తెలంగాణలో 81 ఆస్పత్రులు సీజ్.. ఎందుకంటే?

కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రులు, అర్హత లేని వైద్యులపై  తెలంగాణా సర్కార్ కొరడా ఝుళిపించడానికి సిద్ధమైంది. కనీస సౌకర్యాలు లేని ఆస్పత్రులు, క్లినిక్ ల పై  చర్యలు తీసుకోవాలని. జిల్లా వైద్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అర్హత లేకుండా అలోపతి వైద్యం చేస్తున్న డాక్టర్ల పై చర్యలకు ఉపక్రమించింది. జిల్లా వైద్య సిబ్బంది చేసిన తనిఖీలలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు తనిఖీలలో కనీస సౌకర్యాలు లేని క్లినిక్కులు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని ,81 ఆసుపత్రులను సీజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు.   31 జిల్లాలలో వైద్యసిబ్బంది చేసిన తనిఖీలలో ప్రయివేట్ ప్రాక్టీస్ చేసే వారు రిజిస్టర్డ్ ప్రాక్టీష్ నర్లు గా ఉంటూ ఆసుపత్రి నిర్వహించడం తమ పేరుకు ముందు  డాక్టర్ అని రాసుకోవడం గుర్తించి, అటువంటి వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గతకొన్ని రోజులుగా తెలంగాణ సర్కార్ ప్రభుత్వ డాక్టర్ల పై చర్యలకు చర్యలు చేపట్టిందని అందుకోసం ప్రభుత్వం వారి ఫోన్లలో జిపి ఎస్ ట్రాకింగ్ ప్రవేశ పెట్టి వారు ఎక్కడికి వెళుతున్నది నిఘా పెట్టనున్నట్లు సమాచారం అందింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డాక్టర్లు,క్లింక్ ల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు 1,568 ప్రివేయిట్ ఆసుపత్రులు, క్లినిక్ లలో తనిఖీలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆ తనిఖీల సందర్భంగా 416 ఆసుపత్రుల లో సౌకర్యాలు చట్టప్రకారం లేవని గుర్తించినట్లు వివరించింది. అలాగే   క్వాలిఫికేషన్ లేని పలువురు వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. అలా గుర్తించిన వారిలో కొందరికి రిజిస్ట్రేషన్ లేదనీ,కొందరు లైసెన్స్ రెన్యువల్ చేయించుకోలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు.   చట్టపరంగా అనుమతులు లేని మెడికల్ ప్రాక్టిషనర్లపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్  చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.   రాష్ట్రంలో జిల్లా వైద్య అధికారులు సాగిస్తున్న తనిఖీలను ప్రజారోగ్య శాఖ డైరెక్టర్   డాక్టర్ జి శ్రీనివాస్ ధృవీకరించారు.  రిజిస్టర్డ్ డాక్టర్లకు లైసెన్స్ రెన్యువల్ కు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు.  అర్హత లేని డాక్టర్లు,  క్లినిక్ ల నుంచి  జిల్లా వైద్య సిబ్బంది వసూళ్ళ కు దిగుతున్నారన్న ఫిర్యాదులు ఈ సందర్భంగా వెల్లువెత్తడం కొసమెరుపు.  

జగన్ పాలనను మరోసారి ఏకి పారేసిన తెలంగాణ మంత్రి

ఏపీ అభివృద్ధి లేమికీ, అరాచకానికీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఈ మాట ఏ తెలుగుదేశం పార్టీ వారో, లేదా రాష్ట్రంలోని వైసీపీ ప్రత్యర్థులో, సీఎం జగన్ వ్యతిరేకులో అనడం లేదు. పొరుగు రాష్ట్రం మంత్రులు బహిరంగ సభలలో చెబుతున్నారు. ఏపీలో జగన్ పాలన నిర్వాకాన్ని రాష్ట్రంలో రాజకీయ పార్టీలో, విపక్షమో విమర్సిస్తే ఏదో అనుకోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రాల మంత్రులు తమ రాష్ట్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతోందో చెప్పుకోవడానికి అభివృద్ధి లేమికీ, అరాచక పాలనకూ నమూనాగా ఏపీని చూపిస్తున్నారు. తాజాగా హరీష్ రావు  ఏపీలో ఉద్యోగులు, టీచర్లు పడుతున్న అవస్థలను, ఆందోళనలను ఆ ఆందోలనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ తెలంగాణలో ఉద్యోగులను ప్రభుత్వం ఎంతో గొప్పగా గౌరవిస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రభుత్వం ఉద్యోగులపై కేసులు పెట్టి లోపలేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం  వారికి మంచి ఫిట్ మెంట్ ఇచ్చి గౌరవించిందని చెప్పారు.ఏపీలో టీచర్లు పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిపై ప్రభుత్వం పలు రకారల కేసులు పెట్టింది.  అరెస్టులు చేయించింది. అంతేనా ఉపాధ్యాయులకు బ్రాందీ షాపుల వద్ద డ్యూటీలు వేసింది. బాత్ రూములు శుభ్రం చేయించింది. ఆ ఫొటోలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు అవే అంశాలను ప్రస్తావించిన తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలంగాణ టీచర్లను తాము ఎంత గౌరవం ఇస్తున్నామో వివరించారు. తమ పాలన ఎంతో గొప్పగా ఉందని చెప్పుకోవడానికి ఏపీలో జగన్ పాలనను హేళన చేశారు. హరీష్ రావు చెప్పిన వన్నీ వాస్తవాలే. ఏపీ లో జగన్ సర్కార్ పొరుగు రాష్ట్రాలలో ఎంతగా నవ్వుల పాలౌతోందో చెప్పడానికి తాజాగా హరీష్ రావు వ్యాఖ్యలు తిరుగులేని రుజువు అనడంలో సందేహం లేదు. అయితే తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలే కాదు.. తెలంగాణ మంత్రులు సమయం దొరికినప్పుడల్లా ఏపీలో జగన్ ప్రభుత్వ నిర్వాకాలపైనా, పరిపాలనా తీరుపైనా విమర్శలు గుప్పించడం ఒక రివాజుగా మారిపోయింది.   తమ పాలనను గొప్పగా చూపుకోవడానికి ఏపీ సర్కార్‌పై వేసిన సెటైర్లు వేయడానికి వ్యవసాయ మోటార్లకు కరెంట్ మీటర్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం కామన్.  మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే రైతుల మెడకు ఉరితాడు తగిలించడమేనని .. అలా మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఏపీ సర్కార్ అప్పు తెచ్చుకుందనీ, రైతుల మెడకు ఉరితాళ్లు వేయడానికి అంగీకరించి ఉంటే తమ రాష్ట్రానికీ  ఏటా రూ. ఆరు వేల కోట్లు వచ్చేవనీ,  కానీ తమకు కేంద్రం సొమ్ములు కాదు..రైతు సంక్షేమమే ముఖ్యం కనుక అంగీకరించలేదనీ కూడా హరీష్ రావు చెప్పారు. గతంలో కేటీఆర్ ఏపీలో కరెంట్ కష్టాల గురించి ప్రస్తావించిన విధంగానే తాజాగా హరీష్ రావు కూడా తాను తిరుపతి వెళ్లినప్పుడు.. తాడిపత్రికి చెందిన ఓ రైతును కరెంట్ పరిస్థితి గురించి అడిగితే  రోజుకు కేవలం మూడు గంటలు అదీ   వచ్చి పోతూంటుందని  చెప్పాడని హరీష్ రావు తెలిపారు. అయితే కేటీఆర్, హరీష్ రావు మాత్రమే కాదు ఏపీలో పరిస్థితులను చూపుతూ తమ సర్కార్ ను పొగుడుకునే విషయంలో  తెలంగాణ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ ఇలా ఎవరూ ఒక్క నిముషం కూడా సందేహించరు. పైగా వారి విమర్శలకు, హేళనలకు స్పందించేందుకు ఏపీ సీఎం సహా మంత్రులెవరికీ నోరు రాదు. జగన్ పాలనలో ఏపీ ప్రతిష్ట దిగజారిపోయిందనడానికి తెలంగాణ మంత్రుల విమర్శలే తిరుగులేని నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు  . గతంలో ఓ సందర్భంలో కేటీఆర్.. ఏపీలో నివసించడం నరకం అని తన స్నేహితులు చెప్పారని ప్రకటించారు. ఇప్పుడు హరీష్ రావు కూడా దాదాపుగా అదే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం మంత్రులు ఏపీ పరువును గంగలో కలిపేసేలా వ్యాఖ్యలు చేస్తున్నా   ఏపీ మంత్రులకు, వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడానికి నోరు రావడం లేదంటే  అందుకు కారణం ఏపీలో పరిస్థితులు అంత అధ్వానంగా ఉండటమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ప్రతిష్ఠాత్మకమైన    క్రెడాయ్ స‌మావేశంలో కేటీఆర్ ఏపీ బండారం బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.  జ‌గ‌న్ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దుస్థితిని, దౌర్భాగ్యాన్ని కేటీఆర్ క‌ళ్ల‌కు క‌ట్టేలా వివ‌రించారు. ఏపీలో విప‌రీత క‌రెంట్ కోత‌లు, ఊరూరా గుంత‌లు మ‌య‌మైన రోడ్లు, తాగు-సాగు నీటి క‌ష్టాలను ప్ర‌పంచానికి తెలిసేలా..  కీల‌క‌మైన క్రెడాయ్ వేదిక‌గా గొంతెత్తి చాటారు కేటీఆర్‌. ఏపీ పరిస్థితిపై మిత్రులు చెప్పిన మాటలంటూ ఏపీ దుస్థితిని స‌భాముఖంగా వివ‌రించారు. "పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానం, అన్యాయంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేదేదీ అతిశయోక్తి కాదు. పక్క రాష్ట్రం వెళ్లి తెలుసుకోవచ్చు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. మీరే వెళ్లి చూడండి. పక్క రాష్ట్రం వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు" అని కేటీఆర్ అప్పట్లో అన్నారు.  చంద్ర‌బాబు హ‌యాంలో స‌న్‌రైజ్ స్టేట్‌గా ఏపీ అభివృద్ధి, అమ‌రావ‌తి రాజ‌ధాని గురించి.. దేశంలోనే కాకుండా, ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గింది. ప్రపంచం మొత్తం నవ్యాంధ్ర వైపు ఆసక్తిగా చూసింది. కానీ జగన్ అధికారం చేపట్టిన ఈ మూడేళ్లలో ఏపీ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సీన్ రివర్స్ అయ్యింది.  ఒక్క‌ఛాన్స్ అంటూ అంద‌ల‌మెక్కిన జ‌గ‌న్‌.. ఏపీని అంథ‌కార‌ప్ర‌దేశ్‌గా మార్చేశారు. ఎడాపెడా క‌రెంట్ కోత‌లు.  చంద్ర‌బాబు హ‌యాంలో ఒక్క గంట కూడా క‌రెంట్ కోత అనే మాటే వినిపించ‌లేదు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌తో మాత్రం ఒక్క గంట క‌రెంట్ ఉంటే అదే అదృష్టం అనేలా దాపురించింది.  అలాగే రోడ్ల సంగ‌తి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్లుగా పరిస్థితి తయారైంది. తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లు మిన‌హా.. ఈ మూడేళ్ల‌లో కొత్త‌గా ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు వైసీపీ. ఎక్క‌డిక‌క్క‌డ దారుణంగా దెబ్బ‌తిన్నాయి ర‌హ‌దారులు.  అప్పుల‌తో కాలం గడుపుతున్న సర్కార్ కు ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డ‌మే క‌ష్ట‌మైపోతోంది.   చంద్రబాబు హయాంలో ఏపీ గురించి దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా మాట్లాడుకునే వారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు.   ఇప్పుడు జగన్ హయాంలో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఏపీ గురించి ఎవరు మాట్లాడినా హేళన చేయడానికే మాట్లాడుతున్నారు. పారిశ్రామిక వేత్తలు ఏపీ అంటేనే భయపడి పారిపోతున్నారు. రాష్ట్రంలో జనం జగన్ కు అనవసరంగా  ఒక్క‌ఛాన్స్ ఇచ్చామని అంటున్నారు.   

ప్రైవేట్ ఆసుపత్రులలో సిటిజన్ చార్టర్ పెట్ట‌రా?

