That is fake audio: Chandrababu

అది ఫేక్ ఆడియో: చంద్రబాబు 

గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన వైకాపా నేత వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి నాటకం ఆడి అట్టర్ ప్లాప్ అయ్యారు. సరిగ్గా పోలింగ్  కు ఒక రోజు ముందు  ఫేక్ ఆడియోలను రిలీజ్ చేస్తూ అధికారంలో రావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఒటమి కన్ఫర్మ్ కావడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.  తన పేరిట సోషల్ మీడియాలో ఓ ఆడియో సందేశం వైరల్ అవుతుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. పథకాల్లేవ్ ఏం లేవ్... మా ఆస్తులన్నీ అమరావతిలోనే ఉన్నాయి... త్వరలోనే మీకు లాభాలు చూపిస్తా... అంటూ తన వాయిస్ తో ఈ మెసేజ్ రూపొందించారని చంద్రబాబు మండిపడ్డారు.  "ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రావడం లేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

jagan will lost elections

ప్రజలు జగన్‌కి చాలా వ్యతిరేకంగా వున్నారు: ప్రశాంత్ కిషోర్

ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఘోర పరాజయాన్ని చవిచూస్తాడని జర్నలిస్టు రవిప్రకాష్‌తో జరిపిన ముఖాముఖిలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. తాను చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చేశానని, ప్రజలు తనకు ఓటు వేస్తారని జగన్ నమ్ముతున్నారని, జగన్ ఏమైనా తన సొంత ఆస్తిని ఏమైనా ప్రజలకు ఇచ్చారా అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పప్పులు బెల్లాలు పంచినట్టు డబ్బు పంచాడే తప్ప, తన జేబులోంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, ప్రజలను అప్పులపాలు చేసిన జగన్ ఓట్లు వస్తాయని భ్రమలో వున్నారని పీకే అన్నారు. వెల్ఫేర్ చేశాం కాబట్టి ఎలక్షన్లలో గెలుస్తాం అనేది జగన్‌కి వున్న ఒక పెద్ద భ్రమ అని, ఈ ఎన్నికలలో అది వదిలిపోతుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌ని చాలా వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో రేపు చూపించబోతున్నారు. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా వున్నారు. అయితే చంద్రబాబు మీద అనుకూలత కంటే జగన్ మీద వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా వుంది. ఆ వ్యతిరేకతతోనే ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.  (సమాప్తం)

Busy at distribution centers

పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి...డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద సందడి 

ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25లోకసభ ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తుండగా తెలంగాణలో మాత్రం కేవలం 17  లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈవీఎంలు, తదితర ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసేందుకు నిర్దేశించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి తమకు కేటాయించిన ఈవీఎంలు, తదితర సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు పయనమవుతున్నారు. కాగా, సెక్టార్ ల వారీగా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. పోలింగ్ వేళ అనుసరించాల్సిన విధివిధానాలను అధికారులు సిబ్బందికి వివరించారు. ఇప్పటికే వారికి ఆయా అంశాలపై శిక్షణ ఇచ్చారు.

Thousands of buses to Siddam Sabhas..not only for polling

సిద్దం సభలకు వేల సంఖ్యలో బస్సులు..పోలింగ్ కు  మాత్రం జాడలేవు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు.   హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని ఏపీకి చెందిన వారంతా ఓటేసేందుకు తప్పకుండా సొంతూళ్లకు వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ డీజీపీ ర్యాంక్‌ అధికారి అయిన ఆర్టీసీ ఎండీకి మాత్రం ఇది ఎందుకు తెలియలేదనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు సీఎం జగన్‌ నిర్వహించిన ప్రతి 'సిద్ధం' సభకు వెయ్యి నుంచి 3 వేల చొప్పున బస్సులు కేటాయించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజలకు మాత్రం సరైన ఏర్పాట్లు చేయలేదు.   ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతి ఒక్కరూ సొంతూళ్లకు ప్రయాణమవుతారని తెలిసినా ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయలేకపోయారు. సోమవారం పోలింగ్‌ జరగనుండగా, శని, ఆదివారాలు వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో రద్దీ అధికంగా ఉంటుందనే అంచనా వేయలేకపోయారు.  హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా శుక్ర, శనివారాల్లో రోజుకు 300 చొప్పున మాత్రమే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం 205 బస్సులే సిద్ధం చేశారు. దీంతో అవి ఏమాత్రం సరిపోవడంలేదు. హైదరాబాద్‌ నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు ఎలాగోలా రైళ్లు, బస్సుల్లో విజయవాడకు చేరుకున్నా.. అక్కడి నుంచి చుట్టుపక్కల మండలాలు, ఇతర జిల్లాల్లోని సొంత ఊరికి వెళ్లేందుకు బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఈ నెల 8 నుంచి ఆదివారం వరకు హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు 1,048 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని ఆర్టీసీ పేర్కొంది. వీటన్నింటిలో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో ఓటేయడానికి పొరుగు రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వస్తున్న వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్లను, ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు.  ఈసీని ఆశ్రయించిన పవన్ కళ్యాణ్  ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లినా బాధ్యతతో ఓటేయడానికి వస్తున్న వారికి బస్సులు ఏర్పాటు చేయాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర సిటీల నుంచి జనం పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని చెప్పారు. అయితే, పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకున్న జనాలకు సరిపడా బస్సులు లేవని తెలిపారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న వారి కోసం అదనంగా బస్సులు తిప్పాలని కోరారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను కోరారు. ఈమేరకు జనసేన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.వాస్తవానికి ఓటేయడానికి పెద్ద సంఖ్యలో జనం వస్తారనే విషయం ముందుగానే అంచనా వేసి, అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే, ప్రస్తుతం అలాంటి చర్యలు ఏవీ చేపట్టినట్లు కనిపించడంలేదన్నారు. బాధ్యతను మరవకుండా ఓటేయడానికి వస్తున్న వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయడం ఆర్టీసీ అధికారుల కనీస బాధ్యత అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సభలకు ఆగమేఘాలమీద బస్సులను ఏర్పాటు చేసే అధికారులకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న జనాల సమస్యలు కనిపించడంలేదా అని నిలదీశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఈ లేఖలో కోరారు.

