Annamaya District

గుప్తనిధుల కోసం వినాయక విగ్రహం ధ్వంసం.. 13 మంది ముఠా అరెస్టు

  అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో  రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  బీ.వి.రమణ మాట్లాడుతూ గుప్తనిధుల కోసం వినాయకుడి విగ్రహం పగలు గొట్టిన ఘటనపై  పెనగలూరు పోలీస్ స్టేషన్  లో కేసు నమోదు అయ్యింద న్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే  సూచనలతో దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. పెనగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గతనెల 24  తేది తెల్లవారుజామున ఓబిలి స్కూలు ఆవరణలో దొంగతనం జరిగిన వినాయక విగ్రహం కేసులో వచ్చిన నమ్మకమైన సమాచారం అందిందన్నారు.  ఈ మేరకు, పెనగలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్, బి.రవి ప్రకాష్ రెడ్డి మరియు సిబ్బంది పెనగలూరు  పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు శనివారం అనుమానాస్పదంగా తిరుగుతున్న 13 మందిని విచారించారించారని తెలిపారు .వారు గత నెలలో ఓబిలి స్కూలు ఆవరణలో వినాయక విగ్రహ దొంగతనం గురించి తెలుపడం జరిగిందన్నారు. నందలూరు మండలం మదనగోపాలపురం కు చెందిన చుక్కా రవి అను వ్యక్తి గుప్త నిధుల కోసం చిట్వేలి కి చెందిన కొంత మంది కనిశెట్టి వెంకటసుబ్బయ్య, చిట్వేలి సుబ్బరాయుడు, ఆర్కాటు భాస్కర్  మరియు ఈటిమార్పురం నకు చెందిన డొంకా చంద్ర, బైర్రాజు సుధాకర్ రాజు లతో మాట్లాడుకొని గుప్త నిధులు వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో చుక్క రవి వియ్యంకుడు అయిన మనుబోలు కు చెందిన సురేష్ ద్వారా నెల్లూరు లో రాపూరు లక్ష్మమ్మ @ రాపూరు లక్ష్మి, మునుసామి వేలురెడ్డి @పూజారి, గోకిల రమేష్ @ కోకిల రమేష్, ముసునూరు పుల్లారెడ్డి మరియు క్షుద్ర పూజలు చేసి గుప్త నిధులు వెలికి తీయడం కోసం వారిని మాట్లాడుకొన్నారని తెలిపారు.  అదేవిధంగా గుప్త నిధులు పైన ఆసక్తి ఉన్న పెనగలూరు కు చెందిన దాసరి వెంకట నరసమ్మ ,సుధాకర్ రాజు, చంద్ర వారి దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు సుకదేబ్ రైతో, కలక్వాడ్ శ్యాం లతో పాటుగా అందరూ కలిసి గత నెల 23 తేది రాత్రి  ముఠాగా ఏర్పడి ఓబిలి స్కూలు వద్దకు చేరికున్నారని, వేకువ జామున సదరు వినాయక విగ్రహాన్ని ఈడ్చుకుంటూ ఒదేటివారిపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో ఒక ట్రాక్టర్ లో వేసి  అక్కడ నుండి ఈటిమార్పురం చెరువు దగ్గరకు వెళ్లి, అక్కడ విగ్రహాన్ని దింపి, గుప్త నిధుల కోసం పూజలు చేసి సమ్మెట తో విరగకొట్టగా,  విగ్రహంలో ఎటువంటి నిధులు లేకపోవడంతో  విగ్రహాన్ని అక్కడే ఉన్న కుంట లో పడి వేశారన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన వాహనాలు ఒక ట్రాక్టర్, ఒక ఇన్నోవా కారు, నాలుగు మోటార్ సైకిల్ లు, ఒక సమ్మెట లను, వస్తువులను సీజ్ చేయడం అయినదని. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా ముద్దాయిలను గుర్తించడం అయినదని తెలిపారు. ఈ  కేసులో ప్రతిభ  కనబరిచిన పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ శవి.విద్యాసాగర్ నాయుడు  అభినందించారు  

AIIMS

ఎయిమ్స్‌లో 13 మంది విద్యార్థులపై చర్యలు

  గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి చెప్పారు. ఎయిమ్స్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ర్యాగింగ్ కు పాల్పడినవారిని ఆరు నెలల నుంచి ఏడాదిన్నరపాటు సస్పెండ్ చేయడంతోపాటు ఒక్కొక్కరికి రూ.25వేలు జరిమానా కూడా విధించనట్లు తెలిపారు.   ఆ విద్యార్థులను వసతి గృహం నుంచి పూర్తిగా బహిష్కరించినట్లు చెప్పారు. సస్పెన్షన్ కాలం పూర్తి అయిన తర్వాత కూడా వారు హాస్టల్ లో ఉండే అవకాశం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఈ ర్యాగింగ్ పై ఇతరత్రా ఆరోపణలను ఆయన ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి పేర్లు బయటకు చెప్పడం లేదన్నారు.  

