అద్భుత నటుడు జూనియర్ ఎన్టీఆర్.. అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో ఎన్టీఆర్ తో లంచ్ భేటీ తరువాత.. ఆయనతో భేటీ ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ ట్వీట్ చేశారు. ఆయనో అద్భుత నటుడని పేర్కొన్న అమిత్ షా.. ఆయన ఇటీవల నటించిన సినీమాలో ఆయన నటన చూసిన తరువాత ఆయనను ఒక సారి కలవాలని భావించాననీ, ఆయనతో భేటీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందనీ పేర్కొన్నారు.   మునుగోడులో బీజేపీ బహిరంగ సభ అనంతరం అమిత్ షా హైదరాబాద్‌ లోని నోవాటెల్‌ హోటల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ను తనతో డిన్నర్ సమావేశానికి అమిత్ షా ఆహ్వానించిన సంగతి విదితమే.  ఆ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌కు అమిత్ షా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతించారు. అలాగే  జూనియర్ ఎన్టీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. వీరి మధ్య ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం జరగింది.  అందులో దాదాపు 20 నిమిషాల సేపు అమిత్ షా, ఎన్టీఆర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం అమిత్‌ షా, కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి భోజనం చేశారు. ఈ భేటీలో ప్రధానంగా ఎన్టీఆర్ నటన, రాజకీయ జీవితం గురించిన ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన విశ్వామిత్ర, దానవీర శూర కర్ణ తదితర సినిమాలను తాను చూసినట్లు అమిత్ షా చెప్పారనీ, అలాగే ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అధికారుల పనితీరు బాగుండేదనీ అన్నట్లు సమాచారం. అదలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షాల భేటీపై ఉభయ తెలుగు రాష్ట్రాలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరువురి మధ్యా ప్రస్తావన కు వచ్చిన అంశాలపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారనీ, అందుకు జూనియర్ ఎన్టీఆర్ సున్నితంగా నిరాకరించారనీ చెబుతున్నారు. ఒక వేళ బీజేపీలోకి రావడం ఇష్టం లేకుండా తెలంగాణ తెలుగుదేశం సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కు సూచించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ రానున్న రోజులలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరయ్యే అవకాశాలను మెరుగుపరిచాయని విశ్లేషకులు అంటున్నారు.

పొద‌ల్లో దొరికిన పెద్దామె!

పిల్లాడు పెర‌ట్లో ఆడుతూంటే చెట్టు ద‌గ్గ‌ర మ‌ట్టిలో స్టీలు స్పూను క‌నిపించింది. అమాంతం దాన్ని తీసుకుని త‌ల్లి ద‌గ్గ‌రికి వెళ్లాడు. దీనికోసం రెండ్రోజులుగా వెతుకుతున్నా ఎలా దొరికింది అంటే పిల్లాడు వివ‌రంగా చెప్పాడు. ఇది త‌ప్ప‌కుండా ప‌నిపిల్ల ప‌నే అని  విసుక్కుంది, మ‌రో ఇంట్లో దాదాపు ఇలానే ఒక గిన్నె క‌ని పించింది. ఆ ఇంటి ఇల్లాలు వాళ్ల ప‌నిపిల్ల ప‌నే అనుకుని తిట్టి త‌రిమేసింది. ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణం. కానీ ఈథ‌న్ అనే రెండేళ్ల పిల్లాడికి ఏకంగా ఒక పెద్దామె క‌నిపించింది! జార్జియాకి చెందిన బ్రిటానీ మూర్‌, ఆమె పిల్లాడు రెండేళ్ల ఈథ‌న్‌ని ఇంటి పెర‌ట్లో ఆడిస్తోంది. బంతి విసి రితే వాడు తెస్తున్నాడు. కొంత సేప‌య్యాక ఆట‌లో భాగంగా బంతికోసం పెర‌ట్లో ఓ మూల‌గా పొద‌ల మాటు న ఏదో క‌దులుతున్న అనుమానం వ‌చ్చి అలా చూస్తుండిపోయాడు. చెట్లు కదులుతున్నాయ‌ని వాడికి అమితాశ్య‌ర్య‌మేసిందేమో! ముందుకు వెన‌క్కి క‌దిలి అక్క‌డికి వెళ్లాలా వ‌ద్దా అని సంశ‌యించాడు. ఆఖ‌రికి బాగా ద‌గ్గ‌రికి  వెళ్లి చూశాడు. వాడికి మ‌నిషి పాదాలు క‌నిపించి గ‌ట్టిగా అరిచాడు. త‌ల్లి ప‌రుగున వెళ్లింది. అక్క‌డేదో  క‌రిచిందో, కుట్టిందో అని. తీరా చూస్తే మ‌నిషి పాదాలు క‌నిపించాయి. ఆమె కూడా భ‌యం భ‌యంగానే పొద‌లు తొల‌గించి చూస్తే ఓ పెద్దామె స్పృహ లేకుండా  ప‌డి ఉంది.  వెంట‌నే భ‌ర్త‌ని పిలిచి ఆమెను ఇంట్లోకి తీసికెళ్లింది. ఆమె పై దుమ్ము ధూళీ తుడిచి మొహం మీద నీళ్లు చ‌ల్లితే ఆ పెద్దామె తేరుకుంది. చుట్టూ ఉన్న‌వారిని ప‌రికించి చూసింది. వీళ్లెవ‌రో కొత్త‌వారిలా ఉన్నారు, త‌న‌నెందుకో ఇక్క‌డికి ప‌ట్టుకొచ్చార‌నే అనుకుంది. మీరెవ‌రు, న‌న్నెందుకు ఇక్క‌డికి తీసుకు వ‌చ్చారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌నీ హెచ్చ‌రించింది. అమ్మ‌.. మ‌స‌లావిడా.. పొద‌ల్లో ప‌డి ఉంద‌ని లోప‌లికి తీసుకొచ్చి సేవ‌లు చేస్తే ఎంత మాటంటోంది వ‌దినా.. అన్న‌ది బ్రిటానీ త‌న ప‌క్కింటావిడ‌తో! కొంత‌సేప‌టికి బ్రిటానీ భ‌ర్త పోలీసుల్ని పిలిచాడు. ఆమెను ప‌రిశీలించి, ఆమె బంధువుల గురించి అడి గారు. ఇంత చేస్తే ఆమె నాలుగ‌యిదు వీధుల అవ‌త‌ల ఉండే పెద్దావిడ అని తేలింది. ఆమె బంధువు, ముని మ‌న‌వ‌రాలూ వ‌చ్చి అంద‌రికి సారీ చెప్పింది. ఆమెకు దారుణ‌మైన మ‌తిమ‌రుపు. అలా తిరుగుతూ ఎవ‌రింట్లోకో వెళ్లి క‌బుర్లు చెబుతూనే ఉండిపోతూంటుందిట‌. మ‌రి వీళ్ల ఇంట్లో పెర‌ట్లోకి ఎలా వ‌చ్చింద‌నే ఇప్ప‌టికీ అనుమాన‌మే. ఏమైన‌ప్ప‌టికీ  ఆ 86 ఏళ్ల పెద్దామె పేరు నీనా.  కానీ ఆమెను ర‌క్షించి బ‌య‌టికి తీసుకొచ్చిన రెండ ఏళ్ల ఈథ‌న్ ని మాత్రం ఆ ఇంటివాళ్లంతా ఎంతో సత్క రించారు.  ప‌క్కింటాళ్లంతా బుగ్గ‌లు గిల్లారు, పోలీసులు శ‌భాష్ బేటా అన్నారు.  నీనా మాత్రం న‌వ్వి ఊరుకుంది. 

