Sanjana Fires On Emanual: భరణి అవుట్ ఆఫ్ ది రేస్.. ఇమ్మాన్యుయేల్ పై సంజన ఫైర్!

బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే కి ఇంకా ఒక్క వారమే టైమ్ ఉంది. హౌస్ లో టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. లీడర్ బోర్డుపై లీస్ట్ లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా టాస్క్ నుండి తొలగిపోతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో లీడర్ బోర్డుపై లీస్ట్ లో భరణి ఉన్నాడు. ఇక నామినేషన్ నుండి సేవ్ అయ్యే ప్రక్రియ నుండి తొలగిపోయాడు. తన దగ్గరున్న పాయింట్స్ లో సగం ఎవరికైనా ఇవ్వమని బిగ్ బాస్ చెప్పాడు. భరణి దగ్గరికి సంజన వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. నాకు పాయింట్స్ చాలా అవసరమని అడుగుతుంది. నేను మాట ఇవ్వలేను ఆలోచించుకోవాలని భరణి చెప్తాడు. ఆ తర్వాత తన పాయింట్స్ అన్ని తనూజకి ఇస్తున్నానని చెప్పి భరణి ఎమోషనల్ అవుతాడు. ఎందుకు ఏడుస్తున్నారని తనూజ అడుగుతుంది. ఏం లేదని భరణి అంటాడు. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. అందులో స్కోర్ బోర్డుపై మిగిలిన ముగ్గురు అయిన ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన ఆడుతారు. వాటర్ లో ఉన్న షేప్స్ తాళం తీసి టేబుల్ పై సెట్ చెయ్యాలి.. అలా బజర్ మోగేసరికి ఎవరివి ఉంటాయో వాళ్ళే విన్ అని బిగ్ బాస్ చెప్తాడు. అందులో ముగ్గురు ఒకరి షేప్స్ ఒకరు టేబుల్ పై నుండి తీసి బయటకు విసిరేస్తారు.. అలా ముగ్గురు ఒకరికొకరు తోసుకుంటూ గేమ్ ఆడుతారు. తనూజ,ఇమ్మాన్యుయేల్ ని పట్టుకొని ఆపుతుంది. మనం మనం కొట్టుకుంటే వేరేవాళ్ళు ఆ షేప్స్ పెట్టుకుంటున్నారని ఇమ్మాన్యుయేల్ అంటాడు. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విన్ అవుతాడు‌ సెకెండ్ సంజన ఉంటుంది. తనూజ పెట్టిన షేప్స్ అన్ని వాళ్ళు తీసేసారు కాబట్టి తనూజకి ఈ టాస్క్ లో పాయింట్స్ రాలేదు. టాస్క్ తర్వాత ఇమ్మాన్యుయేల్ పై సంజన గట్టిగా అరుస్తుంది. నాకు ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదు.. మీరు కలిసి గేమ్ ఆడారు.. మనం మనం ఆపుకుంటే వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారన్నావ్ అంటే నేనే కదా అని సంజన ఏడుస్తుంది. నాకు ఎవరు లేరు.. ప్రతీసారీ అందరికి నేనే టార్గెట్ అని ఏడుస్తుంది. మీరు చూసేవాళ్ళకి ఏం పొట్రే చేద్దామనుకుంటున్నారని ఇమ్మాన్యుయేల్ అంటాడు. మరొకవైపు నా షేప్స్ అన్ని తీసి ఫస్ట్ వాటర్ లో నువ్వే వేసావని ఇమ్మాన్యుయేల్ తో తనూజ గొడవ పడుతుంది.

Podharillu: మహా పెళ్ళిచూపులు హిట్టు.. చక్రి పెళ్ళిచూపులు ఫట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -05 లో..... మహాకి వాళ్ల నాన్న పెళ్లిచూపులు ఏర్పాట్లు చేస్తాడు. తనకి అబ్బాయి బొకె ఇస్తాడు. నాకు పువ్వుల వాసన నచ్చదని మహా అంటుంది. హారిక కాఫీ తీసుకొని వచ్చి మహాకి ఇచ్చి అబ్బాయి వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది. దాంతో మహాకి ఇష్టం లేకపోయినా కాఫీ ఇస్తుంది. మరొకవైపు చక్రికి పెళ్లిచూపుల కోసం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు.. అక్కడ చక్రి.. ఒక గారె తిని ఎవరు చేశారని అడుగుతాడు. అమ్మాయి చేసిందని చెప్పగానే గారె లోపల ఉడకలేదు.. ఇంకా పిండి ఉందా అని చక్రి అడుగుతాడు. ఉందని అమ్మాయి చెప్పగానే చక్రి అమ్మాయికి గారెలు చెయ్యడం నేర్పిస్తాడు. అదంతా చూసి తన తమ్ముళ్ళకి కోపం వస్తుంది. మీకు వంట అంటే ఇష్టమా అని అమ్మాయి అడుగుతుంది. అవసరం అని చక్రి చెప్తాడు. అందరు అన్నీ మాట్లాడుకుంటారు. చక్రి వెళ్ళేటప్పుడు అమ్మాయి బాయ్ చెప్తుంది కానీ తన పేరెంట్స్ ఏ విషయం అయినా చెప్తామని అనగానే అబ్బాయి వాళ్ళు డిస్సపాయింట్ అయి వెళ్ళిపోతారు. మరొకవైపు పెళ్ళిచూపులకి వచ్చిన అబ్బాయికి నచ్చొద్దని మహా అనుకుంటుంది. అమ్మాయి, అబ్బాయి మీరు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారా అని ప్రతాప్ అనగానే దానికోసం వెయిట్ చేస్తున్నానని అబ్బాయి అంటాడు. ఇద్దరు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. నీకు వంట వచ్చా.. కెనడాలో మేడ్ కి చాలా ఖర్చు అని అంటాడు. భార్య గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటే మహాకి కోపం వస్తుంది. ఆ తర్వాత మీ అమ్మాయికి అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా పెంచారని అబ్బాయి అనగానే హమ్మయ్య నేను నచ్చలేదని మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రపంచం అంటే ఏంటో చూపిస్తానని అబ్బాయి అనగానే మహా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది. అది చూసి రుద్ర షాక్ అవుతాడు. నన్ను మోసం చేసావ్ గంగ.. ఆ రోజు ఫొటోస్ తీసి నువ్వే సోషల్ మీడియాలో పెట్టావ్ లేదంటే ఇది ఇక్కడ ఎందుకు ఉంటుందని  రుద్ర అంటాడు. అసలు అదేంటో కూడా నాకు తెలియదని గంగ అంటుంది. ఇంట్లో అందరు వచ్చి.. ఏంటి గొడవ అంటారు. నేను గంగ కెరీర్ కోసం తనని పెళ్లి చెసుకున్నాను కానీ ఇంత మోసం చేసిందని తెలిసాక ఇక నాకు అవసరం లేదు.. నువ్వు ఇక్కడే ఉండిపోమని  చెప్పి రుద్ర వెళ్లిపోతాడు. దాంతో లక్ష్మి కిందపడిపోతుంది. తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంటే.. రుద్ర చూసి అసలు గంగ వాళ్ల అమ్మకి ఏమైంది.. వద్దని అనుకుని వచ్చాను.. ఇప్పుడు వెళ్తే బాగోదని రుద్ర అనుకుంటాడు. ప్రాబ్లమ్ గంగతో కానీ వాళ్ల అమ్మతో కాదు కదా అని మళ్ళీ అనుకుంటాడు. లక్ష్మీకి హాస్పిటల్ ఖర్చు ముప్పై వేయిలు అవుతుందని డాక్టర్ చెప్తాడు. అప్పుడే రుద్ర వచ్చి పే చేసి వెళ్తాడు. మీ మధ్యలో ఏం గొడవ అయిందో తెలియదు గానీ మీరు మళ్ళీ కలవాలని గంగతో శ్రీను అంటాడు. కలవాలంటే నేను తప్పు చెయ్యలేదని నిరూపించాలని గంగ అంటుంది. మరొకవైపు ఇషిక, వీరులకి పారు ఫోన్ చేసి తన ప్లాన్ చెప్తుంది. ఇక గంగని రుద్ర ఎప్పటికి క్షమించడని పారు చెప్పగానే మంచి ప్లాన్ చేసావని పారుని ఆ ఇద్దరు పొగుడుతారు. తరువాయి భాగంలో రుద్ర ఒక్కడే ఇంటికి వస్తాడు. ఏమైందని పెద్దసారు అడుగగా రుద్ర జరిగింది చెప్తాడు. శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi:రాహుల్ చెంపచెల్లుమనిపించిన సుభాష్.. కావ్యకి నయం అవుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -902 లో....స్టేషన్ కి రేణుకని పిలిచి అప్పు మాట్లాడుతుంది. నీ కూతురు బ్రతికే ఉందని చిన్న క్లూ దొరికిందని అప్పు అనగానే రేణుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండని అప్పు అనగానే రేణుక వెళ్తుంటే తన భర్త ఎదరవుతాడు. అప్పూనే అతన్ని పిలిపిస్తుంది. మీ కూతురు బ్రతికే ఉందని అప్పు చెప్పగానే అతను కంగారుపడతాడు. అంతే కాదు పాప చనిపోయిందని ఒక బాడీ చూపించారు కదా ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చెయ్యాలని అనుకుంటున్నాం.. దాంతో అన్ని నిజాలు బయటకు వస్తాయని అప్పు అనగానే అతను ఇంకా కంగారుపడతాడు. మంచిదే కదా మేడమ్ అని అతను అంటాడు. మీరు ఇప్పుడు వెళ్ళండి అని అప్పు అనగానే.. అతను వెళ్తాడు. మరొకవైపు రాజ్, కావ్యలని రౌడీలు బంధించగా రాజ్ తన తాళ్లు విప్పుకొని రౌడీలని కొడతాడు. అప్పుడే చోటు, మోటుల హెడ్ బాస్ అయిన పెద్ద విలన్ అక్కడికి వచ్చి రాజ్ ని గన్ చూపించి బెదిరిస్తాడు. అప్పుడే పోలీసులు వచ్చి రౌడీలని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత సుభాష్ కి శృతి ఫోన్ చేసి మన క్లయింట్స్ అందరు రాహుల్ సర్ కంపెనీతో డీల్ పెట్టుకున్నారు. రాహుల్ సర్  ప్రెజెంట్ చేసిన డిజైన్స్ మొత్తం కూడా కావ్య మేడమ్ వేసినట్లు ఉన్నాయని శృతి చెప్తుంది. దానికి సంబందించిన ఫొటోస్ అన్ని సుభాష్ కి పంపిస్తుంది. అది చూసి సుభాష్.. ఈ రాహుల్ వెన్నుపోటు పొడిచాడు అని షాక్ అవుతాడు. మరొకవైపు కావ్యకి చేస్తున్న ఆయుర్వేద వైద్యం పూర్తి అవుతుంది. ప్రాబ్లమ్ 99% తగ్గిందని అతను చెప్తాడు. దాంతో రాజ్, కావ్య హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాహుల్ డిజైన్స్ చూసి ఇంట్లో వాళ్లంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే సుభాష్ వచ్చి రాహుల్ చెంపచెల్లుమనిపిస్తాడు.. కావ్య డిజైన్స్ దొంగతనం చేసావని అంటాడు. లేదు మావయ్య నేను వేసానని రాహుల్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కావేరికి పిలిచే ఛాన్స్ కూడా ఇవ్వని కాంచన.. కార్తీక్ ఆన్ ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -539 లో..... శౌర్య హోమ్ వర్క్ చెయ్యకుండా అల్లరి చేస్తుంది. దాంతో అనసూయ కోప్పడుతుంది. శౌర్య హోమ్ వర్క్ చెయ్యకుండా  కాంచన బొమ్మ డ్రాయింగ్ వేస్తుంది. అది అనసూయ చూసి ఇది రాయకుండా ఏం చేస్తుందని శౌర్య వెంట అనసూయ పరుగెడుతుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. అంతలోనే కావేరి వస్తుంది. ఏంటి చిన్నమ్మ ఇలా వచ్చావని కార్తీక్ అడుగుతాడు. దీప ప్రెగ్నెంట్ కదా అత్తయ్యగా తనకి ఇష్టమైనవి వండి పెట్టాలని కావేరి అంటుంది. అందుకే రేపు ప్రొద్దున మా ఇంటికి టిఫిన్ కి పిలుద్దామని వచ్చానంటూ కావేరి అంటుంది. కాంచనని కూడా పిలవబోతుంటే.. కార్తీక్, దీప వస్తారని కాంచన అంటుంది. సరే అని కావేరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు కాశీ ఇంటికి రాగానే శ్రీధర్ గొడవ పెట్టుకుంటాడు. దాంతో స్వప్న, కాశీ కూడా గొడవపెట్టుకుంటారు. నువ్వు ఒక అసమర్ధత గలవాడివి అని స్వప్న అనగానే కాశీకి కోపం వస్తుంది. అప్పుడే కావేరి వచ్చి.. ఏంటి మీ గొడవ అని కోప్పడుతుంది. నీ భర్తని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోమని కావేరి అనగానే.. వాళ్ళేదో అంటే