కావ్య, కళ్యాణ్ లను పోలీస్ స్టేషన్ నుండి విడిపించిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -146 లో రాజ్ దగ్గరికి శృతి డిజైన్స్ తీసుకొని వస్తుంది. ఆ డిజైన్స్ చూసి చిరాగ్గా ఏంటి నీకు డిజైన్స్ వెయ్యడం వచ్చా ఒక్కోసారి బాగా వేస్తావ్.. ఒక్కో సారి ఇలా వేస్తావ్.. మొన్న వేసిన డిజైన్ నువ్వు వేసిందేనా అని డౌట్ వచ్చి వెళ్లి నాకు తొందరగా మంచి డిజైన్స్ రెడీ చేసి తీసుకొని రా అని శృతితో చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత రాజ్ కి స్టేషన్ ఎస్ఐ ఫోన్ చేసి.. మీ భార్య మీ తమ్ముడు స్టేషన్ లో ఉన్నారు రండి అని చెప్తాడు. ఈ తింగరిది మళ్ళీ ఏం పని చేసిందో అని రాజ్ బయలుదేర్తాడు.‌ మరొక వైపు ఇందిరా దేవి, అపర్ణ, ధాన్యలక్ష్మి  హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటారు. అప్పుడు అక్కడికి స్వప్న వచ్చి రిమోట్ తీసుకొని ఛానల్ చేంజ్ చేస్తుంటుంది. ఏంటి స్థిరంగా ఉండలేవా అని అపర్ణ అంటుంది. స్వప్న చిరాకు  పడుతు.. నా బాధ ఎవరు పట్టించుకుంటారని అంటుంది. ఏంటి నీ బాధ అని ఇందిరాదేవి అడుగుగా.. నా భర్త నాతో ప్రేమగా ఉండట్లేదు.. నన్ను పట్టించుకోవడం లేదని స్వప్న అంటుంది. అప్పుడే అక్కడికి రాహుల్ రుద్రాణి వస్తారు. నీ ప్రాబ్లమ్ ఏంటి డైరెక్ట్ చెప్పమని రుద్రాణి అడుగుతుంది. హనీమున్ కి నన్ను తీసుకొని వెళ్లడం లేదని స్వప్న అంటుంది. హనీమూన్ కి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి వెళ్తారు. నువ్వు పెళ్లి ముందే ప్రెగ్నెంట్ అయ్యావ్. ఇప్పుడు హనీమూన్ కి ఎలా వెళ్తావని రుద్రాణి అంటుంది... అవును నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం మాటి మాటికి మేము గుర్తుచేయాల్సి వస్తుంది. నీ జాగ్రత్తలు నీకు తెలియావా అని ఇందిరాదేవి అంటుంది. ఏంటి నాకు కడుపు లేదన్న విషయం నేనే బయట పెట్టుకునేలా ఉన్నా అని స్వప్న తనలో తానే అనుకుంటుంది.  మరొక వైపు రాజ్ స్టేషన్ కి వెళ్లేసరికి.. కావ్య లేడీ కానిస్టేబుల్ తో చుక్కల ముగ్గు ఎలా వెయ్యాలో నేర్పిస్తుంటే,  కళ్యాణ్ మరొక కానిస్టేబుల్ తో తన కవిత్వలు చెప్తూ ఉంటాడు. ఎస్ఐ దగ్గరికి వెళ్లిన రాజ్.. జరిగింది తెలుసుకోని కమీషనర్ తో రికమండ్ చేపిస్తాడు. ఆ తర్వాత కావ్య, కళ్యాణ్ లను బయటకు తీసుకొని వస్తాడు. మరొకవైపు స్వప్న ప్రెగ్నెంట్ తో ఉండగా సూడిగం తీసుకొని వెళ్ళాలని అనుకుని డబ్బులు గురించి ఆలోచిస్తుంది కనకం. మరొక వైపు.. మీరు చేసేదేంటని కావ్యని రాజ్ అడుగుతాడు. " ఏం లేదు అన్నయ్య.. వదిన కార్ డ్రైవింగ్ నేర్చుకుంటా అంటే నేర్పిస్తున్నా" అని కళ్యాణ్ అంటాడు. డ్రైవింగ్ అనేది ఎవరు లేని ప్లేస్ లో నేర్చుకోవాలి. ఇలాగ క్రౌడ్ ఉన్న దగ్గర కాదని రాజ్ వాళ్లిద్దరిపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కాలేజీకి గెస్ట్ లుగా జగతి, మహేంద్ర.. షాక్ లో రిషి, శైలేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -813 లో.. గెస్ట్ లను రిసీవ్ చేసుకోవడానికి అందరు బయటకు వెళ్తుంటే.. వసుధార కూడా వెళ్ళడానికి వస్తుంటే మీరు అక్కడి వరకు నడిచి, మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకు ఇక్కడే ఉండండని వసుధారతో రిషి అనగా.. సరేనని వసుధార అక్కడే ఉంటుంది.  ఆ తర్వాత అందరు గెస్ట్ ల కోసం ఎదురుచూస్తుంటారు. అప్పుడే జగతి, మహేంద్రల కార్ వస్తుంది. కార్ లో నుండి జగతి, మహేంద్ర దిగగానే వాళ్ళిద్దరిని చూసి రిషి షాక్ అవుతాడు.. జగతి మాత్రం వెళ్లి రిషి ని హగ్ చేసుకొని తన ప్రేమని చెప్తూ ఎమోషనల్ అయినట్లు ఊహించుకుంటుంది. కాసేపటికి పదా జగతి అని మహేంద్ర అనగానే ఊహలో నుంచి బయటకు వచ్చి.. ఇద్దరు రిషి దగ్గరికి వెళ్తారు. ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళు అన్నట్లుగానే జగతి, మహేంద్ర, రిషిల ప్రవర్తన ఉంటుంది. ఏంటి పిన్ని, బాబాయ్ లు ఎమోషనల్ అవుతున్నారని అటుగా చూసేసరికి.. అక్కడ ఉన్న రిషిని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. ఏంటి రిషి బ్రతికే ఉన్నాడా అని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. మరొకవైపు కాలేజీ ప్రిన్సిపల్ వాళ్ళని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్తాడు. రిషి ఆశ్చర్యంగా చూస్తూ పక్కకి వెళ్ళిపోతాడు. అందరూ లోపలికి వెళ్తారు. జగతి, మహేంద్రలను చూసి వసుధార షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు వసుధార దగ్గరికి వెళ్లి.. ఏం తెలియనట్టుగా పరిచయం చేసుకుంటారు. రిషి, వసుధారల గురించి ప్రిన్సిపల్ జగతి, మహేంద్రలకి గొప్పగా చెప్తాడు. మరొకవైపు రిషిని శైలేంద్ర చూస్తూ.. వాళ్ళు నాకు అబద్దం చెప్పారా అని రౌడీకి కాల్ చేస్తాడు శైలేంద్ర. రిషి నా ముందే ఉన్నాడు. మీరు చనిపోయారని చెప్పారు కదా అని శైలేంద్ర అడుగుతాడు. నేను కనుక్కుని ఫోన్ చేస్తానని రౌడీ అంటాడు. మరొక వైపు రిషి కోసం సెమినార్ హాల్లో అందరూ ఎదురు చూస్తుంటారు. ఏంటి వీళ్ళు అనుకోకుండా వచ్చారా అని ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, మోసగాడని ముద్రవేసిన వారి ముందు మోటివేషన్ స్పీచ్ ఎలా ఇవ్వాలని రిషి అనుకుంటాడు. స్టూడెంట్స్ కోసమైన నేను వెళ్లి మాట్లాడాలని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత రౌడీ కాల్ చేసి.. అవును సర్ రిషి బ్రతికే ఉన్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని చెప్తాడు.ఈ సారి అలా కాకుండా చూస్తామని రౌడీ అంటాడు. మీరేం చేయనవసరం లేదని, ఇంతమంది ఉండగా వాన్ని ఇక ఎవరేం చెయ్యలేరని శైలేంద్ర అనుకుంటాడు.  