Visakhapatnam

విశాఖలో కోకైన్ కలకలం

  విశాఖలో కోకైన్ కలకలం రేపింది ఓ ఆఫ్రికన్ వద్ద 25 గ్రాముల కొకై న్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఖాళీ ప్రదేశంలో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు థామస్ జియోన్ అనే ఆఫ్రికన్ దేశస్థుడు ఉన్నారు. చేకూరి అక్షయ్ ఏలియాస్ గున్న అనే వ్యక్తితో కలిసి థామస్ జియోన్ ను పోలీసులు విచారించారు వీరి వద్ద 25 గ్రాముల  కోకైన్ లభించింది.  దీని విలువ మార్కెట్లో 15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా ఈ మాదక ద్రవ్యాన్ని  ఢిల్లీ నుంచి ఈ ఆఫ్రికన్ దేశస్థుడు తీసుకువచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది అయితే ఏ రకంగా భారత్ లోకి ఇది  వచ్చిందన్న కోణంలో విచారణ జరుగుతున్నట్టు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.

CM Chandrababu

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది : మంత్రి కొల్లు

  అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు రాష్ట్రంలో అసత్యపు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంద, అరాచకాలు, విధ్వంసాలు, కక్షసాధింపులతో ప్రజలను పీడించుకుతిన్నారు.  గుంటూరు జిల్లాలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున దాడులు చేయించి, టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించారు. దీనివల్ల అనేక మంది గ్రామాలు వదిలి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.  గతంలో టీడీపీ నాయకులపైన అచ్చెన్నాయుడు దగ్గర నుంచి నామీద, మా నాయకుడు చంద్రబాబునాయుడుని కూడా కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా?"  పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది వైసీపీయేనని, జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో గ్రామాల్లో కత్తులు తిప్పి అరాచకాలు చేసింది వైసీపీ నాయకులే. నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ నాయకుడు సర్పంచ్‌గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి, గ్రామాల్లో వ్యక్తిగత దాడులకు దిగి అక్రమ కేసులు పెట్టాడని, బాబూరావుపై దాడి చేస్తే దాదాపు నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలి వెళ్లిపోయిన వారు, ఇప్పుడు మళ్లీ వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత కక్షలకు పార్టీ రంగులు పులుముతున్నారు.  విజయవాడలో చెన్నుపాటి గాంధీ కన్ను పొగొట్టింది వైసీపీ ప్రభుత్వమే. దళిత సీఐ ఆనందరావును బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడంతో అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ నాయకుడు పెద్దారెడ్డి చెప్పిన పనులు చేయలేదని గుర్రయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, అలాగే పేదవాడైన అమర్‌నాథ్ ‌ను పెట్రోల్ పోసి తగలబెట్టింది వైసీపీ ప్రభుత్వమే. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి దాదాపు 80 మంది తెలుగుదేశం నాయకులను పెట్టనపెట్టుకుంది వైసీపీ దుర్మార్గమైన ప్రభుత్వమే.  జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక దళిత బిడ్డపై అత్యాచారం జరిగినా పట్టించుకోలేదని, దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగించారని, పోలీస్ స్టేషన్లలో కేకులు కట్ చేయించారు. ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ‌ను హింసించి, వేధించి అతని ప్రాణాలు పోవడానికి కారణం వైసీపీయే. ఇసుక దందాను ప్రశ్నిస్తే దాడులు చేసి శిరోముండనం చేసింది కూడా వైసీపీనే కదా. మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిపింది వైసీపీయేనని, పులివెందులలో అత్యాచారం చేసి హత్య చేస్తే, పరామర్శకు అనిత  వెళ్తే ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా?. అలాగే తెలుగుదేశం కార్యాలయంపై దాడులు చేయించి, దాడులు చేసిన వారికి ప్రమోషన్లు ఇప్పించారు. చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. కక్షపూరితమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి... తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎవరైతే దాడులు చేశారో వారికి ప్రమోషన్లు ఇచ్చి క్రిమనల్స్ ను ప్రోత్సహించింది వైసీపీయే. బూతులు మాట్లాడిన వారికి రక్షణ కల్పించారు. పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఒక జీవో తెచ్చింది కూడా వైసీపీయే. బియ్యం కొట్టేసినవాడు మాట్లాడుతున్నాడు.. దొంగపట్టాలు ఇచ్చినోడు మాట్లాడుతున్నాడు.. ప్రజాస్వామ్యంలో ఇంత నీచానికి దిగజారుతారా.. సిగ్గులేకుండా బరితెగించి మాట్లాడుతారా?. వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారులను వేధించారని, అనేకమంది ఐఏఎస్ అధికారులు జైలుపాలయ్యారు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు, కథనాలు, ప్రెస్‌ మీట్లు పెట్టించారు.  దోపిడీ దొంగలు వచ్చి ప్రెస్ ‌మీట్లు పెడుతుంటే బాధ అనిపిస్తుంది. గతంలో పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్‌లో చనిపోతే, దాన్ని మతాల మధ్య విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొంటూ, పిల్ల సైకోలు చేసిన తప్పులు తప్పించడం కోసం తప్పుడు ప్రెస్ ‌మీట్లు పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, అధికారులను వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారో ఆమె స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏడాది కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు,  ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, వికలాంగులకు రూ.6000, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు రూ.10,000, పూర్తిగా బెడ్ మీద ఉన్నవారికి రూ. 15000 ఇస్తున్నాం. దాదాపు 2 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇచ్చామని, గతంలో 42 లక్షల మందికి ఇస్తే, ఈరోజు 67 లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చాం. రోడ్ల గుంతలను పూడ్చి ప్రజలకు సౌకర్యవంతంగా చేశామని, గ్రామాల్లో సీసీరోడ్లు వేశామని తెలిపారు. త్వరలో అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత ఇవ్వనున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నాం. మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే.. చూసి తట్టుకోలేక.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బురదజల్లే కార్యక్రమాలకు కొంతమంది పేటిఎం బ్యాచ్‌లను పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే మీకు బుద్ది చెప్తారని హెచ్చరిస్తున్నాం. త్వరంలో మీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం.. ఫ్రస్టేషన్‌లో రోజుకో మాట మాట్లాడుతున్నారు. సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ రాజీనామా, సింగయ్యకు సంబంధించిన వీడియోలు వంటి విషయాలను కూడా వైసీపీ రాజకీయం చేస్తోంది. దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే.. దొర అయిపోతారా? అక్రమంగా ఇళ్ల పట్టాలు సృష్టించి ఎన్నికల్లో కొడుకును అందలం ఎక్కించడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులను మీ పక్కన కూర్చోబెట్టుకుని ప్రోత్సహిస్తారా?. తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు.