వాజ్ పేయి, అద్వానీల వల్లే బీజేపీకి ఈ అధికారం.. గడ్కరీ

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగిందంటే అందుకు మాజీ ప్రధాని వాజ్ పేయి, మాజీ ఉప ప్రధాని అద్వానీలే కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వారి వల్లే బీజేపీ నేడు ఈ స్థాయికి ఎదిగిందన్నారు. గడ్కరీకి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలికిన తరువాత ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నాగపూర్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బీజేపీ జాతీయ స్థాయిలో బలోపేతం కావడానికి వాజ్ పేయి, అద్వానీ వంటి వారే కారణమన్నారు. లోక్ సభలో కేవలం రెండు స్థానాలున్న బీజేపీ ఈ రోజు జాతీయ స్థాయిలో అత్యధిక రాష్ట్రాలలో అధికారం చేజిక్కంచుకోగలిగిందంటేఅందుకు వారి కృషే కారణమనిపేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో ముంబైలో ఒక సదస్సులో వాజ్ పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తించారు. ‘చీకటి ఏదో ఒక రోజున తొలగిపోతుంది, సూర్యుడు బయటకు వస్తాడు, కమలం వికసిస్తుందని వాజ్ పేయి అన్నారనీ, ఆ రోజు ఆ సదస్సులో తానూ ఉన్నాననీ గుర్తు చేసుకున్నారు.  నాగ్‌పూర్‌లో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. 1980లో ముంబైలో బీజేపీ నిర్వహించిన సదస్సులో వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు.   వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారితోపాటు కార్యకర్తల కృషి కారణంగానే నేడు మోదీ నాయకత్వంలో పార్టీ అధికారంలో ఉందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారని.. అయితే, దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజిక, ఆర్థిక సంస్కర్తలు దూరదృష్టితో ఆలోచిస్తారనీ, వారి విజన్  శతాబ్దం మేలు గురించి కూడా ఆలోచిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. 

గుజరాత్ లో అధికారామే ఆప్ లక్ష్యం

గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పావులు కదుపుతోంది. ఇప్పటికే ఢిల్లీని దాటి పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన  ఆప్ త్వరలో గుజారాత్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో సత్తాచాటాలని భావిస్తోంది.  ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకుంటే దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి తీసేసినట్లునని భావిస్తోంది.  ఈ నేపథ్యంలోనే    ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు సోమవారం (ఆగస్టు 22)న గుజరాత్ లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లోని హిమ్మత్ నగర్ లో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. మంగళవారం (ఆగస్టు 23)న భావ్ నగర్ లో పర్యటించనున్నారు. తమ రెండు రోజుల గుజరాత్ పర్యటనపై కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. విద్య, వైద్యానికి సంబంధించి గుజరాత్ ప్రజలకు  స్పష్టమైన హామీ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే ఢిల్లీలో మాదిరే గుజరాత్ లో కూడా మంచి స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆప్ కు అధికారం ఇస్తే గుజరాత్ లో ప్రతి ఒక్కరూ ఉచితంగా మంచి విద్య, వైద్యం పొందుతారని కేజ్రీవాల్  ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ఈ రెండు రోజుల పర్యటనలో గుజరాత్ యువతతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. 

మాజీ హోంమంత్రి సుచరిత ఇంటి ముందు ఎమ్మెల్యే శ్రీదేవి ధర్నా

తాడికొండ వైసీపీలో విభేదాలు రొడ్డెక్కాయి. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నాయకురాలు, మాజీ హోంమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయిన మేకతోటి సుచరిత నివాసం ముందు ధర్నాకు దిగారు. ఇప్పటి వరకూ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న ఉండవల్లి శ్రీదేవికి అదనంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను పార్టీ అధిష్టానం అదనపు సమన్వయకర్తగా నియమించింది. ఈ నిర్ణయాన్ని ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ అదనపు సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు ఆందోళనలకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ జిల్లా అద్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తన అనుచరులతో కలిసి ఉండవల్లి శ్రీదేవి మేకతోటి సుచరిత నివాసం ముందు బైఠాయించి ధర్నాకు దిగడంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా రోడ్డెక్కినట్లైంది. కాగా సుచరిత స్వయంగా ఉండవల్లి శ్రీదేవిని బుజ్జగించి నిరసన విరమింప చేశారు. అదనపు సమన్వయ కర్త నియామకం విషయాన్ని అధిష్ఠానంతో మాట్లాడి పరిష్కరిస్తానని సుచరిత హామీ ఇవ్వడంతో ఉండవల్లి శ్రీదేవి తన ఆందోళన విరమించారు. కాగా ఎమ్మెల్యే స్వయంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలి నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగడంతో మేకతోటి సుచరిత నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