ముకుంద, మురారి కలిసి ఉన్న ఫోటోని భవాని చూస్తుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -207 లో.. ముకుంద దగ్గరికి రేవతి వచ్చి కృష్ణ గురించి ఉన్నవి, లేనివి కలిపించి ఎందుకు చెప్పావని అడుగుతుంది. నేను జరిగిందే చెప్పానని ముకుంద అంటుంది. నీ ప్రేమని నువ్వు దక్కించుకోవాలని నువ్వు చూస్తున్నావ్ కానీ అది జరగదు. మురారి ఒకప్పుడు నీ ప్రేమికుడు. ఇప్పుడు కృష్ణకి తాళి కట్టిన భర్త అని రేవతి అంటుంది. నీ వెనకాల భవాని అక్క ఉంది. కృష్ణ, మురారీల వెనకాల నేను ఉన్నాను. భవాని అక్క నీ చెప్పుడు మాటలు వింటుందేమో కానీ తప్పుడు పనులు చెయ్యదని రేవతి అంటుంది. నువ్వు చేసేది తప్పో రైటో అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ముకుందకి వార్నింగ్ ఇస్తుంది రేవతి. మరొక వైపు భవాని అన్న మాటలు మురారి గుర్తుచేసుకుంటాడు. అప్పుడు కృష్ణ బాధపడుతూ మురారి దగ్గరికి వస్తుంది. ఏంటి కృష్ణ అసలు నువ్వు మందు తాగడమేంటని అడుగుతాడు. నేను మందు తాగలేదు. వాసన చూసాను అంతే.. ముకుంద అలా చెప్పిందని కృష్ణ అంటుంది. పెద్దమ్మ అన్న మాటలకూ బాధపడుతున్నావా అని మురారి అడుగుతాడు. లేదు నేను తప్పు చెయ్యలేదు కాబట్టి నేను బాధపడనని కృష్ణ పడుకుంటుంది. తినకుండా ఎలా పడుకుంటావని కృష్ణతో మురారి అంటాడు. ఒక ఆపిల్ అందులో నంచుకొని తినడానికి పికెల్ తీసుకొని రా అని కృష్ణ మురారికి చెప్తుంది. మురారి వెళ్తు నేను కృష్ణ కోసం డెకరేట్ చేసిన లైట్స్ ఏం అయ్యాయని మురారి అనుకుంటాడు. మరొకవైపు అలేఖ్య, మధు ఇద్దరు మాట్లాడుకుంటారు. పాపం కృష్ణ మందు తాగలేదని నువ్వు చెప్పి ఉంటే బాగుండేదని అలేఖ్య అంటుంది. అది చెప్తుండగానే కదా పెద్దమ్మ నన్ను కొట్టిందని మధు అంటాడు. మరొక వైపు మురారి తన గదిలోకి వచ్చినట్లుగా ముకుంద ఉహించుకుంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న మురారి ముకుంద గదిలో.. మురారి ఐ లవ్ యు అని డెకరేట్ చేసి ఉంది చుసి మురారి కోపంగా లోపలికి వచ్చి.. నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా అంటూ మురారి డెకరేషన్ చెడగొడతాడు. నా ప్రేమని ఇలా చేస్తావా నిన్ను కృష్ణని ఎలా విడదీస్తానో చూడని ముకుంద అనుకుంటుంది.  ఆ తర్వాత రేవతిని అడిగి మురారి అవి తీసుకొని వస్తుంటే భవాని చూసి.. అవి ఏంటని అడుగుతుంది. కృష్ణకి ఆపిల్ ఇంకా పికెల్ అని మురారి అనగానే.. నీ భార్యని నేనేదో అన్నట్లు ఇక్కడ తినకుండా.. నీతో గదిలోకి తెప్పించుకుంటుందా అని మురారిపై కోప్పడుతుంది. మురారి కృష్ణకి ఆపిల్, పికెల్ తీసుకొని వెళ్లి తినమని చెప్తాడు. మరొకవైపు ముకుంద, మురారి కలిసి ఉన్న ఫొటోస్ ని అలేఖ్య, మధు ఇద్దరు భవానికి చూపిస్తామని వస్తుంటే.. రేవతి ఆపి ఆ ఫోటోస్ ని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఒక కేజీ బరువు తగ్గిపోయాను...శ్రీముఖి అక్కకు థ్యాంక్స్!