jagan will lost elections

 బొత్స ఒక బేవకూఫ్.. ఇలాంటి వాళ్ళవల్లే జగన్ నాశనమయ్యాడు- పీకే

తాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపానని, చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకున్నానని, అందుకే జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతూ వుండటం పట్ల ప్రశాంత్ కిషోర్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘‘చంద్రబాబుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను తమిళనాడు ఎన్నికల తర్వాత ‘ఐ ప్యాక్‌’తో సంబంధాలు తెంచుకున్నాను.  ఏ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా లేను. నేను చంద్రబాబు కోసం పనిచేస్తున్నట్టయితే హైదరాబాద్‌లో ఎందుకు వుంటాను... ఆంధ్రప్రదేశ్‌కే వెళ్తాను. ఏపీలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా నాకు సంబంధం లేదు.. చంద్రబాబు దగ్గర నేను డబ్బు తీసుకున్నానని అంటూ బొత్స సత్యనారాయణ నన్ను అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. నేను డబ్బు తీసుకుని పొగిడే వాడిని అయితే బొత్స కూడా నాకు డబ్బు పంపిస్తే ఆయన్ని కూడా పొగుడుతాను కదా.. బొత్స మంత్రి పదవిలో అక్రమంగా బాగానే సంపాదించాడు కదా.. నేను డబ్బు తీసుకుని జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అనుకుందాం.. మరి జగన్ తల్లి విజయమ్మ ఎందుకు జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతోంది? జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడమని ఆమెకి ఎవరు డబ్బు ఇచ్చారు. జగన్ చెల్లెలు షర్మిలకు ఎవరు డబ్బు ఇచ్చారు? విజయమ్మ, షర్మిల ఇద్దరూ జగన్‌ని వ్యతిరేకించడం జగన్ పతనాన్ని సూచిస్తోంది. జగన్ జైల్లో వున్నప్పుడు షర్మిల ఎంతో శ్రమపడింది. అయినప్పటికీ ఆమెని తిడుతున్నారు. గత ఎన్నికలలో నేనూ జగన్ పార్టీ విజయానికి కృషి చేశాను. నన్నూ తిడుతున్నారు. బొత్సలాంటి బేవకూఫ్‌లు జగన్ పక్కన వుండటం వల్లే జగన్ ఇలా నాశనం అయిపోయాడు. గతంలో జగన్‌కి మద్దతుగా నిలిచిన వాళ్ళని కృతజ్ఞత లేకుండా నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఇదే వాళ్ళ కేరక్టర్లు ఏమిటో చెబుతూ వుంటుంది. బొత్స ఏ పార్టీలో వుంటే ఆ పార్టీని మోసం చేశాడు. 2019లో వైసీపీ గెలవకపోతే బొత్స ఎక్కడ వుండేవాడు? ఈ ఎన్నికల తర్వాత బొత్స అండ్ ఆయన వైఫ్ ఇద్దరూ తెలుగుదేశం వైపు నడుస్తారు చూస్తూ వుండండి. వీళ్ళు కృతజ్ఞత లేని మనుషులు. కృతఘ్నత కంటే పెద్ద పాపం మరొకటి లేదని భగవద్గీతలో చెప్పారు. నా విషయంలో కావచ్చు, విజయమ్మ విషయంలో కావచ్చు, షర్మిల విషయంలో కావచ్చు, జనం విషయంలో కావచ్చు... ఎవరి విషయంలోనూ కృతజ్ఞత అనేదే అనేదే లేకుండా వ్యవహరిస్తున్న జగన్ అండ్ టీమ్ ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తారు. చూస్తూ వుండండి..ఈ ఎన్నికల తర్వాత జగన్ 2019 ముందు నాటి పరిస్థితికి వెళ్ళిపోతాడు’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Prostitution center at junior artists house

జూనియర్‌ ఆర్టిస్టు ఇంట్లోనే దందా! 14 ఏళ్ళ కూతుర్ని కూడా విడిచిపెట్ట‌లేదు!

