Suman Shetty Remuneration: సుమన్ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  బిగ్ బాస్ సీజన్-9 లో శనివారం నాటి ఎపిసోడ్ ఆకట్టుకునేలా సాగింది. 14వ వారం ఎవరూ ఊహించని విధంగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. నిన్న మొన్నటి దాకా బిగ్ బాస్ దత్తపుత్రుడు సుమన్ శెట్టి అని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా అతనే ఎలిమినేషన్ అయ్యాడు. టాప్-7 కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి నిన్న హౌస్ నుండి బయటకొచ్చాడు‌. (Suman Shetty Remuneration)   సుమన్‌ శెట్టికి రోజుకు 45 వేల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. అంటే వారానికి మూడు లక్షల పదిహేను వేల వరకు సుమన్ శెట్టి రెమ్యునరేషన్ అందుకున్నాడు. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి నిలిచాడు. బిగ్‌ బాస్‌ ట్రోఫీ విన్నర్‌ కి యాభై లక్షలు ఇస్తారు. టాక్స్ లు కట్‌ అయితే ఆయనకు దక్కేది నలభై లక్షలు ఉండొచ్చు. అలాంటిది సుమన్ శెట్టికి ఇప్పటివరకు 40 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందింది. పైగా మధ్యలో ఎవరికైనా సూట్‌ కేసు ఆఫర్‌కి టెంప్ట్ అయితే విన్నర్‌కి ఆ మాత్రం కూడా రాదు. చాలా తగ్గిపోతుంది. దీంతో సుమన్‌ శెట్టికి ఇప్పుడు విన్నర్‌కి మించిన పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. అయితే ఇందులోనూ కొంత టాక్స్ కట్ అవుతుందని చెప్పొచ్చు.   సుమన్ శెట్టి హౌస్ లో పద్నాలుగు వారాలు ఉన్నాడు. ఇందులో టాస్క్ లో రెండు, మూడు సార్లు గెలిచాడు అంతే. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అంతగా ఏం లేదు. కానీ అతడికి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అతడు ఇన్ని వారాలు హౌస్ లో ఉన్నాడు.  

Suman Shetty Buzz Interview:  చాలా పెద్ద తప్పు చేశావ్.. సుమన్ ని నిలదీసిన శివాజీ..!

  బిగ్ బాస్ సీజన్-9 లో 14వ వారం వీకెండ్ వచ్చేసింది‌. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయ్యాడు. ఇది ఎవరు ఊహించని విధంగా జరిగింది.    ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చేసిన సుమన్ శెట్టి బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక సుమన్ శెట్టి వచ్చీ రాగానే.. జయం సినిమాలోని 'శబ్బాసి శబ్బాసే' అనే బిజిఎమ్ తో అదరగొట్టాడు ఎడిటర్. ఇంటర్వ్యూలో ఏది అడిగినా దానికి నిజమే చెప్తానని అబద్ధం చెప్పనని ప్రమాణం చేస్తున్నానని శివాజీ అనగా.. ఏది అడిగినా అబద్ధం చెప్పనని సుమన్ శెట్టి అన్నాడు.    ఇక ఇంటర్వ్యూ మొదలెట్టాడు శివాజీ. కళ్యాణ్ , ఇమ్మాన్యుయేల్ కి బ్యాంకాక్ కి తీసుకెళ్తానని మాటిచ్చావంట కదా అని శివాజీ అడుగగా.. అన్నా అవన్నీ ఇప్పుడెందుకు అన్నా అని సుమన్ శెట్టి అన్నాడు. మనలో మన మాట.. అసలు నువ్వు ఈ హౌస్‌లో ఇన్ని రోజులు ఉంటావని అనుకున్నావా? అని శివాజీ అడుగగా.. లేదన్నా అని సుమన్ శెట్టి అన్నాడు. నువ్వే కాదు.. మేం కూడా అనుకోలేదని శివాజీ అన్నాడు.    ఎందుకని నీ పిలకని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టావంటూ శివాజీ అడుగగా.. సుమన్ శెట్టి ఆశ్చర్యపోయాడు. చాలా పెద్ద తప్పు చేశావ్ సుమన్ నువ్వు.. ఎవరూ చేయకూడని తప్పు చేశావ్.. ఎందుకు చేశావ్ అలా.. ఏమీ ఆలోచించవా.. ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తావా అని శివాజీ అడిగాడు. ముందు తప్పేంటే చెప్తే.. చేశానో లేదో చెప్తానని సుమన్ శెట్టి అన్నాడు.   సుమన్ శెట్టి హౌస్ లో పెద్దగా ఆడకపోయినా 14వ వారం వరకు బిగ్ బాస్ ఉంచాడు అనేది కొందరి అభిప్రాయం. అలాంటిది చేయకూడదని తప్పు అంటే అదేం ఉండదు.. ఏదో హైప్ ఇవ్వడం కోసం.. టీఆర్పీ కోసం శివాజీ చేత అడిగించినట్టున్నారు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.    మరి సుమన్ శెట్టి నిజంగానే తప్పు చేశాడా? ఒకవేళ చేస్తే అదేంటో తెలియాలంటే బజ్ ఇంటర్వ్యూ (Suman Shetty Buzz interview) ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.  

