళ ముందు నీ గుట్టు బయటపడిందా అంటూ కృష్ణమూర్తి సెటైర్లు వేస్తాడు.  అంతలోనే స్వప్న వచ్చి.. "అమ్మా.. ఈ డైమండ్ చూడు" అని చూపిస్తుంది. అయితే ఆ రింగ్ రాహుల్ ఇచ్చాడని చెపితే కనకం తిడుతుందని రాజ్ ఇచ్చాడని చెప్తుంది. ఆ రింగ్ చూసి కనకం అదేం పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి స్వప్న.. "ఏంటమ్మా" అని అడుగుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మన ఇంటికి వస్తారన్నారని డీలాగా చెప్తుంది. మనకేమైనా మీ అక్కలాగా జూబ్లిహిల్స్ లో బంగ్లాలు ఉన్నాయా? వాళ్ళు వస్తే మన పరువు పోతుందని కృష్ణమూర్తి కోపంతో కనకం ని తిట్టగా.. "అవును కదా.. మా అక్కకి బంగ్లా ఉంది కదా.. కోపంలో అన్నా.. భళే గుర్తుచేశారండి. మన ఇల్లు అదేనని చెప్తాను" అని కనకం అంటుంది. కృష్ణమూర్తి దానికి నిరాకరిస్తూ.. నీలాగా నేను అబద్ధాలు అవలీలగా ఆడలేనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు రాజ్ ఇంట్లో పనిమనిషి దొంగతనం చెయ్యడంతో.. ఆమె తప్పు లేదని ఆమెకి అవసరం ఉన్నంత డబ్బుని ఇచ్చేస్తాడు రాజ్.. అలాగే అకౌంటెంట్ పని మనిషికి డబ్బు ఇచ్చానని చెప్పాడు. అది నిజం కాదని పనిమనిషి చెప్పడంతో.. రాజ్ కి డౌట్ వచ్చి.. నీ మీద నాకు ఎప్పటి నుండో డౌట్ ఉంది. డబ్బులు దొంగలెక్కలు చూపించి తీసుకుంటున్నావ్ అని రాజ్ అతడిని జాబ్ నుండి తీసేసి.. వాళ్ళ ఇంట్లోనే సర్వెంట్ గా చేస్తాడు. అతడిని మోసం చేసిన డబ్బులు తీరేంత వరకు అలాగే పని చేయాలని  చెప్పి అక్కడ నుండి రాజ్ వెళ్ళిపోతాడు. మరోవైపు తన కూతుళ్ళని గొప్పింటికి కోడళ్ళుగా చేద్దామంటే తనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదని కనకం బాధ పడుతూ.. కిరోసిన్ ని ఒంటి మీద పోసుకొని నేను బ్రతకను అని బెదిరించేసరికి తన ముగ్గురు కూతుళ్ళు.. "అమ్మ నువ్వు చెప్పినట్టే వింటామమ్మ" అని మాటిస్తారు‌. కూతుళ్ళు ఒప్పుకున్నారు.. నేను కూడా నీకు అడ్డు రాను.. నీ చావు నువ్వు చావని చెప్పేసి వెళ్ళిపోతాడు. "మా అమ్మ నాకోసం ఇంత కష్టపడుతుంది.. నేను రాజ్ అంటే ఇష్టం లేదు.‌. రాహుల్ అంటే ఇష్టమని ఎలా చెప్పాలి" అని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!

నారింజ పళ్ళు చూపిస్తూ రెచ్చిపోయిన గృహలక్ష్మి

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో తులసిని ఎంతో పద్ధతైన కట్టూ బొట్టుతో కనిపిస్తుంది. చూడడానికి  తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. ఆ రోల్ కి కస్తూరి సూపర్ గా సెట్ ఐపోయింది. ఆమె ప్లేస్ లో ఇంకా ఎవరినీ ఊహించుకోలేము. ఐతే కస్తూరి సీరియల్ లో రోల్ కి తగ్గట్టు ఎలా పద్దతిగా  కనిపిస్తుందో వన్స్ షూటింగ్ ఐపోతే పర్సనల్ లైఫ్ ని మస్త్ ఎంజాయ్ చేస్తుంది. కొంటె ఫోటోలు పెడుతుంది...కవ్వించే ఆన్సర్స్ కూడా ఇస్తుంది.  ఇక ఇప్పుడు లవర్స్ డే సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఒక పిక్ పెట్టింది. ఓ రెండు నారింజ పళ్ళను చూపిస్తూ.. పెదాలతో కవ్విస్తున్న ఫొటోస్ అవి. ‘హ్యాపీ క్లైమెన్‌టైన్స్‌డే.. ఆరెంజ్ యు ద బెస్ట్’ అంటూ కొటేషన్‌ కూడా పెట్టింది.  ఈ పిక్స్ చూసి కొంతమంది నెటిజన్స్  డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రిప్లైలు ఇస్తూ రెచ్చిపోతున్నారు. ఐతే కస్తూరి మాత్రం ఈ కామెంట్స్ ని అస్సలు పట్టించుకోదు. ఇంతకు ముందు కూడా చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెడితే వాళ్లకు సరిగ్గా సమాధానం ఇచ్చిపడేసింది. మరిప్పుడు ఈ పిక్స్ కి వచ్చిన కామెంట్స్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.  ఇక ఇంటింటి  గృహలక్ష్మి సీరియల్ చాలా చిరాకు తెప్పిస్తోంది. సామ్రాట్ తో ప్రేమాయణం ఇప్పుడు ఎక్స్ హస్బెండ్ ఎక్స్ట్రా ప్రేమ.  ఒలకబోస్తున్నాడు.