‘ఆ పాడుపని’ నేను చేయలేనమ్మా అని వేడుకున్నా చిత్రహింసలు పెట్టేద‌ట‌. ఏడుస్తున్నా కనికరించకుండా బాలికతో వ్యభిచారం చేయించింది.  ఆ అమ్మ‌త‌ల్లి చెరలో చిన్నారి ఏకంగా రెండేళ్లు నరకం చూసింది. జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తూ, జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ మ‌హిళ త‌న ఇంటినే వ్య‌భిచార కొంప‌గా మార్చివేసింది. త‌న వ్యాపారం కోసం ఆమె 14 ఏళ్ళ క్రితంమే ఓ ఆడ‌బిడ్డ‌ను తెచ్చుకుని పెంచుకుంది.  బడికీ పంపింది. అయితే పెంపుడు కూతురు అనే సంగతి బాలికకు చెప్పకపోవడంతో ఆమే తన తల్లి అని, చిన్నారి భావిస్తూ వచ్చింది.  కన్నతల్లి అయివుండి తన పట్ల ఎందుకింత నిర్దయగా వ్యవహరిస్తోందనే విషయం అర్థంకాని ఆ బాధిత బాలికకు తాజాగా ఆమె తన తల్లే కాదనే విషయం తెలిసింది.  అయితే ఆమె ఇంటికి వచ్చే విటుల్లో కొందరు బాలికపై కన్నేసి, ఎక్కువ డబ్బులిస్తామని మహిళకు ఆఫర్‌ చేశారు. దీంతో బాలికనూ పాడుపనిలోకి దించాలని భావించి, రెండేళ్ల క్రితమే బడి మాన్పించింది. అప్పటి నుంచి చిన్నారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. ఇంట్లోంచి బాలిక కేకలను విని స్థానికులు, పోలీసులకు సమాచారమిచ్చారు. వెస్ట్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ జంగయ్య తన బృందంతో ఆ మహిళ ఇంటిపై దాడిచేశారు. బాలిక చేతులు, కాళ్లపై అట్లకాడతో కాల్చిన గాయాలతో పాటు మెడ, పెదవిపైనా గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు.  ఒంటినిండా గాయాలతో ఇంట్లో బందీగా ఉన్న బాలికను చూసి పోలీసులు చలించిపోయారు. వెంటనే బాధిత బాలికను వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.  వేలాది మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఇప్ప‌టికీ తేల‌న‌వి ఎన్నో వున్నాయి. ఆ అమ్మాయిలంతా ఇలా వ్య‌భిచార కేంద్రాల‌కు త‌ర‌లించ‌బ‌డుతున్నారు. మైన‌ర్ బాలిక‌ల్ని బ‌ల‌వంతంగా వ్య‌భిచార కూపంలోకి దించి, వారితో పెద్ద ఎత్తున వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న ముఠాలు దేశంలో పెరిగిపోతున్నాయి.  మ‌హిళ‌ల్ని భోగ వ‌స్తువుగా భావించి, వారి శ‌రీరాల‌తో వ్యాపారం చేసే వాళ్ల‌కు ఈ స‌మాజంలో కొద‌వ‌లేదు. అలాంటి వారి ప‌ట్ల ప్ర‌భుత్వాలు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

jagan will lost elections

జనానికి జగన్ దూరమైపోయారు: ప్రశాంత్ కిషోర్

‘‘వాలంటరీ వ్యవస్థను నేను సూచించలేదు. ‘నవరత్నాలు’ అనే వాటిని మాత్రం నేను సూచించాను. ఎన్నికైన తర్వాత ‘నవరత్నాలు’ తప్పనిసరిగా అమలు చేయండి అని జగన్‌కి చెప్పాను. అంతే తప్ప ఈ నవరత్నాలు మాత్రమే చేసి మిగతా అన్నీ మర్చిపొమ్మని మాత్రం చెప్పలేదు. 2019లో గెలిచింది జగన్. ప్రభుత్వం ఆయనది. కేబినెట్ ఆయనది. పవర్ ఆయన దగ్గర వుంది.. మేం సూచించిన నవరత్నాలు కాకుండా ప్రజలకు ఇంకేం కావాలన్నది ఆయన ఆలోచించి అమలు చేయాలి. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది... రాష్ట్రంలోని ప్రజల ఇంకా ఏమేం కోరుకుంటున్నారు... అనేది ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆలోచించాలి. కానీ ఆయన అలాంటి ఆలోచన ఏదీ చేసినట్టు కనిపించలేదు’’ అని జర్నలిస్టు రవిప్రకాష్‌తో జరిగిన ముఖాముఖితో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. జగన్ చేసిన చాలా పెద్ద పొరపాటు ప్రజల్ని అస్సలు కలవకపోవడం. ప్రభుత్వంలో వున్న పెద్దపెద్ద నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జగన్‌ని కలవాలంటే సాధ్యం కాకుండా పోయింది. ఇక ప్రజలు కలిసే అవకాశం ఎక్కడ వుంటుంది? అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2019లో జగన్‌ని గెలిపించినందుకు నన్ను ప్రజల్లో చాలామంది దోషిగా చూస్తున్నారు. జగన్‌ని ఎలా గెలిపించాలన్న వ్యూహాలు అయితే నేను వేశాను గానీ, ఓట్లు వేసింది మాత్రం ప్రజలేకదా.. జగన్‌ని గెలిపించిన విషయంలో నేను దోషి అయితే, జగన్‌కి ఓటు వేసిన ప్రజలు కూడా దోషులే కదా.. వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో చేసిన తప్పును 2024 ఎన్నికలలో సరిదిద్దుకోవడానికి సిద్ధంగా వున్నారు. ప్రజలకి దూరమైనపోయిన నాయకులకు, ప్రజలను తేలిగ్గా తీసుకునే నాయకులకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారు. ఈసారి ఎన్నికలలో ప్రజల నుంచి జగన్ గుణపాఠం నేర్చుకోబోతున్నారు.. జగన్ భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