CM Chandrababu

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్

  సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ, ఆర్ధిక శాఖ, సీసీఎల్ఏకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు అథారిటీ ఆమోదం తెలిపింది. పలనాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడిలేమల్లే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది.  రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్‌ఎఫ్‌పీ పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్‌పిని ఆహ్వానించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. మందడంలో వివాంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలెక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలియచేసింది.  రాజధాని పనులకు కృష్ణా నది నుంచే ఇసుక   రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు కృష్ణానది నుంచే ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం రాజధానిలో రూ.49,040 కోట్ల విలువైన పనులు  జరుగుతున్న రీత్యా రానున్న రెండేళ్లలో వివిధ ప్రాజెక్టులకు 160 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. రాజధాని నిర్మాణానికి  అవసరం అయ్యే ఇసుకను ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను సీఆర్డీఏ కోరింది. రెండేళ్ల పాటు రాజధాని ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను తవ్వుకునేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఇసుక డీసిల్టేషన్ ప్రక్రియకు రూ.286 కోట్ల మేర వ్యయం కానున్నట్టు అథారిటీ సమావేశంలో అధికారులు తెలిపారు.  రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కూడా సీఆర్డీఏ అథారిటి ఆమోదాన్ని తెలిపింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు 2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్  ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీకి 12 ఎకరాలు, ఎంఎస్‌కే ప్రసాద్  ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడెమీకి 12 ఎకరాలు కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ అమోదం ఇచ్చింది.  అలాగే ఆదాయపు పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.40 ఎకరాలు, ఎస్ఐబీకి 0.50 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరాలు, కిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు 25 ఎకరాలు, భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 2 ఎకరాలను, బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలను కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది. అలాగే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంబికా గ్రూప్‌లకు గతంలో కేటాయించిన 1.40  ఎకరాలను రద్దు చేస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి సమీపంలో E-15 రహదారిపై నాలుగులేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది.  అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు రాజధాని అమరావతిలో స్ఫూర్తినిచ్చేవారి స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో నిర్మించే ఎకో పార్కులకూ మంచి పేర్లను పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టుల కోసం అధికారులు ఎలాంటి బేషజాలు లేకుండా ప్రయత్నాలు చేయాలని సూచించారు.  అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, గతంలో రాష్ట్ర సచివాలయం వేగంగా రికార్డు సమయంలో నిర్మించామని, అదే స్ఫూర్తితో పనులు పూర్తి చేయాలని అన్నారు. అమరావతిలో ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో కేంద్రంతో సంప్రదింపులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాజధానిలో నిర్మించతలపెట్టిన ఏ ప్రాజెక్టూ ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు అనుమతులను వేగవంతంగా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సరిగ్గా చేయని సంస్థలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, గడువులోగా పూర్తి చేసేలా నిర్దేశించాలని ముఖ్యంత్రి చంద్రబాబు అన్నారు

Rayachoti incident

రాయచోటి ఘటనపై ఏన్‌ఐఎ విచారిస్తోంది ..అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ

  రాయచోటి ఘటన జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని,దీనిపై  అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఓక ప్రకటనలో హెచ్చరించారు. జాతీయ భద్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా ఇతర ప్రసారమాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా, అవాస్తవాలను సృష్టించినా, పుకార్లు ప్రసారం చేసినా, షేర్ చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సామాజిక మధ్యమాలలో గ్రూప్ అడ్మిన్ లు ప్రతి సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని, మరియు  ఒక వేళ ఆయా గ్రూపుల్లో తప్పుడు సమాచారం వస్తే గ్రూప్అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాయచోటి ఘటనపై  ఈ నెల 3వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేశామని, ఈ విషయం గురించి కేంద్ర దర్యాప్తు బృందం విచారణ చేస్తున్నారన్నారు. కనుక ఎటువంటి విషయాలు ఉన్నా అధికారికంగా అన్నమయ్య జిల్లా పోలీస్ వారు తెలియజేస్తారని,ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని, ప్రజలు భయభ్రాంతులు కలిగించే ఊహాగానాలు, కథనాలు, దృశ్యాలు సృష్టించినా, పుకార్లు వ్యాప్తి చేసినా, ప్రసారం చేసినా షేర్ చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. సమాజంలో ముఖ్యంగా మీడియా పాత్ర విలువైనదని పోలీసు శాఖకు సహకరించాలన్నారు.  ఏదైనా విషయానికి సంబంధించి పోలీసు అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలి న్నారు .తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై, సృష్టిస్తున్న వారిపై, షేర్ చేస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు .వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జాతీయ భద్రతకు కు సంబందించిన విషయాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తీవ్రమైన నేరం గా పరిగనించబడుతుందన్నారు. మరియు చట్ట పరమైన పర్యావసనాలు కఠినంగా ఉంటాయన్నారు. కావున ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాని ప్రమాణీకతను తనిఖీ  చేసుకోవడం చాలా ఎస్పీ సూచించారు.

Kodali Nani

పలు పోలీస్ స్టేషన్‌‌లో హాజరై కొడాలి నాని

మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ పలు పోలీస్ స్టేషన్‌‌లో  హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు అత్కూరు, గన్నవరం, హనుమాన్ జంక్షన్, పటమట పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం చేసి వెళ్లారు. అయితే అనేక మంది వైసీపీ నేతలతో కొడాలి నాని పోలీస్‌స్టేషన్‌కు రావడం వివాదస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మాజీ మంత్రి.. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఇంటి వద్ద నుంచి స్టేషన్‌కు వచ్చి మరీ సంతకాలు చేశారు.  గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై దాడి జరిగిన ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కింది కోర్టులోనే బెయిల్ తీసుకోవాలని హైకోర్టు సూచించడంతో, ఆయన గుడివాడ కోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయంలో నాని పోలీస్ స్టేషన్‌కు వస్తే పోలీసులు రాచమర్యాదలు చేసేవారు. అప్పుడు అధికార ధీమాతో పోలీసులను బెదిరించేవారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. ఓడలు, బండ్లు  అవుతాయి బండ్లు  ఓడలు అవుతాయి అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు

shed collapse in simhachalam

సింహాద్రి అప్పన్న ఆలయంలో కూలిన షెడ్డు

సింహాచలం అప్పన్న ఆలయంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు కుప్పకూలింది. ఈ షెడ్డను  ఈ నెల తొమ్మిదో తేదీన గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ఏర్పాటుచేశారు.  అదృష్టవశాత్తు షెడ్డు కూలిన  సమయంలో  భక్తులు లేకపోవడంతో  ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై భారీ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలినట్లు  తెలుస్తోంది. ప్రమాద సమయంలో షెడ్డు క్రింద ఎవరూ లేకపోవడంతో సరిపోయింది.  ఈ ఏడాది  ఏప్రిల్ 30న సింహాద్రి అప్పన్న చందన యాత్ర సందర్భంగా మెట్ల మార్గంలో  క్యూ లైన్ గోడ కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా గిరిప్రదర్శన సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డు కూలిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇదే సంఘటన 9వ తేదీన జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని అంటున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకపోయినప్పటికీ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టే సమయంలో నిర్లక్ష్యం, అశ్రద్ధను ఇప్పటికైనా వీడాలని భక్తులు కోరుతున్నారు.  