ఏ ఊరెళ్లినా, ఎక్క‌డ‌యినా దుకా ణం పేరు, వ‌స్తువుల ధ‌ర‌లు తెలియ‌జేస్తూ ఒక బోర్డు రాసి ఉంటుంది. క‌నీసం ఒక్కోవ‌స్తువు ఇంత అవుతుంద‌ని చెప్పేందు కు సిద్ధంగా ఉంటారు. పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో పేరు ఉండి లోప‌లికి వెళితే దేనికి ఎంత‌వుతుంది అనే ది అడిగానా పెద్ద‌గా చెప్ప‌క ర‌హ‌స్యంలా ఉంచి ఆ త‌ర్వాత భ‌య‌పెట్టేది మాత్రం ఆసుప‌త్రు లే! పూర్వం ఏ న‌ర్సో, కౌంట‌ర్లో క్ల‌ర్కో చెప్పేవారు త‌ల‌నొప్పి మం దుల‌కు ఇంత‌, చిన్నా ప‌రేష‌ న్‌కి ఇంత అని..ఇటీవ‌లి కాలంలో ప్ర‌యివేటు, ప్ర‌భుత్వ ఆసు పత్రు ల్లోనూ వేడుకున్నా ఎవ‌రూ చెప్ప‌డం లేదు. క‌నీసం ఆప‌రేష‌న్‌కి దాదాపు ఇంత అవ‌చ్చు అని అందాజా కూడా చెప్ప‌డం లేదు. ఎందుకు అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. వాస్త‌వానికి సిటిజ‌న్ చార్ట‌ర్ ఏర్పాటు గురించిన ప్ర‌జ‌ల డిమాండ్ చాలాకాలం నుంచే ఉంది. కానీ ఆరోగ్యశాఖ ప‌ట్టించుకోవ‌డం లేదు. దీన్ని ఆసుప‌త్రులు బాగా అనుకూలం చేసుకుంటు న్నాయి.  ప్రైవేట్ ఆసుపత్రులు సామాన్యుడి ని నిలువునా దోచేస్తున్నాయి. రోగులకు  సర్జరీకి అసలు అయ్యేది ఎంత? అన్న అంశం పై అటు రోగికి కాని రోగి బంధువుకు కాని కనీస అవగాహన లేకపోవడం తో ఆసుపత్రుల భాగోతం శ్రుతిమించుతోంది.జనరల్ వార్డ్ బెడ్ రోజుకు ఎంత? షేరింగ్ రూమ్ రోజుకు ఎంత? స్పెషల్ రూమ్ రోజుకు ఎంత ?అన్న విషయం   రోగి బంధువుకు  అవగాహాన లేదు సరికదా ఏ సర్జరీకి ఎంత అవుతుంది. ఆయా ఆసుపత్రులలో ఐ సి యు బెడ్ ఎంత? నాన్ ఏ సి బెడ్ ఎంత? రోజుకు ఎంత అన్న సమాచారం తప్పనిసరిగా సిటిజన్ చార్టర్ రూపంలో పెట్టాల్సిందే. అలాగే డాక్టర్ కన్సల్టెంట్ ఫి ఎన్నసార్లుకు వినియోగించ వచ్చు ప్రస్తుతం డిజిటల్ వ్యవస్థ వచ్చాక ఆయా ఆసుపత్రులలో ఎన్నిపడ కల ఆసుపత్రి ఏది ఎక్కడఉంది? ప్రతి టెస్ట్కు ఎంత ఖర్చు అవుతుంది అన్న సమాచారం సిటిజన్ చార్టర్ లో పెట్టాలి. అక్కడి డాక్టర్ల వివరాలు అయా శాఖలు. హెచ్ఓడి వివరాలు సిటిజన్ చార్టర్ లో చేర్చాలని సామాన్యుడు డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే, ఆసుప‌త్రికి వ‌చ్చిన రోగిని అనేక ప‌రీక్ష‌లు అతిగా చేసి చివ‌రికి పెద్దాప‌రేష‌న్ చేయాల‌ని వీల‌యితే వాడి ఆస్తంతా లాగేసుకునే ప్ర‌య‌త్నాలే చేస్తున్నాయి ఈరోజుల్లో ఆసుప‌త్రులు అనే అప‌వాదు ఉంది. అందుకే ఆసుప‌త్రికి వెళ్ల‌కుండానే ఉండాల‌ని కోరుకుంటున్నారు. అందుకే నాటువైద్యులు కూడా దేవుళ్ల‌యి కూర్చున్నారు.  ఈ సిటిజన్ చార్టర్ ముఖ్య ఉద్దేశ్యం ఒకటే మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి పేరుతో వైద్యం చేసిన ఘటన వెలుగు లోకి వచ్చింది. మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్ లేకుండానే ఆసుపత్రిని నడుపుతూ రోజుకు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. గతంలో కీళ్ళ మార్పిడి సర్జరీకి లక్ష నుండి లక్షా యాభై రూపాయలు సర్జరీకి అయ్యేఖర్చు కోరోనా తరువాత కీళ్ళ మార్పిడి సర్జరీ నాలుగు లక్షలకు చేరింది ఇది ప్యాకేజి మాత్రమే. అయితే సర్జరీ తరువాత రోగికి వచ్చిన ఫైనల్ బిల్ ఎనిమిది లక్షలు దీంతో లబోదిబోమన్న రోగి అంత బిల్లు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడినించి తేవాలో అర్ధం కాక తీవ్ర విషాదం లో మునిగి పోయారు. ఇంతేకాదు కేవలం సర్జరీ కి చెప్పింది నాలుగు లక్షలయాభై వేలు. కాని వచ్చిన బిల్లు ఎనిమిది లక్షలు దిస్చార్జికి ముందు కట్టి వెళ్ళాలంటూ హుకూం జారీ చేసారు సదరు అకౌంట్స్ మేనేజర్  అప్పటికప్పుడు కట్టాలంటే ఇల్లె అమ్ముకోవాల్సిందే. మామూలు ప్యాకేజికి అదనంగా జిఎస్టే అంటూ అదనంగా,ఇతర సేవల రూపంలో దోచేయడం పై సామాన్యుడు తీవ్రఆందోళనకు గురిఅవుతున్నాడు. అప్పటి కప్పుడు అప్పుపుట్టడం అసాధ్యం. అసలు ఇన్సూరెన్స్ పోగా అదనపు భారంపడుతూ ఉండడంతో ఏమిచేయాలో అర్ధంకాక వెర్రి చూపు లు చూస్తూ చేసేది లేక కట్టే వెళుతున్నారు. ఇదే పరిస్థితి మధ్య తరగతి ఆర్ధికంగా దిగువన ఉన్నవాళ్ళకే వస్తే ఇంకే ముంది డబ్బు కట్టలేక ఆత్మహాత్య మినహా మరోమార్గం లేదని సామాన్యుడు వాపోతున్నాడు.       కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్,లివర్  ట్రాన్స్ ప్లాంట్,హార్ట్  ట్రాన్స్ ప్లాంట్ కి ఎంత ఖర్చు అవుత్నుందో కూడా అంచనా వేయలేము. అసలు సస్త్రచికిచ్చల ఖర్చు సామాన్యుడు భరించగాలడా? వీటి వివరాలను అయ్యే ఖర్చును సిటిజన్ చార్టర్ లో పెట్టాలి అన్నది సామా న్యుడి డిమాండ్. సిటిజన్ చార్టర్ లో స్పష్టంగా ప్రక టించాలని. సాధారణ సర్జరీ లప్రో స్కోపిక్ సర్జరీ,బెరియాటిక్ సర్జరీ వికటించిన సందర్భాలు ఉన్నాయి.రోగి సర్జరీ టేబుల్ పైనే చనిపోయిన ఘటనలు చూసాం. అయితే సర్జరీ ముందుగానే వివరాలు చెప్పకుండా కేవలం కౌన్సిలింగ్ చేసి నిరయం కాకుండా సర్జరీకి వెళ్ళే ముందు ఎన్ ఓ సి పై సంతకం పెట్టించుకోవడం వంటి పద్దతికి స్వస్తి చెప్పాలి. రోగి పూర్తి బాధ్యత ను ఆసుపత్రి తీసుకోవాలి. రోగికి చేస్తానన్న సర్జరీ కాక మరో సర్జరీ చేసినా, చెప్పిన ప్యాకేజికి బదులు అదనపు ప్యాకేజి కింద అదనపు డబ్బు వసూలు చేసినా చట్ట పరమైన చర్యలు తీసు కునే వీలును ప్రభుత్వం కల్పించాలని. ఒక వేళ రోగి ఏ పరిస్థితిలో చనిపోయినా పూర్తి బాధ్యత నష్టపరిహారం ఆసుపత్రి చెల్లించే వీలునుకల్పించి సామాన్యుడి ఆరోగ్యానికి బద్రత దోపిడీని నివారించే ఆరోగ్య బిల్లును పర్ల్యమేంట్ లో ప్రవేసపెట్టాలని ప్రైవేట్ ఆసుపత్రులకు మేలు చేసే వీలును కల్పిస్తూనే సామాన్యుడి ప్రజా ఆరోగ్యా నికి పెద్ద పీట వేసే విధంగా ఆరోగ్య శాఖ కసరత్తులు చేయాలాని సామాన్యుడు మొర పెట్టుకుంటు న్నాడు. ఏ సర్జరీకి ఎంత రేటుననుస‌రించి సర్జరీ నిర్ధారిస్తారు. ఏఫారిన్ బాడీ వాడతారు. సర్జరీకి వాడే స్టంట్, లెన్స్ వాటి వివరాలు రోగి ఎంచుకున్న సర్జరీ విధానాన్ని సర్జరీకి పట్టే సమయం వాటితో పాటు ఎంతమంది సర్జరీ చేస్తున్నారు వారి వివరాలు రోగి బందు వు లకు అందించాలి ఆతరువాతే ఎన్ ఓ సి పై సంతకాలు పీట్టె వీలును రోగికి రోగి తాలూకు  బంధువుకు వివరించాలని సామ న్యుడు సూచిస్తున్నాడు. ఆ త‌ర్వాత‌నే ఏ కేటగిరీ రూమ్ రెంట్ నర్సింగ్ సేవల ఖర్చు, అత్యవసర సమయంలేదా సర్జరీ సమ యంలో వినియోగించిన ఇతర సామాగ్రి మందులు సైతం రోగికి లేదా రోగి బంధువులకు ఖచ్చితంగా తేలపాలాని ఏ సేవ చేసినా అయ్యే ఖర్చు అదనపుఖర్చు ఎంత అనే వివరాలు పూర్తిగా సిటిజన్ చార్టర్లో పొందుపరచాలని సామాన్యుడు డిమాండ్ చేస్తున్నాడు. ఊహించని బిల్లుల తో అతలాకుతలం అయిపోతున్నాడు అసలు సామాన్యుడి కి వైద్యం తీసుకోవాలంటే ముందు నుయ్యి వేనుకగోయ్యి మాదిరిగా కనిపిస్తోందని దీనికి బదులు చనిపోతే బాగుం డునని రోగులు వాపోతున్నారంటే పరి స్థితి ఎలా ఉందొ రోగి బంధువులు రోగి తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. పిర్రచూసి పీట కన్నుచూసి కాటుక వేసారు అన్నట్లు రోగిని బట్టి ఆర్ధిక స్థితినిబట్టి ఆరోగి ఏ కేట గిరి కిందకు వస్తుందో ఆ కేటగిరీ కింద ఇచ్చేసేవలు వాటికి ఆయ్యే ట్రీట్మెంట్ ఖర్చు ఐసియు లో య్యేఖర్చు,సాధారణ చికిత్చకు వినియోగించే వస్తువులు. చికిత్చ వివరాలు చికిత్చకు వినియోగించిన పూర్తివివరాలు ఆహారంతోపాటు ఇతర డాక్టర్ల సేవలకు తీసుకునే ఫీజుతో సహా సిటిజన్ చార్టర్ లో పొందుపరచా లని సామాన్యుడు డిమాండ్  చేస్తున్నాడు. మారో అంశం ఏమంటే,  ఆసుపత్రి పేర్లు మారితే ధరలు మారతాయా? ప్రైవేట్ ఆసుపత్రుల పై అజమాయిషీ ఎవరిదీ సేవారంగా నికి చెందినా వైద్యం విషయంలో రాష్ట్రప్రభుత్వాల పరిధిలో అంశమా కేంద్రానికి సంబంధం లేదా సామాన్యుడికి ఈ ధరా ఘాతం నుండి బయట పడాలంటే ఏది మార్గం అన్నసామాన్యుడుప్రశ్నలకు సమాధానం ఎవరు ఇస్తారు. ప్రభుత్వాలు తమ ఆరోగ్య విధానంలో ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి వివరాలు,వారిన్ నైపుణ్యం,వివరాలు సిటిజన్ అందించే సేవలు ఎవరు అందిస్తారు అన్న విషయం కాంటాక్ట్  నంబర్స్ కూడా అందించాలాని  ఆసుపత్రిలో రోగికి ఏ డాక్టర్ చికిత్చ చేస్తున్నాడు. ఆయా ఫ్లోర్ మేనేజర్స్ వివరాలు నర్సింగ్ స్టేషన్ ఫోన్ నెంబర్ వివరాలతో ఇన్‌ఫ‌ర్మేష‌న్ షీట్‌ తప్పనిసరిగా రోగి చేరికకు ముందే ఇవ్వాలని సామాన్యు డు కోరుకుంటున్నాడు.ఆసుపత్రుల డమాండ్ తట్టుకోవాలంటే లక్షలు ఎలాసంపాదించాలి అన్న మనోవేదనతో రోగి ముందే గుండెపోటు తెప్పించి విధానానికి ఇప్పటికైనా చెక్ పెట్టాలని కోరుతున్నాడు. 75  సంవత్సరాల స్వతంత్ర దేశ చరిత్రలో ప్రజారోగ్యానికి అసలు ప్రభుత్వాలు ఖర్చుచేసింది ఎంత పట్టణాలలో దోపిడీకి గ్రామా ల్లో కార్పోరేట్ అసుపత్రులపై నియంత్రణ అవసరం. ఆసుపత్రులలో ధరల నియంత్రణకు సిటిజన్ చార్టర్ ఏర్పాటూ అంతే అవ స‌రం. లేదంటే భ‌విష్య‌త్తులో ప్ర‌జారోగ్యం గాలిలో దీపం లాగానే ఉంటుంది. ఆరొగ్యానికీ రక్షణ ఎవడు. బిల్లు పోటును ఆపేది ఎవరు అన్నది మారో ప్రస్నమిగిలింది. ప్రజారోగ్యానికి ఏ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఆయా పార్టీలు తమ మ్యాని ఫెస్టోలో స్పష్టంగా పేర్కొనాల‌ని సామాన్యుడు కోరుకుంటున్నాడు.