jagan will lost elections

వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం: ప్రశాంత్ కిషోర్

జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో అద్భుతాలు సృష్టించింది అని చెప్పుకుంటూ వుంటారు. తెలుగు మీడియం లేకుండా మొత్తం ఇంగ్లీషు మీడియం చేయడమే ఆ అద్భుతం. ప్రభుత్వం మీడియం మార్చిందే తప్ప, స్కూళ్ళలో పరిస్థితులను మార్చలేదు. ఇంగ్లీషు మీడియం చేసినందువల్ల చదువు వచ్చేస్తుందా? అని ప్రశాంత్ కిషోర్  ‘వాలంటీర్లు’ అనే పేరుతో జగన్ వేలాదిమందిని ఒక సైన్యం లాగా క్రియేట్ చేశాడు. దీని ద్వారా రాజ్యాంగాన్ని, పంచాయితీరాజ్ చట్టాన్ని పక్కన పెట్టేశాడు. ఈ ‘వాలంటరీ వ్యవస్థ’ ఐడియా జగన్‌కి నేను ఇచ్చానని చాలామంది అనుకుంటూ వున్నారు. కానీ, ఈ పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ పార్టీ అయినా ఎన్నికలలో గెలవటానికి ఏం చేయాలన్న వ్యూహాలు మాత్రమే నేను ఇస్తాను. ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎంతమాత్రం జోక్యం చేసుకోను. చివరికి ఆ పార్టీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా నేను రాను. జగన్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా నేను రాలేదు. పంచాయితీరాజ్ వ్యవస్థ అనేది ఎంతో ఆలోచించి రూపొందించిన వ్యవస్థ. అధికార వికేంద్రీకరణకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఈ వ్యవస్థలో వున్న ఉద్యోగులు అధికార వికేంద్రీకరణకు ఉపయోగపడతారు. కానీ, జగన్ మాత్రం పంచాయితీరాజ్ వ్యవస్థని పక్కన పెట్టేసి, రెండు లక్షల మంది ఉద్యోగులతో వాలంటీర్ల పేరుతో కొత్త వ్యవస్థని తీసుకొచ్చారు. తన పార్టీ కార్యకర్తలను తన ప్రభుత్వంలో భాగస్వాములను చేసేశారు. అన్ని పథకాలు, డబ్బు వాళ్ళ చేతే ప్రజల దగ్గరకి తీసుకెళ్ళారు. పంచాయితీరాజ్ వ్యవస్థ ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ఆ వ్యవస్థలోని ఉద్యోగులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ వాలంటీర్ల వ్యవస్థని జగన్ పెంచి పోషించారు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

jagan will lost elections

జగన్ ప్రజలను యాచకులని చేశాడు: ప్రశాంత్ కిషోర్

ఒక మేస్త్రీ పని చేసుకుని తన పొట్ట గడవడానికి కష్టపడి పనిచేసి నెలకు 20 వేల రూపాయలు సంపాదించుకుంటాడని అనుకుందాం. ఆ మేస్త్రికి పని దొరక్కుండా పోతే సంపాదనే వుండదు. దీనికి బదులుగా ప్రభుత్వం ఏదో ఒక స్కీమ్ పేరు చెప్పి నెలనెలా ఆరు వేల రూపాయలు అతనికి ట్రాన్స్.ఫర్ చేస్తూ వుంటుంది. ఆ మేస్త్రికి అది అవసరమా? తాను సంపాదించుకునే 20 వేలు కావాలని అనుకుంటాడా.. లేక ప్రభుత్వం దాని చేసే ఆరు వేలు కావాలని అనుకుంటాడా? కానీ, జగన్ చేసింది ఇదే. ఉపాధి, ఉద్యోగాలు లేకుండా చేశాడు. నేను నెల నెలా డబ్బులు ఇస్తాను.. సరిపెట్టుకోండి అన్నాడు. కష్టించి పనిచేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను యాచకులుగా మార్చేశాడు.  జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో అద్భుతాలు సృష్టించింది అని చెప్పుకుంటూ వుంటారు. తెలుగు మీడియం లేకుండా మొత్తం ఇంగ్లీషు మీడియం చేయడమే ఆ అద్భుతం. ప్రభుత్వం మీడియం మార్చిందే తప్ప, స్కూళ్ళలో పరిస్థితులను మార్చలేదు. ఇంగ్లీషు మీడియం చేసినందువల్ల చదువు వచ్చేస్తుందా? 