"నీతోనే డాన్స్" షోలో ఏ వారం యాదమ్మ రాజు - స్టెల్లా జంట  ఎలిమినేట్ అయ్యారు. తమ ఎలిమినేషన్ కి సంబంధించి వీళ్ళు ఒక వీడియో చేశారు.  "రిషిక, ప్రశాంత్, గోవింద్ మాష్టర్లు మాకు డాన్స్ బాగా నేర్పించారు. మాకు షూటింగ్స్ ఉండడం వలన రాత్రి 10 గంటలకు వెళ్లి ప్రాక్టీస్ చేసి తెల్లవారు జామున 3 గంటలకు వచ్చేవాళ్ళం. నాకు డాన్స్ అనేదే కొత్త అసలు స్టేజి ఫియర్ కూడా ఎక్కువ. ఎందుకంటే చాలా కెమెరాలు ఉంటాయి. వాటిల్లో ఏది చూడాలో నాకు అసలు తెలీదు. ఫస్ట్ ఎపిసోడ్ లో నా డాన్స్ కి వంక పెట్టి అందరూ నన్నే కామెంట్ చేస్తుంటే ఈ షో నుంచి తప్పుకుందాం అనుకున్నాను. ఐతే తర్వాత నా బాధ చూసి రాజు, మాష్టర్లు ఇచ్చిన సపోర్ట్ కి నేను కొంతవరకు బాగానే చేసాను. ఇక మిగతా వాళ్ళతో పోల్చితే మా డాన్స్ లో ఎనర్జీ లెవెల్స్ తగ్గడంతో, ఎక్స్ప్రెషన్స్ తగ్గడంతో జరిగింది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని ఎలిమినేట్ చేశారు. ఈ షో ఒప్పుకున్నప్పుడు నాకు  చాలా ప్రెషర్ ఐపోయింది మొదట్లో..కానీ తర్వాత అలవాటైపోయింది. రియాలిటీ షో ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ముఖ్యంగా ఒక కేజీ వెయిట్ కూడా తగ్గిపోయాను డాన్స్ ప్రాక్టీస్ కి. నేను శ్రీముఖి అక్కకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను భయపడుతూ ఉన్నప్పుడు చాలా సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. దయచేసి మా మీద ఎలాంటి నెగటివ్ ట్రోల్ల్స్ చేయకండి ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. కానీ నేను కూడా డాన్స్ చేయగలను అనే విషయం ఈ షో ద్వారానే నాకు కూడా తెలిసింది. షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా బాగా చేస్తారు. మిగతా ముగ్గురు  జోడీస్ టాప్ 5 లో ఉండాలి... జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి...కాబట్టి ఎక్కువ మాట్లాడితే నాకు ఏడుపొచ్చేస్తుంది" అని స్టెల్లా. స్టెల్లా అసలు ఇలా డాన్స్ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు..ఆమెకు కొంచెం చెవికి సంబంధించిన సమస్య ఉంది అందుకే డాన్స్ సరిగా చేయలేకపోయింది అని చెప్పాడు యాదమ్మ రాజు. ఐతే ఎప్పుడూ కామెడీ గా జోక్స్ వేస్తూ అందరినీ నవ్వించే ఈ జంట ఎలిమినేట్ అయ్యేసరికి జడ్జెస్, మిగతా కంటెస్టెంట్స్ కూడా కొంత బాధపడ్డారు షోలో.    

ఆకులు మేకలే కాదు.. నేను కూడా తింటున్నా!

బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. సుమ కనకాల.. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. ఈ మధ్య స్పీడ్ బోట్ లో  వెళ్తూ వ్లాగ్ చేసి ట్రెండింగ్ లో నిలిచింది సుమ. ఆ తర్వాత బంగాళాదుంపల ఫ్రైని 'ఫ్రెంచ్ ఫ్రై' అని అమ్మేస్తున్నారంటూ సుమ ఒక వీడియోని పోస్ట్ చేయగా అది కూడా వైరల్ అయింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది సుమ. "పుష్ప సినిమాలో ఏం చెప్పారు. ఆకులు తింటది మేక , మేకను తింటది పులి.. ఆకులు మేకలే కాదు మనుషులు కూడా తింటారు. ఇదిగో చూడండి నేను తింటున్నాను" అంటూ సుమ సలాడ్ తింటున్న వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకి అత్యధికంగా కామెంట్లు వస్తున్నాయి. 'నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటి అక్క' అని ఒకరు కామెంట్ చేయగా, 'మనల్ని మనుషలు అని ఎవరన్నారు సుమ' అని మరొకరు, 'ఎంత సంపాదిస్తే ఏం లాభం, మీరు మాలా నచ్చిందేదీ తినలేరు' అంటూ కామెంట్ చేశారు. ఇలా కొన్ని ఫన్నీ కామెంట్లతో ఈ వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇలా రెగ్యులర్ గా ట్రావెల్ వ్లాగ్స్, ప్రమోషన్స్, కుకింగ్ వ్లాగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సుమ.  

తనకొక రిలేషన్ కావాలని ఓపెన్ గా చెప్పిన అఖిల్ సార్థక్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.  అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్, మోనల్ గజ్జర్ తో‌ జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి‌. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు. బిబి జోడీలోని మొదటి రెండు వారాల్లో అఖిల్-తేజస్విని వాళ్ళ హాట్ పర్ఫామెన్స్ తో జడ్జ్ లకే చెమటలు పట్టించారు. అయితే ఆ షోలో విన్నర్ గా వీళ్ళ జోడి నిలుస్తుందని అనుకున్నారంతా కానీ అనుకోకుండా అఖిల్ కి కాలికి గాయం కారణంగా డాక్టర్స్ డ్యాన్స్ చేయకూడదని చెప్పడంతో వాళ్ళ జోడీ షో నుండి బయటకొచ్చేసారు. అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో  తన గురించిన అప్డేట్ లని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. " నాకు ఒక రిలేషన్ కావాలి. అది ఎలా ఉండాలంటే హాట్ గా ఉండాలి. ఇంకా అధిక సంపదతో ఇద్దరమే సంతోషంగా ఉండాలి" అని పోస్ట్ చేసాడు అఖిల్.  అయితే అఖిల్ రెగ్యులర్ గా జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కాగా ఇప్పుడు తనకొక గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ ఓపెన్ గా చెప్పాడు అఖిల్ సార్థక్.  

డోంట్ కాంప్రమైజ్ అంటున్న అరియానా!

అరియానా.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటి అయిపోయింది. అరియానా మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలుపెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియానా. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ  చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. దాంతో అరియానా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యమే లేదు.అరియానా అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వల్ల అరియనాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని  అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియానా చాలా బాధపడింది. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆర్జీవీతో కలిసి జిమ్ లో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఆ తర్వాత అరియానా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. ఇలా అరియానా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. బిగ్ బాస్-5 బజ్ కి  ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా అరియానా పాపులర్ అయింది. ఇంటర్వ్యూలో అరియానా కంటెస్టెంట్ తో సూటిగా మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా అరియానా ఒక పోస్ట్ చేసింది. ఒక బోల్డ్ ఫోటో అప్లోడ్ చేసి దానికి ఒక‌ క్యాప్షన్ చేసింది.  "ఎవరికోసం మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి.. డోంట్ కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్.. మీకు ఉన్నదానితోనే ఉండండి" అంటూ అరియానా చెప్పింది. దీంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది అరియానా.

నాకన్నా బెటర్ గా చేసేవాళ్ళని నేను పట్టించుకోను.. నాతో నాకే పోటీ!