‘గుప్పెడంత మనసు’ నుంచి వెళ్లిపోయిన దేవయాని!

గుప్పెడంత మనసు సీరియల్ టాప్ వన్ ప్లేస్ లో సెట్ ఐపోయింది. ఈ సీరియల్ లో అందరివీ అద్భుతమైన పాత్రలు. అందులో దేవయాని పాత్ర మాత్రం సూపర్ గా ఉంటుంది. లేడీ విలన్ రోల్ లో మిర్చి మాధవి ఫుల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఇక మీదట ఈ సీరియల్ నుంచిఈ రోల్ నుంచి ఆమె తప్పుకుంటోంది. ఐతే ఆమె ఈ సీరియల్ నుంచి వెళ్ళిపోతోందన్న విషయం తెలిసిన ఫాన్స్ మాత్రం చాలా బాధపడుతున్నారు. కార్తీక దీపంలో మోనిత రోల్ ఎంతగా ఆడియన్స్ లోకి వెళ్ళిపోయి క్లిక్ అయ్యిందో...ఈ గుప్పెడంత మనసు సీరియల్ లో దేవయాని క్యారెక్టర్ కూడా అంతే స్పీడ్ తో ఆడియన్స్ కి కనెక్ట్ ఐపోయింది. ఇప్పుడున్న సీరియల్స్ లో లేడీ విలన్ రోల్స్ కి వీళ్ళు పెట్టింది పేరు. దేవయాని అలియాస్ మిర్చి మాధవి యూకేకి వెళ్ళిపోతోందంటూ ఈ సీరియల్ టీమ్ లో కొంత మంది ఇన్స్టాగ్రామ్ పేజీలో పిక్స్ పెట్టారు.  ఇప్పుడు సోషల్ మీడియాలో దేవయానికి ఆ సీరియల్ యాక్టర్స్ అంతా సెండాఫ్ చెప్పిన వీడియో, ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె చివరి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయ్యింది. దేవయాని  సీరియల్ నుంచి తప్పుకునేసరికి రిషి అలియాస్ ముఖేష్ గౌడ పెద్దమ్మా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ధరణి పాత్రలో నటించిన సీతామహాలక్ష్మి  లవ్ యూ, మిస్ యూ అంటూ పోస్టులు పెట్టింది. ఇక ఆమె నటనకి ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు.  నెటిజన్లు కూడా మిస్ యూ దేవయాని మేడం అంటూ కామెంట్ చేశారు. ఈ సీరియల్ లో ఆల్రెడీ రిషి ఫ్రెండ్ గా నటించి గౌతమ్ అలియాస్ కిరణ్ కాంత్ బ్రహ్మముడి సీరియల్ కి షిఫ్ట్ ఐపోయాడు. ఇప్పుడు దేవయాని రోల్ కూడా ఆగిపోయింది. ఐతే ఈమె ప్లేస్ ని ఎవరితో రీప్లేస్ చేస్తారో వాళ్ళు ఇంతా బాగా సీన్ పండిస్తారో తెలియదు. మాధవి మిర్చి మూవీలో అద్భుతంగా నటిచడం కాదు ఆడియన్స్ మనసుల్లో జీవించేసింది. అందుకే అప్పటినుంచి ఆమెకు  మిర్చి మాధవి అనే పేరు ఫిక్స్ ఐపోయింది. 100 % లవ్, శతమానం భవతి, గద్దలకొండ గణేష్ వంటి మూవీస్ లో ఈమె నటించింది.  ఇక బుల్లితెర విషయానికి వస్తే  త్రిశూలం సీరియల్‌తో ఎంట్రీ  ఇచ్చి కథలో రాజకుమారి, చిన్నారి, కంటే కూతుర్నే కనాలి సీరియల్స్  తో మంచి పేరు సంపాదించుకుంది.