ఢిల్లీలో వాయు కాలుష్యంపై పోరాటానికి కొత్త ప్రణాళిక

ఢిల్లీలో, పర్యావరణ శాఖ కొత్త రియల్ టైమ్ సోర్స్ విభజన వ్యవస్థను ఉపయోగిస్తుందని అధికారులు తెలిపారు, ఇది అవ‌స‌ర సమయంలో అన్ని కాలుష్య వనరుల సహకారాన్ని నిర్ధారించడంలో సహాయపడు తుంది. వాతావరణ తీవ్రతను బట్టి దేశ రాజధానిలో, దాని పరిసర ప్రాంతాలలో అనుసరిం చిన వాయు కాలుష్య నిరోధక చర్యల సమితి అక్టోబరు 1 నుండి అమలులోకి వస్తుంది. పర్యావ రణ నిపుణులు ఈ సంవత్సరం ముందస్తు చర్యకు దారితీస్తుం దని విశ్వసిస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత నిర్వహణ కోసం ఆగస్టు 2021లో ఏర్పాటైన కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏ క్యూ ఎం), ముందస్తు చర్యలు గాలి నాణ్యతలో తీవ్ర క్షీణతను నివారించవచ్చని ప్రజలు, నిపుణుల నుండి వచ్చిన సూచనలను పరి గణనలోకి తీసుకుని గ్రాప్‌ ని ముందుగానే అమలు చేయాలని నిర్ణయించింది. సవరించిన గ్రాప్‌ ప్రకారం, అంచనాల ఆధారంగా మూడురోజుల ముందుగానే కాలుష్య కార్యకలాపాలపై నియంత్రణలు విధించవచ్చు. ఈసారి, పరిమితులు పీఎం2.5 , పీఎం10 ఏకాగ్రత కంటే గాలి నాణ్యత సూచిక (ఏ క్యూ ఐ) విలువలపై ఆధారపడి ఉంటాయి. వాతావరణ పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా మారితే తప్ప, ముందస్తు చర్య గాలి నాణ్యత ఆకస్మికంగా క్షీణించకుండా నిరోధిం చాలని  సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్, క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ వివేక్ చటోపాధ్యా య అన్నారు. ఏజెన్సీలు తమ ప్రాథమిక స్థాయి చర్యను పటిష్టం చేసుకోవాలి, తద్వారా అత్యవసర చర్యలు అవసరం లేదు. వారు ఆకస్మిక పరిస్థితిని ముందుగానే పసిగట్టాలి, అవసరమైన వాటిని నిరంతరం సరఫరా చేయడానికి సీఎన్‌జి క్యారియర్లు, ట్రక్కులను ఏర్పాటు చేయడం వంటి వాటిని ఎదుర్కోవడానికి ఫూల్ ప్రూఫ్ ప్లాన్‌ను సిద్ధం చేయగలగాలి. అంశాలని ఆయ‌న‌ చెప్పారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్‌లోని విశ్లేషకుడు సునీల్ దహియా, ముందస్తు చర్యలు తీవ్రమైన గాలి నాణ్యత తగ్గడానికి దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, స్థిరమైన అవగాహన ప్రచారాలు మరియు అన్ని వాటాదారులతో నిరంతర నిశ్చితార్థం మాత్రమే గడ్డి తగులబెట్టడం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. మొలకలను కాల్చే సమయానికి ముందు చర్య మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం లేద‌ని సునీల్ అన్నారు. ఢిల్లీలో, పర్యావరణ శాఖ కొత్త రియల్ టైమ్ సోర్స్ విభజన వ్యవస్థను ఉపయోగిస్తుందని అధికారులు తెలిపారు, ఇది నిజ సమ యంలో అన్ని కాలుష్య వనరుల సహకారాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది. గ్రీన్ వార్ రూమ్ ఉల్లంఘనలను పర్య వేక్షిస్తుంది. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న పద్ధతికి అనుగుణంగా ఫిర్యాదులు  ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలోని వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం అధిపతి మహేష్ నారంగ్ మాట్లాడుతూ, నియంత్ర ణలు గత ఏడాది దీపావళి, తరువాతి రోజుల్లో పొలం నుండి ఉద్గారాల కలయిక కారణంగా గాలి నాణ్యత సంక్షోభం పునరావృతం కాకుండా నివారిస్తాయని చెప్పారు. మంటలు మరియు పటాకులు. నవంబర్‌లో దీపావళి అక్టోబరు 24న పొట్ట దగ్ధం అవుతుంది. ఇది చాలా కీలకమైన అంశం. కాబట్టి, అన్ని ఇతర చర్యలను ఖచ్చితంగా పాటిస్తే దీపావళి రోజున తీవ్ర పరిస్థితికి దారితీయకపోవచ్చున‌ని ఆయన చెప్పారు. ఈ ఏడాది పొట్టేళ్ల నిర్వహణకు ప్రభుత్వం మరిన్ని యంత్రాలను సమకూర్చింది. మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామ‌ని నారంగ్ అన్నారు. స్టేజ్ ఒక‌టి కింద, కాలుష్య కారక పరిశ్రమలు, వాహనాలు, బయోమాస్ దహనంపై కఠిన చర్యలను సీఏక్యూ ఎం సిఫార్సు చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఓపెన్ తినుబండారాలలో తాండూర్‌లతో సహా బొగ్గు,కట్టెల వాడకం; డీజిల్ జనరేటర్ సెట్లు, అత్యవసర , అవసరమైన సేవలు మినహా, స్టేజ్ రెండు కింద నిషేధించబడ్డాయి. పరిస్థితి తీవ్రమైనది (దశ 3)గా మారితే, అధికారులు ఎన్‌సి ఆర్‌లో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధాన్ని అమలు చేయాల్సి ఉంటుంది, ముఖ్యమైన ప్రాజెక్టులు (రైల్వేలు, మెట్రో లు, విమానాశ్రయాలు, ఐ ఎస్‌బీటీలు, జాతీయ భద్రత/రక్షణ సంబంధిత ప్రాజెక్టులు వంటివి. ప్రాముఖ్యత) , ప్లంబింగ్, వడ్రంగి, ఇంటీరియర్ డెకరేషన్ మరియు ఎలక్ట్రికల్ పనులు వంటి కాలుష్య రహిత కార్యకలాపాలు. ఇటుక బట్టీలు, హాట్ మిక్స్ ప్లాంట్లు, స్టోన్ క్రషర్లు స్వచ్ఛమైన ఇంధనాలతో పనిచేయడం లేదు ,ఎన్‌సిఆర్‌లో మైనింగ్, అను బంధ కార్యకలాపాలు కూడా స్టేజ్ 3 కింద నిషేధించబడతాయి.

హ‌లో, రోజ‌ర్‌!

ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్‌. ఒక‌రు ప్ర‌పంచటెన్నిస్‌ను ఏలిన రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌. మ‌రొక‌రు ప్ర‌పంచ‌ క్రికెట్‌ లో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుం టూ అంద‌రిచేత కింగ్ అంటూ ఆద‌రం పొందుతున్న కింగ్ కోహ్లీ. 20సార్లు గ్రాండ్స్లామ్ ఛాంపి యన్, టెన్నిస్లెజెండ్ రోజర్ ఫెద రర్ ఇటీవ‌ల రిటైర్ అయిన సం గ‌తి తెలిసిందే. అత‌నికి విరాట్ కోహ్లీ చేసిన సందేశానికి ప్ర‌తి స్పందించాడు.  ఈ నెల ప్రారంభంలో తన రిటైర్మెంట్ ప్రకటించిన ఫెడరర్, లావర్ కప్ 2022లో తన వీడ్కోలు మ్యాచ్ ఆడాడు, ఇది చిరకాల ప్రత్యర్థి  స్నేహితుడు రాఫెల్ నాదల్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్. కోహ్లి, ఏటీపీ పోస్ట్ చేసిన వీడియోలో, ఫెదరర్‌ను ఆల్ టైమ్ గ్రేట్‌ అని ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించాడు. కోహ్లీ వీడియో సందేశంపై స్పందించేందుకు ఫెదరర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి వెళ్లాడు. ధన్యవాదాలు కోహ్లీ, త్వరలో భారత్‌కు చేరుకుంటానని ఆశిస్తున్నాను అని ఫెదరర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కోహ్లీ వీడియో సందేశానికి క్యాప్షన్ పెట్టాడు. ఫెదరర్ కోసం తన వీడియో సందేశంలో, కోహ్లి క్రీడకు స్విస్ మాస్ట్రో అపారమైన సహకారానికి నివాళులర్పించాడు. హలో, రోజర్. మాకు చాలా అందమైన క్షణాలు, జ్ఞాపకాలను అందించిన అద్భుతమైన కెరీర్‌లో మిమ్మల్ని అభినందిస్తూ ఈ వీడియోను మీ కోసం పంపడం నాకు గొప్ప గౌరవం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిమ్మల్ని కలిసే అవకాశం నాకు వ్యక్తిగతంగా లభిం చింది. 2018లో, నేను నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. మీరు ఆడుతున్నప్పుడు కూడా నాకు ప్రత్యేకంగా నిలిచిన విషయం ఏమిటంటే, టెన్నిస్ ప్రపంచంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు మీకు మద్దతుగా నిలిచారని కోహ్లీ వీడియో లో పేర్కొన్నాడు. మీకు ఎప్పుడూ ఆ ప్రత్యేక సామర్థ్యం ఉంది. మేము మీ ఆటను చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా కనిపించింది. మీరు కోర్టు లో తెచ్చిన ఆ ఆనందం, తేజ‌స్సు  సాటిలేనిది. నాకు, మీరు ఎప్పుడూ అత్యుత్తమంగా ఉంటారు. నేను ఖచ్చితంగా మీ జీవితం లోని తదుపరి దశ మీరు కోర్టులో చేసినంత ఆనందాన్ని మరియు ఆనందాన్ని పొందబోతున్నారు. నేను మీకు , మీ కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన‌న్నాడు కింగ్ కోహ్లీ. 

అబార్ష‌న్ నిర్ణ‌యం హ‌క్కు మ‌హిళ‌లకే ...సుప్రీం

వివాహితులు, అవివాహితులు అబార్ష‌న్  వారి ఇష్టాయిష్టాల‌మీద ఆధార‌ప‌డి ఉండాల‌ని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మ‌హిళ‌ లు అంద‌రికీ అబార్ష‌న్ విష‌యంలో నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు ఉంద‌ని సుప్రీం కోర్టు గురు వారం మెడిక‌ల్ ట‌ర్మినేష‌న్ కేసులో తీర్పు ను వెలువ‌రిస్తూ సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది.  మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేసుకునే హక్కు ఉంది. భారతదేశంలో అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత మహిళలు అనే తేడా లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆధునిక కాలంలో చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక ముందస్తు షరతు అనే భావనను తొలగిస్తోం దని సుప్రీం పేర్కొంది. మణిపూర్కు చెందిన 25 ఏళ్ల యువతి 24 వారాల గర్భవతి. సహజీవనం చేసిన వ్యక్తి పెళ్లి చేసుకోవ డానికి నిరాకరించడంతో  ఆమె అబార్షన్ చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ కోర్టుకు వెళ్లింది. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2021లో సవరించిన ఎంటీపీ చట్టంలోని నిబంధ నలతో సెక్షన్ 3కి వివరణలో భర్త అనే పదానికి బదులుగా భాగస్వామి అనే పదం ఉందని గుర్తుచేసింది. ఇది పెళ్లి కాని వారికి కూడా వర్తించేలా.. చట్టసవరణకు పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపిందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. భార్య సమ్మతి లేకుండా భర్త ఆమెతో బల వంతంగా కలిసినా  కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అది  బలవంతపు గర్భ ధారణ కిందకు వస్తుందని తెలిపింది. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎంటీపీ చట్టంలో అత్యాచారానికి అర్థంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని తెలిపింది. 

మాకే దిక్కు లేదు.. ఇక వారసులను తెచ్చి ఏం లాభం

వినాల్సిన స‌మ‌యంలో వినాలి, చెప్పాల్సిన స‌మ‌యంలో చెప్పాలి, అనువుగా ఉంద‌ని చొర‌వ‌దీసుకుని రెచ్చిపోతే అప‌వాదులు ఎదురై చ‌తికిల‌ప‌డాలి. అట్టి స‌మ‌యంలో క‌లిగిన జ్ఞానోద‌య‌మే మ‌న‌సులో మాట తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది.   ఇపుడు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కి క‌లిగిన జ్ణానోదయం అలాంటిదే. అందుకే వారసులను తీసుకు వచ్చినా గెలిపించుకోవడం అంత తేలిక కాదని బాహాటంగా చెప్పేశారు. అసలు నేపథ్యం ఏమిటంటే.  ముఖ్య‌మంత్రి ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశమై  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం లేదని క్లాసు పీకారు. అలా అస్సలు పాల్గొనని ఓ 27 మందికి ప్రత్యేకంగా పని తీరు మెరుగుపరుచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లిచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆ సందర్భంలోనే వారసులతను తెరపైకి తెచ్చి విశ్రాంతి తీసుకుందామని భావిస్తున్న వారికి కూడా గట్టి హెచ్చరిక చేశారు. వారసులెవరినీ తాను ప్రోత్సహించననీ, మీ పని తీరు మార్చుకుంటే మీకే టికెట్లిస్తాననీ, లేకుంటే కొత్త వారిని తెరమీదకు తీసుకువస్తాననీ, ఈ సందర్భంగానే సమావేశం తరువాత విలేకరులతో మాట్లాడిన బొత్స అసలు విషయం చెప్పేశారు. వారసులను తీసుకు రావడం పెద్ద విషయం కాదు..వారిని  గెలిపించు కోవ‌డ‌మే బ‌హుక‌ష్ట్ అని మ‌న‌సులో మాట పైకే అనేశారు. అంతే క‌ష్టాలు ఎప్పుడూ స‌త్యాన్ని ఆ మాత్రం బ‌య‌టికి చెప్పేలా చేస్తాయి.  బొత్స‌యినా, జ‌గ‌న్ అయినా!  అలాగా కున్నా, రాజ్యంలో త‌మ‌కే ప్ర‌గ‌తి లేన‌పుడు ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న వార‌సుల్ని రంగంలోకి ఎలా దింపుతారు.  చిత్రం వంద‌రోజులు ఆడితేనేగా హీరోగారికి వీరాభిమానులు ప‌ట్టం గ‌ట్టేది. స్వీట్లు  పంచుకు నేది. ఇక్క‌డ వైసీపీ పాలన మూడు వంద‌ల రోజులు గ‌డిచిపోయినా ఉత్సాహంగా చెప్పుకోవ‌డానికి, ఘ‌నంగా ప్ర‌చారం చేసుకోవ‌డానికేమీ లేదన్న తత్వం బోధపడటం వల్లనే బొత్సగారు వారసుల విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాలో చెప్పకనే చెప్పేశారు.  