NTR baby kits

ఏపీలో బాలింతలకు ఎన్టీఆర్‌ బేబీ కిట్లు

  ఏపీలో కూటమి సర్కార్ మరో మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందించాలని నిర్ణయంచింది. 2016లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఈ స్కీమ్ మొదలుపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నాళ్లు అమలు చేసిన తర్వాత నిలిపివేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 'ఎన్టీఆర్‌ బేబీ కిట్లు' పేరుతో మళ్లీ మొదలు పెడతోంది.  ఈ కిట్‌లో దోమతెరతో ఉన్న వాటర్‌ ప్రూఫ్ షీటు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ, బట్టలు, తువ్వాలు, పరుపు, నాప్కిన్లు లాంటి 11 వస్తువులు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రెండేళ్ల పాటు DMHOలు, DCHSలు, GGHలకు 'రేట్ కాంట్రాక్ట్' పద్ధతిలో కిట్లు సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ కిట్లను పంపిణీ చేసే బాధ్యతను ఏపీఎంఎస్‌ఐడీసీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే 11 రకాల వస్తువులతో కలిపి.. ఒక్కో కిట్ విలువ సుమారు రూ.1410గా ఉంటుందని చెబుతున్నారు

Nehal Modi

నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్

  వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద, అలాగే నేరపూరిత కుట్ర ఆరోపణల కింద నెహాల్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు యూఎస్ ప్రాసిక్యూషన్ పేర్కొన్నాది.  ఈ కేసులో తదుపరి విచారణ జూలై 17న జరగనుంది. ఆ సమయంలో నెహాల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని యూఎస్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. 14 వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరమ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదర్కొంటున్నారు.

agricultural officers negligence lead farmers suffer

ఎరువుల కోసం రైతుల తిప్పలు.. అధికారుల నిర్లక్ష్యంతో తప్పని అవస్థలు

తెలంగాణలో రైతాంగం అవస్థలు వ్యవసాయ అధికారులకు పట్టడం లేదు. ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ అధికారులకు ముందు చూపు కొరవడటంతో అన్నదాతలు అవస్థలు పడున్నారు.  ఇదంతా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంట అదును దాటుతున్నా.. సరిపడా యూరియా సరఫరా చేయడంలో విఫలమైన అధికారుల తీరును దుయ్యబడుతున్నారు.  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుల్లపెల్లి లోని రైతులు గంటల తరబడి ఎరువుల కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా నిలబడే ఓపిక లేక తమ చెప్పులను క్యూలైన్ లో వదిలేసి పక్కకు వెళ్లి కూర్చుంటున్న దుస్థితి కళ్లకు కడుతోంది. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇటీవల సాగుచేసిన మక్కజొన్న వంటి పంటలకు మందు వేసే సమయం ఆసన్నమైనా యూరియా కొరత పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తం అవుతోంది. దీంతో రైతాంగం. యూరియా కోసం   సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్‌లో పెట్టి పొద్దంతా పనులు మానుకుని వేచి ఉంటున్నారు. అయినా వారికి ఒకటి, రెండు సంచులకు మించి యూరియా దొరకడం లేదు. ఆ అరకొర సరఫరా వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోతోందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  సహకార శాఖ అధికారుల మాయాజాలానికి తోడు వ్యవసాయశాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందంటున్నారు. ఒకవైపు ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతుంటే, మరోవైపు అసలు కొరతే లేదని యంత్రాంగం చెబుతుండడం విడ్డూరంగా ఉంది.

Muharram

బీబీకా ఆలంను సందర్శించిన మంత్రులు

  మొహర్రం సందర్బంగా హైదరాబాద్‌లోని డబీర్ పురాలోని బీబీకా ఆలంను ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సందర్మించారు. ఈ సందర్బంగా బీబీకా ఆలయంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వందల సంవత్సరాల అనావాయితీగా వస్తున్న ఊరేగింపు కోసం ఏనుగును ఇప్పటికే తీసుకురావడం జరిగింది. కాగా, మొహర్రం పర్వదినం పురస్కరించుకొని గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు కొనసాగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎఫండీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పాల్గోన్నారు. దీంతో అధికారులు  మొహర్రం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు

kavitha quit car for sure

కవిత కారు దిగిపోవడం ఖాయమేనా?

కల్వకుంట్ల కవిత.. పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్రపడిన కవిత.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కూడా. తండ్రి చాటు బిడ్డగానే రాజకీయాలలో తొలి అడుగులు వేసినా.. ఆ తరువాత ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బతుకమ్మ, బోనాల పండుగలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. లోక్ సభ సభ్యురాలిగా తన ప్రతిభనూ చాటారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.  అటువంటి కల్వకుంట్ల కవిత ఇటీవల గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలే గత ఎన్నికలలో పరాజయంపాలై, అధికారానికి దూరమై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కవిత ధిక్కార ధోరణితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పైన, ఆ పార్టీ నాయకత్వం పైన కవిత చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు కవితను బీఆర్ఎస్ కే కాకుండా.. కేసీఆర్ కుటుంబానికి కూడా దూరం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. దీంతో కవిత పొలిటికల్ జర్నీపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ తన దేవుడంటూనే కవిత బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ అంగీకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. దీంతో కేసీఆర్ కూడా కవితను దూరంపెడుతున్నారు. ఇందుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న తరుణంలో తండ్రిని కలవడానికి వచ్చిన కవితవైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదు. చిన్న సైగతో ఆమె తన సమీపానికి కూడా రాకుండా నిలువరించారు. ఇక తాజాగా కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సందర్భంగా సొంత కుమార్తె అయి ఉండి కూడా ఎవరో పరాయి వ్యక్తిలా, అతిథిలా కవిత యశోదా ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చేయాల్సి వచ్చింది. వీటన్నిటికీ మించి ఇటీవల కవిత ఒక ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె కారు దిగిపోవడానికే నిర్ణయించుకున్నారని తేటతెల్లం అయ్యింది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆమె ఎంచుకున్న ఛానెల్.. అలాగే ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కవిత రాజకీయంగా బీఆర్ఎస్ తో కలిసి నడిచే పరిస్థితి ఎంత మాత్రం లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. భవిష్యత్ లో తాను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని అని కుండబద్దలు కొట్టడమే కాకుండా.. తన సోదరుడు కేటీఆర్ తో తనకు విభేదాలున్నాయని కూడా స్పష్టంగా చెప్పారు. అంతే కాకుండా మరో అడుగు ముందుకు వేసి ఆ ఇంటర్వ్యూలో తన తండ్రిపైనే విమర్శలను గురిపెట్టి వదిలారు. తన నియోజకవర్గ అభివృద్ధికి స్వయంగా తాను కోరినప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు.  ఇక బిఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిర చేస్తున్న.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కవిత పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేశారు.  వీటన్నిటినీ బట్టి చూస్తుంటే కవిత కారు దిగి సొంత దారి చూసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