నువ్వు ఏదో అంటావేంటి స్వప్న మీరు ఇద్దరు లోపలికి వెళ్ళండి అని శ్రీధర్ అంటాడు. నువ్వు వెళ్లిన పని ఏమైందని శ్రీధర్ అడుగగా అక్క తనని పిలిచే అవకాశం ఇవ్వలేదని కావేరి చెప్తుంది. మరొకవైపు మనతో పాటు అమ్మని కూడా రేపు అక్కడికి తీసుకొని వెళదామని దీపతో కార్తీక్ అంటాడు. అదే విషయం కాంచనతో చెప్పగా రానని అంటుంది. శౌర్య వచ్చి.. తాతయ్య ఇంటికి నానమ్మ భోజనానికి ఎందుకు రావాలని అడుగుతుంది. అలాంటప్పుడు తాతయ్య దగ్గర నానమ్మని వదిలేసి రావాలని శౌర్య అనగానే శౌర్యపై కాంచన కోప్పడుతుంది. నేను మీకు ఏం అడ్డుంటున్నాను.. అన్నీ తల్లి నేర్పిస్తే పిల్ల మాట్లాడుతుందని కాంచన అనగానే దీప తన కాళ్లపై పడుతుంది. అత్తయ్య నేనేం చెప్పలేదని దీప ఏడుస్తుంది. ఆ తర్వాత కార్తీక్ అత్తా కోడళ్ళపై కోప్పడతాడు. నువ్వు రేపు వస్తున్నావా లేదా అని కార్తీక్ అడుగగా.. రానని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ప్రేమ, ధీరజ్ ల అల్లరి.. వేదవతి, రామరాజు సినిమాకి వెళ్తారా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -340 లో..... ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. పార్క్ లో ఇచ్చిన ఫ్లవర్ ఏం చేసావని అడుగుతాడు. అక్కడే పారేశానని ప్రేమ అనగానే.. దీనికి ఏ ఎమోషనల్ ఉండదని తన దగ్గరున్న ఫ్లవర్ ని తనపై విసిరేస్తాడు. ఇదేం ప్రకృతి వైపరిత్యంరా.. నువ్వు ఫ్లవర్ ని తీసుకొని వచ్చావా అని ప్రేమ అంటుంది. ప్రేమ డ్రాయింగ్ వేస్తుంటే ఏం చేస్తున్నావే అని తన చేతిలో ఉన్న పేపర్ లాక్కుంటాడు. అందులో రెండు కుటుంబాలు కలిసినట్లు ప్రేమ, ధీరజ్ ఇద్దరు చెయ్ పట్టుకొని ఉన్నట్లు ఉంటుంది. అది చూసి.. ఇది ఎప్పటికి జరగదని కోపంగా చెప్తాడు. దాంతో ప్రేమ కోపంగా తను దాచుకున్న ఫ్లవర్ తీసుకొని వెళ్ళి ధీరజ్ కి కోపంగా ఇస్తుంది. అది చూసి ఇది ఎప్పటికి అర్థం కాదని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు భాగ్యంకి శ్రీవల్లి ఫోన్ చేసి పార్క్ లో జరిగింది చెప్తుంది. ఆ తర్వాత అమూల్య, విశ్వ ఇద్దరు దూరంగా ఉండి సైగ చేసుకోవడం శ్రీవల్లి చూసి టెన్షన్ పడుతుంది. ప్రొద్దున మా అయన వాళ్ళని చూసాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఏమంటాడోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మరొకవైపు నర్మద, ప్రేమ ఇద్దరు వేదవతి దగ్గరికి వస్తారు. ఇద్దరిపై వేదవతి కోపంగా ఉంటుంది. పేరుకు అత్తాకోడళ్ళు కానీ ఫ్రెండ్స్ అంటారు కానీ మీరు పార్క్ కి వెళ్ళేటప్పుడు కనీసం చెప్పలేదని వేదవతి అనగానే మీరు ముసలివాళ్ళు మీరు వచ్చి ఏం చేస్తారని నర్మద అనగానే వేదవతి కోపంగా రామరాజు దగ్గరికి వెళ్లి ఏవండి మనం సినిమాకి వెళదామని అంటుంది. దానికి రామరాజు సరే అంటాడు. అదంతా చూసి ప్రేమ, నర్మద నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Thanuja second vote Appeal:రెండోసారి ఓట్ అప్పీల్ చేసుకున్న తనూజ.. పాపం సంజన!

బిగ్ బాస్ హౌస్ లో పద్నాలుగో వారం ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టాస్క్ లలో గెలిచి స్కోర్ బోర్డుపై ఎక్కువ పాయింట్లు కలిగిన కంటెస్టెంట్స్ తనూజ,ఇమ్మాన్యుయేల్, సంజన ముగ్గురు.  ఇక‌ వీరిలో మీతో పాటు ఓటు అప్పీల్ కి ఎవరిని తీసుకొని వెళ్తారు తనూజ అని బిగ్ బాస్ అడుగుతాడు. ఆల్రెడీ ఇమ్మాన్యుయేల్ కీ ఓటు అప్పీల్ ఛాన్స్ రావడంతో సంజనని సెలెక్ట్ చేసుకుంటుంది తనూజ. సంజన, తనూజ ఇద్దరు గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ అడియన్స్ ఉంటారు. ఇద్దరిలో ఎవరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇస్తారని బిగ్ బాస్ ఆడియన్స్ ని అడుగుతారు. ఎక్కువ తనూజకి సపోర్ట్ చేస్తారు. దాంతో తనూజకి మళ్ళీ ఓటు అప్పీల్ ఛాన్స్ వస్తుంది. సంజన హౌస్ లోపలికి వెళ్తుంది. తనూజ ఓటు అప్పీల్ చేసుకుంటుంది. ఆడియన్స్ కొంతమంది తనూజని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు ప్రతీసారి ఏడుస్తారు ఎందుకు మీకు సింపథీ కోసమా అని ఒకావిడ అడుగుతుంది. అయ్యో అలా ఏం కాదండి.. ఎప్పుడు మా వాళ్ళు ఎవరో ఒకరు నాతో ఉండేవాళ్ళు కానీ హౌస్ లోకి వచ్చాక వీళ్ళు ఎవరో తెలియదు అలాంటప్పుడు ఎమోషనల్ అవ్వడం తప్పనిసరి అవుతుందని తనూజ చెప్తుంది. మీరు ఇమ్మాన్యుయేల్ మొహం పైనే.. నువ్వు నా ఫ్రెండ్ కాదని అన్నారు.. అలా అనడం కరెక్టేనా అని ఒక ఆడియన్ అడుగుతాడు. వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్.. మీకు క్లోజ్ ఫ్రెండ్ లేడా అని తనూజ అంటుంది. నేను అలా అనలేదని అతను అంటాడు. నేను హర్ట్ అయ్యాను.. వాడు హర్ట్ అవ్వాలి కదా అని తనూజ చెప్తుంది. అలా అతను అడిగే ప్రశ్నలకి తనూజ తడబడుతూ సమాధానం చెప్తుంది.

Tanuja Fires On Bharani: భరణికి వెన్నుపోటు పొడిచిన తనూజ.. గెలిచేది ఆ ముగ్గురిలో ఒకరు!