Jayam serial: గంగ ఎప్పటికీ రాదని చెప్పిన రుద్ర.. పెద్దసారు ఏం చేయనున్నాడు?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -141 లో... రుద్ర మాటలు గంగ గుర్తుచేసుకుంటుంది. మరొకవైపు లక్ష్మీ స్పృహలోకి వస్తుంది. అసలు ఏమైందని అడుగుతుంది. రుద్ర సర్ కి, నీకు గొడవ ఏంటని అడుగుతుంది. ఈ హాస్పిటల్ బిల్ ఎవరు కట్టారని లక్ష్మీ అడుగగా అవన్నీ నీకెందుకని శ్రీను వాళ్ళు అంటారు.   ఆ తర్వాత లక్ష్మీని డిశ్చార్జ్ చేసి ఆటోలో తీసుకొని వెళ్తుంటే అక్కడ పక్కన రుద్ర కార్ కన్పిస్తుంది. అది చూసి ఆగుతారు. రుద్ర సర్ కార్ ఇక్కడ ఉందేంటని అనుకుంటారు కానీ రుద్ర అందులో ఉండడు. నాకు తెలిసి సర్ వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటాడని గంగ అంటుంది. గంగ నువ్వు, రుద్ర సర్ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే మీ గొడవలు అన్నీ దూరం అవుతాయని శ్రీను, బంటి అంటారు.    ఆ తర్వాత రుద్ర, గంగ మాట్లాడుకుంటారు. నేను ఏ తప్పు చెయ్యలేదని రుద్రకి గంగ చెప్తుంది. చేయకుంటే ఆ వస్తువు నీ దగ్గర ఎందుకు ఉందని రుద్ర అడుగుతాడు. నేను ఏ తప్పు చెయ్యలేదు.. ఈ మంటపై ఒట్టు అని గంగ ఒట్టేస్తుంటే రుద్ర తన చేయి పక్కకి లాగుతాడు.    మరొకవైపు ఇంకా రుద్ర ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్ళు ఎదురుచూస్తారు. శకుంతలతో పెద్దసారు మాట్లాడుతాడు. గంగ ఈ ఇంటికి రాదని రుద్ర ఫోన్ లో చెప్పాడని శకుంతల చెప్పగానే.. పెద్దవాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి కదా అని సీరియస్ అవుతాడు. అందరు రుద్ర కోసం ఎదురుచూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: సినిమాకి వెళ్ళిన రామరాజ, వేదవతి.. చందుని శ్రీవల్లి డైవర్ట్ చేసిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-341 లో... ప్రేమ, నర్మద తనని ముసలివాళ్ళు అన్నారని వేదవతి కోపంగా రామరాజు దగ్గరికి వెళ్లి ఏవండి మనం సినిమాకి వెళదామని అంటుంది. దానికి రామరాజు ఒప్పుకుంటాడు. చూసావా అక్క అత్తయ్య సినిమాకి అనగానే ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందోనని నర్మదతో ప్రేమ అంటుంది.‌    ఆ తర్వాత రామరాజు సినిమాకి వెళ్ళడానికి రెడీ అయి వస్తాడు. వేదవతి అద్దాలు పెట్టుకొని వస్తుంది. అది చూసి తిరుపతి షాక్ అవుతాడు. సినిమాకి ఇలాగే వెళ్లాలండి అని రామరాజుతో వేదవతి చెప్తుంది.    మరొకవైపు శ్రీవల్లి టెన్షన్ పడుతూ గేట్ దగ్గర ఉంటుంది. అది చూసి ఏదో చేస్తుంది.. అది ఏంటో తెలుసుకోవాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. చందు రాగానే తనని గేట్ దగ్గర ఆపుతుంది. నేను నాన్నతో మాట్లాడాలని చందు కోపంగా వెళ్తాడు. చందు లోపలికి వెళ్లి నాన్న మీకు ఒక విషయం చెప్పాలి.. అది మన పరువుకి సంబంధించినదని అమూల్య గురించి చెప్పబోతుంటే శ్రీవల్లి పడిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది. అది చూసి చందు వాళ్ళు వచ్చి తనని గదిలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత రామరాజు, వేదవతి సినిమాకి వెళ్తారు.   అదంతా శ్రీవల్లి కావాలని చేస్తుందని ప్రేమ, నర్మదలకి అర్థం అవుతుంది. అసలు ఏమైంది బావ ఎందుకు అలా కోపంగా ఉన్నావ్.. నీకు సంబంధించినవి నాకూ చెప్పకూడదా అని శ్రీవల్లి అంటుంది. దాంతో అమూల్య, విశ్వ పార్క్ లో కన్పించిన విషయం శ్రీవల్లికి చెప్తాడు. మీరు ఆ విషయం మావయ్యకి‌ చెప్తే ఇంట్లో పరువు పోతుందని అమూల్య ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటని శ్రీవల్లి అనగానే చందు కూడా ఆలోచనలో పడతాడు. హమ్మయ్య అని శ్రీవల్లి అనుకుంటుంది. శ్రీవల్లి దగ్గరికి ప్రేమ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: కూతురికి పెళ్ళి అవ్వడం లేదని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న తల్లి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -540 లో... జ్యోత్స్నని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పారిజాతం కల కంటుంది. వద్దు నా మనవరాలిని అరెస్ట్ చెయ్యకండి అని పారిజాతం అంటుంటే జ్యోత్స్న తనని లేపి ఏమైందని ఆడుగుతుంది. నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారే అని అంటుంటే.. ఎప్పుడు అలాగే ఆలోచిస్తావా అని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది.   మరుసటిరోజు ఉదయం సుమిత్ర ఇంకా నిద్ర లేవకపోయేసరికి దశరథ్, సుమిత్రని లేపుతుంటే.. అసలు లేవదు. దాంతో భయపడి శివన్నారాయణకి చెప్తాడు. నాన్న సుమిత్ర లేవట్లేదని చెప్పడం జ్యోత్స్న విని.. పారిజాతం దగ్గరికి వెళ్లి గ్రానీ మమ్మీ చనిపోయిందని చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది.   అందరు కలిసి సుమిత్రని లేపుతారు. సుమిత్ర మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. హమ్మయ్య సుమిత్రకి ఏం కాలేదని పారిజాతం అంటుంది. ఏమైందని సుమిత్ర ని దశరథ్ అడుగుతాడు. నిద్ర పట్టడం లేదని స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నానని సుమిత్ర చెప్తుంది. నిద్ర పట్టనంత ఏం టెన్షన్ ఉందని పారిజాతం అడుగుతుంది. పెళ్లికి ఎదిగిన కూతురు ఉంటే నిద్ర ఎలా పడుతుందని శివన్నారాయణ అంటాడు. ఏం టెన్షన్ జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది కదా అని పారిజాతం అనగానే జ్యోత్స్నకి జాతకాలు కలవక పెళ్లి ఫిక్స్ అవ్వడం లేదని శివన్నారాయణ చెప్తాడు. అది దశరథ్ చెప్పి ఉంటాడు. అందుకే సుమిత్రకి టెన్షన్ అని శివన్నారాయణ అంటాడు.   మరొకవైపు కావేరి ఇంటికి దీప, కార్తీక్ వస్తారు. వాళ్ల టిఫిన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాంచన రాలేదని తెలిసి శ్రీధర్ డిజప్పాయింట్ అవుతాడు. కాంచనకి శ్రీధర్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. అప్పుడే ఒకతను టిఫిన్ తీసుకొని వచ్చి కాంచనకి ఇస్తాడు. నువ్వు రావని తెలిసి నేను పంపించానని కాంచనకి శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss Telugu 9 Top 5: బిగ్ బాస్ సీజన్-9 టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, సంజన టాప్-7 మిగిలారు. ఇక వీరి నుండి ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయి బయటకొచ్చేసాడు.   శనివారం నాటి ఎపిసోడ్ లో.. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని నాగార్జున చెప్పేశాడు. ప్రస్తుతం హౌస్ లో భరణి, సంజన, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్ ఆరుగురు మిగిలారు. వీరిలో ఆడియన్స్ ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉంటే వాళ్ళే ఎలిమినేట్ అవుతారు.    అయితే సోషల్ మీడియా బిగ్ బాస్ లీక్స్, అప్డేట్స్ ని బట్టి చూస్తే ఆదివారం ఎపిసోడ్ లో భరణి ఎలిమినేట్(Bharani Elimination)  అయినట్టు తెలుస్తోంది.    ఇక ప్రస్తుతం డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్, సంజన, ఇమ్మాన్యుయేల్ ఈ అయిదుగురు హౌస్ లో ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వగా.. ఇమ్మాన్యుయేల్ సెకెండ్ ఫైనలిస్ట్ అయ్యాడు.  