మునుగోడుతో కేసీఆర్ పతనానికి శ్రీకారం.. అమిత్ షా

మునుగోడులో బీజేపీ ఆదివారం (ఆగస్ట 21) నిర్వహించిన సమరభేరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. మునుగోడులో శనివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా విమర్శల వర్షం కురిపిస్తే.. ఆదివారం నాటి సమర భేరి సభలో అమిత్ షా కేసీఆర్ ను విమర్శలతో చెరిగేశారు. మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ పతనానికి నాంది అన్నారు. సమరభేరి సభా వేదికపై అమిత్ షా ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీజేపీ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ సర్కార్ ను కూల్చేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని చెప్పిన అమిత్ షా రానున్న రోజులలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోక తప్పదని మునుగోడు సభను చూస్తుంటే అర్ధమౌతోందని అన్నారు. రాజగోపాలరెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకే తాను మునుగోడు వచ్చినట్లు చెప్పిన అమిత్ షా కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానని చెప్పిన కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ నిర్వహించడం లేదని విమర్శించారు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రిని గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని అమిత్ షా చెప్పారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఇల్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా?తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన సీఎం చేశారా?  మళ్లీ టీఆర్ఎస్ ను గెలిపిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారని, అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అన్నారు. ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ చెప్పారు.. ఎంత మంది దళితులకు 10 లక్షల రూపాయలు అందాయని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు.. ఎవరికైనా అందిందా..? అంటూ అమిత్‌ షా నిలదీశారు. నిరుద్యోగులకు నెలనెలా రూ.3వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  నోటి కొచ్చిన హామీ ఇవ్వడం, అమలు చేయకపోవడం కేసీఆర్ నైజమని విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలనతో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని అమిత్ షా విమర్శించారు.

ఎన్టీఆర్, అమిత్ షా భేటీకి ఎనలేని రాజకీయ ప్రాధాన్యత

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రిని జూనియర్ ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ అమిత్ షా ఆహ్వానం మేరకు నోవాటెల్ హోటల్ కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన హోంమంత్రి ఆయనను కలవాలని భావించారనీ, అందుకే ఆహ్వానించారనీ బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.   మరోవైపు.. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా మునుగోడులో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అనంతరం రామోజీఫిల్మ్ సిటీలో రామోజీరావును కలిశారు. అనంతరం నోవాటెల్ హోటల్ లో తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం అయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ  భేటీ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు  సభకు వచ్చిన అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా భేటీకి ఆహ్వానించడం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ ప్రచారం చేశారు.  అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అమిషాల భేటీని చూడాల్సి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భేటీ సందర్భంగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది. ఒక వేళ అందుకు జూనియర్ ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో ఆయనను తెలుగుదేశం తెలంగాణ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరే అవకాశం ఉందని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం 30 స్థానాలలో తెలుగుదేశం పార్టీకి ప్రభావమంతమైన ఓటు బ్యాంకు ఉంది. అంతే కాకుండా తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రుల ఓటు అత్యంత కీలకం. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులలో అత్యధికులు తెలుగుదేశం మద్దతుదారులే అన్న అంచనాతో.. ఉన్న బీజేపీ వారి ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.   తెలుగుదేశం పార్టీకి ఏపీలో మద్దతు ఇవ్వడానికి అందుకు ప్రతిగా తెలంగాణలో తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇరు పార్టీల మధ్యా ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని పరిశీలకులు సైతం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించే అవకాశం ఉందని, ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ అందుకు సుముఖంగా లేకపోతే తెలంగాణ తెలుగు దేశం అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరే అవకాశం ఉందనీ అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం బలానికి, ఆ పార్టీ తెలంగాణ శాఖకు జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్ష పగ్గాలు చేపడితే.. మరింత బలోపేతం అవుతుందని బీజేపీ భావిస్తున్నది. దీంతో తెలుగుదేశం అండతో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం మరింత సులభతరమౌతుందని బీజేపీ ఆశిస్తున్నది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో మునుగోడులో ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 

హిమాచల్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ పదవికి ఆనందశర్మ గుడ్ బై

 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ  హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై పార్టీ అధినేత సోనియా గాంధీకి ఆయన ఆదివారం (ఆగస్టు 21) లేఖ రాశారు.  ఈ లేఖలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్న ఆనందశర్మ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని  తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన ఆనంద్ శర్మ.. స్టీరింగ్ కమిటీ నుంచి తప్పుకోవడం పట్ల పార్టీలోనే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. స్టీరింగ్ కమిటీ పదవికి రాజీనామా చేయడానికి కారణాలేమిటన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కానీ నవంబర్‭లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్టీరింగ్ కమిటీ నుంచి తప్పుకోవడం మాత్రం కాంగ్రెస్ కు తేరుకోలేని దెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‭లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉండనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుండగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది.  బీజేపీ  ఇప్పటికే  ప్రచారంలోదూసుకుపోతుండగా,   ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది.  కొద్ది రోజుల క్రితం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన ఆప్.. ఇప్పుడు అదే ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాలు మోపేందుకు ఉత్సాహంతో ఉంది. ఎటు నుంచి ఎటు చూసినా ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీయే ప్రచారంలో కానీ, ప్రతిష్టలో కానీ వెనుకంజలో ఉంది. గోరు చుట్టుమీద రోకలి పోటులా ఇప్పుడు ఆనందశర్మ స్టీరింగ్ కమిటీ నుంచి వైదొలగడం ఆ పార్టీకి మరింత నష్టం చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గ‌త ఏప్రిల్ నెల‌లో పార్టీ స్టీరింగ్ క‌మిటీ చైర్మ‌న్ గా నియమితులైన ఆనందశర్మ ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేశారు. పార్టీ కంటే తనకు ఆత్మగౌరవమే ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ అస‌మ్మ‌తి వ‌ర్గంగా పేరొందిన జి-23లో జట్టులోని మరో మ‌రో స‌భ్యుడు గులాం నబీ ఆజాద్ జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వికి ఇటీవల గుడ్ బై చెప్పిన సంగతి విదితమే. సంప్ర‌దింపుల ప్ర‌క్రియ‌లో త‌న‌ను విస్మ‌రించారంటూ ఆనంద్ శ‌ర్మ సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  ఆనందశ‌ర్మ గ‌తంలో కేంద్రంలో మంత్రిగా ప‌ని చేశారు. రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ఉప నాయ‌కుడిగా ఉన్నారు.ఏప్రిల్ 26న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో స్టీరింగ్ క‌మిటీ చైర్మ‌న్ గా నియ‌మితుల‌య్యారు.  పార్టీ స‌మావేశాల‌కు  చి ఆహ్వానం లేక పోవ‌డం , ఏ విషయంలోనూ తనను సంప్ర‌దించ‌క పోవ‌డంతో ఆనందశర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

వైసీపీలో కుమ్ములాట ‘ద‌ర్శి’ నీయం!