బిగ్ బాస్ సీజన్-9 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. హౌస్ లో ఫినాలేకి వారం ఉంది కానీ ఇప్పుడే హౌస్ లో గ్రూప్ లుగా ఆడుతున్నారు. హౌస్ లో భరణి, సుమన్, సంజన ఒక టీన్. ఇమ్మాన్యుయేల్, డీమాన్, తనూజ, కళ్యాణ్ ఒక జట్టుగా అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.  టాస్క్ లో భాగంగా ఎవరైనా టాస్క్ నుండి తొలగించండి అని బిగ్ బాస్  అన్నప్పుడు కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డీమాన్ ముగ్గురు భరణి పేరు చెప్పారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ పేరుని భరణి చెప్తాడు. సంజన పేరుని తనూజ చెప్తుంది. ఎక్కువ ఓట్లు భరణికి పడడంతో భరణి టాస్క్ నుండి తొలగిపోతాడు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. అందులో సంజన,ఇమ్మాన్యుయేల్ పాయింట్స్ సాధిస్తారు. డీమాన్, తనూజ పాయింట్స్ ఏం పొందలేకపోతారు. స్కోర్ బోర్డులో లీస్ట్ లో డీమాన్ ఉండడంతో గేమ్ నుండి తొలగిపోతాడు. తన పాయింట్స్ లో సగం ఎవరికైనా ఇవ్వాలని చెప్పగా డీమాన్ తన పాయింట్స్ లో సగం తనూజకి ఇస్తాడు. దాంతో తనూజ లీడ్ లో ఉంటుంది. తదుపరి టాస్క్ నుండి తొలగించడానికి అందరు ఒకరిని ఎన్నిక చేసుకొని చెప్పమంటాడు బిగ్ బాస్. నాకు సపోర్ట్ చెయ్యి తనూజ అని భరణి తనని రిక్వెస్ట్ చేస్తాడు. లేదు.. నాకు ఇమ్మాన్యుయేల్ చాలాసార్లు స్టాండ్ తీసుకున్నాడని భరణితో తనూజ అనగానే అంటే నేను తీసుకోలేదా అని భరణి అంటాడు. ఇక అక్కడి నుండి భరణి వెళ్ళి.. నేను స్టాండ్ తీసుకోలేదట.. ఇమ్మాన్యుయేల్ స్టాండ్ తీసుకున్నాడంట.. ఎలా అంటుంది.. ఎంత హర్టింగ్ గా ఉందని భరణి బాధపడుతాడు. ఇక ఎక్కువ భరణికి ఓట్లు పడడంతో తదుపరి గేమ్ లో భరణి ఆడడు... తర్వాతి టాస్క్ లో ఓట్ అప్పీల్ అనే ఇంగ్లీష్ లెటర్ ని ఫాస్ట్ గా సెట్ చేయ్యాలి. ఆ గేమ్ తర్వాత ఇమ్మాన్యుయేల్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. తనూజ సెకండ్, సంజన థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. లీడ్ లో తనూజ,ఇమ్మాన్యుయేల్, సంజన ఉంటారు.

Sanjana vs Suman Shetty: సుమన్ శెట్టి అవుట్ ఆఫ్ ది రేస్.. సంజన లీడింగ్!

బిగ్ బాస్ సీజన్ కి శుభం కార్డ్ పడబోతుంది. ఈ వీక్ తో టాస్క్ లు అన్నీ కంప్లీట్ అవుతాయి. నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నాడు. ఇక లీడర్ బోర్డుపై సుమన్ లీస్ట్ లో ఉండడంతో సుమన్ ని గేమ్ నుండి తొలగిస్తాడు బిగ్ బాస్. మీ పాయింట్స్ హౌస్ లోని ఎవరికైనా సగం పాయింట్స్ ఇవ్వొచ్చని బిగ్ బాస్ చెప్పాడు. అసలు సుమన్ అన్న న్యాయంగా ఆలోచిస్తే మనకి ఇవ్వాలని ఇమ్మాన్యుయేల్ తో డీమాన్ అంటాడు. ఎందుకు అంటే లాస్ట్ టాస్క్ లో మనల్ని తీశారని అంటాడు.  ఆ తర్వాత బిగ్ బాస్ అలా చెప్పగానే.. నాకు మీరే గుర్తువచ్చారు భరణి అన్న.. ఎందుకంటే ఈ హౌస్ లో నాకంటూ ఉంది మీరొక్కరే అని సుమన్ కంటతడి పెట్టుకుంటాడు.నిన్ను గేమ్ లో ఉంచాలని చాలా ట్రై చేశానని సుమన్ తో చెప్తూ భరణి ఎమోషనల్ అవుతాడు. నీ పాయింట్స్ నాతో పాటు హౌస్ లో ఇంకొకరికి కూడా అవసరమని భరణి చెప్పగానే సంజన గారికి అని సుమన్ చెప్తాడు.  ఆ తర్వాత సంజన దగ్గరికి సుమన్ వెళ్లి పాయింట్స్ మీకు ఇద్దామని అనుకుంటున్నానని చెప్పగానే చాలా థాంక్స్ అన్నా.. అసలు నేను ఎవరిని అడగను కానీ అడిగే సిచువేషన్ వచ్చిందని సంజన ఏడుస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ చెప్పినప్పుడు సుమన్ తన స్కోర్, ఇంకా పాయింట్స్ లో సగం సంజనకి ఇవ్వగా సంజన లీడ్ లోకి వెళ్తుంది. ఇక సుమన్ నామినేషన్ నుండి సేవ్ అయ్యే అవకాశం కోల్పోతాడు.