Brahmamudi: రాహుల్ కి ఎక్సలెన్స్ అవార్డు.. డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -903 లో... కావ్యకి ఇక ఏ ప్రాబ్లెమ్ లేదని ఆయుర్వేద వైద్యం చేసిన అతను చెప్తాడు. దాంతో రాజ్, కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.   మరొకవైపు సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి మాట్లాడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇంత కోపంగా ఉన్నారని అడుగుతుంది. ఎందుకంటే మన కంపెనీకి పది కోట్లు నష్టం వచ్చిందని సుభాష్ అంటాడు. కానీ రాహుల్ ఆ డిజైన్స్ తియ్యలేదు అంటున్నాడు.. పైగా స్వప్న కూడ సపోర్ట్ చేస్తుంది. తెలుసుకుంటా అన్నీ తెలుసుకుంటానని సుభాష్ అంటాడు.   మరొకవైపు ఇంట్లో పనిమనిషికి కావ్య రిపోర్ట్స్ కన్పిస్తాయి. అవి చూసి రుద్రాణి షాక్ అవుతుంది.. అంటే కావ్యకి ప్రాబ్లమ్ ఇంకా ఉంది అన్నమాట అనుకుని హాల్లో ఉన్న అందరికి రిపోర్ట్స్ చూపిస్తుంది. అవి సుభాష్ చూసి షాక్ అవుతాడు. ఏమైందని అపర్ణ అడుగగా మనకి కావ్య ప్రాబ్లమ్ తగ్గిపోయిందన్నారు కానీ తగ్గలేదని చెప్పగానే అందరు షాక్ అవుతారు.      అప్పుడే రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేసారని అపర్ణ కోప్పడుతుంది. మా దగ్గర ఎందుకు నిజం దాచారని అడుగుతుంది. కావ్యకి తన కడుపులో పెరుగుతున్న బేబీని చంపుకోవడం ఇష్టం లేదు.. అందుకే ఇలా.. కానీ దీనికి పరిష్కారం దొరికింది.. గుళ్లో పంతులు కావ్య సమస్య విని కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించమని చెప్పారు.. దాంతో క్షణం ఆలస్యం చేయకుండా మీతో టూర్ కి వెళ్తున్నామని చెప్పి వెళ్లిపోయామని రాజ్ అంటాడు. అక్కడ వైద్యం చేసి కావ్యకి ప్రాబ్లమ్ లేదని చెప్పారనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.    తరువాయి భాగంలో రాహుల్ కి ఎక్సలెన్స్ అవార్డు వస్తుంది. రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Suman Shetty Elimination: సుమన్ శెట్టి ఎలిమినేషన్.. కన్నీళ్ళతో బయటకు వచ్చాడుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో పద్నాలుగో వారం వీకెండ్ వచ్చేసింది. ఇక అందరు ఎదురుచూస్తున్నట్టుగానే ఈ వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. నాగార్జున గ్లామరెస్ గా రెడీ అయి వచ్చేశాడు. హౌస్ మేట్స్ అందరిని మాట్లాడించాడు.   ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే విషయం ముందే చెప్పేశాడు. ఇక నామినేషన్లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరిని సేవ్ చేశాడు నాగార్జున. ఇక చివరి ఎలిమినేషన్ రౌండ్ కలర్ బోర్డ్‌ టాస్క్‌తో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశాడు నాగార్జున. సుమన్ శెట్టి ఎలిమినేషన్ అనగానే అందరు షాక్ అయ్యారు. భరణి అయితే ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. యూ ఆర్ ది బెస్ట్.. నీది మంచి మనస్సు.. నేను బయటకు రాగానే కచ్చితంగా మనం వర్క్ చేద్దామని మాటిచ్చాడు భరణి. ఇక ఇమ్మాన్యుయేల్, తనూజ, కళ్యాణ్, సంజన, డీమాన్ ఎమోషనల్ అయ్యారు. 'అధ్యక్షా వెళ్ళిపోతున్నా' అంటు బిగ్ బాస్ కి బై చెప్పేసి బయటకు వచ్చేశాడు. ఇక హౌస్ ని వీడి స్టేజ్ మీదకి వచ్చాడు నాగార్జున.    ఫైనల్ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యావ్ కదా.. ఎలా ఉందని నాగార్జున అడుగగా.. హ్యాపీగానే ఉంది సర్.. ఒక్కవారం ఉంటే టాప్-5కి వెళ్లేవాడ్ని అని సుమన్ శెట్టి అన్నాడు. నేనూ అదే అనుకున్నా.. అరెరే సుమన్ వెళ్లిపోతున్నాడే అనిపించింది.. నీ ఆటతోనే కాదు.. మాటలతోనూ ఆకట్టుకున్నావ్... ఇప్పుడు నీ జర్నీ వీడియో సుమన్ శెట్టి ప్రభంజనం చూద్దామని చెప్పాడు.    అసలు బిగ్ బాస్ హౌస్‌ని వీడిన ఏ కంటెస్టెంట్‌కి దక్కని గుర్తింపు, గౌరవం సుమన్ శెట్టికి దక్కింది. సుమన్ శెట్టి తన ఆటతో ప్రభంజనం సృష్టించాడు అని నాగార్జున గర్వంగా, ఫుల్ ఎలివేషన్ ఇస్తూ చెప్పాడు. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కి ఇంతటి ఎలివేషన్ ఇవ్వలేదు. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు సుమన్ శెట్టి.   