ఒకే పార్టీ వారు మ‌రీ చిన్న‌పిల్ల‌ల్లా గొడ‌వ‌ప‌డ‌టం వైసీపీలో ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.. వైసీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌కు తాజా ఉదాహ‌ర‌ణ ద‌ర్శి నియోజ‌క‌వర్గం. ఇక్క‌డ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు మధ్య ఆధిపత్య పోరు తారా స్ధాయికి చేరింది. ఇంటి గృహ‌ప్ర‌వేశాల కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుగాక‌పోవ‌డం వంటి ప‌నుల ద్వారా వారి మ‌ధ్య విభేదాలు ఏ స్థాయికి చేరుకున్న‌దీ తెలియ‌జేశారు.  సహజంగా సొంత పార్టీలో గాని, ప్రత్యర్థి పార్టీలో నాయకుల్లో రాజకీయంగా మనస్పర్థలు ఉన్నా వారి కుటుంబాల్లో జరిగే కార్యక్ర మాలకు అందరినీ ఆహ్వానించటం, ఎదుటి వారు వెళ్లటం జరుగుతుంది. కానీ గత ఏడాదిగా దర్శిలో మద్దిశెట్టి, బూచేపల్లి మాత్రం ఆ విధంగా వ్యవ హరించటం లేదు. ఎమ్మెల్యే మద్దిశెట్టి గృహప్రవేశానికి వెంకాయమ్మ కాని శివప్రసాద్‌రెడ్డి గాని హాజరు కాలేదు. ఇటు బూచే పల్లి గృహప్రవేశానికి మద్దిశెట్టి గాని ఆయన సోదరులు కాని రాలేదు. పైగా రాష్ట్ర నాయకుల రాకపోకల్లో కూడా వ్య త్యాసం కనిపిం చింది. జిల్లాలోని ఉన్నతాధికారులు ఈ తలనొప్పి మనకెందుకులే అని రెండు చోట్లకు వెళ్లలేదు. అలాగే కొందరు వైసీపీ నేతలు కూడా అదే పంధా అనుసరించారు.  దీనికి తోడు బూచేపల్లి ఆహ్వానం మేరకు సీఎం చీమకుర్తి రానుండటం బూచేపల్లి వర్గంలో జోరును పెంచింది. మరోవైపు మద్ది శెట్టి కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మద్దిశెట్టి గృహప్రవేశానికి ముఖ్యఅతిధిగా వారి సామాజికవర్గానికి చెందిన విద్యాశాఖ మంత్రి బొత్సా సత్య నారాయణ ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. బూచేపల్లి గృహప్రవేశానికి మాజీమంత్రి, పార్టీ నేత బాలినేనితో పాటు జగన్‌ ప్రత్యేకంగా ప్రోత్సహించే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరుకావటం విశేషం. కారణాలు ఏమైనా బూచేపల్లి కార్య క్రమంలోనే ముఖ్య నాయ కులు, అధికారులు ఎక్కువగా కనపడ్డారు. ఎమ్మెల్యే గృహప్రవేశానికి వెళ్లలేకపోయిన బాలినేని ఆ తర్వాత వెళ్లి వచ్చేందుకు ప్రయత్నించగా తాను అందుబాటులో లేనని మద్దిశెట్టి చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ రెండు  కార్య క్రమాలను పరిశీలిస్తే వైసీపీలోని కాపులు ఎమ్మెల్యే గృహప్రవేశ కార్యక్రమంలో, రెడ్లు అత్యధికులు బూచేపల్లి గృహ ప్రవేశ కార్యక్రమంలో కనిపించారు.  కాగా  బూచేపల్లి ఆహ్వానం మేరకు సీఎం జగన్‌ 24న చీమకుర్తి రానుండటం ఆయనకు కలిసొచ్చింది. అయితే చీమకుర్తి ఎస్‌ఎన్ పాడు నియోజకవర్గంలో ఉండగా దర్శిలో బూచేపల్లి కార్యకర్తల సమావేశం నిర్వహించ టం విశేషం. రెండు రోజుల క్రితం దర్శిలోని ఆయన కొత్త గృహంలో బూచేపల్లి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్ పర్సన్‌ కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే కు ఈ సమావేశం సమాచారం తెలుసో లేదో కూడా తెలియదు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మ్మెల్యే, ఇన్‌చార్జులదే పూర్తి అధికా రం అనేది వైసీపీ విధానం. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా బూచేపల్లి సమా వేశం నిర్వహించటం అందునా చీమకుర్తిలో జరి గే సీఎం సభను జయప్రదం చేయమని కోరడం విశేషం. తద్వారా అటు దర్శిలో ఇటు చీమకుర్తి ప్రాంతంలో బూచే పల్లి కుటుంబం పట్టు నిరూపించుకునే లక్ష్యంతో ఆయన ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇది పార్టీ నిబంధలనకు విరుద్ధమని ఎమ్మెల్యే ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాక బూచేపల్లి వర్గీయులను దెబ్బతీసే ఎత్తుగడలకు కూడా ఆయన సిద్దమయ్యారు.  ఎంపీపీ, జడ్పీటీసీ శుక్రవారం కురిచేడు మండలం కల్లూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే నిర్వహిం చా రు. ఆ కార్యక్రమానికి ఎంపీపీ, జడ్పీటీసీలు ఇద్దరూ గైర్హజరయ్యారు. జడ్పీటీసీ తొలి నుంచి బూచేపల్లి వర్గీయుడే. అయితే ఎమ్మె ల్యే మద్దిశెట్టి సామాజికవర్గానికి చెందిన ఎంపీపీ కూడా రాకపోవటం విశేషం. ఎంపీపీ కోటేశ్వరమ్మ, ఆమె పక్షాన రాజకీయం చేసే చంద్రశేఖర్‌రావులు ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు. నిన్న మొన్నటివరకు ఎమ్మెల్యే తోటి ఉన్నవారు బూచేపల్లి గృహ ప్రవే శా నికి హాజరవ్వటం  అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ విషయంపై ఎమ్మెల్యే కూడా ఎంపీపీని పార్టీ నాయకుడు చంద్ర శేఖర్ రావును మందలించటమే కాక దూరంగా ఉండమని పరోక్షంగా సంకేతాలు పంపినట్లు తెలిసింది. అలాగే వారికి గడప గడపకు సమాచారం ఇవ్వలేదంటున్నారు. ఇటు బూచేపల్లి కూడా జనసమీకరణ పేరుతో ఏర్పాటుచేసే సమావేశాలకు ఎమ్మెల్యే కు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా బూచేపల్లితో సన్నిహితంగా ఉండేవారికి చెక్‌ పెడుతున్న సంకే తాన్ని మద్దిశెట్టి ఇచ్చేశారు. దీంతో ఇటు మద్దిశెట్టి అటు బూచేపల్లి రాజకీయంగా ఢీ అంటే ఢీ అనుకునేందుకు సిద్ధమైనట్లు తేట తెల్లమవుతుంది