ముత్యాలు రాజ శేఖర్.. ఈ పేరు ఎవరికి తెలిసిఉండకపోవచ్చు.‌ కానీ బిగ్ బాస్ సీజన్-6 లో రాజ్ అంటే అందరికి తెలిసి ఉంటుంది. తన కామ్ అండ్ కూల్ నేచర్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను తనవైపుకి తిప్పుకున్నాడు రాజ్. రాజ్ ఒక మోడల్ గా బిగ్ బాస్ సీజన్-6 లోకి అడుగుపెట్టాడు. రాజ్ వాళ్ళ నాన్న 2009 లో చనిపోవడంతో తను చదువు మానేసి ఆఫీస్ బాయ్ గా చేసాడంట. ఆ తర్వాత చిన్న చితక జాబ్స్ చేస్తూ చదువుకున్నాడు. ఒక స్టేజ్ లో తనకి లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చిందని, లివ్ వాట్ యూ లవ్ అనేది తను నమ్మాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన రాజ్. బిగ్ బాస్ సీజన్‌-6 లోకి ఎంట్రీ ఇచ్చాక తనలో చాలా మార్పు వచ్చింది. రాజ్ మొదట కీర్తభట్, ఇనయా సుల్తానాలతో ఎక్కడ టైం ఉన్నాడు. ఆ తర్వాత ఫైమాతో ఫ్రెండ్ షిప్ చేసాడు. దాంతో రాజ్ కి ఒక తోడులా , ఏది ఎలా మాట్లాడాలని, ఎవరు ఎలా ఉంటారో తెలియజేసింది ఫైమా. అయితే చలాకి చంటితో కలిసి కామెడీని చేసిన రాజ్.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు ప్రేక్షకులను ఆకట్టున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్నిరోజులు.. రాజ్ ఎక్కడున్నా రాజే అని నాగార్జున అనేవాడు. అలాగే రాజ్ రెగ్యులర్ గా వాడే ఊతపదం 'మినమం ఉంటది' అనేది ఎక్కువ ఫేమస్ అయింది. అయితే రాజ్ బిగ్ బాస్ తర్వాత తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ అప్డేట్ లో ఉంటున్న రాజ్.‌ తాజాగా రాజ్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో సూట్ వేసుకొని ఉన్న తన ఫోటోని షేర్ చేసి దానికి ఒక క్యాప్షన్ రాసాడు. "నాకన్నా బెటర్ గా చేసేవాళ్ళని నేను పట్టించుకోను. ఎందుకంటే నాతో నాకే పోటీ. గత సంవత్సరం నేనెలా ఉన్నానో ఈ సంవత్సరం నేనెలా ఉన్నానో చూసుకుంటానంతే" అంటూ రాజ్ చెప్పాడు. దీంతో బిగ్ బాస్ సీజన్-6 ఫ్రెండ్స్ తో పాటు రాజ్ ఫ్యాన్స్ చూసి వహ్ రాజ్, అట్లుంటది మనతో అంటూ కామెంట్లు చేస్తున్నారు.    

తన లైఫ్ లో గడిచిన అయిదు నెలలు టఫ్ ఫేజ్ అంట!

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా  ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది.  కొత్తగా మొదలైన థ్రెడ్స్ ఆప్ లో సెలబ్రిటీలంతా జాయిన్ అవుతూ తమ‌ మొదటి పోస్ట్ లు చేస్తున్నారు. కాగా గీతు రాయల్ కూడా అందులో తనకంటు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంది. "నా లైఫ్  లో చివరి‌ అయిదు నెలలు చాలా టఫ్ ఫేజ్ నడిచింది. కానీ ప్రతీ సిచువేషన్ ని దాటుకొని ముందుకొచ్చాను. కొత్తగా మారుతుంది లైఫ్. లో ఫేజ్ నుండి హ్యాపీ నెస్ వస్తుంది" అంటూ ఆ పోస్ట్ లో చెప్పింది గీతు.  

కృష్ణకి సపోర్ట్ చేసినందుకు రేవతిపై ఫైర్ అయిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -206 లో.. శ్రీనివాస్ అన్న మాటలు గుర్తుచేసుకుంటు భవాని బాధపడుతుంది. ఆ తర్వాత భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. మీరు ఇన్ని రోజులు ఇంట్లో లేకుంటే మీ లోటు బాగా తెలిసి వచ్చింది అత్తయ్య అని  భవానితో ముకుంద అంటుంది. నేను లేనప్పుడు ఇంట్లో ఏమైందని భవాని అడుగుతుంది. కృష్ణ మురారి ఇద్దరు పెళ్లి చూడలేదని హోమం పేరిట వాళ్లకు పెళ్లి చేసిందని ముకుంద చెప్తుంది. తప్పేముంది వాళ్ళు భార్యభర్తలు కదా అని భవాని అంటుంది. కృష్ణ, మధుకర్ తో కలిసి ఇంట్లో డ్రింక్ చేసిందని ముకుంద చెప్పగానే‌.. భవాని షాక్ అవుతుంది. మీ తర్వాత ఇంట్లో తనే అన్నట్లుగా ప్రవర్తిస్తుందని ముకుంద అన్నీ కృష్ణపై కల్పించి చెప్తుంది. కృష్ణ కి సపోర్ట్ గా రేవతి అత్తయ్య వెనుకేసుకొస్తుందని ముకుంద చెప్తుంది. కృష్ణని ఇప్పుడే వెళ్లి అడుగుతానుంటూ భవాని వెళ్తుంది. మరొక వైపు కృష్ణకి ప్రపోజ్ చెయ్యాలని గోడపై ఐ లవ్ యు కృష్ణ అంటూ బెలున్స్ పెడతాడు మురారి. అటుగా వెళ్తున్న ముకుంద.. మురారి అలా డెకరేట్ చెయ్యడం చూసి షాక్ అవుతుంది. ఫామ్ హౌస్ లో ప్రపోజ్ చేస్తే అడ్డుపడ్డానని, ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నావా? నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తా అని ముకుంద అనుకుంటుంది. మరొకవైపు భవాని హాల్లోకి వచ్చి కృష్ణ అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విని తొందరగా వచ్చిన కృష్ణ.. ఏం అయింది అత్తయ్య అని అడుగుతుంది. ఏం చెప్పమంటావ్? ఈ ఇంటి పరువు తీసే పని చేసావని చెప్పనా? ఏం అని చెప్పాలి అని భవాని అంటుంది. నీ కోడలు తాగి తందానాలు ఆడుతుంటే నాలుగు తిట్టి బయటకు పంపించాలని తెలియదా అని అక్కడే ఉన్న రేవతిపై భవాని కోప్పడుతుంది. ఇంట్లో కోడలు అన్న విషయం గుర్తుపెట్టుకొని ఉంటేనే ఈ ఇంట్లో స్థానం ఉంటుందని కృష్ణకి  భవాని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత ముకుంద దగ్గరికి వెళ్లిన రేవతి.. కృష్ణ గురించి చెడుగా ఎందుకు చెప్పావని అడుగుతుంది‌. జరిగిందే కదా చెప్పానని ముకుంద అంటుంది. దాంతో ముకుంద ప్రవర్తన గురించి రేవతి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

కుర్రాళ్ళ మతిపోగొడుతున్న గుప్పెడంత మనసు సీరియల్ జగతి!