jagan will lost elections

జూన్ 4న జగన్ భారీ షాక్ తింటారు: ప్రశాంత్ కిషోర్

జగన్ లీడర్ కాదు.. ప్రొవైడర్ అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. లీడర్ భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. ప్రొవైడర్ డబ్బులు ఇచ్చి పబ్బం గడుపుకుందామని అనుకుంటారు. జగన్ నంబర్ వన్ ప్రొవైడర్ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. పాతరోజుల్లో మహారాజులు ఎలా  తమను తాము ఎలా భావించేవారో జగన్ ఈ ప్రజాస్వామ్యంలో కూడా అలాగే తనను తాను మహారాజులా భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏమి కావాలో వారికి అది ఇవ్వాలి. ఉద్యోగాలు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆర్థిక సాయం కావలసిన వారికి సాయం చేయాలి.. ఇలా రకరకాలుగా పరిపాలన వుంటుంది. అంతే తప్ప మహారాజులు దానం చేసినట్టు చేయడం కుదరదు. అన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ, జగన్మోహన్‌రెడ్డి అలాకాదు.. ఒకటే దారి.. డబ్బు పంచడం.. పంచుతూనే వుండటం. జగన్ ఇలా అప్పులు తెచ్చి మరీ దానాలు చేస్తూ మహారాజులా భావించుకున్నారు అని పీకే విశ్లేషించారు. నెలనెలా డబ్బు పంచుతూ వుంటా.. రాష్ట్రం అప్పుల పాలైపోయినా పర్లేదు. అవినీతి అక్రమాలు పెరిగిపోయినా పర్లేదు... మిగతా విషయాలు నేను పట్టించుకోను అన్నట్టు తయారయ్యారు. ఆయన ప్రజల విషయంలో ఎలా వ్యవహరించారంటే, నెలనెలా నీకు ఐదు వేలు ఇస్తా.. నన్నేమీ ప్రశ్నించకు అన్నట్టుగా వ్యవహరించారు. అందుకే, ఈ జూన్ 4న జగన్మోహన్‌రెడ్డి ప్రజల చేతిలో పెద్ద షాక్ తినబోతున్నారు. జగన్ ప్రజల నుంచి గుణపాఠం నేర్చుకోబోతున్నారు. ఆ గుణపాఠం కూడా అత్యంత దారుణంగా వుండబోతోంది అని ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పారు.

harrament to vizag airport restaurent owner

కోడి క‌త్తి డ్రామా.. సంబంధం లేని రెస్టారెంట్ యాజ‌మాన్యంపై జ‌గ‌న్ బ్యాచ్ వేదింపులు

కోడి క‌త్తి డ్రామా ఘ‌ట‌న‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశ‌వ్యాప్తంగా ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రికి సుప‌రిచిత‌మే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో సీఎం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఈ ఘ‌ట‌న  కూడా ఒక‌టి. కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌ల‌తో జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగి వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఏపీ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వ‌చ్చారు. కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తోనే ఐదేళ్లు వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న సాగింది. విప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం.. వారిని జైల్లో పెట్టి పోలీసుల‌తో కొట్టించ‌డం ఇలా ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌పై గ‌ళ‌మెత్తిన ప్ర‌తి ఒక్క‌రిని జ‌గ‌న్ టార్గెట్ చేసి చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌ను త‌ట్టుకోలేక ప‌లువురు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో వేధింపుల‌కు గురైన వారిలో విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్‌లో రెస్టారెంట్ ఓన‌ర్ కూడా ఒక‌రు. స‌రిగ్గా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్‌పై కోడిక‌త్తితో శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి దాడి చేశారు. శ్రీ‌నివాస్ ప‌ని చేస్తున్నది.. విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో ఉన్న రెస్టారెంట్ లోనే. ఈ ఘ‌ట‌న‌లో అభ‌శుభం తెలియ‌ని రెస్టారెంట్ ఓన‌ర్ ని జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అనేక ఇబ్బందుల‌కు గురి చేశారు. తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో వారికి ఎదురైన ఇబ్బందుల‌ను గుర్తుచేసుకుంటూ రెస్టారెంట్ ఓన‌ర్ స‌తీమ‌ణి ఓ వీడియోను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ప్ర‌జ‌లు.. అయ్య‌బాబోయ్‌.. జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ వారిని ఇంత‌గా ఇబ్బందుల‌కు గురి చేశారా అని ఆశ్య‌ర్య పోతున్నారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్ మీద విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడి కత్తితో శ్రీనివాస్ అను వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ ఎడమ భూజానికి గాయమైంది. జ‌గ‌న్ విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకున్న  సమయంలో విమానాశ్రయంలో ప్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పని చేస్తున్న జనుపెల్ల శ్రీనువాసరావు సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కత్తితో దాడి చేశారు. ఆ దాడి ఘ‌ట‌న‌కు ఎయిర్ పోర్టులో రెస్టారెంట్ యాజ‌మాన్యానికీ ఎలాంటి సంబంధం లేదు. కేవ‌లం జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల్లో సానుభూతి పెంచేందుకు మాత్ర‌మే తాను ఈ దాడికి పాల్ప‌డ్డాన‌ని నిందితుడు శ్రీ‌నివాసరావు బ‌హిరంగంగానే చెప్పారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రెస్టారెంట్ యాజ‌మాని తొట్టెంపూడి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుటుంబంపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చింది.  బిజినెస్ చేయ‌డం చేత‌కాక నాశ‌నం అయింది అంటే దానికి ఆ యాజ‌మానే బాధ్యుడు అవుతాడు. కానీ, ప‌ని గ‌ట్టుకొని ప్ర‌భుత్వ‌మే జ‌రుగుతున్న బిజినెస్ ను క్లోజ్ చేసి పైశాచిక ఆనందం పొందిన‌ప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థ‌కాని ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోతారు. అదే ప‌రిస్థితి విశాఖ విమానాశ్ర‌యంలో ఫ్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్ ఓన‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఎదురైంది. లేని పోని ఆరోప‌ణ‌లు చేసి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుటుంబంతోపాటు అందులో ప‌నిచేసే ఎంతో మందిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం రోడ్డుపాలు చేసింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుటుంబంపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి .. కోడిక‌త్తి ఘ‌ట‌న కంటే ఆయ‌న తెలుగుదేశం సానుభూతి ప‌రుడుగా ఉండ‌ట‌మే ప్ర‌ధాన కార‌ణం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ   ఎన్టీఆర్, చంద్ర‌బాబు అంటే హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు ఇష్టం.  దీనిని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జీర్ణించుకోలేక పోయారు. కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు ఎలాంటి సంబంధం లేద‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. నిందితుడు శ్రీ‌నివాస్‌రావు కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌కు కొద్ది నెల‌ల ముందునుంచే రెస్టారెంట్ లో స‌ర్వ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. పైగా జ‌గ‌న్ అంటే నిందితుడికి అభిమానం. కానీ, అభంశుభం తెలియ‌ని రెస్టారెంట్ యాజ‌మాన్యంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేవ‌లం తెలుగుదేశం సానుభూతి ప‌రుడు అనే కార‌ణంతో క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది.  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో  హ‌ర్ష‌వ‌ర్ద‌న్ స‌తీమ‌ణి తొట్టెంపూడి శ్రీ‌ధేవి సొంత పేప‌ర్ ఉంద‌ని త‌మ‌పై జ‌గ‌న్ మీడియా ఇష్ట‌మొచ్చిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిన్న‌బాబు చిరుతిండ్లు అని సాక్షి మీడియాలో పెద్ద‌పెద్ద హెడ్డింగ్‌లు పెట్టి లోకేశ్ మా రెస్టారెంట్లో చిరుతిండ్లు తింటే ఆ బిల్లులు మేము అప్ప‌ట్లో తెలుగుదేశం ప్ర‌భుత్వానికి స‌బ్మిట్ చేశామ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని   ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిజంగా చెప్పాలంటే మా రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న‌ది లోకేశ్ కాదు.. వైసీపీ మంత్రులు, నాయ‌కులేన‌ని ఆమె కుండబద్దలు కొట్టినట్లు ఆ వీడియోలో చెప్పారు. క‌లెక్ట‌రేట్ నుంచి మాకు రావాల్సిన బిల్లులు ఇప్ప‌టికీ ఇవ్వ‌కుండా ఆపేశార‌ని   చెప్పారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ లిక్క‌ర్ డాన్‌, ఎవ‌రికో బినామీ అని జ‌గ‌న్ మీడియా త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. నేను న‌మ్ముకున్న‌ బాబా సాక్షిగా  చెబుతున్నా అవన్నీ పచ్చి అబద్ధాలు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.    