ఇంద్రజ, సుధీర్ మీద ఆది కౌంటర్స్...అమ్మాకొడుకులిద్దరే పోతారు అంటూ కామెంట్స్

డిసెంబర్ 31 కి ఇంకా ఎన్నో రోజులు లేదు. బుల్లితెర రకరకాల ఈవెంట్స్ తో షోస్ లో అలరించడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. అదే "కం టు ఢీ పార్టీ..2026 ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్" పేరుతో ఒక లేటెస్ట్ టీజర్ వచ్చింది. ఇక ఈ ప్రోగ్రాం 31 వ తేదీ రాత్రి 9 .30 కి ప్రసారం కాబోతోంది. ఈ షోకి  హోస్ట్ గా సుధీర్ కనిపించాడు. "సుధీర్ గాడి పార్టీ అంటే వినడమే కానీ సూసిందే లేదు కదా..ఇప్పుడు చూపిస్తా అసలు పార్టీ ఏంటో" అంటూ చెప్పాడు సుధీర్. ఈ షోలో ఇంద్రజ, ఆలీ, కావ్య, పండు, జాఫర్, ఆది వంటి వాళ్లంతా వచ్చారు. డాన్స్ లు చేసారు. "మీ అమ్మకు చెప్పు నీ సంగతి తెలుస్తాయి ఇవ్వాళ" అన్నాడు ఆది. "అమ్మను ఎమన్నా అంటే గనక బాగోదు" అంటూ సుధీర్ వార్నింగ్ ఇచ్చాడు. "ఒక్కసారి నాకు ఊపొచ్చాకా అమ్మ కొడుకులిద్దరినీ ఊపేస్తా" అన్నాడు ఆది.  "నీకు ఊపు రావాలేమో నేనెప్పుడూ ఊపు మీదే ఉంటా" అన్నాడు సుధీర్. "పోతారు మొత్తం పోతారు" అని సుధీర్ ఆదిని అన్నాడు. "ఎవరు పోరు మీ అమ్మాకొడుకులిద్దరే బయటకు పోతారంతే" అన్నాడు ఆది. ఇక నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నాడు "ఆది - ఇంద్రజ కాంబినేషన్ సూపర్, రష్మీ లేదా పుష్ప, సుధీర్ ఫాన్స్ ఇక్కడ, ఆది ఫాన్స్ ఇక్కడ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బిబి జోడి సీజన్ 2 త్వరలో...జోడీలు వీళ్ళే ?

బిగ్ బాస్ ఐపోగానే ఈ కంటెస్టెంట్స్ అందరితో కలిసి బిబి జోడి పేరుతో ఒక డాన్స్ షో తీసుకురావడం ఆనవాయితీగా మారింది. ఆల్రెడీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బిబి జోడి సీజన్ 1 ఐపోయింది. ఇక త్వరలో  బిబి  జోడి సీజన్ 2 రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో కొన్ని జోడీలను తీసుకొచ్చి ఒక బంగ్లాలో బంధించి "వెల్కమ్ టు ది హౌస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్" అనే వాయిస్ వినిపించింది. తర్వాత అమరదీప్ వచ్చి "మళ్ళీ 100 డేసా" అని అడిగాడు. తర్వాత ప్రదీప్ వచ్చి "కాదు అదిరిపోయే డాన్స్" అన్నాడు. తర్వాత కీర్తి భట్ వచ్చి "సోలోనా" అని అడిగింది. శేఖర్ మాష్టర్ వచ్చి "కాదు జోడి" అన్నాడు. తర్వాత శ్రీదేవి విజయకుమార్ నవ్వుతూ వచ్చింది. ధన్ రాజ్ - భానుశ్రీ, ఆర్జే చైతు - కీర్తి భట్, విశ్వ - నేహా, మణికంఠ - ప్రియాంక సింగ్, అమరదీప్ - నైనికా, సాయి శ్రీనివాస్ - నయనిపావని, మానస్ - స్రష్టి వర్మ, అఖిల్ సార్థక్ - వాసంతి, శ్రీసత్య - అర్జున్ కళ్యాణ్ జోడీస్ రాబోతున్నారు. "క్లాసైనా, మాస్ ఐనా ఈ స్టేజి దద్దరిల్లిపోవాల్సిందే" అని చెప్పుకొచ్చాడు శేఖర్ మాష్టర్. "ఇది వన్ టైం ఛాన్స్, ఎప్పుడూ చూడని డాన్స్" అంటూ శ్రీదేవి చెప్పింది. "వెల్కమ్ టు ది విశ్వరూపం ఆఫ్ ఎంటర్టైన్మెంట్" అంటూ హోస్ట్ ప్రదీప్ చెప్పాడు.

Bigg Boss 9 Telugu Tanuja: చివరి టాస్క్ లో ఓడిన ఇమ్మాన్యుయేల్.. తనూజ ఎమోషనల్!