జ్యోతి రాయ్.. ఈ పేరు విని ఉండకపోవచ్చు గానీ జగతి మేడం అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత  'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది. తాజాగా జ్యోతిరాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోస్ ని షేర్ చేసింది. ప్రతీరోజు "గుప్పెడంత మనసు" సీరియల్ లో చీరకట్టులో ఒక అమ్మ పాత్రలో జగతిని చూసే ప్రేక్షకులకు, ఈ ఫోటోస్ నచ్చకపోవచ్చు. బోల్డ్ లుక్ లో అందాలని చూపిస్తుంది  జ్యోతి రాయ్. అయితే ఈ ఫోటోలని చూసిన నెటిజన్లు.. 'మిమ్మల్ని ఇంత ట్రేండీగా చూడాలని లేదు జగతి మేడం. అమ్మగా మాత్రమే చూడాలనుకుంటున్నాం' అని ఒకరు కామెంట్ చేయగా, 'రోజు రోజుకి ఇలా అవుతున్నావేంటే జ్యోతి' అంటూ మరొకరు కామెంట్ చేయగా, నెగెటివ్ కామెంట్స్ ఇంకా బోలెడు ఉన్నాయి. మరి ఈ కామెంట్స్ ని చూసాక జగతి అలియాస్ జ్యోతి రాయ్  ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

జగతి, మహేంద్రలు ఎందుకు ఆ కాలేజీకి వెళ్తున్నారో కనిపెట్టిన శైలేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -812 లో.. కాలేజీలో రిషి ఇచ్చే సెమినార్ కి  వెళ్లాలని వసుధార రెడీ అయి హాల్లోకి వస్తుంది. నేను కూడా కాలేజీకి వస్తాను సర్ అని విశ్వనాథ్ ని వసుధార అడుగుతుంది. ఇంకా నొప్పి తగ్గలేదు కదా అని విశ్వనాథ్ అంటాడు. ఇంకా మీరు  పూర్తిగా సరిగా నడవలేకపోతున్నారు. వద్దని రిషి అంటాడు. ఏం పర్లేదు సర్ వస్తానని వసుధార రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత వసుధార కాలేజీకి రావడానికి రిషి, విశ్వనాథ్ లు ఒప్పుకుంటారు. విశ్వనాథ్ ఏంజిల్ ని పిలిచి నువ్వు కూడా కాలేజీకి రావాలి, తనకి సాయంగా ఉండమని విశ్వనాథ్ చెప్పగా.. ఏంజెల్ సరేనని అంటుంది. అందరూ కాలేజీకి బయల్దేరుతారు. కార్ లో వెళ్తుండగా రిషి ఇండైరెక్ట్ గా వసుధారకి జాగ్రత్తలు చెప్తాడు. నాకెందుకు చెప్తున్నావ్ వసుధార ఇక్కడే ఉంది కదా తనకే చెప్పమని రిషితో ఏంజిల్ అంటుంది. ఏంజెల్ కార్ ఆపమని చెప్పి విశ్వనాథ్ ని వెనక్కి, వసుధారని రిషి పక్కకి కూర్చోమంటుంది. ఇప్పుడు ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు కదా మాట్లాడుకోండని ఏంజిల్ అంటుంది. ఏం తిన్నారు  సర్ అని వసుధార అడుగుతుంది. దోశ తిన్న అని రిషి అంటాడు. ఎన్ని తిన్నారని వసు అడుగుతుంది. పధ్నాలుగు తిన్న అని రిషి వెటకారంగా అంటాడు. రిషి వాళ్ళు కాలేజీకి వెళ్ళగానే పాండియన్ వచ్చి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్తాడు. కాలేజీ ప్రిన్సిపాల్ తో రిషి సెమినార్ గురించి మాట్లాడతాడు. వచ్చే గెస్ట్ లను ఇంప్రెస్స్ చేసి సెమినార్ గురించి గొప్పగా చెప్పాలని ప్రిన్సిపాల్ అంటాడు. అది నేను చూసుకుంటా అని రిషి అంటాడు. ఆ తర్వాత మేడం మీరు అక్కడ కూర్చోండని వసుధారకి రిషి చెప్తాడు. ఏంజిల్ నువ్వు కూడా వసుధారా మేడంతోనే ఉండమని రిషి కేరింగ్ చూపించేసరికి ఏంజిల్ కి డౌట్ వస్తుంది. వసుధార రాకముందు వేరేలా ఉన్నావ్.. ఇప్పుడు వేరేలా ఉన్నావ్. మీ మధ్య ఏదైనా ఉందా అని రిషిని ఏంజిల్ అడుగుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టైం కాదు సెమినార్ టైం అని  ఏంజిల్ తో  రిషి అంటాడు... మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు రిషి ఉన్న కాలేజీ కి వెళ్తున్నారని తెలిసి వాళ్ళ కంటే ముందు శైలేంద్ర ఆ కాలేజీకి వెళ్తాడు. అసలు పిన్ని బాబాయ్ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని లోపలికి వెళ్తాడు. అక్కడ వసుధారని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. వసుధారని కలవడానికి పిన్ని బాబాయ్ వస్తున్నారా? ఈ ముగ్గురు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. మరొకవైపు రిషి ఉన్న కాలేజీకి జగతి, మహేంద్ర వస్తుంటారు. అసలు అనుకోకుండా కాలేజీ వెళ్లినట్లు మనం అక్కడ  ఉండాలని జగతికి మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రాజ్ పై కావ్య చూపిస్తున్న కేరింగ్.. స్వప్నకి అవమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -145 లో... కావ్య కోసం అకౌంట్ ఓపెన్ చెప్పిద్దామంటే ఈ తింగరిది ఇక్కడ లేదని రాజ్ కావ్య కోసం అటు ఇటు చూస్తుంటాడు. రాజ్ అలా చూడడం గమనించిన ధాన్యలక్ష్మి.. రాజ్ ఎవరికోసం చూస్తున్నావ్? కావ్య కోసమేనా నేను పిలుచుకొస్తాను ఉండు అని ధాన్యలక్ష్మి వెళ్తుంది. ఆ తర్వాత అందరి అకౌంట్ ఓపెన్ చెయ్యడం అయింది సర్ ఇంకొక ఫామ్ ఉంది.. ఎవరికి ఓపెన్ చెయ్యమంటారని బ్యాంకు నుంచి వచ్చిన అతను రాజ్ ని అడుగుతాడు. అప్పుడే పై నుండి స్వప్న, కావ్య ఇద్దరు వస్తారు. ఇంక ఇద్దరు ఉన్నారు ఫామ్ ఒకటే ఉందని అందరూ ఆలోచిస్తుండగా.. ఎందుకు ఆలోచించడం మా అక్కకి ఓపెన్ చెయ్యండి అని కావ్య అంటుంది. స్వప్నకి అవసరం అయితే రాహుల్ వెళ్లి ఓపెన్ చేపిస్తాడు కానీ కావ్యకి ఓపెన్ చెయ్యండని ధాన్యలక్షి అంటుంది. అందరూ షాక్ అవుతారు. రాజ్ కావ్య కోసం ఇదంతా చేస్తుంటే స్వప్న కి అంటున్నారు.. కావ్యకి ఓపెన్ చెయ్యండని ధాన్యలక్ష్మి అంటుంది. వివరాలు చెప్పమని కావ్యని రాజ్ అంటాడు. ఆ తర్వాత స్వప్న కోపంగా తన గదిలోకి వెళ్లి నాకు అవమానం జరిగిందంటూ రాహుల్ పై కోప్పడుతుంది. నీ కోపం నాపై కాదు కావ్య నీ చెల్లెలు కదా.. నువ్వు ముందు తనని నీ కంట్రోల్ లో ఉంచుకో.. ఆ తర్వాత అందరూ నీ కంట్రోల్ లొకి వస్తారని రాహుల్ చెప్తాడు. మరొక వైపు కావ్య రాజ్ వెళ్లే కార్ లో ఇన్ హెల్లర్ పెడుతుంది. అప్పుడే రాజ్ వచ్చి ఏం చేస్తున్నావని కావ్యని అడుగుతాడు. మీకు ఇన్ హెల్లర్ అందుబాటులో లేకపోవడం వళ్లే మొన్న అలా జరిగింది. అందుకే కార్ లో ఒకటి పెట్టాను ఇంకొకటి మీరు మీ క్యాబిన్ లో పెట్టండని కావ్య చెప్పగానే.. రాజ్ సైలెంట్ గా వెళ్ళిపోతాడు.ఆ తర్వాత కావ్య దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటానని కావ్య అనగా.. నేను నేర్పుతానని కళ్యాణ్ అంటాడు. మరొక వైపు రాజ్ పట్ల కావ్య కేరింగ్ చూపించడం తో రాజ్ ఇన్ హెల్లర్ ల వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు స్వప్న కిచెన్ లో వంట చెయ్యడానికి రెడీ చేస్తూ ఉంటే.. ధాన్యలక్ష్మి వచ్చి నువ్వు కిచెన్ లోకి ఎందుకు వచ్చావ్? ఏదైనా ఉంటే కావ్య చేసి పెడుతుంది కదా అని స్వప్నతో ధాన్యలక్ష్మి అంటుంది. ఏంటి ఆ కావ్య ఏమైనా ఇంటికి మహారాణా? అన్ని తననే అడగాలా అని కోపంగా స్వప్న రుద్రాణి దగ్గరికి వెళ్తుంది. ఇంకా కావాలనే రుద్రాణి స్వప్నని రెచ్చగొడుతుంది. ఎలాగైనా ఇంట్లో అందరూ నా మాట వినేలా చేసుకుంటా అని స్వప్న అనుకుంటుంది. మరొక వైపు కావ్యకి కళ్యాణ్ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. శృతి డిజైన్స్ లు తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగల్సిందే.     