jagan will lost elections

జగన్ దారుణంగా ఓడిపోతారు: ప్రశాంత్ కిషోర్

ఈసారి ఎన్నికలలో జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జర్నలిస్టు రవిప్రకాష్‌తో జరిగిన మాటామంతీలో ఆయన జగన్ ఓటమి ఖాయమని, ఆ ఓటమి కూడా అలా ఇలా ఉండబోదని, చాలా దారుణంగా వుంటుందని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో జగన్ భారీ విజయం సాధించడానికి సహకరించిన నేనే ఈ మాట చెబుతున్నానంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. జగన్‌తో నాకు ఎలాంటి శత్రుత్వం లేదని, ఆయన తనకు చాలా మంచి మిత్రుడని... మిత్రుడైనప్పటికీ, ఆయన ఘోరంగా ఓడిపోబోతున్నాడన్న వాస్తవం చెప్పడమే న్యాయమని పీకే అన్నారు.  2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత జగన్ తనను తాను ఒక మహారాజుగా భావిస్తూ వచ్చారని, అభివృద్ధి గురించి ఎంతమాత్రం పట్టించుకోకుండా కేవలం జనానికి నెల తిరిగేసరికి డబ్బులు ఇస్తూ వుంటే, వాళ్ళు తనను పదేపదే ఎన్నుకుంటూనే వుంటారనే భ్రమల్లో జగన్ వున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఏపీ జనానికి నెలనెలా డబ్బులు కావాలి తప్ప ఇంకేమీ అవసరం లేదని జగన్ బలంగా నమ్ముతున్నారని ఆయన అన్నారు.  నెలనెలా డబ్బులు అకౌంట్లో వేస్తే చాలు రోడ్లు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, భవిష్యత్తు అవసరం లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారినా పర్లేదు, అప్పులు పెరిగిపోయినా పర్లేదు, శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేదే లేని రాష్ట్రం అయిపోయినా పర్లేదు, ప్రజలకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోయినా పర్లేదు, ప్రజలకు ముఖ్యమంత్రి కనిపించకపోయినా పర్లేదు అనే ఉద్దేశంలోనే జగన్ వున్నారని అన్నారు.  ఆమధ్య జగన్ - తాను ఢిల్లీలో కలిశామని, అప్పుడు నువ్వు ఓడిపోబోతున్నావ్ జగన్, నువ్వు చేస్తున్న తప్పులు ఇవి అని ఆయనకు చెప్పాను. ఆయన నా మాటలు ఎంతమాత్రం పట్టించుకోలేదు అని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. (ఇంకావుంది)

The descendants of chief ministers who are trying their luck!

త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న ముఖ్యమంత్రుల వారసులు..!