బిగ్ బాస్ హౌస్ లో రెండో ఫైనలిస్ట్ కోసం జరిగే పోరులో అందరు ఎలిమినేట్ అవ్వగా రేస్ లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. స్కోర్ బోర్డుపై పాయింట్స్ పెంచుకునేందుకు నెక్స్ట్ టాస్క్ లో పాల్గొనవద్దన్న వాళ్ళని సెలెక చెయ్యండి అని బిగ్ బాస్ చెప్పాడు. అందరు సంజన పేరు చెప్తారు. ఈ టాస్క్ లో తనూజ,ఇమ్మాన్యుయేల్ మాత్రమే ఆడుతారు. సంఛాలక్ గా సంజన ఉంటుంది. బజర్ మోగినప్పుడు బెలూన్ ని చేతితో కాకుండా గాల్లో ఎగిరెస్తూ జాలిలోకి పడెయ్యాలి. అలా టాస్క్ మొదలు అయినప్పుడే ఇమ్మాన్యుయేల్ కాలు బెనుకుతుంది. టాస్క్ ని పాజ్ చేసి ఇమ్మాన్యుయేల్ ని మెడికల్ రూమ్ కి తీసుకొని వెళ్తారు. తన కాలికి పట్టికట్టి పంపిస్తారు. టాస్క్ మళ్ళీ మొదలవుతుంది. టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విన్ అవుతాడు. లాస్ట్ వరకు వచ్చి మిస్ అయిందని  తనూజ ఎమోషనల్ అవుతుంది. ఇదే నా జీవితం ఎప్పుడు ఇలాగే జరుగుతుందని అంటుంది. ఆ తర్వాత స్కోర్ బోర్డులో ఇమ్మాన్యుయేల్,  తనూజ లీడ్ లో ఉంటారు. మళ్ళీ ముగ్గురికి టాస్క్ ఉంటుంది. నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి ఇస్తున్న చివరి టాస్క్ అని బిగ్ బాస్ చెప్తాడు. ఈ టాస్క్ లో ముగ్గురు పాల్గొంటారు. అందులో తనూజ విన్ అవుతుంది  ఓడిపోయినందుకు ఇమ్మాన్యుయేల్ ఏడుస్తాడు. ఈ వారం ఒక్క టాస్క్ కూడా ఓడిపోలేదు కానీ ఇక జరిగిందంటూ ఎమోషనల్ అవుతాడు. లీడర్ బోర్డులో తనూజ టాప్ లో ఉంటుంది. దాంతో తనని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. మీరు నామినేషన్ నుండి సేవ్ అవ్వాలంటే.. మీ దగ్గరున్న మనీ పాయింట్స్ ప్రైజ్ మనీ నుండి కట్ అవుతుందని బిగ్ బాస్ చెప్తాడు. వద్దు బిగ్ బాస్ నేను ఆడియన్స్ ద్వారా వెళ్తానని తనూజ చెప్తుంది. అంటే మీరు ఇప్పుడు నామినేషన్ నుండి సేవ్ అవ్వకుండా మీ భవిష్యత్తును ప్రేక్షకుల చేతిలో పెడుతున్నారా అని బిగ్ బాస్ అడుగగా.. అవును బిగ్ బాస్ అని తనూజ చెప్తుంది. దాంతో సరే అని చెప్పి తనూజని వెళ్ళమని చెప్తాడు. మరి తనూజ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా కామెంట్ చేయండి.

Sanjana Fires On Emanual: భరణి అవుట్ ఆఫ్ ది రేస్.. ఇమ్మాన్యుయేల్ పై సంజన ఫైర్!

బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే కి ఇంకా ఒక్క వారమే టైమ్ ఉంది. హౌస్ లో టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. లీడర్ బోర్డుపై లీస్ట్ లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా టాస్క్ నుండి తొలగిపోతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో లీడర్ బోర్డుపై లీస్ట్ లో భరణి ఉన్నాడు. ఇక నామినేషన్ నుండి సేవ్ అయ్యే ప్రక్రియ నుండి తొలగిపోయాడు. తన దగ్గరున్న పాయింట్స్ లో సగం ఎవరికైనా ఇవ్వమని బిగ్ బాస్ చెప్పాడు. భరణి దగ్గరికి సంజన వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. నాకు పాయింట్స్ చాలా అవసరమని అడుగుతుంది. నేను మాట ఇవ్వలేను ఆలోచించుకోవాలని భరణి చెప్తాడు. ఆ తర్వాత తన పాయింట్స్ అన్ని తనూజకి ఇస్తున్నానని చెప్పి భరణి ఎమోషనల్ అవుతాడు. ఎందుకు ఏడుస్తున్నారని తనూజ అడుగుతుంది. ఏం లేదని భరణి అంటాడు. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. అందులో స్కోర్ బోర్డుపై మిగిలిన ముగ్గురు అయిన ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన ఆడుతారు. వాటర్ లో ఉన్న షేప్స్ తాళం తీసి టేబుల్ పై సెట్ చెయ్యాలి.. అలా బజర్ మోగేసరికి ఎవరివి ఉంటాయో వాళ్ళే విన్ అని బిగ్ బాస్ చెప్తాడు. అందులో ముగ్గురు ఒకరి షేప్స్ ఒకరు టేబుల్ పై నుండి తీసి బయటకు విసిరేస్తారు.. అలా ముగ్గురు ఒకరికొకరు తోసుకుంటూ గేమ్ ఆడుతారు. తనూజ,ఇమ్మాన్యుయేల్ ని పట్టుకొని ఆపుతుంది. మనం మనం కొట్టుకుంటే వేరేవాళ్ళు ఆ షేప్స్ పెట్టుకుంటున్నారని ఇమ్మాన్యుయేల్ అంటాడు. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విన్ అవుతాడు‌ సెకెండ్ సంజన ఉంటుంది. తనూజ పెట్టిన షేప్స్ అన్ని వాళ్ళు తీసేసారు కాబట్టి తనూజకి ఈ టాస్క్ లో పాయింట్స్ రాలేదు. టాస్క్ తర్వాత ఇమ్మాన్యుయేల్ పై సంజన గట్టిగా అరుస్తుంది. నాకు ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదు.. మీరు కలిసి గేమ్ ఆడారు.. మనం మనం ఆపుకుంటే వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారన్నావ్ అంటే నేనే కదా అని సంజన ఏడుస్తుంది. నాకు ఎవరు లేరు.. ప్రతీసారీ అందరికి నేనే టార్గెట్ అని ఏడుస్తుంది. మీరు చూసేవాళ్ళకి ఏం పొట్రే చేద్దామనుకుంటున్నారని ఇమ్మాన్యుయేల్ అంటాడు. మరొకవైపు నా షేప్స్ అన్ని తీసి ఫస్ట్ వాటర్ లో నువ్వే వేసావని ఇమ్మాన్యుయేల్ తో తనూజ గొడవ పడుతుంది.