సినిమా ఫీల్డే నీ అడ్డా..ఇంకా సుమ అడ్డా అనే పేరు ఎందుకు పెట్టావో తెలీదు

  సుమ అడ్డా షో ఈ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ కి సునీత కొడుకు ఆకాష్ నటించిన "సర్కారు నౌకరి" మూవీ టీం వచ్చింది. సునీత, ఆకాష్, రాఘవేంద్రరావు వచ్చారు.. "తెలుగు జాతి గర్వించే దర్శకేంద్రుడు" అంటూ ఇన్వైట్ చేసింది సుమ.  "నా క్యాష్ ప్రోగ్రాంకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు సుమ అడ్డా షోకి వచ్చారు..ధన్యోస్మి" అని సుమ అనేసరికి "సినిమా ఫీల్డే నీ అడ్డా..ఇంకా సుమ అడ్డా అనే పేరు ఎందుకు పెట్టావో నాకు తెలీదు" అన్నారు రాఘవేంద్రరావు. దానికి అందరూ నవ్వేశారు.  రెండు "సు" లతో సునీత, సుమ..ఒకరు వాగుడుకాయ్, ఒకరు పాటకాయ్ అన్నారు. ఇక సునీత వాళ్ళ అబ్బాయి గురించి సుమ కామెంట్ చేసింది. "చేతుల్లో పసి బిడ్డగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ స్టేజి వరకు ఎదిగాడు కానీ నేనే ఎందుకో అలాగే ఉండిపోయాను అనిపిస్తోంది" అంది సుమ. తర్వాత  "సిరిమల్లె సిరిమల్లె పువ్వా" అనే సాంగ్ కి సుమ చంద్రమోహన్ ల నటిస్తే సునీత శ్రీదేవిలా నటించారు. తర్వాత ఆకాష్ సుమ డబ్బులు ఇచ్చేసరికి "చూడు సునీత మీ అబ్బాయి నేను అడుక్కుంటున్నాననుకుంటున్నాడు" అనేసరికి కాదు అని చేతులూపాడు ఆకాష్ ...తర్వాత హీరో హీరోయిన్స్ ఆకాష్, భావన పారిపోతుంటే సునీత వాళ్ళను ఆపి "ఎందుకు ప్రేమించావు, ఎలా ప్రేమించావు, ఎక్కడ కలిశారు, అసలు ఏం జరుగుతోంది" అని సునీత సీరియస్ గా అడిగేసరికి "నువ్వు అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం ఒక్కటే అది ఈవిడే" అని సుమని చూపించేసరికి సుమ షాకైపోయింది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో హీరో సైకిల్ మీద కనిపిస్తుంది అలాగే  బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై 'పెద్ద రోగం చిన్న ఉపాయం' అని రాసి ఉండటం, అందులోనూ ఈ వెరైటీ లుక్ తో అసలు ఈ స్టోరీ ఏమిటి అనే ఒక ఆసక్తి నెలకొంది. అందులోనూ కొత్త హీరోగా  ఆకాష్ ఇందులో చాలా నాచురల్ గా కనిపించాడు. మరి ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని ప్రొమోషన్స్ బాట పట్టింది.    