Podharillu : పొదరిల్లు సీరియల్ లో ట్విస్ట్.. ఇష్టం లేని పెళ్ళిచూపుల్లో మహా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -04 లో... ఇంట్లో వాళ్లు  మహాకి పెళ్లిచూపులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుసుకొని తను బాధపడుతుంది. తనకి సంబంధించిన మెడల్స్, సర్టిఫికేట్లు తీసుకొని వస్తుంది. ఇవన్నీ తెచ్చుకుంది పెళ్లి చేసుకొని వెళ్ళడానికా అని వాళ్ళ నాన్నని అడుగుతుంది. నువ్వేం చెయ్యాలనుకున్న పెళ్లి అయ్యాక చెయ్యమని ప్రతాప్ చెప్తాడు. దీన్ని ఎవరైనా ప్రేమ అంటారా అని మహా తన వదిన హారికకి చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు మాధవ పెళ్లిచూపులకి వెళ్లాడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత తాయారు కూతురు గాయత్రి గుడికి వెళ్తుంది.. మాధవ బావకి నాకు పెళ్లి కావాలని మొక్కుకుంటుంది. అప్పుడే తనకి  తన ఫ్రెండ్ ద్వారా మాధవ పెళ్లిచూపులకి వెళ్తున్నాడని తెలుస్తుంది. దాంతో వాళ్ల అమ్మకి ఏదో సాకు చెప్పి అక్కడ నుండి మాధవ దగ్గరికి బయల్దేరుతుంది. రెడీ అయి ఉన్న మాధవ దగ్గరికి వెళ్లి కోప్పడుతుంది. అప్పుడే నారాయణ వచ్చి.. నువ్వు ఇక్కడ ఎన్ని అంటే ఏం లాభం మీ అమ్మకి చెప్పు లేదంటే నువ్వు వచ్చేయ్.. నీతో నా కొడుకు పెళ్లి చేస్తానని నారాయణ అంటాడు. నువ్వు ఈ పెళ్లిచూపులకి వెళ్ళకు బావ ఈ పెళ్లిచూపులు కూడా క్యాన్సిల్ అవ్వాలని గాయత్రి అనేసి వెళ్ళిపోతుంది. మరొకవైపు నేను రెడీ అవ్వను అంటూ మహా మొండిగా ఉంటుంది. దాంతో హారిక వచ్చి నచ్చజెప్తుంది. నీకు అబ్బాయి నచ్చలేదని క్యాన్సిల్ చెయ్యొచ్చని సలహా ఇస్తుంది. మరొకవైపు మహాని పెళ్లిచూపులు చూడడానికి వసున్న అబ్బాయికి దారిలో బొకే కనిపిస్తుంది. అది వేరే వాళ్ళు కొనుక్కొని వెళ్తుంటే అతను ఇవ్వమని అడుగుతాడు. నేను ఇవ్వనని కొనుక్కున్న అతను అనగానే.. ఎక్కువ డబ్బులు ఇచ్చి లాక్కుంటాడు. నాకు నచ్చింది నాకు దక్కాల్సిందేనని అతను కార్ ఎక్కుతాడు. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళని ప్రతాప్ రిసీవ్ చేసుకుంటాడు. అబ్బాయి అటిట్యూడ్ గా బెహేవ్ చేస్తాడు. మహా వచ్చేలోపు కార్ లో ఉన్న బొకే తీసుకొని వస్తాడు. మహాని చూసి ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: రౌడీని పంపించిన పారు.. హ్యాపీగా గంగ, రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -139 లో.. గంగ, రుద్ర నల్లపూసల కార్యక్రమం కోసం గంగ పుట్టింటికి వస్తారు. బస్తీ వాళ్ళందరు గంగ, రుద్రకి స్వాగతం పలుకుతారు. లక్ష్మీ హారతి ఇస్తుంది. ఇక గంగ ఫ్రెండ్స్ రుద్రని ఒక ఆట ఆడేసుకుంటారు. రుద్ర, గంగలని గుమ్మం దగ్గరే ఆపి.. పేర్లు చెప్పమని అంటారు. గంగ చెప్తుంది కానీ రుద్ర మాత్రం మొహమాటపడతాడు. రుద్ర, గంగ లోపలికి వస్తారు. ఆ స్వీట్ తిను.. ఈ స్వీట్ తిను అంటూ రుద్రని బస్తీ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే మీకెప్పుడు ఇదే పనేనా అని రుద్ర కోప్పడుతాడు. అయిన వాళ్ళు అది జోక్ గా తీసుకుంటారు. మీరు బయటకు వెళ్ళండి అయన తింటాడని గంగ అనగానే అందరు వెళ్ళిపోతారు. నేను తిననని రుద్ర అనగానే నేను తింటాను.. ఎందుకు అంటే వాళ్ళు ఒక పూట భోజనం చెస్తే మరొకపూట చేయరు. అలాంటిది మీ కోసం ఇవన్నీ తెచ్చారు. మీరు తినలేదు అంటే ఫీల్ అవుతారు కదా అని గంగ అంటుంటే.. తన మాటలకి రుద్ర ఇంప్రెస్ అవుతాడు. మరొకవైపు రౌడీని గంగ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది పారు. అతను అక్కడ బాంబ్ పెడతాడు.  ఆ తర్వాత గంగ నల్లపూసలు గుచ్చుతారు. గంగ మెడలో రుద్ర తాళి వేస్తాడు. అదంతా పారుకి రౌడీ వీడియో కాల్ లో చూపిస్తాడు. దాంతో పారు కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత రుద్ర, గంగకి అందరు శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. అందరు కలిసి రుద్ర, గంగ చేత బంతటా ఆడిస్తారు. ఇక బిందెలో ఉంగరం తీపిస్తారు. ఇలా అన్ని రుద్రతో చేపిస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రౌడీల నుండి రాజ్, కావ్య తప్పించుకుంటారా..‌రాహుల్ ప్లాన్ అదేనా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -901 లో....రాహుల్ దగ్గరికి స్వప్న రొమాంటిక్ గా వస్తుంది. తనని చూసి ఏంటి స్వప్న ఇంత అందంగా ఉన్నవని పొగుడుతాడు.స్వప్నని రాహుల్ హగ్ చేసుకొని.. సడెన్ గా అయ్యో సారీ స్వప్న నేను టెన్షన్ లో ఉన్నాను అంటాడు. ఏమైందని స్వప్న అడుగుతుంది. నువ్వు డిజైన్స్ సెలెక్ట్ చేసావ్ కదా ఆ డిజైన్ కి ప్రమోషన్ ఇప్పించాలి కదా వాటికోసం మోడల్స్ కోట్లలో అడుగుతున్నారు. ఇప్పుడే మనం అంత ఇచ్చుకోలేం కదా అని రాహుల్ అంటాడు. స్వప్న నువ్వు ఒకప్పుడు మోడల్ వే కదా ప్లీజ్ ఇప్పుడు ఈ డిజైన్స్ కీ మోడల్ గా  నువ్వు చెయ్యొచ్చు కదా అని రిక్వెస్ట్ చెయ్యడంతో స్వప్న సరే అంటుంది. మరొక వైపు రాజ్, కావ్య హోటల్ లో ఉండగా.. అక్కడ రాజ్ కి తెలిసిన ఇన్‌స్పెక్టర్ కలిస్తే మాట్లాడుతాడు. అప్పుడే రూమ్ సర్వీస్ అతనికి రాజ్ రూమ్ లో పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అది బేరర్ కి ఇచ్చి ఆ టేబుల్ మీద ఉన్న వాళ్లకు ఇవ్వమని చెప్తాడు. అతను వెళ్ళేలోపు రాజ్, కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బేరర్ అక్కడున్న ఇన్‌స్పెక్టర్ కి ఇస్తాడు. మీ రూమ్ లో ఇది దొరికింది అని ఇస్తాడు. ఓహ్ రాజ్ వాళ్ళది అయి ఉంటుందని రాజ్ వెనకాలే ఇన్‌స్పెక్టర్ వెళ్తారు. అప్పుడే రాజ్, కావ్యకి మత్తు ఇచ్చి చోటు, మోటు ఇద్దరు కిడ్నాప్ చేస్తారు. అది ఇన్‌స్పెక్టర్ చూసి వాళ్ళని ఇక్కడ కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం ఎవరికి ఉంది. ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూడాలని ఇన్‌స్పెక్టర్ అనుకుంటాడు. మరొకవైపు రాహుల్, స్వప్నని ఫోటో షూటింగ్ కీ తీసుకొని వస్తాడు.  కెమెరా మెన్ తనని చూసి.. రాహుల్ నీ భార్య చాలా బాగుందంటూ పొగుడుతాడు. స్వప్నకి జ్యువెలరీ వేసి డిజైన్స్ ఫోటో షూటింగ్ జరిపిస్తాడు రాహుల్. ఆ తర్వాత రాజ్, కావ్యని తాళ్లతో కట్టి బంధిస్తారు. పెన్ డ్రైవ్ ఎక్కడ అని చోటు, మోటు వాళ్ళని అడుగుతారు. మాకేం తెలియదని రాజ్ అంటాడు. మరొకవైపు రాజ్ కంపెనీ క్లయింట్స్ ని రాహుల్ రప్పించుకొని డిజైన్స్ ప్రమోషన్ గురించి చెప్పగానే వాళ్ళు రాహుల్ వైపు తిరుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : జ్యోత్స్నకి క్లాస్ పీకిన కార్తీక్.. దీప హ్యాపీ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -538 లో....దీప చెప్పిన ఫుడ్ ట్రక్ ఐడియా బాగుందని అందరూ అనడంతో కార్తీక్ హ్యాపీ నెస్ తో స్వీట్ తీసుకొని వస్తాడు. అది ఓర్వలేక జ్యోత్స్న.. దీప మొదటి పెళ్లి గురించి మాట్లాడుతుంది. దాంతో సుమిత్ర కొట్టబోతుంటే నేను సమాధానం చెప్తానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? ఒక ఆడది రెండో పెళ్లి చేసుకోవద్దన్న రూల్స్ ఉన్నాయా.. ఎవరైనా పరిస్థితికి కట్టుబడి ఉంటారు. నేను దీపని పెళ్లి చేసుకోకున్నా కూడా నిన్ను చేసుకునేటోడిని కాదు. ఇప్పుడు నీకు నాతో ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి క్యాన్సిల్ అయింది.. అలాగే గౌతమ్ విషయంలో కూడా అలాగే అయింది.. ఇప్పుడైనా నీకు పెళ్లి అవసరమా ఆని జనాలు అనుకున్నారనుకో నువ్వు చేసుకోకుండా మానేస్తావా.. లేదు కదా.. ఇప్పుడు పారు, తాత వాళ్ల పిల్లలు కోసం చేసుకున్నారు.. దాస్ మావయ్య తన భార్య జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాడు. అనసూయ గారు కూడా తన భర్త అంటే ఇష్టం కాబట్టి అలా ఉన్నారు. ఇకపోతే మా అమ్మనాన్న త్వరలో కలుస్తారని జ్యోత్స్నకి క్లాస్ తీసుకుంటాడు. కార్తీక్ కి పారిజాతం కూడా సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఆడదాని మనసు అర్థం చేసుకున్నావ్ రా అని పారిజాతం అంటుంది. దీప నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అని పారిజాతం అనగానే నీ నోటి నుండి ఇలాంటి మాటలు వింటే స్వీట్ గా ఉంటుందని శివన్నారాయణ అంటాడు. నీకోసం ఏదైనా చెయ్యాలని అనిపిస్తుందని శివన్నారాయణ అనగానే మీ చేతిలో ఉన్న స్వీట్ తినిపించండి అని పారిజాతం అంటుంది. శివన్నారాయణ తినిపిస్తాడు. కార్తీక్ ఫోటో తీస్తాడు. మరొకవైపు శ్రీధర్ తన పీఏ అయిన కాశీకీ ఫుడ్ ట్రక్ వెంట వెళ్ళమని చెప్తాడు. అ తర్వాత జ్యోత్స్న అన్నమాటలకి దీప బాధపడుతుంటే.. కార్తీక్ వెళ్లి మాట్లాడతాడు. జ్యోత్స్న ఇంకెప్పుడు అలా మాట్లాడకుండా చేసాను కదా అని కార్తీక్ అంటాడు. అ తర్వాత అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటూ కాశీకీ శ్రీధర్ కోపం తెప్పిస్తాడు. వీడిని నా కూతురు ఎలా పెళ్లి చేసుకుందో ఏంటోనని శ్రీధర్ ఆనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం చూసేసిన చందు.. శ్రీవల్లి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -339 లో.. రామరాజు కొడుకులు, కోడళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు అందరు పార్క్ కి వస్తారు. శ్రీవల్లి చందు మాట్లాడుకుంటుంటే అప్పుడే తిరుపతి వస్తాడు. మీరేంటి ఇక్కడ ఆని అడుగుతాడు. సరదాగా వచ్చామని చందు చెప్తాడు. ఆ తర్వాత తిరుపతికి నర్మద, సాగర్ కన్పిస్తారు. వాళ్ళని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ కనిపిస్తారు వాళ్ళని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. నువ్వు ఎందుకు వచ్చావ్ మామ అని తిరుపతిని ధీరజ్ అడుగగా నాకు పని ఉండి వచ్చానని అక్కడ నుండి బయల్దేరతాడు. ఆ తర్వాత అమూల్య, విశ్వ ఉన్నవైపు వెళ్తుంటే అప్పుడే తనకి బాల్ తగిలి వెనక్కి వస్తాడు. నా స్వప్న సుందరి ఎక్కడ అంటూ వెతుక్కుంటూ ఉంటాడు. ఆ తర్వాత అందరు ఒకరికొకరు ఎదరుపడుతారు. మీరేంటి ఇక్కడ అంటే మీరేంటి ఇక్కడ అని అందరు అనుకుంటారు. అప్పుడే అటుగా విశ్వ, అమూల్య వెళ్తారు. వీళ్ళందరు వాళ్ళని చూస్తారేమో అని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. వాళ్ళు వెళ్తుంటే ఎవరికి కన్పించకుండా బెలూన్ తో కవర్ చేస్తుంది. కానీ అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం చందు చూసి షాక్ అవుతాడు. చందు చూడడం శ్రీవల్లి చూసి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ధీరజ్, ప్రేమ ఇంటికి వచ్చాక కూడా గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వంగలపూడి అనిత సెటైర్స్.. ఆది తలకిందకి పెట్టి కాళ్ళు పైకిపెట్టిస్తా!