స్టేజి మీద ఏడ్చేసిన అర్జున్ కళ్యాణ్..ఓదార్చిన శ్రీసత్య

బీబీ జోడి ఇరగదీసే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఈ షోలో ప్రతీ వారం ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ షోలో అర్జున్ కళ్యాణ్-వాసంతి పెయిర్ కి మంచి పేరు వచ్చింది. దీనికి సంబంధించి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోగ్రాం స్టార్టింగ్ లో మెహబూబ్, శ్రీసత్యకు పెళ్లి చేస్తున్నాం అని అనౌన్స్ చేసాడు అవినాష్. "మీరేదో ప్లాన్ తో వచ్చారు ...పెళ్లి చేయాలి అంటే పెళ్లి పెద్దలు ఉండాలి కదా " అని హోస్ట్ శ్రీముఖి అనేసరికి "మగపెళ్లి వారి తరపున తరుణ్ మాస్టర్, ఆడపెళ్ళి వారి తరపున రాధమ్మ, అందరి తరపున సదాగారు వచ్చారు" అని చెప్పాడు. తరువాత  కౌశల్, అభినయశ్రీ మాస్ స్టెప్పులు వేసే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. ఆ పెర్ఫార్మెన్స్ చూసిన సదా ముందు తనకు  నచ్చలేదని  తరువాత  చాలా బాగా నచ్చినట్లు చెప్పింది.  ఆ తరువాత మెహబూబ్, శ్రీసత్య  నాటు నాటు సాంగ్ కి   స్టెప్స్ ఇరగదీసేసారు. ఐతే వీళ్ళ డాన్స్ స్టెప్స్ సరిగా సింక్ అవ్వలేదని సత్య ఆడపిల్లలా చేయలేదు ఆడపులిలా చేసింది అని చెప్పాడు.  ఆ తరువాత భానుశ్రీ, రవి బాగా చేశారు,  ఆర్జే సూర్య - ఫైమా జోడి డాన్స్ ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక అవినాష్ ఒళ్లో కూర్చుని అరియానా ఫ్లోర్ స్టెప్ వేశారు. రొమాంటిక్ గా పెర్ఫార్మ్ చేసే  అఖిల్, తేజస్వి ఈ వారం దేశభక్తి పాటకి డాన్స్ చేసి అలరించారు. ఎప్పటిలాగే అర్జున్ కళ్యాణ్-వాసంతి జోడి వెరైటీగా క్యూట్ గా డాన్స్ చేశారు. అప్పుడు ఏమయ్యిందో తెలీదు కానీ  అర్జున్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అతని బిగ్ బాస్ లవర్ శ్రీసత్య.. స్టేజ్ మీదికి వచ్చి మరీ ఓదార్చింది. వేళ్ళ జోడి పెర్ఫార్మెన్స్ కి  రవి-భానుశ్రీ ఒక మార్క్ మాత్రమే ఇచ్చారు. దీంతో రాధకి కాలిపోయింది. "స్ట్రాటజీ అనుకుంటే.. మేం మీకు పదికి పది ఇచ్చేవాళ్లం కాదు కదా" అని వాసంతి చాలా నైస్ గా చెప్పింది. దీంతో రాధా.. ‘బాధపడొద్దు..  మీకు టైమొస్తుంది" అని  రియాక్ట్ అయ్యింది రాధ.

పాగల్ పవిత్రకు లవ్ ప్రొపోజ్ చేసిన సంతోష్

షో ద్వారా ఫిమేల్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. సోషల్ మీడియాలో పాగల్ పవిత్రగా ఎంతో ఫేమస్. జబర్దస్త్ మాత్రమే కాదు అన్ని రకాల ఫెస్టివల్స్ కి, ఈవెంట్స్ లో రెగ్యులర్ గా సందడి చేస్తుంటుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫాన్స్ తో టచ్ లో ఉంటూనే ఉంటుంది. ఈమె ఎక్కువగా రోహిణితో చాలా క్లోజ్ గా ఉంటుంది.  ఆ మధ్య ఒక షోలోకి సంతోష్ అనే పర్సన్ వచ్చి పవిత్రని బొకే ఇచ్చి లవ్ ఎక్సప్రెస్ చేసాడు. ఇక ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వీళ్ళిద్దరూ వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు. అసలే వాలెంటైన్స్ డే కూడా కాబట్టి సంతోష్ పవిత్రకి లవ్ ప్రపోజ్ చేసాడు. ‘ప్రేమిస్తున్నాను కాబట్టి.. భరిస్తా అనట్లేదు, భరించగలను కాబట్టే ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యూ పవిత్ర’ అని చెప్పేసరికి కిసుక్కున నవ్వేసింది పవిత్ర కానీ ఆ మాటకు ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. అమ్మాయిలం కాబట్టి కొంచెం టైం తీసుకుని ఆలోచించి చెప్తాను అని అంది. సంతోష్ మాట్లాడుతూ.. " మా ఇంట్లో అందరూ అబ్బాయిలే నేను..హాస్టల్ ల్లోనే ఎక్కువగా ఉండేవాడిని. అలా నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని. జబర్దస్త్ మరో లేడీ కమెడియన్ షబీనా తన హజ్బెండ్ మున్నా నేను క్లాస్మేట్స్..అలా వాళ్ళతో పవిత్రను చూసేసరికి అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అనిపించింది.  తర్వాత ఆమె గురించే ఎక్కువగా ఆలోచించేవాడిని. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే తనొక అమ్మాయి, నేనొక అబ్బాయి. అలా నేను తనను లవ్ చేస్తున్నాను. అది ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తన ఇష్టం అన్నాడు. దాదాపు అతని మాటలకు పవిత్ర పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యింది కానీ.. కన్ఫర్మ్ చేయలేదు. నువ్వు నాతో ఉంటే నిన్న మా అమ్మలా చూసుకుంటాను" అని చెప్పాడు సంతోష్.