నువ్వు చాలా వీక్ అన్న పవిత్ర...ఎం దమ్ములేదా అన్న సుష్మిత

  సూపర్ క్వీన్ సీజన్ 2 సెమీ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సూపర్ క్వీన్స్ తో గేమ్స్ ఆడించాడు ప్రదీప్. ఈ సెమీ ఫినాలేలో టాప్ 5 లో ఉన్న వాళ్లకు మాత్రమే ఫినాలేకి వెళ్లే  అవకాశం అని చెప్పేసరికి అందరూ షాకయ్యారు. ఈ రాబోయే వారం ఎపిసోడ్ లో సూపర్ క్వీన్స్ ని టు టీమ్స్ గా డివైడ్ చేసాడు  ప్రదీప్.. తర్వాత ఆ టీమ్ లోంచి ఒకరిని, ఈ టీమ్ లోంచి మరొకరిని తీసుకుని ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ గేమ్స్ ఆడించాడు. ఈ గేమ్స్ కూడా ఆడలేని విధంగా ఉన్నాయి. ఇలా ఒక్కో జోడికి ఒక్కో గేమ్ ఇచ్చాడు. ఫైనల్ గా పవిత్ర వెర్సెస్ సుష్మిత మధ్య కాంపిటీషన్ పెట్టడానికి పిలిచాడు. "నువ్వు సుస్మితని సెలెక్ట్ చూసుకున్నావా..నీకు ఇసక తెలుసా...ఇలా జల్లుతుంది" అని పవిత్రను అడిగాడు ప్రదీప్ "సెలెక్ట్ చేసుకుంటే ఏముంది..ఐనా కళ్ళాపి కదా జల్లేది" అని అంది పవిత్ర. "ఇసుకలో పుట్టినదాన్ని నేను..కాకినాడ ఇక్కడ " అని సుస్మిత అనేసరికి "బేసిక్ గా హాస్పిటల్ లో కదా పుడతారు" కదా అని పవిత్ర అనేసరికి షాకయ్యింది సుష్మిత. "ఈ బ్యాచ్ తో పోల్చుకుంటే సుష్మిత చాలా వీక్ అని నా ఒపీనియన్ అంటూ పవిత్ర అనేసరికి "నేను వీక్ అని నువ్వెలా చెప్తావు" అని సుష్మిత సీరియస్ అయ్యింది. "గేమ్ మొదలుపెట్టే ముందు నాకేం కావాలంటే" అని ప్రదీప్ మధ్యలో వచ్చేసరికి "ఆగండి...ఇక్కడ చాలా చర్చ జరగాలి" అని గట్టిగా చెప్పింది సుష్మిత..అదే సీరియస్ నెస్ తో "నీ హైట్ ఎంత నా హైట్ ఎంత" అని పవిత్రని నిలదీసింది "ఐనా ఫ్రెండ్ షిప్ లో ఏంట్రా ఇవన్నీ" అని కవర్ చేసుకోబోయింది పవిత్ర .."ఫ్రెండ్స్ అన్న మాట మాట్లాడద్దు నువ్వు" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది సుష్మిత. "అపోనెంట్ ని చేంజ్ చేసుకోవచ్చా" అని పవిత్ర అడిగేసరికి "ఎం నీకు దమ్ము లేదా" అని రివర్స్ లో అడిగింది సుష్మిత. తర్వాత వాళ్ళతో గేమ్ ఆడించాడు. మరి సెమీ ఫినాలే నుంచి ఫైనల్స్ కి ఎవరు సెలెక్ట్ అవుతారు అనే విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

మేము చెప్పేదంతా సొల్లు అంటూ రష్మీ యాంకరింగ్ పై కామెంట్ చేసిన దొరబాబు

ఎక్స్ట్రా జబర్దస్త్ 450 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ గా ఎపిసోడ్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్. ఇందులో స్కిట్స్ అన్ని బాగా నవ్వించాయి. ఈ ఎపిసోడ్ 14 న ప్రసారం కాబోతోంది . దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో పటాస్ ప్రవీణ్ ఒక షిప్ ని నడుపుతూ ఉంటాడు..."ఈ షిప్ కి ఎంతో పెద్ద చరిత్ర ఉంది..ఖుష్బూ గారు ఈ పడవ ఎక్కి ఏమన్నారంటే ప్రవీణ్ కొన్ని ముత్యాలు తీసుకురా అన్నారు. నేను సప్త సముద్రాలు తిరిగాను కానీ ముత్యాలు దొరకట్లేదు అని చెప్పా ఎందుకంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో మీరు నవ్వుతుంటే రాలిపోతున్నాయి కదా" అని చెప్పానన్నారు ప్రవీణ్. ఆ మాటలకు ఖుష్భు నవ్వేసరికి "ఉండుండు..ఆమె నవ్వారు ముత్యాలు ఏరుకుంటా" అంటూ కామెడీ చేశారు కృష్ణ భగవాన్. ఇక రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత స్కిట్ లో ఖుష్బూ రాకేష్ కి అత్తగారి క్యారెక్టర్ లో చేశారు. "అత్తా నువ్వు ఇంత తెల్లగా ఉంటావ్..ఏ పౌడర్ వాడతావు" అని రాకేష్ అడిగాడు "ఫారెన్ పౌడర్" అని చెప్పారు ఖుష్బూ "ఎంత పడింది" అని పౌడర్ కాస్ట్ ని రాకేష్ అడిగితె " ఇంత దులిపితే ఇంతే వచ్చింది" అని కౌంటర్ వేశారు ఖుష్బూ. ఇక ఫైనల్ లో వర్ష, ఇమ్ము పెళ్లి చేసుకుని వచ్చేసరికి స్కిట్లో ఇమ్ముకి తల్లిగా నటించిన మహిళ ఫుల్ గా తిట్టింది. "నా ఆశ నిరాశ చేసావ్ కదా. ఏ యాంగిల్ లో చూసి ఈమెను పెళ్లి చేసుకున్నావ్ " అని అడిగేసరికి "మీ అమ్మకు చెప్పలేదా కోడలొస్తోందని" అంది వర్ష..."మీ ఆవిడకు చెప్పలేదా పళ్ళు రాలగొడతానని" అని వర్షని ఉద్దేశించి అనేసరికి షాకయ్యాడు ఇమ్ము. ఇక ఫైనల్ గా దొరబాబు లేడీ గెటప్ లో వచ్చి ఎంటర్టైన్ చేసాడు. రష్మీ ని ఇమిటేట్ చేసాడు. "వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్..స్పాన్సర్డ్ బై వాళ్ళు, కోస్పాన్సర్డ్ బై వీళ్ళు, మేము చెప్పేదంతా సొల్లు" అనేసరికి రష్మీ ముఖం మాడిపోయింది.    