విద్యుత్ కొనుగోళ్ల‌కు కేంద్రం ఓకే

గత రెండు రోజులుగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్‌) నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధిం చిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రా నికి సమాచారం అందడంతో  ఇంధన ఎక్స్ఛేంజీ విద్యుత్తు కొనుగోలుకు అనుమతులను పునరుద్దరించింది.  విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రం వెల్లడించింది.   తొలుత తెలం గాణ డిస్కంలు రూ.1360 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ విద్యుత్తు కొనుగోలు చేయకుండా అడ్డుకుంది. ఆ తరువాత ఈ బకాయిలు రూ.52.85 కోట్లుగా ఉన్నాయని పేర్కొంటూ నిషేధాన్ని కొనసాగించింది. చెల్లించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల బకాయిలపై గందరగోళం నెలకొంది.  శనివారం చెల్లించాల్సిన పాత బకాయిలు ఏమీ లేవని తెలిపింది. ఈ మేరకు ఐఈఎక్స్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయవచ్చని తెలంగాణతో పాటు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తెలంగాణ డిస్కంలు ఐఈఎక్స్‌ నుంచి 10 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి డిమాండ్‌ శనివారం 11,524 మెగావాట్లకు తగ్గింది. కేంద్రం నిషేధంతో పాటు విద్యుత్తు లోటుతో రెండు రోజులు ఇబ్బందులు వస్తాయని భావించినా, డిమాండ్‌ తగ్గడంతో పాటు కేంద్రం అనుమతించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్‌ ద్వారా విద్యు త్‌ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. తెలంగాణలో ఇటీవ‌ల‌ గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 12,114 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది 2021 ఆగస్టు 18న ఈ డిమాండ్ 8,500 మెగావాట్లు మాత్రమే   ఉంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పెద్దగా లేక పోవడం, ఉష్ణోగ్ర తలు పెరగడం, ఇళ్లకు, వ్యవసాయానికి వినియోగం పెరగడంతో డిమాండు ఎక్కు వైంది.  ప్రస్తుతం కృష్ణానదిలో భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా,  పూర్తిస్థాయిలో జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు తక్కువగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం గరిష్ఠ డిమాండు సమయంలో డిస్కంలు 2 వేల మెగావాట్ల దాకా ఎక్స్ఛేంజీలో కొంటున్నాయి. శుక్రవారం నుంచి నిషేధం విధించినందున ఈ మేర వ్యవసాయానికి త్రీఫేజ్‌ సరఫరా తగ్గించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. సమ స్య పరిష్కారమైతే ఎలాంటి కోతలు ఉండవని అధికారులు చెబుతున్నారు.  కేంద్ర ఇంధన శాఖ 2022 జూన్‌ నుంచి చెల్లింపుల్లో జాప్యానికి సర్‌ఛార్జి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యుదుత్పత్తి సంస్థలకు బిల్లులను నిర్దేశిత వ్యవధిలో చెల్లించాలి. తెలంగాణ రూ.1,600 కోట్లు, ఏపీ రూ.350 కోట్లు బకాయిలున్నాయంటూ.. విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో లావాదేవీలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి విదితమే.

బాబాను ఆశ్ర‌యించాడు.. స‌స్పెండ్ అయ్యాడు!

జ్యోతిష్కులు, బాబాలంటే క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. వారి మాటే శాస‌నంగా మారింది. చాలామంది అనేక విష‌యాల్లో వారి సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటించేస్తుంటారు. అదంతా న‌మ్మ‌కంతో కూడిన ప‌ని. అలాగ‌ని మ‌నం చేయ‌ద‌గ్గ ప‌ని కూడా బాబా ద‌గ్గ‌రికి వెళ్లి నేను ఇలా చేద్దామ‌నుకుంటున్నాను, అయిపోద్దా సామీ.. అని అడ‌గ‌డం అన్యాయం. ఆయ‌నేదో చెబుతాడు, మ‌నం ఏదో వింటాం, అవ‌త‌ల అస‌లు ప‌ని కాబోతే కొంప అంటుకునేది మ‌న‌దే!.. స‌రిగ్గా ఇలానే జ‌రిగింది ఏఎస్ ఐ అనిల్ శ‌ర్మ విష‌యంలో. గ‌త నెల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ భామిత జిల్లా ఛ‌త్రాపూర్‌లో 17 ఏళ్ల అమ్మాయి హ‌త్య‌కు గురైంది. ఆమె త‌ల్లిదండ్రులు అనుమా నితులుగా ముగ్గురి పేర్లు చెప్పారు. వారిని అరెస్టు చేసి విచారిస్తే వారికి, ఈ కేసుకీ సంబంధం లేద‌ని తేలి వ‌దిలేశారు. ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద ర్నీ ఇలానే విచారించి వ‌దిలేశారు. పై అధికారులు, అమ్మాయి బంధువుల గోడు భ‌రించ‌లేక‌పోయాడు అనిల్ శ‌ర్మ‌. లాభం లేద‌ని త‌న‌కు తెలిసిన ఒక బాబాగారి ద‌గ్గ‌రికి వెళ్లాడు. మంత్రాలేసి ఏమ‌న్నా చెబుతాడేమోన‌ని. ఆయ‌న నాలుగు నిమ్మ‌కాయ‌లు  తె ప్పించి విభూది విసిరి ఏదో చెబుతాడ‌ని గంపెడాశ‌తో కొద్దిరోజులు పోలీసాయ‌న ఆయ‌న చుట్టూ తిరిగాడు. ఆయ‌న ఏమి చెప్పాడో లేదో తెలీదుగాని పోలీసాయ‌న త‌న ప‌నికి సాములోరి సాయం కోర‌డ‌మేమిట‌ని తెలిసిన జ‌నం ప్ర‌చారం చేసి మ‌రీ తిట్టారు.  ఒక వీడియోగ్రాఫ‌ర్ వీడియో తీసి మ‌రీ ప్ర‌చారం చేసి ఘ‌న‌విజ‌యం సాధించినంత ఆనందించాడు. ఆ ఏ ఎస్ ఐని పై అధికారి నిజం గానే ఎన్ని తిట్టాలో అన్ని తిట్టి శ‌ర్మ‌నీ, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన ఇత‌ర పోలీసుల్ని కూడా స‌స్పెండ్ చేశారు. ఆ త‌ర్వాత వారం రోజుల‌కు అస‌లు నిందితుడు దొరికాడు. అత‌నెవ‌రో కాదు అమ్మాయి మేన‌మామ తీర్ధ అహిర్వార్. అత‌న్ని జైల్లో వేసి విచారిస్తు న్నారు. అయితే ఇత‌న్ని తామే ప‌ట్టుకున్నామ‌ని, ఎలాంటి సాములోరి స‌ల‌హాలు, సూచ‌న‌లు లేవ‌ని స‌ద‌రు పోలీసు అధికారి ప్ర‌క‌టించడం కొస‌మెరుపు. 