వైసీపీలో అసమ్మతి సెగ.. జగన్ ఉక్కిరిబిక్కిరి!?

నియంతృత్వ పోకడల కారణంగా వైసీపీ అధినేత జగన్ పార్టీలోనే ఒంటరి అయిపోతున్నారా? ఆయన తీరు, శైలి పట్ల అసంతృప్తితో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఆయనకు ఒక్కరొక్కరుగా దూరమైపోతున్నారా. పార్టీ నేతలు   తీవ్ర అసంతృప్తి సెగలు రగిలిపోతున్నారా అన్న ప్రశ్నలకు పార్టీ శ్రేణుల నుంచే ఔననే సమాధానం వస్తున్నది. అలాగే ఇటీవల వరుసగా జరిగిన సంఘటనల ఆధారంగా పరిశీలకులు కూడా ఆ రీతిగానే విశ్లేషణలు చేస్తున్నారు.  పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పార్టీ అధినేత జగన్ పై పార్టీ నేతలే తిరుగుబావుటా  ఎగరేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని  విశ్లేషకులు చెబుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో బుధవారంనాడు జగన్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్ కు   మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే  కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గైర్హాజరు కావడాన్ని విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మరో పక్కన తాను ఆదేశించిన ప్రకారం   గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సక్రమంగా పాల్గొనని  27 మంది ఎమ్మెల్యేల పేర్లు ఆయన సమావేశంలో పబ్లిగ్గా ప్రకటించడం ఒకింత సంచలనం సృష్టించినా జగన్ పై అసంతృప్తితో రగిలిపోయే వారి సంఖ్యను కూడా పెంచిందని అంటున్నారు.   ముఖ్యంగా జగన్ కు వీర విధేయుడిగా ఇంత కాలం అందరి నోళ్లలో నానిని కొడాలి నాని, తెలుగుదేశం ఎంపీగా గెలిచి  ఆ తరువాత వైసీపీ గూటికి చేరిన వల్లభనేని వంశీ ఈ సమావేశానికి హాజరు కాకపోవడం వారిలో పెల్లుబుకుతున్న అసంతృప్తికి,  ధిక్కారానికి నిదర్శనమని అంటున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో తన అసమ్మతిని, అసంతృప్తిని, వ్యతిరేకతను బహిరంగంగా లేఖ రూపంలో వల్లభనేని వంశీ వ్యక్తం చేస్తే.. తన మౌనం ద్వారా, ఆదేశాలను పట్టించుకోకుండా అసెంబ్లీ ఆ మార్పు బిల్లు ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి కూడా గైర్హాజరు కావడం ద్వారా కొడాలి నాని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ సమావేశం తరువాత మరింత మంది కూడా అదే దారిలో నడిచే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక కొడాలి నాని విషయానికి వస్తే.. మంత్రి పదవిలో ఉన్నప్పుడు జగన్ పై విమర్శలు చేసిన విపక్ష నేతలపై ఆగమేఘాల మీద మీడియా సమావేశం పెట్టి మరీ, విమర్శలు, ఆరోపణలు,   బూతులతో విరుచుకుపడేవారు.   అయినప్పటికీ ఆయనను మంత్రి పదవి నుంచి జగన్ పీకేశారు. దీంతో కొడాలి కోరలు పీకేసిన తాచుపాములా  అయిపోయారు. ఇంతకు ముందులా ఆయన పబ్లిక్ లో పెద్దగా కనిపించడంలేదు. అడపా దడపా మీడియాలోకి వచ్చినా మునుపటి మాదిరి తీవ్రంగా స్పందించడంలేదనే చెప్పాలి. మరో పక్కన గుడివాడ నుంచి తనకు వైసీపీ వస్తుందో రాదో అనే అనుమానం కూడా కొడాలిలో కలుగుతోందంటున్నారు. ఒకవేళ తనకు టికెట్ వచ్చినా.. టీడీపీ నుంచి తనను ఢీకొట్టేందుకు బలమైన సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను చంద్రబాబు బరిలో దింపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక విధంగా దేవినేని ఉమ పేరునే టీడీపీ చీఫ్ కన్ ఫర్మ్ చేశారంటూ తాజాగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జగన్ అస్తవ్యస్థ పాలన, అభివృద్ధి లేని ఏలుబడి, జనం సమస్యలు పట్టించుకోని వైనంతో ఈసారి వైసీపీకి గడ్డుకాలం తప్పకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పేరు చెప్పి జనంలోకి వెళ్లినా తనకు ఉపయోగం ఉండకపోవచ్చనే అనుమానం ఏదో కొడాలి నానిలో ఉండి ఉండొచ్చని అంటున్నారు. అందుకే కాబోలు.. గడప గడపకు కార్యక్రమం సమీక్షకు కొడాలి నాని గైర్హాజరై ఉంటారనే అభిప్రాయం వస్తోంది. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న కొడాలి నాని సమీక్షకు హాజరు కాకపోవడానికి ఏదో బలమైన కారణమే ఉంటుందనే అభిప్రాయం వస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో అధినేత ఆదేశించినా ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ కొడాలి నాని మాట్లాడకపోవడంతో జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నరన్న వాదన కూడా వైసీపీ శ్రేణుల్లో వినవస్తోంది. ఏది ఏమైనా గతంలోలా నాని ఇక మీదట జగన్ పట్ల  వీరవిధేయత ప్రదర్శించే అవకాశం అయితే లేదని స్పష్టంగా తేలిపోయిందని చెబుతున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయానికి వస్తే.. సాంకేతికపరంగా ఆయన వైసీపీ ఎమ్మెల్యే కాదు. అయినప్పటికీ వైసీపీతో అంట కాగుతున్నారు. ఆయన కూడా జగన్ నిర్వహించిన సమీక్షకు హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. దశాబ్దాల నుంచి ఉన్న విజయవాడలోని హెల్త్ వర్శిటీ పేరు నుంచి ఎన్టీఆర్ తొలగించి, వైఎస్సార్ పేరు పెట్టడంతో వంశీలో అసహనం కలిగిందంటున్నారు. తాను ఏ పార్టీ గుర్తుపై గెలిచాడో ఆ పార్టీ (తెలుగుదేశం) వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు పేరును తొలగించే అంశాన్ని పునరాలోచించాలని జగన్ కు వంశీ లేఖ కూడా రాశారు. అయితే.. ఆ లేఖపై జగన్ స్పందించిన దాఖలాలు లేవు. దీంతో వంశీ చిన్నబుచ్చుకున్నారని చెబుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వంశీ పాల్గొనడం లేదు. మరో పక్కన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వల్లభనేని వంశీ వచ్చారంటున్నారు. తాను పోటీ చేయనప్పుడు ఇక నియోజకవర్గం సమీక్షకు హాజరైతే ఏంటి. . గైర్హాజరైతే ఏంటనే ధోరణి ఆయనకు కలిగిందని చెబుతున్నారు. కాగా.. గన్నవరం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరగకపోవడంపై వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలను జగన్ ప్రశ్నించారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో తమ పార్టీ ఎమ్యెల్యే కాకపోయినా గడప గడపకు కార్యక్రమాన్ని అంతగా పట్టించుకోని ఎమ్మెల్యేల పేర్లలో వల్లభనేని వంశీ పేరు కూడా జగన్ ప్రస్తావించడం గమనార్హం. జగన్ ఆదేశాలను పాటించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ   జగన్ పేర్కొన్న జాబితాలో ఉన్న వారూ ఎలాగూ అధినేత తమపై ఒక అభిప్రాయానికి వచ్చేశారు కనుక వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు వచ్చే అవకాశాలు  లేనట్టే అన్న నిర్థారణకు వచ్చేసి, ఇక ఆయన ఆదేశాలు పాటించేదేమిటన్న ధిక్కార స్వరాన్ని వినిపించే అవకాశం మెండుగా ఉందంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి మరో గూటికి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారంటున్నారు.   ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని తమ వారసులను బరిలో దింపుతామంటే జగన్ ససేమిరా అనడంతో వారు కూడా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని చెబుతున్నారు. దాంతో పాటు.. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిరగకపోతే.. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలే బాధ్యత తీసుకోవాలని జగన్ అనడం కూడా  ఎమ్మెల్యేలకు రుచించలేదని అంటున్నారు.  జగన్ లాగ పని చేయాలంటే జగన్ లాగ తమకు కూడా బటన్ లు నొక్కే అవకాశం ఉండాలని పలువురు ఎమ్మెల్యేలు పార్టీ అధినేతపైనే జోకులు వేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వకుండా గడప గడపకు  తిరగమంటే ఎలా..? ఇలాగైతే కష్టమే అంటూ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.  మొత్తానికి జగన్ కు సమీప భవిష్యత్ లోనే సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగలడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్నది. 

ఆర్జేడీ, బీజేపీ మాట‌ల యుద్ధం..గోడ మీద‌ పిడ‌క‌!

మీ గోడ‌మీద వేసిన పిడ‌కే పెద్ద‌దంటే..ఎదురింటి పిన్నిగారు కాదండీ మీ గోడ‌మీద‌దే మ‌రీ పెద్ద‌గా ఉంద న్నది. పిడ‌క ఎవ‌రు వేసేర‌న్న‌ది కాకుండా ఏ సైజులో ఉంద‌న్న‌దే వారి వివాదానికి కార‌ణం కావ‌డ‌మే విచి త్రం. అదుగో అలా ఉంది బీజేపీ, ఆర్జీడీ మధ్య మాట‌ల యుద్ధం.  దేశంలో ఇపుడు పిఎఫ్ఐ గురించి ఆరాతీయ‌డంలో ఆరెస్టులు జ‌రుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో నూ ఆ సంస్థ‌కు సైనికుల్లాంటి కుర్రాళ్లుండ‌డ‌మే ప్ర‌భుత్వాల్ని కంగారు పెడుతోంది. బీహార్ మాజీ ముఖ్య మంత్రి లాలూ ప్ర‌సాద్ తాను పిఎఫ్ ఐ స‌భ్యు డ‌న‌ని అంటే తాను ఖ‌చ్చితంగా ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌న‌ని గ‌ర్వంగా  చెప్పుకుంటాన‌ని బిజేపీ నేత గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇలాంటి స‌వాలే మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోం మంత్రి  న‌రోత్తంసింగ్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్‌పై విసిరారు. దేశంలో పిఎఫ్ ఐని నిషేధానికి ముందే ఆర్ ఎస్ఎస్‌ను నిషేధించాల్సింది అని బీజేపీపై లాలూ యాద‌వ్ విమ‌ర్శ‌నాస్త్రం సంధించారు. అందుకు స్పందిస్తూ  బిజేపీ నేత గిరిరాజ్‌, బీహార్‌లో త‌మ ప్ర‌భుత్వ‌మే ఉం దని, వారికి ధైర్యం ద‌మ్ము ఉంటే బీహార్‌లో ఆర్ఎస్ఎస్‌ను నిషేధించ‌మ‌ని స‌వాలు విసిరారు. ఇటీవ‌ ల కేంద్రం పిఎఫ్ ఐతో పాటు దానికి సంబంధించిన సంస్థ‌ల‌ను తీవ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతు న్నాయ‌న్న నెపంమీద నిషేధించారు. కానీ హిందూ మ‌తోన్మాదంతో రెచ్చి పోతున్న ఆర్ ఎస్ ఎస్ నే ముందుగా దేశంలో నిషేధిస్తే ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉంటార‌ని ఆర్జేడీ అధినేత లాలూ ఢిల్లీకి వినిపించేలా అన‌డం బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.   కాగా, పిఎఫ్ ఐ నిషేధం పేరుతో ముస్లిం యువ‌త‌పై దాడులు స‌బ‌బు కాద‌ని ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే అలాగ‌ని పిఎఫ్ ఐ కి తాను మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌న్నారు. ముస్లిం లంతా అదే వ్య‌వ‌స్థ‌కు చెందిన‌వార‌నే అభిప్రాయం స‌బ‌బు కాద‌ని, అంద‌రి అభిప్రాయం తెలుసు కోకుం డానే ముద్ర‌వేసి నిషేధించ‌డం, వేధించ‌డం యావ‌త్ ముస్లింల‌పై నిషేధంతో స‌మాన‌మ‌ని ఓవైసీ మండి ప‌డ్డారు. అస‌లు యూఏపిఏ చ‌ట్టాన్నే తాను వ్య‌తిరేకిస్తున్నాన‌ని ఓవైసీ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం తూట్లు పొడుస్తోంద‌ని ఓవైసీ ఆరోపించారు.  అయితే ఆర్ ఎస్ ఎస్‌లో ఉన్న‌వారిలో చాలామంది ఇప్ప‌టికీ మంచివారున్నార‌ని 2003 నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌శంసిస్తూనే వ‌చ్చారు. అంతేకాదు ఆర్ ఎస్ ఎస్‌ను దేశ‌భ‌క్తులుగానూ అప్ప‌ట్లో కీర్తించారు. అందుకే ఆమెను దుర్గారూపిణిగా ఆర్ ఎస్ ఎస్ అభివ‌ర్ణించింద‌ని ఓవైసీ అన్నారు. మమత వ్యాఖ్యలపై బెంగాల్ ఇమాం అసోసియేష‌న్ చీఫ్ మ‌హ్మ‌ద్ యాహ్య  కూడా స్పందిస్తూ 20 కోట్ల మంది ముస్లింలు మ‌మ‌తా బెనర్జీని సెక్యుల‌ర్ నేత‌గా భావిస్తున్నరని తెలిపారు. కానీ, ఆమె మాట‌లు అర్ధంలేకుండా ఉన్నా య‌న్నారు. దేశంలో బీజేపీ త‌న ప్రాభ‌వం కోసం విప‌క్షాల మీద ఈ విధంగా విరుచుకుప‌డ‌టం, విభేదాలు సృష్టించడంలో ఆనందిస్తోంది గాని ఇది తిరిగి విప‌రీత ప్ర‌భావం చూపుతుంద‌న్న వాస్త‌వా న్నికూడా గ్ర‌హించాలి.   ఒక‌రి అనుమానాన్ని స‌త్య‌మ‌ని ప్ర‌చారం చేసి అదే న‌మ్మించేలా చేసి మీవాళ్లు మావాళ్ల కంటే ఘ‌నుల‌ని భుజాలు చ‌ర‌చుకుంటే విప‌క్షాలు దుమ్మెత్తిపోయ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో  అడ్డంకుల‌ను కూడా సృష్టిం చి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తి కుర్చీకే ఎస‌రు రావ‌చ్చ‌న్న‌ది బీజేపీ గ్ర‌హించాలి. అందువ‌ల్ల పిడ‌క‌ల వేట‌ను ఇంత‌టితో ఆపాలి. 