CM Revanth Reddy

రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌‌కు కేటీఆర్ సవాల్

  రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.  72 గంటలు సమయం ఇస్తున్నా.. ప్రిపేర్‌ అయ్యి చర్చకు రండి ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లెలోనైనా చర్చకు సిద్దమని తేల్చి చెప్పారు. ప్లేస్, టైం, డేట్ అన్నీ రేవంత్ ఇష్ట్రమన్నారు. బేసిన్‌కు తేడా తెలియని రేవంత్..కేసీఆర్‌ను చర్చకు పిలుస్తారా అని ప్రశ్నించారు. ఆయన స్థాయికి తాము చాలని సెటైర్ల వేశారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చింది కేసీఆర్‌. రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్‌ఎస్‌. నిజం తెలిసినా ఒప్పుకోలేని వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని కేటీఆర్ అన్నారు.  ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో చర్చకు సిద్ధమని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. తన అనుచరులకు నియామకాలు ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడా, ఎవరూ చేయలేదు. 70 లక్ష మంది రైతుల ఖాతాల్లో నిధులు జమచేశాం. రైతులకు  Free electricity ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌కే చెందుంతన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ చేశారు. నాలుగు వేల పెన్షన్, రూ. 2,500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలవదన్నారు.‘వందనా.. వాళ్ళ‌ బొందనా? వంద సీట్లు కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. వంద గెలవాలంటే.. ముందు ప్రజలు ఓట్లు వేయాలి కదా. రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుంది. గుడ్డులు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటుని కేటీఆర్ అన్నారు.

Google map

గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి.. చివరకు ఏమైందంటే?

  గూగుల్ మ్యాప్ సాయంతో కారులోవెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఈ క్రమంలో వడ్డకొండ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాదంలో నలుగురి స్వల్పగాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ ని చాలా మంది వాడుతుంటారు. అయితే కొంతమంది గూగుల్ మ్యాప్స్ పైనే గుడ్డిగా ఆధారపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే ఈ యాప్‌ ఇచ్చే డైరెక్షన్స్ నమ్మి ఎంతోమంది ప్రమాదాల్లో పడ్డారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

రేవంత్ సర్కార్ కు ఖర్గే కితాబు!