యు.ఎస్‌లో పెరుగుతోన్న హానా క్రేజ్‌

చిన్న‌పుడు మ‌న ఇళ్ల ద‌గ్గ‌రికి వ‌చ్చి జోస్యం చెబుతాం రండి.. చిల‌క జోస్యం చెబుతాం రండి.. అంటూ రంగుల దుస్తుల్లో వ‌చ్చే వాడంట వాడి మాట‌ల‌కు, పాట‌కు అంత క్రేజ్ ఉండేది. పంజ‌రంలోంచి చిల‌క‌ను బ‌య‌టికి తీసి దాని ముందు ప‌ది కాయితాలు ప‌డేస్తే ఏదో ఒక కాయితం ప‌ట్టి వాడికి ఇస్తే, ఏదో చ‌దివి చెబుతూంటాడు. చిత్రంగా అంద‌రికీ మేలే జ‌రిగే మాట‌లే చెబుతాడు. వాడికి నాలుగు డ‌బ్బులు కావాలిగనుక‌!  నిజంగా భ‌విష్య వాణి చెప్పేవారు చాలా అరుదు. మ‌నిషిలో ఏదో అతీత‌శ‌క్తి ఒక్కోసారి అలా మాట్లాడిస్తుంద‌నే వాద‌నా ఉంది. కానీ అదో నిమిషాల స‌మ‌య‌మే మాట్లాడ‌నిస్తుంది. కొంద‌రు గుర్తుంచుకుని రాసి పెడ‌తా రు. వాటిలో ఒక్క‌టి రెండు త‌ప్ప అన్నీ జ‌రుగు తాయి. ఇపుడు లేటెస్ట్‌గా అలాంటివారి జాబితాలోకి చేరింది హానా కారొల్‌. ఈ 19 ఏళ్ల అమెరికా అమ్మాయి 2022లో జ‌రిగే ప‌ది అద్భుతాల‌ను ఏకంగా నోట్‌బుక్‌లో రాసింద‌ట‌. ఎలిజిబ‌త్ రాణి మ‌ర‌ణం, హేలీ బీబ‌ర్ గ‌ర్భందాల్చడం కూడా అందులో ఉన్నాయి. ఆధునిక భావాలున్న ఈ అమ్మాయి ఎక్కువ‌గా పాప్ క‌ల్చ‌ర్ అంటే ఇష్ట‌ప‌డుతుంది, సెల‌బ్ర‌టీస్‌ని క‌లుస్తూంటుందిట‌.  అయితే క్ర‌మేపీ కేవ‌లం ఫోటోలు చూసి మ‌రీ చెప్ప‌గ‌లిగే స్థాయికి ఎది గింది. నెల‌కు ల‌క్ష‌న్న‌ర సంపాదిస్తోంది. ఎవ‌ర‌యినా ఫోటో పంపితే దాన్ని ప‌ట్టుకుని ఒక్క ప‌ది ప‌దిహేను నిమిషాలు ఏకాంతంలో ఆ ఫోటోనే చూస్తూంటే త‌న‌కు తెలియ‌కుండానే ఆ వ్య‌క్తి గురించి తెలిసిపోతోంద‌ని చెబుతోంది  హానా. ఫోటోలు పంపేవారి ప్రేమ జీవితం, పెళ్లి, ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం గురించి అనేక అంశాలు చెబుతుంది. చాలామంది త‌న‌కు వీరాభిమానులుగా మారార‌ని అంటోంది. అయితే ఇంత పేరు ప్ర‌తిష్ట‌లు గ‌డించినా హానా మాత్రం చాలా మామూలు అమ్మాయిలానే జీవించాల‌నుకుంటోంది. ఎవ‌రో వ‌చ్చి త‌న‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం, స‌న్మా నాలు చేసి చెక్ ఇవ్వ‌డాలు ఇలాంటివి త‌న‌కు న‌చ్చ‌వ‌ని చెబుతోంది. భ‌విష్య‌త్ చెప్ప‌డం అనేది త‌న‌కు కొంత తెలియ‌కుం డానే జ‌రిగిపోతోంది గ‌నుక తాను ప్ర‌త్యేకించి అందుకు శిక్ష‌ణ తీసుకోలేదంటుంది హానా. భోజ‌నం చేసినంత సులువుగా జ‌రిగి పోతోంది.. మాన‌సిక ఒత్తిడికి కూడా గురి కావ‌డం లేద‌ని ఆమె అన్న‌ది.

జూనియర్ ఎన్టీఆర్ కు అమిత్ షా ఆహ్వానం.. కారణమేమిటంటే?