పీకేతో కేసీఆర్ కటీఫ్ అంతా ఉట్టిదే ..వ్యూహమే!

ఇంతకీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సంబంధాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెంచుకున్నారా?  పీకేనే కట్ చేశారా? ఈయనకు ఆయన కటీఫ్ చెప్పారా, ఆయనకు ఈయన కటీఫ్ చెప్పారా?  పీకేతో పనికాదని, కేసీఆర్ వ్యూహ కర్తను వదిలించు కున్నారా? కేసీఆర్ ను గెలిపించడం అయ్యే పని కాదని, పీకే వదిలి వెళ్ళిపోయారా? అసలు ఏమి జరిగింది? ఎందుకు విడిపోయారు?  అవును, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈయన ఆయనతో సంబంధాలు తెంచుకున్నారంటే, ఇంకొందరు ఆయనే ఈయనకు కటీఫ్ చెప్పారని అంటున్నారు. అయితే, ఏది నిజం, ఏది కాదు అంటే, అదీ నిజం కాదు, ఇదీ నిజం కాదు, అంటున్నాయి అసలు నిజం ఏంటో తెలిసిన  ప్రగతి భవన్, ఫార్మ హౌస్ ఇన్నర్ సర్కిల్స్.  అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అదీ ఇదీ ఏదీ నిజం కాదు. ఆయన ఈయనకు కటీఫ్ చెప్పలేదు. ఈయన ఆయనకు కటీఫ్ చెప్పలేదు. నిజానికి కటీఫ్ కథలు, కథనాలు అన్నీ కూడా కట్టు కథలే. అంతే కాదు కట్టు కథలు కూడా కేసీఆర్, పీకే సంయుక్త వ్యూహంలో భాగమే. నిజానికి, కేసీఆర్, పీకే ల మధ్య సమన్వయ బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎంపీ కథనం ప్రకారం, పీకే వ్యూహాలనే కేసీఆర్ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. నిజానికి, ఇప్పుడు ఇద్దరి మధ్య అవగాహన మరింత పెరిగింది. ఇద్దరి మధ్యా బంధం మరింతగా బలపడిందని అంటున్నారు.   అయితే, కటీఫ్  వదంతులు జోరుగా సాగడం వెనక పీకే వ్యూహం ఏమిటని ఆరా తీస్తే, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా, దాని వెనక పీకే వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే, ముఖ్యమంత్రి కుటుంబంలో ఏమి జరిగినా, జరగక పోయినా మీడియా అన్నిటికీ, పీకే ‘ఐ ప్యాక్’ ట్యాగ్  తొడిగేస్తోంది. రాజకీయ నిర్ణయాల విషయంలోనే కాదు, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ పీకే జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఇది ఎటుపోయి ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. మరో వంక ముడుగోడు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్ధిని ఎందుకు ప్రకటించలేదంటే, ఇంకా పీకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో సెటైర్లు షికారు చేస్తున్నాయి. పీకే టీమ్ సర్వే ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, అందుకే అభ్యర్ధి ప్రకటన ఆలస్యం అవుతోందని, ముఖ్యమంత్రి స్థాయిని ,సామర్ధ్యాన్ని దిగజార్చే విధంగా పచారం జరుగుతోంది.  ఇలా ఒకటని కాదు, చివరకు, మంత్రి కేటీఆర్  కాలు విరిగి ఇంట్లో కూర్చుంటే, అది కూడా పీకీ వ్యూహమే అనే ప్రచారం జరిగింది. ఏపీలో కోడి కత్తి, బెంగాల్లో మమత వీల్ చైర్ ప్రచారంతో కేటీఅర్ కాలు ఫ్రాక్చర్ ను కలిపేసి పీకే ఖాతాలో వేస్తున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్, పూర్తిగా పీకే మీద ఆధారపడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో, ముఖ్యమంత్రి, పార్టీ ఇమేజ్ డ్యామేజి అవుతోంది. ఇంత బతుకూ బతికి.. అనే సామెతను గుర్తుచేస్తోందని అంటున్నారు. ఈ అన్నిటినీ మించి, పీకే సర్వేల పేరిట  జరుగతున్న ప్రచారం పార్టీ ఇమేజ్ ని బాగా డ్యామేజి చేస్తోంది. పబ్లిక్ పర్సెప్షన్ ప్రజాభిప్రాయం ను మార్చి వేస్తోందని, పీకే టీమ్ సర్వే లోనే బయట పడిందని అంటున్నారు. పీకే సర్వే లోనే తెరాస ఓడి పోతోందని ప్రతిపక్షలు చేస్తున్న ప్రచారం వలన, ప్రజలు అదే నిజం అనుకునే పరిస్థితి వచ్చింది.  పార్టీకి నష్టం జరుగుతోంది. అదే విధంగా, పీకే సర్వే ఆధారంగా అభ్యర్ధులను మార్చేస్తారనే ప్రచారం వలన ఫిరాయింపులు జరిగే ప్రమాదం ఉందనీ పీకే టీమ్ సర్వేలోనే తేలిందని, ఫలితంగా సమీకరణాలపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. అందుకే, పీకేతో తెగతెంపులు చేసుకున్నామనే ప్రచారం వలన, పీకే పేరున జరుగతున్న వ్యతిరేక ప్రచారాన్ని, కట్టడి చేయవచ్చని, అందుకే  కేసీఆర్, పీకే వ్యూహాత్మకంగా కటీఫ్ కథలను తెర మీదకు తెచ్చారని అంటున్నారు. అయితే, అదే నిజామా అంటే, ఏమో, కానీ, పీకే పేరున జరుగుతున్న ప్రచారం వలన తెరాసకు నష్టం జరుగుతోందనేది మాత్రం పచ్చి నిజం అంటున్నారు.

జగన్ తిరుపతి పర్యటనలో వైసీపీ రంగు పడింది

వైసీపీ రంగుల పంచాయతీ మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సారి ఆ పార్టీ రంగుల పిచ్చతో ఏకంగా దేవుడి బొమ్మలనే చెరిపేసింది. అది కూడా తిరుపతిలో అలిపిరి వెళ్లే దారిలో ఉండే గోడలపై ఉన్న దేవుడి బొమ్మలను చెరిపేసి వైసీపీ రంగులతో నింపేశారు. ఈ వ్యవహారంపై తిరుపతి ప్రజలలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఇప్పటి దాకా ప్రభుత్వ కార్యాలయాలూ, పాఠశాలలకు వైసీపీ రంగులు వేసి కోర్టు మొట్టికాయలతో వాటిని తీసేసి మళ్లీ గతంలోలా మామూలు రంగులు వేసి లక్షల్లో ప్రజా ధనం వృధా చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు జగన్ తిరుపతి పర్యటన సందర్భంగా అలిపిరి మార్గంలో దేవుడి బొమ్మల స్థానంలో వైసీపీ రంగులు వేసిన వైనానికి సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో వైసీపీ నాయకులు అలర్ట్ అయ్యారు. ఇదంతా తెలుగుదేశం దుష్ప్రచారం అంటూ ధ్వజమెత్తారు. అంతటితో ఆగకుండా అలిపిరి మార్గంలో గోడలకు దేవుడి బొమ్మలు అలాగే ఉన్నాయనీ, వాటిని కనిపించకుండా వైసీపీ రంగులు వేశామనడం శుద్ధ అబద్ధమంటూ నాలుగు ప్రదేశాలలో దేవుడి బొమ్మలు ఉన్న వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. దీంతో రంగుల పంచాయతీకి తెరపడుతుందని భావించిన వైసీపీకి తెలుగుదేశం పార్టీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కేవలం నాలుగు చోట్ల మాత్రమే దేవుడి బొమ్మలను ఉంచారనీ మీగిలిన అన్ని ప్రాంతాలలోనూ బొమ్మలన్నిటినీ తొలగించారనీ పేర్కొంటూ అందుకు సంబంధిచి రుజువులతో సహా మరో వీడియోను తెలుగుదేశం ట్వీట్ చేసింది. దీంతో వైసీపీ నేతలు బొమ్మలు తొలగించలేదంటూ చేసిన వాదన శుద్ధ తప్పు అని తేలిపోవడంతో ఆ పార్టీకి రిటార్డ్ ఇచ్చే అవకాశమే లేకుండా పోయింది. దీంతో వైసీపీని వెనకేసుకొస్తూ తిరుపతి నగరపాలక సంస్థ రంగంలోనికి దిగింది. అలిపిరి మార్గంలో ఉన్న బొమ్మలు పాతవైపోవడంతో కొత్తగా రంగులు పూశామే తప్ప ఇందులో వైసీపీ ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. అయితే పూయడానికి వైసీపీ పార్టీని స్ఫురింప చేసే రంగులు వినా మరేమీ దొకరలేదా అంటూ నెటిజన్లు తిరుపతి నగరపాలక సంస్థపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద వైసీపీ రంగుల పంచాయతీ వెంకన్న దేవుడి పాదల వద్దకు చేరింది. వైసీపీ నేతల తీరును జనం కూడా తప్పుపడుతున్నారు.  తిరుపతి పవిత్రతను చెడగొడుతున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటి వరకూ తిరుపతిలో ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు ఎవరూ పాల్పడలేదని విమర్శిస్తున్నారు. వైసీపీ భ్రష్ట రాజకీయాలకు తిరుపతిని వేదిక చేసుకోవడం సరికాదనీ, దీనిని తామెంత మాత్రం అంగీకరించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తిరుపతి నగరపాలక సంస్థపై కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ తప్పదాలను కప్పి పుచ్చడం వినా తిరుపతి కార్పొరేషన్ కు మరో పని లేదా అని దుమ్మెత్తి పోస్తున్నారు. దేవుని చిత్రాలను తొలగించి రంగులు వేయడానికి తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలోనే ముహూర్తం కుదిరిందా అని నిలదీస్తున్నారు. లేదా జగన్ మొప్పు పొందడం కోసం ఆయన పర్యటన సందర్భంగా ఆయన పార్టీ రంగులు వేశారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉండగా  తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మార్గంలో గోడలపై ఉన్న  దేవుళ్ల చిత్రాలను తొలగించి.. జగన్ పార్టీ రంగులు వేయడం హిందూ మతాన్ని అవమానపరచడమేనని తెలుగుదేశం అధినేత అన్నారు.  జగన్‌ తీరుపై భక్తులు ఆగ్రహంగా ఉన్నారని ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్ కు రంగులు వేయక ముందు గోడపై హిందూ దేవుళ్ల చిత్రాలు ఉన్న ఫొటోను వైకాపా, పార్టీ రంగులు వేసిన తర్వాత ఫొటోలను జత చేశారు.   

ఆ 27 మందీ అవుట్? జగన్ పై ఇక తిరుగుబాటేనా?!