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. ఒక విధంగా ఉరమని ఉరుముల రాష్ట్రంలో కాలుపెట్టిన ఖర్గే, ఆయన వెంట వచ్చిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చిన పనితో పాటుగా పక్కపనులను చక్కపెట్టుకు వెళ్ళారని, పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.  సరే.. పక్కపనుల సంగతి కాసేపు పక్కనపెట్టి అసలు విషయానికి వస్తే..  మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రధానంగా సామాజిక న్యాయ సదస్సు పేరిట తెలంగాణ కాంగ్రెస్ కమిటీ  శుక్రవారం (జులై 4) ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రనికి వచ్చారు.అయితే సదస్సు సదస్సులా కాకుండా..  బహిరంగ సభలా జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలప్రదర్శన సభలా జరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  విశ్లేషకులు పేర్కొనడమే కాదు.. పార్టీ నాయకులు అదే చెప్పుకుంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. నిజంగా కూడా  ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సెంట్రిక్ గానే జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో పెరిగిన దురాన్ని తగ్గించుకునే ప్రయత్నంగానూ.. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసి,తన కుర్చీని సుస్థిరం చేసుకునే ప్రయత్నంగా  ఎల్బీస్టేడియం సభను పేర్కొనవచ్చని పరిశీలకులతో పాటుగా, పార్టీ నాయకులు కూడా పేర్కొంటున్నారు.  అందుకే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అదనంగా ఏడవ గ్యారెంటీగా.. పార్టీ అధిష్టానానికి వంద అసెంబ్లీ, 15 లోక్ సభ సీట్లను గ్యారెంటీ ఇచ్చారని అంటున్నారు. ఎల్బీ స్టేడియం సభలో ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి, కాదంటే, ఖర్గే ద్వారా పార్టీ అధినేత రాహుల్ గాంధీకీ.. మూడేళ్ల ముందే హామీ ఇస్తున్నా.. రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తాం. ఇక్కడ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వంద సీట్లలో ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత. తెలంగాణ నుంచి 15 మంది ఎంపీలను ఢిల్లీకి పంపుతాం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మావంతు సహకారం అందిస్తాం  అంటూ ఇచ్చిన హామీ..  మూడేళ్ళు తనను ముఖ్యమంత్రి పదవిలో కొంసగించాలని చేసిన అభ్యర్ధనగానే  భావించవలసి ఉంటుదని పరిశీలకులు భావిన్తున్నారు. అయితే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుర్చీని కాపాడుకునెందుక చేసిన ప్రయత్నం సక్సెస్’ అయినట్లేనా అంటే..  తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కితాబు ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఖర్గే సంతృప్తి  చెందినట్లే ఉందని అంటు న్నారు. అంతే కాకుండా.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారిగా కులగణన చేయించిందని, కులగణనతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చేసిన వ్యాఖ్యాలు రేవంత్ రెడ్డి సర్కార్  కు అధ్యక్షులవారు ఇచ్చిన సర్టిఫికేట్ గానే భావించవలసి ఉంటుందంటున్నారు. అలాగే..  ఖర్గే తన ప్రసంగంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం కూడా  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన కితాబుగానే  ముఖ్యమంత్రి అనుచరగణం పేర్కొంటున్నారు. అయితే.. ఖర్గే ఇచ్చిన సర్టిఫికేట్ ముఖ్యమత్రి కుర్చీకి గ్యారెంటీ  ఇస్తుందా? అంటే అలా అనుకునే అవకాశం లేదని అంటున్నారు. ఖర్గే సంతృప్తి చెందితే సరిపోదనీ, హై కమాండ్ సంతృప్తి చెందితేనే.. ఏ ముఖ్యమంత్రి కుర్చీయినా నిలబడుతుందనీ లేదంటే ఏమి జరగాలో అదే జరుగుతుందని అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల కర్ణాటకలో ముఖ్యమత్రి మార్పు విషయంగా ఖర్గే  అది పార్టీ హై కమాండ్ పరిధిలోని అంశమనీ,  హై కమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుందో ఎవరూ చెప్పలేరంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనే  ముఖ్యమంత్రి మార్పు తన చేతిలో లేదని ఖర్గే చేతులెత్తేసిన నేపథ్యంలో.. కర్ణాటకలో అయినా, తెలంగాణాలో అయినా  హై కమాండ్ ముఖ్యమంత్రిని మార్చాలని అనుకుంటే ఖర్గే ఇచ్చిన సర్టిఫికేట్ ముఖ్యమంత్రి కుర్చీని కాపాడలేక పోవచ్చని అంటున్నారు.

ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ య‌శోద ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 2న ఆయ‌న‌ అనారోగ్యం కారణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.   వైద్య పరీక్షలలో కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ అధికంగా, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు తెలియడంతో అవి సాధారణ స్థాయికి వచ్చే వరకూ ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు.  జ్వరం అదుపులోనికి రావడం, సుగర్, సోడియం లెవెల్స్ సాధారణ స్థితికి రావడంతో ఆయన ఈ ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు శుక్రవారం ఆయన ఆస్పత్రిలోనే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో చేరిన తనను పరామర్శించడానికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతలతో ఆక్కడే ఆయన ఇష్ఠాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, రైతుల కష్టాలు, యూరియా లభ్యత, సాగునీరు, వ్యవసాయం, ఇతర ప్రజా సమస్యలపై ఆయన వారితో ముచ్చటించారు.   అదే సమయంలో వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు.  బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరిపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే కేసీఆర్ త్వరలో మీడియా ముందుకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికలు, జూబ్లీ ఉప ఎన్నిక నేపధ్యంలో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారనీ, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

అంతా అయిపోయాకా ఇప్పుడెందుకీ యాత్ర?