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు అమిత్ షా నుంచి ఆహ్వానం అందింది. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన అమిత్ షా నోవాటెల్ హోటల్ లో బస చేశారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు రావాలని అమిత్ షా నుంచి ఎన్టీఆర్ కు తనతో ఢిన్నర్ సమావేశానికి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్లు, అందుకు జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించినట్లు  విశ్వసనీయంగా తెలిసింది. దీంతో అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ  భేటీ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు  సభకు వచ్చిన అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా భేటీకి ఆహ్వానించడం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ ప్రచారం చేశారు.  అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అమిషాల భేటీని చూడాల్సి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భేటీ సందర్భంగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది. ఒక వేళ అందుకు జూనియర్ ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో ఆయనను తెలుగుదేశం తెలంగాణ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరే అవకాశం ఉందని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం 30 స్థానాలలో తెలుగుదేశం పార్టీకి ప్రభావమంతమైన ఓటు బ్యాంకు ఉంది. అంతే కాకుండా తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రుల ఓటు అత్యంత కీలకం. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులలో అత్యధికులు తెలుగుదేశం మద్దతుదారులే అన్న అంచనాతో.. ఉన్న బీజేపీ వారి ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.   తెలుగుదేశం పార్టీకి ఏపీలో మద్దతు ఇవ్వడానికి అందుకు ప్రతిగా తెలంగాణలో తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇరు పార్టీల మధ్యా ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని పరిశీలకులు సైతం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించే అవకాశం ఉందని, ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ అందుకు సుముఖంగా లేకపోతే తెలంగాణ తెలుగు దేశం అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరే అవకాశం ఉందనీ అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం బలానికి, ఆ పార్టీ తెలంగాణ శాఖకు జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్ష పగ్గాలు చేపడితే.. మరింత బలోపేతం అవుతుందని బీజేపీ భావిస్తున్నది. దీంతో తెలుగుదేశం అండతో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం మరింత సులభతరమౌతుందని బీజేపీ ఆశిస్తున్నది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో మునుగోడులో ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 

జగన్ ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరి కొద్ది గంటలలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం జగన్ హస్తిన పర్యటనను బయలుదేరుతారు.  రాత్రి ఢిల్లీలోనే సీఎం జగన్ బస చేసి సోమవారం (ఆగస్టు 22) ఉదయం  పదిన్నర గంటలకు గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోడీతో జగన్ చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలను కూడా సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలుస్తారు.  అలాగే అందుబాటులో ఉన్న కొందరు కేంద్ర మంత్రులను కూడా  జగన్ కలసే అవకాశాలున్నాయి.   రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ద్రౌపది మర్ము అమరావతి  వచ్చిన సందర్బంగా సీఎం జగన్ ఆమెకు తన నివాసంలో తేనేటి విందు ఇచ్చి సత్కరించారు. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో నూతన రాష్ట్రపతితో జగన్ మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు. ఆ తరువాత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ కర్ తోనూ సమావేశం కానున్నారు. కాగా   ప్రధాని మోదీతో భేటీలో   జగన్ కీలక అంశాల పైన క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్య..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ,  సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై జగన్ మోడీతో చర్చించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇవి కాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా మోడీతో జగన్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీ సందర్భంగా ప్రదాని మోడీ చంద్రబాబుల భేటీ తరువాత విస్తృతంగా ప్రచారం అవుతున్న రాజకీయ సమీకరణాల మార్పు అంశంపై జగన్ ప్రధాని నుంచి క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

పలాస వద్ద లోకేష్ అరెస్టు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పలాస  వెడుతుండగా శ్రీకాకుళం సమీపంలో హైవేపై పోలీసులు ఆయనను అడ్డగించారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా కొత్తరోడ్డు  జంక్షన్ వద్ద  లోకేశ్‌ సహా మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా  పోలీసులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నారా లోకేష్, మాజీ మంత్రులు చినరాజప్ప, కళావెంకటరావు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసి జేఆర్ పురం పోలీసు స్టేషన్ కు తరలించారు. గత కొద్ది రోజులుగా పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల కిందట తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్ సూర్యనారాయణ ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా తెలుగుదేశం శ్రేణులు అడ్డుకున్నాయి.   అలాగే తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ చార్జి గౌతు శిరీష్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ తో పలాసలోని తెలుగుదేశం కార్యాలయం ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించేందుకు పలాస వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు.  శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసులు వైఫల్యం చెందారనీ, తమ పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డుకోవడమేమిటని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా  పలాసలో ఆదివారం (ఆగస్టు 21)ఎలాంటి ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు.  తెలుగుదేశం కార్యాలయం ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చన నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 21) పలాస, కాశీబుగ్గ పట్టణాల్లో నిషేధాజ్ణలు అమలులో ఉన్నాయని, అందుకే బయటవారెవరినీ పట్టణంలోనికి అనుమతించడం లేదని రాధిక తెలిపారు. కాగా లోకేష్ అరెస్టుతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్ గూటికి త్రిష.. త్వరలో అధికారిక ప్రకటన?

ప్రముఖ హీరోయిన్ త్రిష రాజకీయ అరంగేట్రంకు రంగం సిద్ధమందా?సీనియర్ల అడుగుజాడలలో నడిచేందుకు ఆమె రెడీ అయిపోయరా? ఇటీవలి కాలంలో సినిమాలలో ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో త్రిష చూపు రాజకీయాలవైపు మళ్లిందా అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానమిస్తున్నారు. తమిళనాడులో సినిమా నటులకు రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఎంజీఆర్ నుంచి తీసుకుంటే జయలలిత, కెప్టెన్ ప్రభాకర్, కమల్ హసన్, ఖుష్బు ఇలా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నటీనటుల జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో త్రిష పేరు కూడా చేరనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు. తమిళనాడు కాంగ్రెస్ కు చెందిన ప్రముఖులు త్రిషతో సంప్రదింపులు కూడా జరిపారంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఖుష్బూ కూడా త్రిషను కమలం గూటికి చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. అయితే త్రిష మొగ్గు మాత్రం కాంగ్రెస్ వైపే ఉందని అంటున్నారు. కాగా త్రిష కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయమైందని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున పోస్టింగ్ లు దర్శన మిస్తున్నాయి. అధికారికంగా త్రిష తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ ఆమె త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్ అధినేత్రిగా ప్రియాంక?

కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. త్వరలోనే నామినేషన్ల ప్రక్రియకు ఆ పార్టీ శ్రీకారం చుట్టనుంది. ఇదంతా ప్రతి పార్టీలోనూ మామూలుగా జరిగే వ్యవహారమే. కానీ కాంగ్రెస్ పార్టీ విషయం మాత్రం ప్రత్యేకం. పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటుండటం, ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు మోస్తున్న సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం.. గాంధీ కుటుంబం వినా మరో వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నిక గడువు సమీపిస్తున్న సమయంలో కూడా పార్టీ చీఫ్ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ పార్టీ నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. అనివార్య పరిస్థితిలో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇక ఆ బాధ్యతలు తాను చేపట్టలేనని సోనియా కూడా తేల్చేశారు. దీంతో పార్ట అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారన్న విషయంలో పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ప్రియాంకు ఒప్పించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని పరిశీలకులు అంటున్నారు. ఎందు కంటే గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయట నుంచి ఎవరైనా పార్టీ పగ్గాలు చేపడితే.. పార్టీని ఐక్యంగా ఉంచడం సాధ్యం కాదని పార్టీలో మెజారిటీ నాయకులు భావిస్తున్నారు.  అందుకే పార్టీ మొత్తం ఇప్పుడు ప్రియాంక వైపు చూస్తున్నది. ఆమెలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయని చెబుతుంటారు. ప్రియాంక గాంధీ కూడా ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రత్యక్ష ఆందోళనల్లో సైతం పాలు పంచుకుంటున్నారు. దీంతో ఆమెకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. అయితే ఇటీవలి యూపీ ఎన్నికలలో వైఫల్యం ఆమెకు ప్రతిబంధకంగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఆగస్టు 21(ఆదివరం) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 28 నామినేషన్ల దాఖలుకు తుది గడువు.  ఆగస్టు 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఆగస్టు 28.  అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనా ఇప్పటికీ అధ్యక్ష పదవికి నామినేషన్ల వ్యవహారంలో పార్టీ ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. ఇంకా అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిందిగా పార్టీ సీనియర్లు రాహుల్ గాంధీని ఒప్పించేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.  అలాగే ఆయన పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల విషయంలో కూడా అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమి ఏర్పాటులో కూడా ఆయన జోక్యం ఇసుమంతైనా లేదు.  ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్లు ప్రియాంక వైపు చూస్తున్నారు.పార్టీలో నాయకత్వ సంక్షోభానికి తెరపడాలంటే పార్టీ పగ్గాలు అందుకోవడానికి రాహుల్ గాంధీ అయినా అంగీకరించాలి.. లేదా ప్రియాంక గాంధీ అయినా ముందుకు రావాలని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఒక వేళ అనివార్యంగా గాంధీ కుటుంబానికి చెందని వారెవరైనా పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వస్తే ఆ వ్యక్తి ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు ఏ మాత్రం లేవు. 

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో జాప్యం ఎందుకంటే?

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని ఖరారు చేసి చాలా రోజులే అయ్యింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా కేసీఆర్ నేడో రేపో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అసలు శనివారం (ఆగస్లు 20)న మునుగోడులో జరిగిన సభలోనే కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. అలా భావించానికి కారణం మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి పేరును సీఎం కేసీఆర్ మునుగోడు బహిరంగ సభ వేదికగా ప్రకటిస్తారని గతంలో చెప్పారు. దీంతో అంతా సభా వేదిక మీద నుంచి కేసీఆర్ అభ్యర్థి పేరును ప్రకటించి, ప్రజలకు ఆయనను పరిచయం చేస్తారని అనుకున్నారు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్ సభా వేదిక నుంచి మునుగోడు అభ్యర్థిని ప్రకటించలేదు. కనీసం చూచాయిగా కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని ప్రకటిస్తే తామంతా సహాయ నిరాకరణ చేస్తామని అసంతృప్తి నేతలు ఒక సమావేశం పెట్టి మరీ నిర్ణయించడంతో అభ్యర్థి ప్రకటన వాయిదా పడిందని అంటున్నారు. అసమ్మతి నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. జగదీశ్ రెడ్డితో భేటీ తరువాత కూడా అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. మునుగోడుకు చెందిన కొందరు అసమ్మతి నేతలు బీజేపీ గూటికి చేరడమూ జరిగిపోయింది. ఇంకా పలువురు అసమ్మతి నేతలు కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని బహిరం సభ వేదికగా ప్రకటిస్తే.. ఆ తరువాత తామూ ఒక సభ పెట్టి తన నిర్ణయాన్ని వెలువరిస్తామని హెచ్చరించినట్లు కూడా చెబుతున్నారు. కేసీఆర్ స్వయంగా అసమ్మతి నేతలతో భేటీ అయ్యి బుజ్జగించినా పూర్తి ఫలితం రాలేదన్నది పార్టీ వర్గాల కథనం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా బహిరంగ సభ వేదికగా అభ్యర్థి పేరును ప్రకటించలేదని అంటున్నారు. ముందుగా మునుగోడులో కూసుకుంట్ల అభ్యర్థిత్వంపై ఉన్న వ్యతిరేకతను చల్లార్చిన తరువాతే అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషనే వెలువడలేదు.. అప్పుడే అభ్యర్థి ప్రకటనపై తొందర ఎందుకు, వేచి చూసే ధోరణి అవలంబించడం బెటర్ అని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఆ నలుగురూ రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాల అభివృద్ధి.. రేవంత్

మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని అంటున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి, నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసమే ఉప ఎన్నిక అంటున్న బీజేపీకి తెలంగాణ కాంగ్రస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టి రిటీర్డ్ ఇచ్చారు. అభివృద్ధి కోసమే అయితే రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేయవచ్చుకదా అని ప్రశ్నించారు. చౌటుప్పల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాజగోపాలరెడ్డి సరే అంటే ఆయనకు కాంగ్రెస్ బీఫాం ఇస్తామన్నారు. అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసమే ఉప ఎన్నిక అంటున్న బీజేపీ ఒక్క మునుగోడుతో ఆగిపోవడం ఎమిటని ప్రశ్నించారు. ఆ పార్టీకి ఉన్న నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ది చెందుతాయిగా అన్నారు.   టీఆర్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని అన్నారు. మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొదరుడు, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేస్తారని రేవంత్ చెప్పారు. పార్టీ మారిన వారు తనపై విమర్శలు చేయడాన్ని రేవంత్ లైట్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఒక్కడిదీ కాదనీ,చాలా మంది సీనియర్లు ఉన్నారనీ చెప్పిన రేవంత్.. సమష్టిగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేసీఆర్ భ్రష్టు పట్టించారనీ, అలాగే కేంద్రం కూడా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని విమర్శించిన రేవంత్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని, డిండి ఎత్తిపోతల పథకానికి   ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.