ఏపీలోని 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌రుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప‌ది మంది మాజీ ముఖ్యమంత్రుల వార‌సులు పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రుల ఆరుగురు కుమారులు, ఇద్ద‌రు కుమార్తెలు, మ‌రో ఇద్ద‌రు బంధువులు  ఎన్నికల బరిలో  తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1) కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి  తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున‌ డోన్ నుంచి పోటీ చేస్తున్నారు.  మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.  గతంలో సూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2) బాలకృష్ణ టీడీపీ త‌ర‌ఫున‌ హిందూపురం నుంచి పోటీలో వున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు కుమారుడు బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యే రేసులో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచారు బాలయ్య. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు.  3)  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి,  టీడీపీ - జనసేన- బీజేపీ కూటమి నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో వున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి ఇప్పుడు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు.  4) నాదెండ్ల మనోహర్ జనసేన అభ్య‌ర్థిగా తెనాలి నుంచి పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్. తెనాలి నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్నారు. వైఎస్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు.  5) నేదురుమల్లి  రామ్ కుమార్ రెడ్డి వైసీపీ తరపున వెంకటగిరి నుంచి బరిలో ఉన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు.  ఈయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. 6) నారా లోకేశ్ టీడీపీ అభ్య‌ర్థిగా మంగళగిరి నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ప్రస్తుత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి ఓడిపోయిన లోకేశ్.. ఈసారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు. 7) ప్రస్తుత సీఎం వైఎస్ జ‌గ‌న్‌ పులివెందుల నుంచి పోటోలో వున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బరిలో వున్నారు. కడప ఎంపీగా 2 సార్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి, 2014లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షనాయకుడయ్యారు. 2019లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.  8) వై ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి క‌డ‌ప ఎంపిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ కుమార్తె. షర్మిల త‌న అదృష్టాన్ని ఈ ఎన్నిక‌ల్లో పరీక్షించుకుంటున్నారు.  తండ్రి మరణానంతరం వైసీపీలో షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ అరెస్ట్ అయిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని అంటూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అనంతరం కుటుంబ తగాదాల నేపథ్యంలో ఏపీని వదిలి తెలంగాణలో పార్టీ పెట్టారు. ఇటీవల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టారు. కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఆరుగురు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తుండగా,  మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇద్దరు కూడా ఈ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  వీరే కాకుండా మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాలకు చెందిన మరికొందరు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. 9) నల్లారి బ్రదర్స్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో వున్నారు.  మరోవైపు మాజీ ముఖ్య‌మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. 10) కాసు మహేశ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మహేశ్ రెడ్డిది కూడా మాజీ ముఖ్యమంత్రి కుటుంబమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి సోదరుడు వెంగళరెడ్డికి ఈయన మనవడు.  మహేశ్ రెడ్డి తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి నరసరావుపేట ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. టంగుటూరి అంజయ్య, రాజశేఖర రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో ఆయన పనిచేశారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

ap ceo mk meena on ink mark

వేళ్ళ మీద ఇంకు గుర్తు వేస్తే చర్యలు

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ విషయంలో ఎలర్ట్ చేశారు. ఓటర్ల ఇళ్ళకు వెళ్ళి, వాళ్ళకి డబ్బు ఇచ్చి, వారి వేళ్ళ మీద ఇంకు గుర్తు వేసి, వాళ్ళు ఓటింగ్‌కి వెళ్ళకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతోపాటు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ తరహా కుట్ర జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ ఇష్యూ మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా స్పందించారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళ మీద గుర్తు  వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేళ్ళ మీద వేసే సిరా ప్రభుత్వమే తయారు చేస్తుందని, ఆ ఇంక్ కేంద్ర ఎన్నికల సంఘం వద్దనే అందుబాటులో వుంటుందని ఆయన తెలిపారు. ఇతరుల దగ్గర చెరగని సిరా వుండదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఎవరైనా ఓటర్ల వేళ్ళ మీద ఇతర సిరాలతో గుర్తు వేస్తే, దానిని చట్టవ్యతిరేక చర్యగా భావించి కఠన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Betting in AP for IPL! Focus on Lokesh and Pawan?

ఐపీఎల్‌కు ధీటుగా ఏపీలో బెట్టింగ్! లోకేష్‌, ప‌వ‌న్‌పైనే ఫోకస్ ?