ఈనాడు 50 , ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 14 న వైజాగ్ లో ఘనంగా వేడుకులు జరగబోతున్నాయి. ఇక ఈటీవీ షోస్ నుంచి ఉన్న కళాకారులంతా కూడా వైజాగ్ వచ్చారు. పండు, పల్సర్ బైక్ ఝాన్సీ, సింగర్ సునీత, సుమ, ఆది, సౌమ్య శారద,  ఈనాడు 50 , ఈటీవీ @ 30 , సుమ @16 అంటూ తన వయసు ఇంకా పదహారు అని వైజాగ్ స్టేజి మీద చెప్పేసరికి వంగలపూడి అనిత పకపకా నవ్వేసింది. నేను వైజాగ్ బీచ్ అనగానే ఇదంతా చూపించడానికి గైడ్ లు కూడా వచ్చేసారు అంటూ ఆదిని, పండుని చూపించింది. ఇక వాళ్ళు కూడా నవ్వేశారు. "సర్ నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాను" అని సుమా అనేసరికి "మీరా విశాఖపట్నంలో ఇంటర్మీడియట్ అమ్మాయనుకున్నాను" అంటూ అయ్యన్నపాత్రుడు కామెంట్ చేశారు. "ఆవిడను ఇంటర్మీడియట్ అని పొగిడి మీరు 10th క్లాస్ కి వెళ్లిపోయారు తెలుసా" అంటూ ఆది అయ్యన్నపాత్రుడికి కౌంటర్ ఇచ్చాడు. దానికి అయ్యన్నపాత్రుడు నవ్వేశారు. "మీరు పాలిటిక్స్ కి ముందు టీచర్ గా కూడా చేశారు కదా ఒక వేళా నాలాంటి స్టూడెంట్ తగిలితే ఎం చేసేవాళ్ళు" అంటూ ఆది హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనితను అడిగాడు. "నేనైతే తల కిందకి కాళ్ళు పైకి పెట్టిస్తా" అంటూ ఆది మీద సెటైర్ వేశారు.  వెంటనే సుమ "నాకిప్పుడు ఇది చూడాలని ఉంది". ఇక ఈ ఈవెంట్ కి శంబాలా మూవీ టీమ్ నుంచి ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ వచ్చారు. ఇక సుమ, ఆది, సింగర్ సునీత ఆడియన్స్ లోకి వెళ్లి ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళతో కూడా ముచ్చటించారు. "నేను హీరోగా సుమ గారు హీరోయిన్ గ ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నా" అని రాసి ఉంది. మీరు పేరు చెప్పండి అని ఆది అనేసరికి అనిల్ కుమార్ అన్నాడు. జయమ్మ పంచాయతీ అనిల్ గారి ఆనవాయితీ..సినిమా పేరు  అంటూ ఆది అతని మీద సెటైర్ వేసాడు. తర్వాత ఇంకో ప్లకార్డు చూసారు. "సునీత గారు నన్ను చూసి అందగాడా అందగాడా" అనే పాట పాడాలి అని రాసి ఉంది. వెంటనే సునీత ఆ సాంగ్ ని ఆడియన్స్ మధ్యలోనే నిలబడి పాడి వినిపించారు. ఇక వందేమాతరం శ్రీనివాస్ కూడా రాములమ్మ సాంగ్స్ పాడారు. తర్వాత వంగలపూడి అనిత స్టేజి మీదకు వచ్చి "ఒక నీతితో, నిజాయితీతో, నిబద్దతతో కళాకారులను ముందుకు తీసుకురావడమే కాకుండా ఢీ లాంటి షోస్ ని ఏర్పాటు చేయడం కానీ ఒక పాడుతా తీయగా లాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి యువశక్తిని ముందుకు తీసుకొస్తున్న ఇటువంటి వాళ్లకు మనందరం కూడా సపోర్ట్ చేయాలి" అని చెప్పారు.

Divya Support to Demon Pavan: దివ్వ ఓటు డీమాన్ పవన్‌కి .. అన్నయ్య భరణి పోటు

బిగ్ బాస్ ఇప్పటికే పదమూడు వారాలు పూర్తయింది. దివ్య నిఖిత మూడో వారం  వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి లాజిక్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అది గేమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ భరణితో అన్నయ్య అనే బాండింగ్ తోనే గడిచిపోయింది. ఇక భరణి గారి కుటుంబం గురించి తెలిసిందే కదా.. ఒకవైపు చెల్లి.. ఒకవైపు కూతురు. కూతురు అయిన తనూజతో భరణి క్లోజ్ గా ఉంటే దివ్య అసలు ఒప్పుకోదు. భరణిని కమాండ్ చేసేది.. ఆ విషయం భరణి తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళతో వీళ్లతో చెప్తుండేవాడు. భరణికి బాలేకపోతే దగ్గరుండి మరి బాగోగులు చూసుకునేది. ఫ్యామిలీ వీక్ లో భరణి కూతురు వచ్చి.. మీరు డాడీపై కమాండింగ్ తగ్గించండి అని చెప్పింది. తనూజతో భరణి కూతురు క్లోజ్ గా పాజిటివ్ గా మాట్లాడతుంది కానీ దివ్యతో అంతగా మాట్లాడదు. దివ్య ఎలిమినేట్ అయినప్పుడు భరణి చాలా ఎమోషనల్ అవుతాడు. నాకు ఈ హౌస్ ద్వారా మంచి అన్నయ్య దొరికాడు అని దివ్య స్టేజ్ పైన చెప్పుకొచ్చింది. బజ్ ఇంటర్వ్యూలో కూడా భరణి గారి కూతురు నాతో మాట్లాడలేదు.. నేను హర్ట్ అయ్యానని దివ్య చెప్పింది. అయితే దివ్య బయటకు వచ్చి రెండు వారాలు పూర్తయింది. అయితే హౌస్ లో  భరణితో పాటు హౌస్ మేట్స్ ఆట చూసినట్లుంది. తన గురించి ఎవరు ఏం మాట్లాడారో అన్నీ మనసులో పెట్టుకుంది. అందుకే హౌస్ నుండి బయటకు వచ్చాక భరణికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ తాజాగా డీమాన్ కి ఓటు వేసినట్లు స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హౌస్ లో ఉన్నప్పుడు భరణిని అన్నయ్య లాగా ఫీల్ అయినా చెప్పిన దివ్య తనకి సపోర్ట్ గా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడంతో అందరికి అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యకి కాకుండా ఫ్రెండ్ కి సపోర్ట్ చెయ్యడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే హౌస్ లో ఉన్నవారిలో జెన్యున్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది డీమాన్ పవన్ అనేది అందరికి తెలిసిందే. హౌస్ లో ఉన్నవారిలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.