Podharillu: మహా పెళ్ళిచూపులు హిట్టు.. చక్రి పెళ్ళిచూపులు ఫట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -05 లో..... మహాకి వాళ్ల నాన్న పెళ్లిచూపులు ఏర్పాట్లు చేస్తాడు. తనకి అబ్బాయి బొకె ఇస్తాడు. నాకు పువ్వుల వాసన నచ్చదని మహా అంటుంది. హారిక కాఫీ తీసుకొని వచ్చి మహాకి ఇచ్చి అబ్బాయి వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది. దాంతో మహాకి ఇష్టం లేకపోయినా కాఫీ ఇస్తుంది. మరొకవైపు చక్రికి పెళ్లిచూపుల కోసం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు.. అక్కడ చక్రి.. ఒక గారె తిని ఎవరు చేశారని అడుగుతాడు. అమ్మాయి చేసిందని చెప్పగానే గారె లోపల ఉడకలేదు.. ఇంకా పిండి ఉందా అని చక్రి అడుగుతాడు. ఉందని అమ్మాయి చెప్పగానే చక్రి అమ్మాయికి గారెలు చెయ్యడం నేర్పిస్తాడు. అదంతా చూసి తన తమ్ముళ్ళకి కోపం వస్తుంది. మీకు వంట అంటే ఇష్టమా అని అమ్మాయి అడుగుతుంది. అవసరం అని చక్రి చెప్తాడు. అందరు అన్నీ మాట్లాడుకుంటారు. చక్రి వెళ్ళేటప్పుడు అమ్మాయి బాయ్ చెప్తుంది కానీ తన పేరెంట్స్ ఏ విషయం అయినా చెప్తామని అనగానే అబ్బాయి వాళ్ళు డిస్సపాయింట్ అయి వెళ్ళిపోతారు. మరొకవైపు పెళ్ళిచూపులకి వచ్చిన అబ్బాయికి నచ్చొద్దని మహా అనుకుంటుంది. అమ్మాయి, అబ్బాయి మీరు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారా అని ప్రతాప్ అనగానే దానికోసం వెయిట్ చేస్తున్నానని అబ్బాయి అంటాడు. ఇద్దరు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. నీకు వంట వచ్చా.. కెనడాలో మేడ్ కి చాలా ఖర్చు అని అంటాడు. భార్య గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటే మహాకి కోపం వస్తుంది. ఆ తర్వాత మీ అమ్మాయికి అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా పెంచారని అబ్బాయి అనగానే హమ్మయ్య నేను నచ్చలేదని మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రపంచం అంటే ఏంటో చూపిస్తానని అబ్బాయి అనగానే మహా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది. అది చూసి రుద్ర షాక్ అవుతాడు. నన్ను మోసం చేసావ్ గంగ.. ఆ రోజు ఫొటోస్ తీసి నువ్వే సోషల్ మీడియాలో పెట్టావ్ లేదంటే ఇది ఇక్కడ ఎందుకు ఉంటుందని  రుద్ర అంటాడు. అసలు అదేంటో కూడా నాకు తెలియదని గంగ అంటుంది. ఇంట్లో అందరు వచ్చి.. ఏంటి గొడవ అంటారు. నేను గంగ కెరీర్ కోసం తనని పెళ్లి చెసుకున్నాను కానీ ఇంత మోసం చేసిందని తెలిసాక ఇక నాకు అవసరం లేదు.. నువ్వు ఇక్కడే ఉండిపోమని  చెప్పి రుద్ర వెళ్లిపోతాడు. దాంతో లక్ష్మి కిందపడిపోతుంది. తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంటే.. రుద్ర చూసి అసలు గంగ వాళ్ల అమ్మకి ఏమైంది.. వద్దని అనుకుని వచ్చాను.. ఇప్పుడు వెళ్తే బాగోదని రుద్ర అనుకుంటాడు. ప్రాబ్లమ్ గంగతో కానీ వాళ్ల అమ్మతో కాదు కదా అని మళ్ళీ అనుకుంటాడు. లక్ష్మీకి హాస్పిటల్ ఖర్చు ముప్పై వేయిలు అవుతుందని డాక్టర్ చెప్తాడు. అప్పుడే రుద్ర వచ్చి పే చేసి వెళ్తాడు. మీ మధ్యలో ఏం గొడవ అయిందో తెలియదు గానీ మీరు మళ్ళీ కలవాలని గంగతో శ్రీను అంటాడు. కలవాలంటే నేను తప్పు చెయ్యలేదని నిరూపించాలని గంగ అంటుంది. మరొకవైపు ఇషిక, వీరులకి పారు ఫోన్ చేసి తన ప్లాన్ చెప్తుంది. ఇక గంగని రుద్ర ఎప్పటికి క్షమించడని పారు చెప్పగానే మంచి ప్లాన్ చేసావని పారుని ఆ ఇద్దరు పొగుడుతారు. తరువాయి భాగంలో రుద్ర ఒక్కడే ఇంటికి వస్తాడు. ఏమైందని పెద్దసారు అడుగగా రుద్ర జరిగింది చెప్తాడు. శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi:రాహుల్ చెంపచెల్లుమనిపించిన సుభాష్.. కావ్యకి నయం అవుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -902 లో....స్టేషన్ కి రేణుకని పిలిచి అప్పు మాట్లాడుతుంది. నీ కూతురు బ్రతికే ఉందని చిన్న క్లూ దొరికిందని అప్పు అనగానే రేణుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండని అప్పు అనగానే రేణుక వెళ్తుంటే తన భర్త ఎదరవుతాడు. అప్పూనే అతన్ని పిలిపిస్తుంది. మీ కూతురు బ్రతికే ఉందని అప్పు చెప్పగానే అతను కంగారుపడతాడు. అంతే కాదు పాప చనిపోయిందని ఒక బాడీ చూపించారు కదా ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చెయ్యాలని అనుకుంటున్నాం.. దాంతో అన్ని నిజాలు బయటకు వస్తాయని అప్పు అనగానే అతను ఇంకా కంగారుపడతాడు. మంచిదే కదా మేడమ్ అని అతను అంటాడు. మీరు ఇప్పుడు వెళ్ళండి అని అప్పు అనగానే.. అతను వెళ్తాడు. మరొకవైపు రాజ్, కావ్యలని రౌడీలు బంధించగా రాజ్ తన తాళ్లు విప్పుకొని రౌడీలని కొడతాడు. అప్పుడే చోటు, మోటుల హెడ్ బాస్ అయిన పెద్ద విలన్ అక్కడికి వచ్చి రాజ్ ని గన్ చూపించి బెదిరిస్తాడు. అప్పుడే పోలీసులు వచ్చి రౌడీలని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత సుభాష్ కి శృతి ఫోన్ చేసి మన క్లయింట్స్ అందరు రాహుల్ సర్ కంపెనీతో డీల్ పెట్టుకున్నారు. రాహుల్ సర్  ప్రెజెంట్ చేసిన డిజైన్స్ మొత్తం కూడా కావ్య మేడమ్ వేసినట్లు ఉన్నాయని శృతి చెప్తుంది. దానికి సంబందించిన ఫొటోస్ అన్ని సుభాష్ కి పంపిస్తుంది. అది చూసి సుభాష్.. ఈ రాహుల్ వెన్నుపోటు పొడిచాడు అని షాక్ అవుతాడు. మరొకవైపు కావ్యకి చేస్తున్న ఆయుర్వేద వైద్యం పూర్తి అవుతుంది. ప్రాబ్లమ్ 99% తగ్గిందని అతను చెప్తాడు. దాంతో రాజ్, కావ్య హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాహుల్ డిజైన్స్ చూసి ఇంట్లో వాళ్లంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే సుభాష్ వచ్చి రాహుల్ చెంపచెల్లుమనిపిస్తాడు.. కావ్య డిజైన్స్ దొంగతనం చేసావని అంటాడు. లేదు మావయ్య నేను వేసానని రాహుల్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కావేరికి పిలిచే ఛాన్స్ కూడా ఇవ్వని కాంచన.. కార్తీక్ ఆన్ ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -539 లో..... శౌర్య హోమ్ వర్క్ చెయ్యకుండా అల్లరి చేస్తుంది. దాంతో అనసూయ కోప్పడుతుంది. శౌర్య హోమ్ వర్క్ చెయ్యకుండా  కాంచన బొమ్మ డ్రాయింగ్ వేస్తుంది. అది అనసూయ చూసి ఇది రాయకుండా ఏం చేస్తుందని శౌర్య వెంట అనసూయ పరుగెడుతుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. అంతలోనే కావేరి వస్తుంది. ఏంటి చిన్నమ్మ ఇలా వచ్చావని కార్తీక్ అడుగుతాడు. దీప ప్రెగ్నెంట్ కదా అత్తయ్యగా తనకి ఇష్టమైనవి వండి పెట్టాలని కావేరి అంటుంది. అందుకే రేపు ప్రొద్దున మా ఇంటికి టిఫిన్ కి పిలుద్దామని వచ్చానంటూ కావేరి అంటుంది. కాంచనని కూడా పిలవబోతుంటే.. కార్తీక్, దీప వస్తారని కాంచన అంటుంది. సరే అని కావేరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు కాశీ ఇంటికి రాగానే శ్రీధర్ గొడవ పెట్టుకుంటాడు. దాంతో స్వప్న, కాశీ కూడా గొడవపెట్టుకుంటారు. నువ్వు ఒక అసమర్ధత గలవాడివి అని స్వప్న అనగానే కాశీకి కోపం వస్తుంది. అప్పుడే కావేరి వచ్చి.. ఏంటి మీ గొడవ అని కోప్పడుతుంది. నీ భర్తని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోమని కావేరి అనగానే.. వాళ్ళేదో అంటే నువ్వు ఏదో అంటావేంటి స్వప్న మీరు ఇద్దరు లోపలికి వెళ్ళండి అని శ్రీధర్ అంటాడు. నువ్వు వెళ్లిన పని ఏమైందని శ్రీధర్ అడుగగా అక్క తనని పిలిచే అవకాశం ఇవ్వలేదని కావేరి చెప్తుంది. మరొకవైపు మనతో పాటు అమ్మని కూడా రేపు అక్కడికి తీసుకొని వెళదామని దీపతో కార్తీక్ అంటాడు. అదే విషయం కాంచనతో చెప్పగా రానని అంటుంది. శౌర్య వచ్చి.. తాతయ్య ఇంటికి నానమ్మ భోజనానికి ఎందుకు రావాలని అడుగుతుంది. అలాంటప్పుడు తాతయ్య దగ్గర నానమ్మని వదిలేసి రావాలని శౌర్య అనగానే శౌర్యపై కాంచన కోప్పడుతుంది. నేను మీకు ఏం అడ్డుంటున్నాను.. అన్నీ తల్లి నేర్పిస్తే పిల్ల మాట్లాడుతుందని కాంచన అనగానే దీప తన కాళ్లపై పడుతుంది. అత్తయ్య నేనేం చెప్పలేదని దీప ఏడుస్తుంది. ఆ తర్వాత కార్తీక్ అత్తా కోడళ్ళపై కోప్పడతాడు. నువ్వు రేపు వస్తున్నావా లేదా అని కార్తీక్ అడుగగా.. రానని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ప్రేమ, ధీరజ్ ల అల్లరి.. వేదవతి, రామరాజు సినిమాకి వెళ్తారా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -340 లో..... ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. పార్క్ లో ఇచ్చిన ఫ్లవర్ ఏం చేసావని అడుగుతాడు. అక్కడే పారేశానని ప్రేమ అనగానే.. దీనికి ఏ ఎమోషనల్ ఉండదని తన దగ్గరున్న ఫ్లవర్ ని తనపై విసిరేస్తాడు. ఇదేం ప్రకృతి వైపరిత్యంరా.. నువ్వు ఫ్లవర్ ని తీసుకొని వచ్చావా అని ప్రేమ అంటుంది. ప్రేమ డ్రాయింగ్ వేస్తుంటే ఏం చేస్తున్నావే అని తన చేతిలో ఉన్న పేపర్ లాక్కుంటాడు. అందులో రెండు కుటుంబాలు కలిసినట్లు ప్రేమ, ధీరజ్ ఇద్దరు చెయ్ పట్టుకొని ఉన్నట్లు ఉంటుంది. అది చూసి.. ఇది ఎప్పటికి జరగదని కోపంగా చెప్తాడు. దాంతో ప్రేమ కోపంగా తను దాచుకున్న ఫ్లవర్ తీసుకొని వెళ్ళి ధీరజ్ కి కోపంగా ఇస్తుంది. అది చూసి ఇది ఎప్పటికి అర్థం కాదని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు భాగ్యంకి శ్రీవల్లి ఫోన్ చేసి పార్క్ లో జరిగింది చెప్తుంది. ఆ తర్వాత అమూల్య, విశ్వ ఇద్దరు దూరంగా ఉండి సైగ చేసుకోవడం శ్రీవల్లి చూసి టెన్షన్ పడుతుంది. ప్రొద్దున మా అయన వాళ్ళని చూసాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఏమంటాడోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మరొకవైపు నర్మద, ప్రేమ ఇద్దరు వేదవతి దగ్గరికి వస్తారు. ఇద్దరిపై వేదవతి కోపంగా ఉంటుంది. పేరుకు అత్తాకోడళ్ళు కానీ ఫ్రెండ్స్ అంటారు కానీ మీరు పార్క్ కి వెళ్ళేటప్పుడు కనీసం చెప్పలేదని వేదవతి అనగానే మీరు ముసలివాళ్ళు మీరు వచ్చి ఏం చేస్తారని నర్మద అనగానే వేదవతి కోపంగా రామరాజు దగ్గరికి వెళ్లి ఏవండి మనం సినిమాకి వెళదామని అంటుంది. దానికి రామరాజు సరే అంటాడు. అదంతా చూసి ప్రేమ, నర్మద నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Thanuja second vote Appeal:రెండోసారి ఓట్ అప్పీల్ చేసుకున్న తనూజ.. పాపం సంజన!