రాజ్ మాటలతో విసుగుచెందిన స్వప్న.. రాహుల్ ఫ్లర్టింగ్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -18 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో.. దుగ్గిరాల ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి కనకం ప్రయత్నిస్తుంది. అయితే కనకం మాట్లాడేప్పుడు ఎక్కడో ఒక దగ్గర నోరు జారుతుంది. ఆ ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తే మళ్ళీ తనే మేనేజ్ చేస్తుంది. "మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి గురించి తెలుసుకున్నారు.. మేము మీ ఇంటికి వచ్చి మీ స్థితిగతులు తెలుసుకోవాలి కదా.. మీ ఇంటికి వస్తాం" అని రాజ్ అమ్మ అంటుంది. కనకం ఒక్కసారిగా షాక్ అయ్యి.. ఇక చేసేదిమీ లేక సరేనని చెప్తుంది. మరోవైపు రాజ్ తో డేటింగ్ లో ఉండి.. అతను చెప్పేవి వింటూ స్వప్న బోరింగ్ గా ఫీల్ అవుతుంటుంది. రాజ్ మాట్లాడుతున్నంత సేపు మనసులో తిట్టుకుంటుంది. కాసేపటికి ఇక వెళదామా అని రాజ్ అనగానే.. హమ్మయ్య సోది భరించలేకపోతున్నా  అని స్వప్న మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు రాజ్ కార్ లో బయల్దేరతారు. రాజ్ కార్ లో మ్యూజిక్ ప్లే చేస్తాడు. అందులో అన్నీ ఓల్డ్ సాంగ్స్ పెట్టడంతో.. "జీవితాంతం ఈ పాత పాటలు వినుకుంటూ ఉండాలా దేవుడా?" అని స్వప్న అనుకొని .. కాసేపటికే భరించలేకపోతుంది. ఇక్కడ నాకు పని ఉందని చెప్పి స్వప్న కార్ లో నుండి దిగిపోతుంది. మరోవైపు స్వప్నని వెతుక్కుంటూ కాఫీ షాప్ కి వస్తుంది కావ్య. అక్కడ లేకపోయేసరికి తిరిగి వెళ్తుండగా... రాజ్ కార్ సడన్ బ్రేక్ వెయ్యాగా బయపడి కావ్య కింద పడిపోతుంది. వెంటనే రాజ్ కార్ దిగి ఎవరని చూస్తాడు. కావ్యని గుర్తుపట్టి.. "నీకేం పని లేదా.. ఎప్పుడు నాకు ఎదురు పడుతావ్" అంటూ ఆవేశపడతాడు. నీతో గొడవ పడటానికి నాకేం పనిలేదా అని కావ్య అంటుంది. ఇలా ఇద్దరి మధ్యలో మరింత గొడవ అవుతుంది. మరోవైపు స్వప్న కార్ దిగి నడుచుకుంటూ వెళ్తూ ఆలోచనలో పడుతుంది. రాహుల్ నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు. తనతో ఉన్నంత సేపు తన మాటల్లో నామీద కేరింగ్ కన్పించింది. అది బాగుంది.. కానీ రాజ్ మాట్లాడుతున్నంతసేపు బోరింగ్ గా అనిపించింది. ఒక గంటసేపు ఉంటేనే ఇలా ఉంది. ఇక జీవితం మొత్తం ఉంటే నా పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూ.. నా అందం మొత్తం ఆడవి కాచిన వెన్నెల అయిపోతుందేమోనని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.