దేశవ్యాప్తంగా ఓ వైపు ఐపీఎల్ మరోవైపు ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇక ఐపీఎల్‌లో జోరుగా బెట్టింగ్ నడుస్తోండగా అటు ఏపీలోనూ అదే స్థాయిలో పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. దీంతో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. అభ్యర్థుల గెలుపు, ఓటమి అంచనాలు, ఎన్నికల్లో మెజారిటీపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికలు పూర్తిగా "జగన్ గెలుపు - జగన్ ఓటమి" పైనే జరుగుతున్నాయని ప్ర‌జ‌ల్లో చర్చ జ‌రుగుతోంది.  బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇదే అంశం ప్రధానంగా తీసుకోవడం ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్ధుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతోంది. సర్వేల ఆధారంగా పార్టీల గెలుపుపై పందేలు కాస్తున్న పరిస్థితి. ఒకటి రెండింతులు, మూడింతలుగా బెట్టింగ్ కాసేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. బుకీలు కూడా బెట్టింగ్స్‌కు సంబంధించిన దుకాణాలు తెరిచారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారే ఈ బెట్టింగ్ బిజినెస్ ఏపీలో అడ్డూ అదుపూ లేకుండా కొన‌సాగుతోంది. బెట్టింగ్ ఈ అంశాల‌పై జ‌రుగుతోంది.  1) వైసీపీ గెలుస్తుందా లేదా, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? 2) కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా?  మెజార్టీ ఎంత వ‌స్తుంది? 3) మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తారా? మెజార్టీ ఎంత వ‌స్తుంది? 4) పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారా? లేక అక్కడ వంగా గీత గెలుస్తారా? 5) హిందూపూర్‌లో బాల‌కృష్ణ‌కు మెజార్టీ ఎంత వ‌స్తుంది? 6) పులివెందులలో గ‌త ఎన్నిక‌ల‌కంటే మెజారిటీ తగ్గుతుందా? లేదా? 7) కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల విజయం సాధిస్తారా?  8) భీమిలిలో గంట శ్రీనివాసరావు గట్టెక్కుతాడా?  9) రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తాడా?  10)  వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? 11)  కూటమికి ఎన్ని సీట్లు వ‌స్తాయి? మంగ‌ళ‌గిరి, పుంగ‌నూరు, చంద్ర‌గిరి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, విజ‌యవాడ వెస్ట్‌, అన‌కాప‌ల్లి, ఫిఠాపురం,  రాజ‌మండ్రి, హిందూపూర్‌, కుప్పం, పీలేరుతో స‌హా ఏపీలోని 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బెట్టింగ్ జోరుగా న‌డుస్తోంది.  గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌నే  తేడా లేదు. పెద్ద ఎత్తున బెట్టింగ్ కాసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో బెట్టింగ్ కోట్ల రూపాయ‌ల్లోనే జరుగుతుందని చెప్పుకోవాలి. జగన్ మళ్లీ సీఎం అవుతాడా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. ఇక వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, జనసేనాని పవన్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా, ఈసారి పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గుతుందనే అంశం బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందెం కాస్తున్నారు. ఐపీఎల్‌కు ధీటుగా ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ జరుగుతుండటం విశేషం. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

రోడ్డు ప్రమాదం.. బయటపడిన ‘కట్టల’ పాములు!

విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారి మీద యాక్సిడెంట్ జరిగింది. కెమెకల్ పొడి బస్తాలను తీసుకెళ్తు్న్న టాటా ఏస్ వెహికల్‌ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దాంతో టాటా ఏస్ వెహికల్‌లో వున్న కెమికల్ పొడి బస్తాలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అలా  పడిపోయింది కెమికల్ బస్తాలే అయితే మేటర్ మామూలుగానే వుండేది. కానీ అందులోంచి బోలెడన్ని ‘కట్టల’ పాములు బయటపడ్డాయి. మొత్తం ఏడు కోట్ల రూపాయల డబ్బు కట్టలు కెమికల్ పొడి బస్తాల మధ్యలో నుంచి బయటపడ్డాయి. నోట్ల కట్టలను చక్కగా ప్లాస్లిక్ కవర్లలో చుట్టి, అట్టపెట్టెల్లో పెట్టి, కెమికల్ పొడి బస్తాల మధ్యలో పెట్టి రవాణా చేస్తున్నారు. టైమ్ బ్యాడ్ అయి యాక్సిడెంట్ జరిగింది. నోట్ల కట్టల పాములు బయటపడ్డాయి. పోలీసులు ఈ ఏడు కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. టాటా ఏస్ డ్రైవర్ని డబ్బు గురించి ప్రశ్నిస్తే మమ్మెమ్మే... బెబ్బెబ్బే అన్నాడు. ఇంకా లోతుగా విచారణ జరిపితే, ఒక వైసీపీ నాయకుడికి చెందిన సంస్థ నుంచి మరో వైసీపీ నాయకుడికి చెందిన సంస్థకు ఈ వాహనం రవాణా అవుతున్నట్టు తెలిసింది. అంటే, డబ్బు ఎవరిదో అర్థమైపోతుంది కదా..

ఏపీలో89శాతం పోలింగ్ జరిగే అవకాశం.. పరిశీలకుల అంచనా!

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (మే13) జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది.  4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ  ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందు కోసం రాష్ట్రంలో మొత్తం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు సగానికి పైగా పోలింగ్ కేంద్రాలలో   వెబ్‌ కాస్టింగ్ నిర్వహిస్తారు. సోమవారం(మే 13) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. నిర్ణీత సమయంలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.  వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయటంతో పాటు  తాగునీటి సదుపాయం, ఫస్ట్ ఎయిడ్  మెడికల్ కిట్లను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచనుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు   ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.   3 లక్షల 30వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం లక్షా 14వేల మంది పోలీసు సిబ్బందిని నియోగిస్తున్నది.  వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు.  ఇక రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2, 387 మంది పోటీలో ఉన్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీలూ ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా విపక్ష తెలుగుదేశం కూటమి, అధికార వైసీపీ మధ్యనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇలా ఉండగా మున్నెనడూ లేని విధంగా ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దేవ వ్యాప్తంగా అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే ఏపీ బయట ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వ్యాపకాలు చేసుకుంటున్న వారు ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకు తీరాలన్న పట్టుదల కనిపిస్తున్నారు. దీంతో దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచీ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు ఓటర్లు వస్తున్నారు. దీంతో ఈ సారి రాష్ట్రంలో ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది 89శాతం వరకూ ఉండొచ్చన్నది అంచనా.