Mid week elimination Bigg Boss 9 Telugu : మిడ్ వీక్ ఎలిమినేషన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వీక్ ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకా ఆరుగురు ఉంటారు. ఫినాలే కి టాప్-5 ఉంటారు. కాబట్టి ఈ వీక్ ఒకరు లేదా నెక్స్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇప్పటికే ఓటింగ్ లో సంజన, సుమన్ లీస్ట్ లో ఉన్నారు. గతవారమే వీళ్లలో ఎవరో ఒకరు వెళ్ళల్సింది కానీ అనూహ్యంగా రీతూ బయటకు వచ్చింది. ఈ వారం వీకెండ్ లో సుమన్ ఎలిమినేట్ అవ్వడం పక్క.. మిడ్ వీక్ ఎలిమినేషన్ సంజన అవుతుందని అందరు అనుకుంటున్నారు. ఈ ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ నిర్ణయంపై ఆధారపడుతుంది. ఇప్పటివరకు ఏ సీజన్ లో అయిన  మిడ్ వీక్ ఎలిమినేషన్ లో హౌస్ మేట్స్ అందరిని పిలిచి టాప్-5 కి అర్హత లేని వారిని డిసైడ్ అయి చెప్పమంటాడు బిగ్ బాస్. అలా అందరు ఒకరి పేరు చెప్పాలి. ఇప్పటికే హౌస్ లో జీరో పాయింట్స్ తో సంజన ఉంది. హౌస్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే అందరికంటే లీస్ట్ సుమన్.. కానీ సంజన, సుమన్ ఇద్దరు ఉంటే అందరు సంజనని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో తను మిడ్ వీక్ బయటకు వచ్చేస్తుంది. టాప్-5 భరణి కన్ఫమ్. టాప్-5 లో పెట్టేందుకే భరణికి బూస్ట్ ఇచ్చి మరి రీఎంట్రీ ఇచ్చారు. అలాంటిది భరణి బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. కళ్యాణ్, తనూజ,ఇమ్మాన్యుయేల్, డీమాన్, భరణి టాప్-5 కంటెస్టెంట్స్ అని అందరికి తెలిసిందే. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో సుమన్ , సంజన కాకుండా డీమాన్ గానీ భరణి గానీ బయటకు వస్తే బిగ్ బాస్ సీజన్-9 కి ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్ అవుతుంది. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu Tanuja: ఓటు అప్పీల్  చేసిన తనూజ.... మేడమ్ సర్ మేడమ్ అంతే!

బిగ్ బాస్ సీజన్-9 పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక పద్నాలుగో వారం హౌస్ లో టాస్క్ లు కొనసాగుతున్నాయి. నామినేషన్ నుండి సేవ్ అవ్వాలంటే టాస్క్ లో పోటీపడుతూ స్కోర్ బోర్డు పై పాయింట్స్ ఎక్కువ కలిగి ఉండాలి. అలా టాస్క్ అనంతరం పాయింట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళకి బిగ్ బాస్ ఓటు అప్పీల్ ఛాన్స్ కలిపించాడు. కాసేపటికి బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. అందులో తనూజ, భరణి, సంజన, సుమన్ నలుగురు పోటీ చేశారు. ఇమ్మాన్యుయల్, డీమాన్ సంఛాలక్ గా ఉన్నారు. ఈ టాస్క్ త్వరగా పూర్తి చేసిన వారికి ఎక్కువ పాయింట్స్ వస్తాయని బిగ్ బాస్ చెప్పాడు. మొదటగా సంజన టాస్క్ పూర్తి చేసినా కొన్ని మిస్టేక్స్ చేసింది.. అలాగే తనూజ కూడా మిస్టేక్ చేసింది. ఆ తర్వాత ప్రాపర్ గా భరణి చేస్తాడు. ఈ గేమ్ ముగిసే సమయానికి  భరణికి 100 పాయింట్లు, తనూజకి 80 పాయింట్లు, సంజనకి 60 పాయింట్లు, సుమన్ కి 40 పాయింట్లు వస్తాయి. ఇక లీడర్ బోర్డు లో భరణి, తనూజ టాప్ లో ఉంటారు. వాళ్ళిద్దరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. వాళ్ళు గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ బయట నుండి వచ్చిన  ఆడియన్స్ ఉంటారు. భరణి గురించి పాజిటివ్ గా మాట్లాడుతారు.  మీరు ఎవరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇవ్వాలని  అనుకుంటున్నారని బిగ్ బాస్ అడుగగా ఎక్కువ తనూజకి సపోర్ట్ చేస్తారు. దాంతో భరణి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత తనూజ ఓటు అప్పీల్ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆడియన్స్ తనూజని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఒకతను మీకు ఫ్యాన్ బాయ్ వస్తాడు. మేడం సర్ మేడం అంతే అని చెప్పగానే తనూజ మురిసిపోతుంది. ఈ సారి లేడీ విన్నర్ గా చూడాలి అనుకుంటున్నామని మరొకరు చెప్పగానే.. తప్పకుండా అని తనూజ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Sanjana vs Demon Pavan: డీమాన్ పై విరుచుకుపడ్డ సంజన.. ఫుల్ ఫైర్!

బిగ్ బాస్ పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక తుదిదశకి చేరుకుంది. ఈ వారం బిగ్ బాస్ టాస్క్ లు పెడుతూ ఎక్కువ పాయింట్స్ పొందినవారికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇచ్చాడు. అలా  మొదటగా ఇమ్మాన్యుయేల్ కీ ఛాన్స్ వచ్చింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్ కోసం ఇద్దరు ఆటనుండి తప్పుకోవాలని బిగ్ బాస్ చెప్పగా అందరు డిస్కషన్ చేసుకుంటారు. స్కోర్ బోర్డులో ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ టాప్ లో ఉంటారు. లీస్ట్ లో సుమన్, సంజన ఉంటారు. టాప్ లో ఉన్నవాళ్ళని తియ్యాలని భరణి, సంజన, సుమన్ శెట్టి, తనూజ డిసైడ్ అవుతారు. మేమ్ టాప్ పొజిషన్ కి రావడానికి చాలా కష్టపడ్డామని డీమాన్ రిక్వెస్ట్ చేస్తాడు. లీస్ట్ లో ఉన్నవాళ్ళని తియ్యాలని డిమాన్ చెప్తాడు. ఎందుకు ప్రతీసారీ నన్నే తీస్తారు. ఈ వీక్ లో రెండుసార్లు పక్కన పెట్టారు. ఒక మనిషిని ఎన్నిసార్లు చంపుతారంటూ డీమాన్ పై సంజన చెలరేగిపోయింది. సంజన గొడవకి దిగుతుంది. నేను అనేది మీకు అర్థం అవ్వడం లేదు.. అలా చేసుకుంది మీరేనని డీమాన్ అంటాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ చాలా కష్టపడ్డాడని తనూజతో డీమాన్ అనగానే అంటే మేమ్ వట్టిగనే కూర్చొని ఇక్కడికి వచ్చామా ఏంటని తనూజ ఫైర్ అవుతుంది. ఇక ఆ తర్వాత భరణి, సంజన,తనూజ, సుమన్ వీళ్ళు టాప్ లో ఉన్న ఇమ్మాన్యుయేల్, డీమాన్ ని టాస్క్ నుండి తియ్యాలని చెప్తారు. ఇమ్మాన్యుయేల్, డీమాన్ లీస్ట్ లో ఉన్నవాళ్ళని తియ్యాలని చెప్తారు. కళ్యాణ్ కూడా టాప్ లో ఉన్న వాళ్ళని తియ్యాలని చెప్తాడు. దాంతో టాప్ లో ఉన్న ఇమ్మాన్యుయేల్, డీమాన్ ని టాస్క్ నుండి తీసేస్తారు.