‘ఎమ్మెల్యేలూ మీ తీరు మారాల్సిందే.. నాతో కలిసి పనిచేయాల్సిందే.. లేదంటే కష్టమబ్బా. నో మొఖమాటమ్స్’ అంటూ జగన్ ఎమ్మెల్యేలకు హాట్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు బాగాలేదని 27 మందిని మరింత ఘాటుగా హెచ్చరించారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై తాడేపల్లిలో తాజాగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, పార్టీ సమన్వయకర్తలను ఉద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇచ్చేది లేదంటూ ఖరాఖండీగా చెప్పేశారు. రెండు నెలలే గడువిస్తున్నాననీ హెచ్చరించారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే సీటు ఇవ్వని వారి పేర్లు ప్రకటిస్తానని జగన్ విస్పష్టంగా చెప్పేశారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వెనకబడిన 27 మంది ఎమ్మెల్యేలను జగన్ తీవ్రంగా మందలించారు. ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని, సత్వర పరిష్కారం చేయాల్సిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని జగన్ ప్రజాప్రతినిధులను గట్టిగా హెచ్చరించారు. వారంలో నాలుగు రోజుల చొప్పున, నెలకు 16 రోజులు కూడా తిరగకపోతే ఎలా అని ఆ 27 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు గంటో రెండు గంటలో కాదనీ, ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలన్నారు. అదే గ్రామంలో పార్టీ నేతల ఇళ్లల్లో భోజనాలు చేయాలని, ప్రతి గడపకూ కచ్చితంగా సమయం కేటాయించాలని జగన్ ఆదేశించారు.  డిసెంబరులో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, అప్పటిలోగా అందరూ బాగా తిరగాలన్నారు. పని తీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను గడపగడపలో తిప్పొద్దనీ, తామే స్వయంగా వెళ్లాలని, సమస్యల్ని గుర్తించి తక్షణమే పరిష్కరించాలని జగన్ ఆదేశించారు. కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని సూచించారు. పనితీరు సరిగ్గా లేని వారిపై వేటు తప్పదని పార్టీ అధినేత జగన్ చేసిన హెచ్చరికలు ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతున్నాయి. గడప గడపకు.. గత సమీక్ష కంటే ఇప్పుడు ఫలితం మెరుగ్గా ఉందని, మరికొందరు తీరు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్  సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో క్షేత్రస్థాయిలో ప్రతి గడప వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లాలని ఆయన సూచించారు. సీఎం జగన్ ఇచ్చిన పిలుపును 27 మంది ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోలేదు. వచ్చే డిసెంబరు నాటికి వారి పనితీరు మారకపోతే చర్యలు తప్పవని సీఎం చేసిన హెచ్చరికలతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. అదలా ఉంచితే.. తాడేపల్లిలో సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు జగన్ పై సెటైర్లు వేసుకున్నారు. ‘మీతో పాటు పనిచేయాలంటే మేం కూడా బటన్ నొక్కాల్సిందే. మా దగ్గర నొక్కడానికి బటన్స్ లేవుగా’ అని జోకులు వేసుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ‘ప్రజాసమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వకుండా తిరగమంటే ఎలా.. ఇలాగైతే కష్టమే బ్రదర్’ అంటూ అక్కడ నుండి ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడంతో జగన్ పై వారిలో తిరుగుబాటు మొదలైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక జగన్ ఆగ్రహానికి గురైనా ఆ 27 మందీ  జగన్ పై తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నారనీ, త్వరలోనే తిరుగుబాటు దెబ్బ జగన్ కు రుచిచూపేందుకు పావులు కదుపుతున్నారనీ ఆయా ఎమ్మెల్యేల సహచరులు, సన్నిహితులు అంటున్నారు.

ఆ నిషేధం వ‌స్తే, ఏపీలో స‌గం ఖాళీ!

ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అస్త‌వ్య‌స్తంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే ఏ మూల‌నుంచో ఊరూ పేరూ లేనివాడు ఓ క‌త్తి ప‌ట్టుకుని అమాంతం దాడిచేసిపోతాడు.. ఇదో పాత సినిమా డైలాగు. ఇది ఇప్పుడు న్న రాజ‌కీయ నాయ‌కుల వ్య‌వ‌హార‌శైలికి అచ్చుగుద్దిన‌ట్టు న‌ప్పుతుంది. తీవ్ర‌నేరారోప‌ణ‌లు ఉన్న‌వారు వాస్త‌వానికి ప్ర‌జా ప్ర‌తినిధులు కావ‌డానికి వీల్లేదు. ఇది చ‌ట్టంలోనే ఉందా లేదా అనే చ‌ర్చ కంటే అస‌లు రాజ‌కీయ నాయ కునిగా ఎద‌గ‌డానికి ఆలోచ‌న‌లు చేసేవారు, న‌లుగురితో ప్ర‌చారం చేయించుకునేవారు త‌మ‌కు తాము వేసుకోవాల్సిన ప్ర‌శ్న‌. పెళ్లిచూపుల్లో అబ్బాయి గురించి, అమ్మాయి గురించి వేయి ప్ర‌శ్న‌లు వేస్తు న్న‌ట్టే... ప్ర‌జ‌లూ త‌మ ప్ర‌తినిధిని అడ‌గ‌వ‌చ్చు. కానీ ఆ అవ‌కాశం ఎవ్వ‌రూ, ఎన్న‌డూ ఇవ్వ‌రు. కేవ‌లం పార్టీ అధి నేత‌లు, సీనియ‌ర్లు ఒక వ్య‌క్తిని త‌మ పార్టీ అభ్య‌ర్ధిగా అనుకుని ఎన్నిక‌ల్లో కోట్లు త‌గ‌లేసి గెలిపించు కుంటా రు. అదే కావాలి. ఆ త‌ర్వాత ఆ హేమా హేమీ ఎలాంటి ప‌నులు చేసినా, ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ రించినా పార్టీ కార్యాల‌యం కాపాడేస్తుంది. అదుగో ఆ న‌మ్మ‌కంతోనే మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో అదే ధైర్యంతో ఓట్లు అడుగుతు న్నారు. ఇన్నాళ్ల‌కు ఓ వ్య‌క్తి అస‌లు ఇలాంటి చోద్యాలు చూడ‌ద‌ల్చుకోలేదంటూ సుప్రీం కోర్టు మెట్లెక్కాడు.  ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధిత్వానికి బొత్తిగ అన‌ర్హుడైన‌వాడు, ముఖ్యంగా సివిల్‌, క్రిమిన‌ల్ కేసుల్లో పీక‌ల్లోతు ఉండి కోర్టు ప‌క్షిగా మారిన వారికి ఎన్నిక‌ల్లో పోటీచేసే వీలు క‌ల్పించ‌వ‌ద్ద‌ని  కోరుతూ ప్రము ఖ న్యాయవాది అశ్వి నీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిం చింది. న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం. జోసెఫ్, హృషికేష్ రాయ్‌ తో కూడిన బెంచ్ కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖ, ఎన్నికల కమిషన్ కు నోటీసులుజారీ చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని లా కమిషన్ తన 244వ నివేదికలో తెలిపిందని పిటిషనర్  కోర్టుకు తెలిపారు.  దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో సగానికి పైగా ప్రజా ప్రతినిధులు ఇంటి దారి పట్టాల్సిందే మరి. కార‌ణమేమంటే, ఇప్ప‌టికే కోర్టు కేసులు, ఈడి విచార‌ణ‌ల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఆ స్థానానికి అన‌ర్హుడ‌న్న ముద్ర ప డింది. ఆయ‌న కోర్టుకు త‌న లాయ‌ర్ల‌ను పంపిస్తూ చాలాకాలం కేసుల‌కు కోర్టు హాజ‌రును త‌ప్పించుకుం టూ వ‌చ్చారు. అంత‌కు మించి జైలు జీవితం అనుభవించారు కూడా. అలాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లో ఉండ డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బ‌?, ఎంత‌సేప‌టికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ రాజ‌కీయ‌నాయ‌కుల గురించి ప్ర‌స్తావి స్తున్న ప్ర‌జ‌లు, కోర్టులు, న్యాయ‌స్థానాలు మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న వ‌ర్తించ‌దా అని రాజ‌కీయ‌ప‌రిశీలకులు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జాభీష్టం మేర‌కే పాల‌న సాగిస్తు న్నారా లేదా అన్న‌దాని కంటే అస‌లు పాల‌కుడు స‌వ్య‌మైన‌వాడేనా అన్న‌ది కీల‌కం. ప‌రిపాల‌నా లోపాల కంటే ప్ర‌తినిధుల చ‌రిత్ర ఎంతో ముఖ్యం. నేర‌చ‌రిత్ర ఉన్న‌వారిని తెలిసీ ఎన్నుకోవ‌డం ప్ర‌జ‌ల‌కు ఆత్మా హుతితో స‌మాన‌మ‌న్నారు వెన‌క‌టికి  ఒక సీనియ‌ర్ నేతే అన్నారు.  ఇదే అంశంపై అసోసియేషన్ ఫర్ డెమోక్ర టిక్ రిఫార్బ్ రూపొందించిన గణాంకాలను పిటిషన్లో ప్రస్తావిం చారు. 2009 నుంచి క్రిమినల్ కేసులున్న‌ ఎంపీల సంఖ్య 100 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 2019 సాధా రణ ఎన్నికల్లో గెలుపొందిన 539 మంది లోక్ స‌భ సభ్యుల్లో 233 మంది.. అంటే 43 శాతం మందిపై క్రిమినల్ కేసులు న్నాయని తెలిపారు. ఓ ఎంపీ తనపై ఏకంగా 204 క్రిమినల్ కేసులున్నట్టు వెల్లడిం చారని  కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.   ఇటీవ‌లికాలంలో ఎన్నిక‌ల్లో పోటీచేస్తున్న‌వారిలో అత్యాచారాలు, హ‌త్య‌లు, అత్యాచారాల‌కు  పాల్ప‌డిన వారు, కిడ్నాప్‌ల‌కు పాల్ప‌డిన‌వారు కూడా పార్ల‌మెంటుకు వ‌స్తున్నార‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. అస‌లు ఎన్నిక‌ల్లో పాల్గొనే ముందు ఎన్నిక‌ల క‌మిష‌న్ అలాంటివారి చ‌రిత్ర తెలిసి కూడా అనుమ‌తించ‌డ‌మే మి ట‌ని ప్ర‌శ్నించారు. అంత‌కుమించి ఆయా పార్టీలే వారికి మ‌ద్ద‌తునిచ్చి మ‌రీ  పంపిస్తున్నార‌ని ఆరోపిం చా రు.  అయితే, ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై మరిన్ని పరిమితులు విధించడం కష్టమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.  ఆర్టికల్ 19(2)లో  పేర్కొన్న భావప్రకటనా స్వేచ్ఛ పై రాజ్యాంగమే కొన్ని పరిమితుల ను కూడా విధించిందని కోర్టు తెలిపింది.  యూపీ ప్రభుప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రం పై మరిన్ని పరిమితులు విధిం చడం కష్టం.  ప్ర‌భు త్వం పై రాజకీయ కుట్రలో భాగంగానే రేప్ కేసు పెట్టా రని అప్పట్లో ఓ మంత్రి వ్యాఖ్యానిం చారు.  ఆ తర్వాత సదరు మంత్రి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ప్రజా ప్రతినిధులు తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వారి వాక్స్వా తంత్య్రంపై పరిమితులు విధించాలని పిటిషనర్ తరపు న్యాయ వాది కోర్టును అభ్యర్థించారు. ఈ అంశాన్ని నవంబరు 15న పరిశీలిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్,నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 

అయ్యో పాపం రోజా మేడం అవుటై పోయారు!

అయిపొయింది,. మంత్రి రోజా నోటికి గట్టిగానే పని చెపుతున్నారు.అంతకు ముందు ఎలా ఉన్నా కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆమె మాటల దూకుడు పెంచారు. అంతవరకు ఉన్న కొద్ది పాటి  కట్టుబాట్లను కూడా తెంచుకుని మరీ రెచ్చి పోయారు. ఏమి మాట్లాడుతున్నారో, ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నామో తెలియకుండా, కనీసం స్థాయి బేధం అయినా, పట్టించుకోకుండా,   పోయి ప్రతిపక్షమ మీద విరుచుకు పడుతున్నారు.  అయినా, నోరు దాచుకోకుండా అంతలా కష్ట పడుతున్నా, చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆమెను,’గడప గడప’కు పరీక్షలో ‘ ఫెయిల్ చేశారు. పనితనం పెంచుకోక పొతే, పక్కన పెట్టక తప్పని హెచ్చరించారు‘గడప గడప’ పరీక్ష ఫెయిల్ అయిన ఏమ్మేల్యేల  ఫస్ట్ లిస్ట్’ లోని  27 ఎమ్మెల్యేలలో  మంత్రి ఆర్కే రోజా పేరు కూడా వుంది. అఫ్కోర్స్, ఆమెతో పాటుగా, తానేటి వనిత, కారుమూరు నాగేశ్వరరావు,  బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా ఉన్నారను కోండి, అది వేరే విషయం. కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పక్షం రోజుల్లోనే రోజాకు  రెండవ సారి వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా ఇదే ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించడంతో రోజా రాజకీయ భవిష్యత్ ఏమిటనే విషయంలో ఆమె సన్నిహిత వర్గాల్లో చర్చ మొదలైంది. చివరకు రోజా పరిస్థితి, ‘ఒక్క సారి మంత్రి చేయి గణనాథా, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ’ అన్న చందంగా మారుతుందా అన్న ఆందోళన ఆమె సన్నిహితుల్లో మొదలై నట్లు, చెపుతున్నారు.  నిజానికి, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. చివరకు అసెంబ్లీలో దూకుడు ప్రదర్శించి సంవత్సరం పాటు సస్పెండ్ కూడా అయ్యారు. ఒక విధంగా వైసీపీ ఫేస్ గా, జగన్ రెడ్డి, ఇన్నర్ సర్కిల్ లో ఒకరుగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలోనే  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ లోనే తనకు బెర్త్ ఖాయమన్న ధీమాతో, రోజా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోయారు. ఎంతవరకు నిజమో ఏమో కానీ, ప్రమాణ పత్రం తెచ్చుకుని బట్టీ పట్టారని కూడా అంటారు. అయితే  జగన్ రెడ్డి  రోజాకు తొలి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టారు. ఆ విధంగా, కలలలో తేలియాడుతున్న రోజా, జగనన్న ఇచ్చిన షాక్ కు ఖగుతున్నారు.అవాక్కయ్యారు అని  అంటారు.    ఇక అక్కడి నుంచి మంత్రి వర్గ విస్తరణ కోసం. ఇంకా తెలవారదేమి అంటూ  చకోరా పక్షిలా ఎదురు చూశారు. గుళ్లూ గోపురాలూ తిరిగారు. నోములూ వ్రత్రాలూ చేశారు. జ్యోతిషులను నమ్మి శాంతులు, హోమాలు గట్రా చేయించారు. ఒకటని కాదు, ఏమేమి చేయాలో అన్నీ చేశారు. చివరకు ఏ దేవుడు కరుణించాడో, ఏ ప్రభువు ఆశ్వీదరించారో, గానీ, ఆమె కల నెరవేరింది. జగనన్న కొంచెం ఆలస్యంగానే అయినా, రెండవ విడత, గత డిసెంబర్ లో చేపట్టిన మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణలో ఆమెకు అవకాశం కల్పించారు. పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖను కేటాయించారు. శాఖ ఏదైతేనేం మంత్రి అయ్యానని ఆమె హ్యాపీహ్యపీస్ గా సంతోషంగా ఉన్నారు.  అయితే, మంత్రి పదవి వచ్చి ఇంకా నిండా ఆరు నెలలు అయినా నిండక ముందే,   పిడుగులాంటి వార్త వచ్చి పడింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పెట్టిన, గడప గడపకు పరీక్షలో రోజా ఫెయిల్ అయ్యారని, స్వయంగా ముఖ్యమంతే అందరి ముందు ప్రకటించారు. రెండు నెలలు సమయమిచ్చి, ఈలోగా, పాస్ మార్కులు తెచ్చుకుంటే సరి, లేదంటే మంత్రి పదవి కాదు, ఎమ్మెల్యే టికెట్’కే భరోసా లేదని ఖరా ఖండిగా, చెప్పారు. దీంతో, మంత్రి పదవి మూడునాళ్ళ ముచ్చటేనా, అనే విషాదం యోగంలోకి రోజా  జరుకున్నారని అంటున్నారు. చివరకు ఎమౌతుందో, ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే రోజా రాజకీయ జీవితం తెర మరుగయ్యే హెచ్చరికలు మాత్రం బలంగానే,వినిపిస్తున్నాయని, అంటున్నారు.ఆమె అభిమానులు  అయితే అయ్యో పాపం రోజా మేడం ..అవుటై పోయారు...అంటూ పాడుకుంటున్నారు.