జూలై 9న జ‌గ‌న్ మామిడి టూర్ సీజన్ అయ్యాకా వచ్చి ప్రయోజనమేంటంటున్న రైతులు చిత్తూరు జిల్లా మామిడి వ్య‌వ‌హారం అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూలై  9న జ‌గ‌న్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి వ‌చ్చి ఇక్క‌డి రైతుల‌ను ప‌ర‌మార్శించ‌నున్నారు. కార‌ణం ఈ రైతుల‌కు త‌గిన ధ‌ర లేక అవ‌స్థ  ప‌డుతున్నారని తెలియడమే. అలా తెలియడంతో ఇలా  వారి కోసం ఓదార్పుయాత్రకు వచ్చేస్తున్నారు. ఇక జగన్ ఓదార్పు యాత్ర అంటే తెలియందేముంది. వైసీపీ శ్రేణులు, నేతలు రెచ్చిపోయి ప్రకటనలు గుప్పించేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టేస్తున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా వంటి వారు జగన్ వస్తున్నాడనే సరికి తెలుగుదేశం కూటమి నేతలు వణికి పోతున్నారంటూ మాట్లాడేస్తున్నారు. అయితే రైతులు మాత్రం జగన్ ఓదార్పు అంటూ చేయనున్న యాత్రపై పెదవి విరుస్తున్నారు.  సీజన్ అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి ప్ర‌యోజ‌న‌మేంట‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మా హ‌యాంలో మేం రూ. 4 వేలు స‌బ్సిడీ ఇచ్చాం.  మీ హ‌యాంలో  మీరేం ఇచ్చార‌ని నిల‌దీస్తున్నారు స్థానిక తెలుగుదేశం లీడ‌ర్లు.  ఈ రాజకీయ‌ పోరాటాల‌ను అటుంచితే.. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుకు ఇంత క‌ష్టం ఎలా వ‌చ్చిందో చూస్తే.. ఇక్క‌డ టేబుల్ ర‌కాల‌ను ప‌క్క‌న పెట్టి.. తోతాపురి ర‌కాల‌ను ఎక్కువ‌గా పండించారు. కార‌ణం ఈ ప్రాంతంలో ఏకంగా 60 వ‌ర‌కూ గుజ్జు ప‌రిశ్ర‌మ‌లున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మామిడి రైతులు అధిక శాతం ఈ ర‌కాల‌నే పండించారు. దానికి తోడు ఈ ఏడాది వ‌ర్షాలు  కూడా స‌కాలంలో ప‌డడంతో మామిడి దిగుబ‌డి భారీగా పెరిగింది. దీంతో డిమాండ్ త‌గ్గింది. ఇదంతా అలా ఉంచితే.. ఇప్ప‌టికే ల‌క్ష క్వింటాళ్ల మామిడి గుజ్జు అలాగే నిల్వ ఉండి పోయింది. అంత‌ర్జాతీయంగా ఏర్ప‌డిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం దృష్ట్యా ఈ గుజ్జును ఎగుమ‌తి చేయ‌లేక పోతున్నారు. స్థానికంగా అమ్మ‌గ‌లిగే ర‌కాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఇక్క‌డి ప‌రిశ్ర‌మ‌లు కొంటాయ‌న్న భావనతో పండించిన తోతాపురిని ఎవ‌రూ కొన‌డం లేదు. ఆల్రెడీ ఉన్న నిల్వ‌ల‌ను అమ్ముకోలేక పోవ‌డంతో.. గుజ్జు ప‌రిశ్ర‌మ‌లు మామిడిని కొన‌డం ఆపేశాయి. దానికి తోడు ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ సిండికేట్ గా ఏర్ప‌డి.. మేలో తెర‌వాల్సిన ఫ్యాక్ట‌రీలు ఇంకా తెర‌వ‌కుండా నానుస్తున్నారు. దీంతో దిక్కు తోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయాడు మామిడి రైతు.  వీట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మామిడి రైతును ఆదుకోవ‌డంలో భాగంగా ఏకంగా 250 కోట్ల రూపాయ‌ల‌ను  కేటాయించింది. ఇదే అద‌నుగా భావించిన మాజీ సీఎం జ‌గ‌న్ ఇక్క‌డా రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఆరాట‌ప‌డుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కార‌ణం ఏమిటంటే జగన్ రావడం వల్ల అనవసర అలజడి తప్ప మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదని రైతులు, మార్కెట్ యార్డు ప్రతినిథులు తెగేసి చెప్పడమే.  అది ఆయ‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం పోరాటమైతే..  ఇక్క‌డ రైతులది జీవ‌న పోరాటం. వారి క‌డ‌గండ్ల‌ను కూడా జ‌గ‌న్ క్యాష్ చేసుకోడానికి రావ‌డం తమకు సుతరామూ ఇష్టం లేదంటున్నారు స్థానిక మామిడి రైతులు.

దిగి రానున్న టోల్ చార్జీలు!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యస్ చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజ్ సగానికి సగం తగ్గనుంది. ఔను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా ఇది భారీగా తగ్గే అవకాశం ఉంది.    ఎప్పుడో  2008లో టోల్‌ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్‌ ఛార్జీలను కేంద్రం తాజాగా సవరించింది. ఈ సవరింపుల కారణంగా  సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ రహదారుల మార్గాల్లో టోల్‌ ఫీజు లెక్కింపు పద్ధతి మారుతుంది. ఈ మార్పు కారణంగా టోల్ చార్జీలు దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వాణిజ్య వాహన యజమానులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది.   వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలను కలిగి ఉన్న జాతీయ రహదారుల విభాగాలకు టోల్ రేటు తాజా సవరింపులతో 50 శాతం వరకూ తగ్గుతుంది.