బిగ్ బాస్ హౌస్ లో పద్నాలుగో వారం ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టాస్క్ లలో గెలిచి స్కోర్ బోర్డుపై ఎక్కువ పాయింట్లు కలిగిన కంటెస్టెంట్స్ తనూజ,ఇమ్మాన్యుయేల్, సంజన ముగ్గురు.  ఇక‌ వీరిలో మీతో పాటు ఓటు అప్పీల్ కి ఎవరిని తీసుకొని వెళ్తారు తనూజ అని బిగ్ బాస్ అడుగుతాడు. ఆల్రెడీ ఇమ్మాన్యుయేల్ కీ ఓటు అప్పీల్ ఛాన్స్ రావడంతో సంజనని సెలెక్ట్ చేసుకుంటుంది తనూజ. సంజన, తనూజ ఇద్దరు గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ అడియన్స్ ఉంటారు. ఇద్దరిలో ఎవరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇస్తారని బిగ్ బాస్ ఆడియన్స్ ని అడుగుతారు. ఎక్కువ తనూజకి సపోర్ట్ చేస్తారు. దాంతో తనూజకి మళ్ళీ ఓటు అప్పీల్ ఛాన్స్ వస్తుంది. సంజన హౌస్ లోపలికి వెళ్తుంది. తనూజ ఓటు అప్పీల్ చేసుకుంటుంది. ఆడియన్స్ కొంతమంది తనూజని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు ప్రతీసారి ఏడుస్తారు ఎందుకు మీకు సింపథీ కోసమా అని ఒకావిడ అడుగుతుంది. అయ్యో అలా ఏం కాదండి.. ఎప్పుడు మా వాళ్ళు ఎవరో ఒకరు నాతో ఉండేవాళ్ళు కానీ హౌస్ లోకి వచ్చాక వీళ్ళు ఎవరో తెలియదు అలాంటప్పుడు ఎమోషనల్ అవ్వడం తప్పనిసరి అవుతుందని తనూజ చెప్తుంది. మీరు ఇమ్మాన్యుయేల్ మొహం పైనే.. నువ్వు నా ఫ్రెండ్ కాదని అన్నారు.. అలా అనడం కరెక్టేనా అని ఒక ఆడియన్ అడుగుతాడు. వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్.. మీకు క్లోజ్ ఫ్రెండ్ లేడా అని తనూజ అంటుంది. నేను అలా అనలేదని అతను అంటాడు. నేను హర్ట్ అయ్యాను.. వాడు హర్ట్ అవ్వాలి కదా అని తనూజ చెప్తుంది. అలా అతను అడిగే ప్రశ్నలకి తనూజ తడబడుతూ సమాధానం చెప్తుంది.