బొత్సపై జగన్ సీరియస్.. సమావేశంలో అందరి ముందే చిన్నబుచ్చిన వైనం

జగన్ రెడ్డి మరో సారి తన మంత్రివర్గ సహచరులలో కొందరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేసిన వారిలో ఓ సీనియర్ మంత్రి కూడా ఉన్నారు. అయితే ఆయనను తప్పని సరిపరిస్థితుల్లో రెండో కేబినెట్ లో కూడా కొనసాగించినప్పటికీ.. ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకింత ఉక్కపోతకు గురి చేస్తూనే ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ ఆ మంతి అని చెబుతున్నారు.  బొత్స సత్యనారాయణను జగన్ తొలి కేబినెట్ లోకి తీసుకున్నారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా బొత్సకు మరోసారి అవకాశం ఉండదనే అంతా భావించారు. అయితే కారణాలేవైనా ఆయన తన మంత్రిపదవిని దక్కించుకున్నారు. అయితే పునర్వ్యవస్థీకరణలో బొత్సకు అప్రధానమైన శాఖను కేటాయించడం పట్ల ఆయన అప్పట్లోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి విదితమే. తొలి కేబినెట్ లో రాజధాని వ్యవహారాలను చక్కపెట్టే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక  శాఖ నిర్వహించిన బొత్సకు, పునర్వ్యవస్థీకరణలో ఆయనకు ఏమాత్రం ఇష్ఠంలేని విద్యా శాఖను జగన్ అప్పగించారు. అప్పట్లోనే తనను పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బొత్స బహిరంగంగా కాకపోయినా.. తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విదితమే.  విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే విషయంలోనూ ఆప్పట్లో ఆయన జాప్యం చేశారు. శాఖ మార్పు కోసం జగన్ ను కలిసేందుకు అప్పట్లో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఎం అప్పాయింట్ మెంట్ దొరకలేదని కూడా అప్పట్లో పార్టీలో గుసగుసలు వినిపించాయి. వీటన్నిటికీ తగ్గట్లుగానే ఆయన విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజులలో విద్యా శాఖ అధికారులు, బొత్సను పక్కన పెట్టేసి తమ పని తాము చేసుకుపోయారు. దాంతో  విద్యా శాఖలో ఏమి జరుగుతోందో, విద్యా శాఖ మంత్రికి తెలియని ఒక విచిత్ర పరిస్థితి అప్పట్లో నెలకొందని అంటునారు. మంత్రి ప్రమేయం లేకుండానే అప్పట్లో జీవోలు వచ్చేశాయి. ఈ విషయంలో అప్పట్లో బొత్స తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  మంత్రిగారి ఆదేశాలను అధికారులు అసలు పట్టించుకోని విచిత్ర పరిస్థితి అప్పట్లో విద్యాశాఖలో ఉండేది. పట్టిచుకోవడం లేదని అంటున్నారు.    రాష్ట్రంలో పాఠశాలల విలీనం ప్రక్రియను వెంటనే అపేయాలని మంత్రి బొత్స అధికారులను ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. ఆ సమయంలోనే  మంత్రి రివ్యూ మీటింగ్ పెడితే, సగం మంది అధికారులు గైర్హాజరయ్యారు. ఇక వచ్చిన  సగం మంది మంత్రి ఆదేశాలు అక్కడే చెత్త బుట్టలో పడేసి చక్కా పోయారని సెక్రటేరియట్ వర్గాలు అప్పట్లో జోకులు కూడా వేసుకున్నాయి. సీఎం ఆదేశాల మేరకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని అప్పట్లో రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  సరే తరువాత తరువాత అదంతా సద్దుమణిగిందనుకుంటుంటే.. బుధవారం (సెప్టెంబర్ 28) జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో సీనియర్ మంత్రి అని కూడా చూడకుండా బొత్స ముఖం మీదే ఆయన పని తీరు బాగాలేదని జగన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసి చిన్నబుచ్చారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలి అరెస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపణలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. ‘ఓన్లీ మచ్ లౌడర్’ అనే ఈవెంట్స్ సంస్థ మాజీ సీఈఓ విజయ్ నాయిర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. విజయ్ నాయిర్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ శిశోడియా, మరో 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో సీబీఐ చేర్చింది. వారిలో విజయ్ నాయిర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. మనీష్ శిశోడియాకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో సభ్యుగు విజయ్ నాయిర్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించింది. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఈ లిక్కర్ స్కామ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో దూకుడు పెంచడం తెలుగు రాష్ట్రాల్లోని నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు  రాజకీయ నేతలకు లింకులు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నాయనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయ్ నాయిర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ తదుపరి అరెస్టు ఎవరిదై ఉంటుంది అనే ఆందోళనతో పలువులు ఉన్నారంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ కేసులు నమోదు చేసిన తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేస్తోంది. బినామీల ద్వారా ఢిల్లీలో లిక్కర్ దందాలో పెట్టుబడులు పెట్టారనే కోణంలో విచారణ జరుగుతోందంటున్నారు. బినామీల పేరుతో అనధికారికంగా పెట్టుబడులు పెట్టి, నల్లధనాన్ని వైట్ చేసుకున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన కీలక సమాచారం ఈడీ అధికారులకు దొరికిందని అంటున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్కామ్ తో సంబంధాలున్న రాజకీయ నేతల హార్ట్ బీట్ పెరిగిపోతోందని అంటున్నారు. అనుమానిత సంస్థలు, వాటికి సంబంధించిన లావాదేవీలను బట్టబయలు చేసే పనిలో ఈడీ అధికారులు నిమగ్నమై ఉన్నారనే తెలుస్తోంది. ఈ స్కామ్ తో లింకులు ఉన్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఏపీ సీఎం సతీమణి  భారతి   పేరు కూడా తెర మీదకు  వచ్చింది. అలాగే  హైదరాబాద్ లో ఉన్న పలువురి ఇళ్లలో సీబీఐ సోదాలు చేసింది. ఈ కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసం, కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సీబీఐ సోదాలు నిర్వహించింది. రామచంద్ర పిళ్లై వ్యాపార భాగస్వాములుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలో కూడా తనిఖీలు జరిపింది. ఏపీలోని ప్రముఖ వ్యాపారవేత్త, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన సంస్థల్లో ఈడీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి తొలి అరెస్ట్ జరగడంతో తదుపరి ఎవరి వంతు వస్తుందో అనే ఆందోళన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నెలకొందని తెలుస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ప్రియాంక?!

కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. త్వరలోనే నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఇదంతా ప్రతి పార్టీలోనూ మామూలుగా జరిగే వ్యవహారమే. కానీ కాంగ్రెస్ పార్టీ విషయం మాత్రం ప్రత్యేకం. పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటుండటం, ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు మోస్తున్న సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం.. గాంధీ కుటుంబం వినా మరో వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నిక గడువు సమీపిస్తున్న సమయంలో కూడా పార్టీ చీఫ్ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించడం లేదు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో గందరగోళం రోజు రోజుకూ చిక్కనౌతోంది. పార్టీ అధినేత్రి ఏరి కోరి ఎంపిక చేసిన అభ్యర్థి గెహ్లాట్ నామినేషన్ వేయకుండానే తోక జాడించారు. తన వర్గానికి చెందిన వ్యక్తిని రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అంగీకరిస్తేనే అంటూ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసినంత పని చేశారు. ఆ తరువాత తమాయించుకుని సారీ చెప్పినా.. ఇక గెహ్లాట్ నమ్మే పరిస్థితి కాంగ్రెస్ అధిష్ఠానంలో కనిపించడం లేదు. కమల్ నాథ్ అనుకుంటూ ఆయనా ఆసక్తి చూపడంలేదు. దీంతో దిగ్విజయ్ సింగ్ పేరు తెరమీదకు వచ్చింది. నామినేషన్ దాఖలుకు ఒక్కరోజే గడువు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రసకందాయంలో పడిందని అంటున్నారు. అసలు వాస్తవం చెప్పాలంటే.. 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటి నుంచీ ఆ పదవి ఖాళీగా ఉన్నదనే అనాలి.  అనివార్య పరిస్థితిలో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా, ఆమె గతంలోలా పకడ్బందీగా, కచ్చితంగా ఆ బాధ్యతలను నిర్వర్తించలేకపోయారనడంలో సందేహం లేదు.   ఇప్పుడు ఆ తాత్కాలిక బాధ్యతలు కూడా తన వల్ల కాదని సోనియా తేల్చేశారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె విశ్రాంతి కోరుకోవడం సహజమే. అందుకే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ ను అంగీకరింపచేయడానికి పార్టీ వర్గాలు, సీనియర్ నేతలు, ఆఖరికి సోనియా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే అనివార్యంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్డింది.  గాంధీ కుటుంబం   నుంచి కాకుండా బయటి వారిని ఎన్నుకోవాలన్న రాహుల్ సూచన మేరకు సోనియాగాంధీ గెహ్లాట్ ను ఎంపిక చేశారు. అయితే ఆయన తీరుతో ఇంకెంత మాత్రం గాంధీ కుటుంబం బయటవారికి అవకాశం ఇవ్వకూడదన్న నిర్ణయానికి సోనియా వచ్చేశారని చెబుతున్నారు. దీంతో రాహుల్ ఎటూ సుముఖంగా లేరు కనుక ప్రియాంకకు ఆ బాధ్యతలు కట్టబెట్టాలని సోనియా నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ శ్రేణులు, సీనియర్లు కూడా రాహుల్ కాకుంటే ఆమే ఆ పదవికి అన్ని విధాలుగా అర్హురాలని అంటున్నారు. ఆమెలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయని చెబుతుంటారు. ప్రియాంక గాంధీ కూడా ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రత్యక్ష ఆందోళనల్లో సైతం పాలు పంచుకుంటున్నారు. దీంతో ఆమెకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.  దీంతో ప్రియాంక గాంధీ వాద్రా పేరు తెరపైకి వచ్చింది.  భారతీయసంప్రదా యం ప్రకారం ఆడబిడ్డకు పెళ్లయిన తర్వాత పుట్టింటి పేరు ఉండదని, అత్తంటి పేరే ఇంటిపేరు అవుతుందని, ఆమెను ఇంకెంత మాత్రం గాంధీ కుటుంబ సభ్యురాలిగా పరిగణించరాదని కాంగ్రెస్ ఎంపీ ఒకాయన  తాజాగా ట్వీట్ చేశారు. అంటే ఆమెను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకుని పగ్గాలు అప్పగిస్తే గాంధీ కుటుంబేతర వ్యక్తికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లౌతుందని ఆయన తాత్పర్యం. .మరోవైపు, పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్వేసేందుకు సీనియర్ నేత శశిథరూర్ సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎవరనేది ఇంకా  తేలలేదు.రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వైపు పార్టీ అధిస్థానం మొదటి నుంచీ మొగ్గుచూపుతూ వచ్చింది.అయితే ఊహించని విధంగా రాజస్థాన్లో తలెత్తిన పరిణామాలతో అధ్యక్ష పదవికి గెహ్లాట్ అభ్యర్థిత్వం డోలాయ మానంలో పడింది. రాజస్థాన్లో తనఅనుచరగణానికే  నచ్చచెప్పలేనిగెహ్లాట్... పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు ఎలాచక్కబెడతారనే ప్రశ్నలు మొదలయ్యాయి. సీనియర్ నేత కమల్నాథ్ ఢిల్లీకిచేరుకున్న ప్పటికీ ఆయనఅధ్యక్షుడి పదవిపై పెద్దగామొగ్గుచూపడం లేదు.మరో సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ సైతం పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన ఆచూతూచివ్యవహ రిస్తున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికలనామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో ఇంకా సందిగ్ధత తొలగలేదు.  ప్రియాంకా గాంధీ యేతర కుటుంబ వ్యక్తిగా పరిగణించి ఆమెనే పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీలో దింపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఇది ఉభయతారకంగా ఉంటుందని సోనియా కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. గాంధీ కుటుంబం బయటి వ్యక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ అధినేత్రిగా ఎన్నుకుందని చెప్పుకోవచ్చునూ, అలాగే పార్టీ పగ్గాలు కుటుంబం చేతి నుంచి జారిపోకుండా చూసుకోవచ్చునని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

బీజేపీకి ఎందుకీ ఆరాటం?