అప్పట్లో రాధ ఫొటోస్ పెట్టుకుని ఎవరూ లేనప్పుడు మాట్లాడుకునేవాడిని

నీతోనే డాన్స్ ఆదివారం ఎపిసోడ్ మంచి కలర్ ఫుల్ గా పోటాపోటీగా జరిగింది. ఈ వారం శని, ఆదివారం జరిగిన ఎపిసోడ్స్ లో అందరిని వాళ్ళ వాళ్ళ ఫ్యాన్ మూమెంట్స్ ని ఏమిటో అడిగింది శ్రీముఖి. అలాగే ఇప్పుడు తరుణ్ మాష్టర్ ని కూడా అడిగేసరికి. " ఈ షోలో ఒకరికి ఇంకొకరిపై ఫ్యాన్ మూమెంట్ ఉంది..కానీ మనకు ఇప్పటివరకు చెప్పలేదు. తరుణ్ మాష్టర్ కి ఫ్యాన్ మూమెంట్ కలిగిందా లేదా" అని తరుణ్ మాష్టర్ వైపు చూస్తూ అడిగింది. "నిజమే నాకు ఒక హీరోయిన్ ని చూస్తే చాలా ఎక్సయిట్మెంట్ కలిగేది. ఆమె ఫిలిమ్స్ ని నోరెళ్ళబెట్టుకుని చూసేవాడిని. ఆ హీరోయిన్ మరెవరో కాదు నా పక్కనే కూర్చున్నారు ఇప్పుడు. ఆ ఏజ్ లో రాధ గారి ఫొటోస్ ని అక్కడక్కడా పెట్టుకుని ఎవరూ లేనప్పుడు ఆ ఫోటోలను చూసుకుని ఆమెతో మాట్లాడేవాడిని. ఐతే నాకు చిరంజీవి గారి మీద కొంచెం జెలస్ గా ఉంది ..ఆయన చాలా చేశారు" అని తరుణ్ మాష్టర్ అన్నారు. "నేను తరుణ్ మాష్టర్ తో ఎక్కువగా వర్క్ చేయలేదు. కానీ ఆయన చూస్తే చాలా హోంలీగా , ఫ్రెండ్లీగా అనిపించేది. ఆయన చాలా ఈజీగా కనెక్ట్ ఇపోయారు. అందుకే ఆయన మీద నాకు  ఒక క్రష్ ఉండేది. అంటే ఆ క్రష్ కాదు" అని క్లారిటీ ఇచ్చారు రాధ. ఇక రాధ గురించి తరుణ్ మాష్టర్ అలా చెప్పేసరికి ఆమె  లేచి ఆయన్ని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. తరుణ్ మాష్టర్ కూడా రాధ చేతి మీద ముద్దిచ్చారు. ఈవారం ఎపిసోడ్ లో వీళ్ళ ఫ్రెండ్లీ మూమెంట్స్ హైలైట్ గా నిలిచాయి.  తెలుగు,తమిళ, హిందీ మూవీస్ కి  కొరియోగ్రఫీని అందించిన తరుణ్ మాస్టర్ మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో ఆయన రజనీకాంత్ సినిమాలకు ఎక్కువగా పనిచేశారు. నరసింహ, బాబా వంటి రజనీకాంత్ మూవీస్ కి ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. ఆయన కూడా తలైవా అంటే చాలా ఇష్టం..ఆ విషయాన్నీ చాలా సందర్భాల్లో కూడా చెప్పారు తరుణ్ మాష్టర్.  

బిగ్ బాస్ సీజన్-7 కి మొగలిరేకులు సీరియల్ యాక్టర్!

  సాగర్.. ఈ పేరు ఎవరికి తెలియకపోవచ్చు.. కానీ మొగలిరేకులు సీరియల్ లో మున్నా భాయ్ అంటే ఠక్కున గుర్తుపడతారు. అప్పట్లో ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. సీరియల్స్ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని ఈ సీరియల్ విషయంలో నిజం అయిందని చెప్పొచ్చు. సీరియల్ వచ్చి పదేళ్లు దాటినా.. ఈ సీరియల్ గురించి మాట్లాడుతునే ఉంటారు. ఈ సీరియల్ డైరెక్టర్ మంజుల నాయుడు ఇందులోని పాత్రలని అంతలా మలిచారు. మున్నా అలియాస్ ఆర్కేనాయుడు.. ఇవి మొగలిరేకులు సీరియల్ లో పాత్రల పేర్లే అయినా అవి ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలుగా నటించాడు సాగర్. తన కెరీర్ ని చిన్న చితక పాత్రలతో మొదలు పెట్టాడు. మొదటగా సాగర్ 'చక్రవాకం' సీరియల్ లో నటించాడు. ఆ తర్వాత 'మొగలిరేకులు' సీరియల్ లో మెయిన్ లీడ్ గా చేసాడు. అదే అతని కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మొగలిరేకులు సీరియల్ కి గాను బెస్ట్ యాక్టర్ గా సాగర్ నంది అవార్డు కూడా అందుకున్నాడు. సాగర్ కి ఈ సీరియల్ ద్వారా మంచి ఫేమ్ వచ్చింది. తనకంటు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత సాగర్ 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్ మూవీ', 'సిద్దార్థ' మూవీలలో యాక్ట్ చేసాడు. వాటితో పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఆ తర్వాత 'షాదీ ముబారక్' మూవీలో హీరోగా తన నటనతో అందరిని మెప్పించాడు. ఆ తర్వాత సాగర్ కి అవకాశలు తగ్గడంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. కాగా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటి షో బిగ్ బాస్ సీజన్-7 లోకి‌ సాగర్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్ లో సాగర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు, మళ్ళీ తన కెరీర్ ని రీస్టార్ట్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ టీం సాగర్ ని అప్రోచ్ అవడం, అగ్రిమెంట్ కూడా పూర్తి అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాగర్ హౌస్ లోకి వెళ్లడం నిజమే అయితే హౌస్ లో మళ్ళీ మున్నా బాయ్ ని చూడొచ్చని ప్రేక్షకులకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత బిగ్ బాస్ ద్వారా టీవీ లో కనిపిస్తున్న సాగర్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి మరి. కాగా ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

బిగ్ బాస్ సీజన్-7 కి రంగం సిద్ధం.. రిలీజైన కొత్త లోగో!

బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి ఈ సీజన్ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  టెలివిషన్ చరిత్రలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గత కొన్ని సంవత్సరాలగా టెలివిజన్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. టీఆర్పీలో అత్యధిక రేటింగ్ తో  ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్డాగా మారింది బిగ్ బాస్. ఈ సీజన్ కి సంబంధించిన సెట్ పనులు, ఇంకా ప్రోమో షూట్ అంతా ఇప్పటికే మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ టీం కంటెస్టెంట్ ని అప్రోచ్ అవడం కూడా జరిగిందంట, అందులో కొంతమందిని కన్ఫర్మ్ చెయ్యడం, వాళ్ళతో అగ్రిమెంట్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. ప్రతి కేటగిరి నుండి ఒకరిని సెలెక్ట్ చేస్తూ జరిగే ఈ ప్రక్రియలో.. ఒక రియల్ కపుల్ ని తీసుకుంటున్నారంటూ తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్-7 కి హోస్ట్ గా ఈ సారి కూడా నాగార్జున వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్ కి అవుటింగ్ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ శివ ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్-7కి బిబి కేఫ్ యాంకర్ గా అరియన గ్లోరీ వ్యవహరిస్తుందని తెలుస్తుంది.  బిగ్ బాస్ సీజన్-7 కి సంబంధించిన ప్రోమో షూటింగ్ ఈ నెల ఆఖరున మొదలవుతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్-7కి సంబంధించిన చాలా అనుమానాలు ప్రేక్షకులల్లో ఉన్నాయి. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎప్పుడు ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారా అనే క్యూరియాసిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే అందరిలో ఉన్న సస్పెన్సు కి తెరతీస్తూ స్టార్ మా ప్రతిష్టాత్మకంగా బిగ్ బాస్ లోగోని విడుదల చేసింది. లోగో గత సీజన్ లో కంటే భిన్నంగా ఉంది. దీంతో బిగ్ బాస్ సీజన్-7 పై అంచనాలు తార స్థాయికి చేరాయనడంలో ఆశ్చర్యం లేదు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం అవుతున్న ఈ సీజన్ ఎంత మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి మరి.