Tanuja Fires On Bharani: భరణికి వెన్నుపోటు పొడిచిన తనూజ.. గెలిచేది ఆ ముగ్గురిలో ఒకరు!

బిగ్ బాస్ సీజన్-9 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. హౌస్ లో ఫినాలేకి వారం ఉంది కానీ ఇప్పుడే హౌస్ లో గ్రూప్ లుగా ఆడుతున్నారు. హౌస్ లో భరణి, సుమన్, సంజన ఒక టీన్. ఇమ్మాన్యుయేల్, డీమాన్, తనూజ, కళ్యాణ్ ఒక జట్టుగా అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.  టాస్క్ లో భాగంగా ఎవరైనా టాస్క్ నుండి తొలగించండి అని బిగ్ బాస్  అన్నప్పుడు కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డీమాన్ ముగ్గురు భరణి పేరు చెప్పారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ పేరుని భరణి చెప్తాడు. సంజన పేరుని తనూజ చెప్తుంది. ఎక్కువ ఓట్లు భరణికి పడడంతో భరణి టాస్క్ నుండి తొలగిపోతాడు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. అందులో సంజన,ఇమ్మాన్యుయేల్ పాయింట్స్ సాధిస్తారు. డీమాన్, తనూజ పాయింట్స్ ఏం పొందలేకపోతారు. స్కోర్ బోర్డులో లీస్ట్ లో డీమాన్ ఉండడంతో గేమ్ నుండి తొలగిపోతాడు. తన పాయింట్స్ లో సగం ఎవరికైనా ఇవ్వాలని చెప్పగా డీమాన్ తన పాయింట్స్ లో సగం తనూజకి ఇస్తాడు. దాంతో తనూజ లీడ్ లో ఉంటుంది. తదుపరి టాస్క్ నుండి తొలగించడానికి అందరు ఒకరిని ఎన్నిక చేసుకొని చెప్పమంటాడు బిగ్ బాస్. నాకు సపోర్ట్ చెయ్యి తనూజ అని భరణి తనని రిక్వెస్ట్ చేస్తాడు. లేదు.. నాకు ఇమ్మాన్యుయేల్ చాలాసార్లు స్టాండ్ తీసుకున్నాడని భరణితో తనూజ అనగానే అంటే నేను తీసుకోలేదా అని భరణి అంటాడు. ఇక అక్కడి నుండి భరణి వెళ్ళి.. నేను స్టాండ్ తీసుకోలేదట.. ఇమ్మాన్యుయేల్ స్టాండ్ తీసుకున్నాడంట.. ఎలా అంటుంది.. ఎంత హర్టింగ్ గా ఉందని భరణి బాధపడుతాడు. ఇక ఎక్కువ భరణికి ఓట్లు పడడంతో తదుపరి గేమ్ లో భరణి ఆడడు... తర్వాతి టాస్క్ లో ఓట్ అప్పీల్ అనే ఇంగ్లీష్ లెటర్ ని ఫాస్ట్ గా సెట్ చేయ్యాలి. ఆ గేమ్ తర్వాత ఇమ్మాన్యుయేల్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. తనూజ సెకండ్, సంజన థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. లీడ్ లో తనూజ,ఇమ్మాన్యుయేల్, సంజన ఉంటారు.