రాను రాను బీజేపీకి భ‌జ‌న‌చేయించుకునే పిచ్చి బాగా ముదురుతోంది. వారికంటే గొప్ప రాజ‌కీయ‌వేత్త‌లు ఎవ్వ‌రూ లేర‌ని, దేశంలో మ‌త‌, సంప్ర‌దాయాల‌ను కాపాడే మ‌హాత్ములు ఇంకెవ‌రూ లేర‌ని భుజ‌కీర్తుల‌ కోసం మ‌హా తాప‌త్ర‌య‌ప‌డుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండి ప్ర‌జాసంక్షేమం, పాల‌నా వ్య‌వ‌హారాల్లో శ‌భాష్ అనిపించుకుందామ‌నే కంటే ఇత‌రులు, ఇత‌ర అంశా ల్లోనే బాగా దృష్టిపెడుతోంది. పండ‌గ‌లు, పందిళ్ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. ఇది దుర్గాపూజ‌ల స‌మ‌యం గ‌నుక అర్జంటుగా బెంగాల్‌లో ప్ర‌పంచ ప్ర‌సిద్ధ దుర్గా పూజా విధానాన్ని ఆ మ‌హా కార్య‌క్ర‌మానికి అంత‌ర్జాతీయ యునెస్కోగుర్తింపు తెప్పిం చి ఆ కార్యక్ర‌మం త‌మ చేతుల‌మీదుగానే జ‌రిగింద‌ని న‌లుగురిచేతా అనిపించుకోవాల‌ని మ‌హా తాప‌ త్ర‌య‌ ప‌డుతోంది. ఈ విధంగా బెంగాల్ ప్ర‌భు త్వం ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసి ఈ విధంగా కూడా రాజ‌కీయాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించే య‌త్నాలు చేస్తోంది.  బెంగాల్ దుర్గా పూజలో కోల్పోయిన స్థలాన్ని తిరిగి పొందేందుకు బీజేపీ ఎలా ప్రయత్నిస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ ఎస్‌) పశ్చిమ బెంగాల్‌లో బిజెపి బ్యానర్‌లో దుర్గాపూజ నిర్వ హించడానికి ఎప్పుడూ అనుకూలంగా లేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి) ఫిరాయింపు దారులు ముకుల్ రాయ్ (అతను ఇప్పుడు తిరిగి అధికార పార్టీలోకి వచ్చాడు), బిజెపికి చెందిన కైలాష్ విజయ వర్గియా మద్దతుతో, మమతా బెనర్జీ దుర్గామాత మంజూరు కోసం అధిగ మిస్తున్నట్లు కనిపించినందున పూజ ప్ర‌సాదంలోనూ కుంకుమ వేళ్లు ముంచడానికి అనుకూలంగా వాదించారు. హిందూ ఓట్ల ఏకీకరణకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు పూజలు చేశారు. అప్పటి కాలాలు వేరు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టిఎంసి కంటే 40 శాతం ఓట్లు, కేవలం నాలుగు సీట్లు తక్కువగా ఉన్న బిజెపి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 21 శాతంగా ఉన్న హిందూ ఓట్ల శాతం 2019 పార్లమెంటు ఎన్నికల్లో 57 శాతానికి పెరగడం, అది మరింతగా దూసుకుపోగలదన్న విశ్వాసాన్ని ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ హెచ్చరికలను పట్టించుకోకుండా సైద్ధాంతిక సర్దుబాట్లకు సిద్ధమైంది. జై శ్రీరామ్ నినాదంతో ప్రమాణం చేసిన బిజెపి నాయకులు, కార్యకర్తలు బెంగాల్ దేవతలైన దుర్గా, కాళిని ఉర్రూతలూగిస్తూ కని పించారు. 2020లో, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున, బిజెపి కోల్‌కతాలో  ఇతర ప్రాంతాలలో చాలా ఆర్భాటంగా దుర్గాపూజను నిర్వహిం చడమే కాదు, పూజా పండల్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చారు, చాలా మంది కేంద్ర నాయకులు కనిపించారు. సాంప్రదాయ బెంగాలీ వస్త్రధారణలో ఉత్సవాల్లో చేరారు. లక్ష్యం స్పష్టంగా ఉంది: మమత ,ఆమె టీఎంసి బిజెపిపై ప్రయోగించిన 'బయటి వ్యక్తిస‌,  'హిందీ మాట్లాడే ప్రాంత‌ పార్టీ' ట్యాగ్‌లను తొల గించి ప్రజల హృదయాలను గెలుచుకోండి.  చివరికి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అది ఫలించలేదు. బీజేపీ హిందూ ఓట్ల శాతం 7 శాతం (50 శాతానికి) పడిపోయింది, ఓట్లు టీఎంసీకి బదిలీ అయ్యాయి. బెంగాల్ ఓటర్లు బిజెపి హిందుత్వ భారీ ప్రచారానికి అనుకూలంగా లేరని స్పష్టమవుతోంది, ఇది వివిధ రూపాల్లో వ్యక్తమైంది. గత ఏడాది ఎన్నికలలో ఎదురుదెబ్బ తగలడంతో, దుర్గాపూజ నిర్వహణపై బీజేపీ నేతల ఆసక్తి క్షీణించింది. అయితే, ఈ ఏడాది, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఇద్దరూ దాని కొనసాగింపులో వివే కాన్ని చూస్తున్నారు. అన్నింటికంటే, బెంగాల్ అతిపెద్ద పండుగగా, దుర్గా పూజ కమ్యూనిటీ లు,మతాల అంతటా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్దపీట వేసిన పూజలకు స్పాన్సర్‌గా, పోషకుడిగా బీజేపీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయ త్నించినా ఫలితం లేకుండా పోయింది. మమత తన పార్టీ , ప్రభుత్వం నుంచీ కమ్యూనిటీ పూజల కు అన్ని రకాల సహాయాన్ని ఉపసంహరించుకుంటానని బెదిరించడం ద్వారా బీజేపీ కోసం తీసుకునే వారు లేకుండా చూసుకున్నారు. ఇది బిజెపిని వెనుకకు నెట్టినప్పటికీ, బెంగాల్‌లో దుర్గాపూజకు లభించే ట్రాక్షన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. కోల్‌కతా దుర్గా పూజను యునెస్కో తన 'ఇంట్‌యాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ' జాబితాలో చేర్చినందుకు మమత తన వంతుగా డోలు కొట్టారు. బిజెపికి, యునెస్కో గౌరవానికి దుర్గాపూజ ను ప్రతిపాదించడానికి మోడీ ప్రభుత్వం కూడా తన వంతు కృషి చేసిందని బెంగాల్ ప్రజ లకు గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. బిజెపి ఎంపి మీనాక్షి లేఖి మాట్లాడుతూ, ఈ విజయంలో రాష్ట్ర ప్రభు త్వం పాత్ర లేదు. యునెస్కో ట్యాగ్ పొందడానికి దరఖాస్తులు ఇంతకుముందు కూడా చేశా రు. కానీ అవి తిరస్కరించబడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో తాజా ప్రయత్నం జరి గింది, మాకు గుర్తింపు వచ్చింది. ఇది మాత్రమే కాదు, సెప్టెంబర్ 1న యునెస్కో ట్యాగ్‌పై మమత కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమానికి కౌంటర్‌గా సెప్టెంబర్ 24న బీజేపీ కూడా వేడుకను నిర్వహించింది. కానీ తృణమూల్ ఈవెంట్‌లా కాకుండా, దుర్గా పూజకు గొప్పతనాన్ని అందించడానికి కళాకారులు, విగ్రహాల తయారీదారులు, ఢాకీలు (డ్రమ్మర్లు), తెరవెనుక పనిచేసే వారందరి కృషిని బిజెపి కార్యక్రమం గుర్తిం చింది. కోల్‌కతాలోని కొన్ని వారసత్వ రాజ్‌బరీ పూజల సభ్యులతో పాటు అలాంటి ముప్పై మంది వ్యక్తులను సత్కరించారు. ”పూజను తృణమూల్ కాంగ్రెస్ చూసే విధానం-ఆడదడవి మరియు ప్రదర్శన, డోల్స్, స్పాన్సర్‌షిప్ మొదలైన వాటిని భర్తీ చేయాలనే ఆలోచన ఉంది. బిజెపి సంప్రదాయాలు మరియు ఆచారాలకు కట్టుబడి ఉండాలని మరియు అసలు పూజ భాగాన్ని నొక్కి చెప్పాలని కోరుకుంది. టీఎంసి పాలనలో దుర్గాపూజ ఏ స్థాయికి తగ్గించబడిందో ప్రజలకు చూపించడానికి ఇది సరైన మార్గమ‌ని ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త , ఎమెరిటస్ ప్రొఫెసర్ ప్రశాంత రే చెప్పారు. ఈ సంవత్సరం, దుర్గా పూజ పూజారులు, ఆచారాలకు స్టిక్కర్లు వేసే వారి కనుబొమ్మలను పెంచడానికి మమత పుష్కలంగా అవకాశం కల్పించారు. పితృపక్షం (పంచాంగంలో అశుభమైనదిగా పరిగణించ బడుతుంది) సమయంలో అనేక పూజలను ప్రారం భించడం ద్వారా మమత చర్చను ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కూడా అయిన బీజేపీ నేత సువేందు అధికారి, హిందూ మతం, సంప్రదాయాల గురించి మమతకు ఉన్న అవగాహనను ప్రశ్నించారు. కొన్ని పూజలను ప్రారంభించేందుకు అమిత్ షా కోల్‌కతాకు రావచ్చని బలమైన సంచలనం ఉంది, వాటిలో ఒకటి సెంట్రల్ కోల్ కతా లోని బిజెపి నాయకుడు సజల్ ఘోష్. మిథున్ చక్రవర్తి కూడా దక్షిణ దినాజ్‌పూర్‌లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి సుకాంత మజుందార్ పూజను ప్రారంభించేందుకు ఎగురుతూ వచ్చారు. బీజేపీ శిబిరంలో జరుగుతున్న దీన్ని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తు న్నారు. మమతా బెనర్జీ గతంలో అసంపూర్ణ శ్లోకాలను పఠించారు. ఇప్పుడు, పితృపక్ష సమ యంలో దుర్గాపూజ ప్రారంభోత్సవం ఖచ్చితంగా పెద్ద సమస్యగా మారనుంది. అది అమిత్ షా చూస్తా రని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఒకరు చెప్పారు.

గొంతు ఒణికింది.. పాట ఒలికింది..!

ప్ర‌బాస్‌,అనూష్కాలో, చెర్రీ కాజ‌లో ఇర‌వై ఎనిమిది వొంపులు తిరుగుతూ ఇంట్లో,పార్క‌లో, రోడ్డుమీదో, విదేశీ ప‌ర్వ‌తాల మీదో ఎగిరేనే ప్రేమ‌, ప్రేమించుకోవ‌డమే ప్రేమ కాదు. పండువ‌య‌సులోనూ క‌లిసి ఉండ టం, స‌ర‌దాగా ఉండ‌టం, బాధ‌ల్ని, స‌మ‌స్య‌ల్ని మ‌ర్చిపోతూ మాట్లాడుకోవ‌డం. ప్ర‌బాస్‌కి అనూష్క ఏం పాడినా, కాజ‌ల్ చెర్రీ కోసం ఏం మాట్లాడినా..ఓ పెద్దామె మాత్రం ఆస్ప‌త్రిలో మంచంలో ఉన్న భ‌ర్త‌కోసం పోర్చుగీస్ గీతం పాడింది! ప్రేమ ఓ గొప్ప‌భావ‌న‌. దాన్ని ఆక‌ళింపుచేసుకోవాలి. ప్రేమంటే సినిమాల్లో ప్రేమ కాదు. మ‌నిషిని మ‌నిషిగా చూడ్డం, గౌర‌వించ‌డం. జాతి, కుల‌, మ‌తాల‌కు, దేశ విదేశాల‌కు స‌రిహ‌ద్దులు చెరిపేసి ఒక్క‌టిగా చేయ‌గ‌లి గేది. అలా ఆ స్థాయిలో ఉండ‌గ‌లిగేవారిదే అస‌లు ప్రేమ‌. ఇద్ద‌రు ఒక్క‌ట‌యి జీవితాంతం క‌లిసి ఉండ డంలో ప్ర‌ద‌ర్శించే అనురాగాప్యాయ‌త‌లే ప్రేమ‌. పండు ముస‌లి వార‌యినా ఒక‌రికోసం ఒక‌రు అను కోవ డంలోని అద్బుతానందం అనంతం. దానికి లోకం స‌లామ్ అనే అంటుంది.  ఆస్ప‌త్రిలో అనారోగ్యంతో ఉన్న త‌న భ‌ర్త‌కు ఎప్పుడూ వినిపించే పాట‌నే వినిపిస్తూ అత‌నికి ఆస్ప‌త్రిలో ఉన్నాన‌న్న స్పృహ లేకుండా చేయ‌డానికి పెద్దావిడ మ‌ళ్లీ గొంతు స‌వ‌రించుకుంది. ల‌తామంగేష్క‌ర్ కాన క్క‌ర్లేదు.. ఒణుకుతున్న స్వ‌రంతో అత‌ని చేయి ప‌ట్టి రెండు నిమిషాలు పాడిన‌ట్టు చేసినా అది గొప్ప స్వాంత‌న‌నిస్తుంది. అది ప్రేమంటే. ఈ పెద్దావిడ త‌న 70 ఏళ్ల భ‌ర్త కోసం బ్రిజిల్ గీత ర‌చ‌యిత రాసిన పోర్చుగీసు గీతం..కోమో గ్రాండీ ఓమెని..అంటూ పాడింది. ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఎంతో ఆనందించాయి. ఆయ‌న‌కు మందులు, ఆస్ప‌త్రి ఇబ్బందుల త‌ల‌నొప్పి పోయి ప్ర‌శాంతంగా నిద్ర‌పోయాడు.