ఆర్ ఎస్ ఎస్ కామెంట్ కేంద్రంపై ఎక్కుపెట్టిన‌దేనా?

ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి పేదరికం, నిరుద్యోగం, అసమానతలపై ఎర్ర జెండాలు వేసి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. సామాజిక సవాళ్ల గురించి సంఘ్ ఎప్పుడూ ఆలో చిస్తుంద‌ని బీజేపీ అధికార ప్రతినిధి చెప్పారు.  స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం) కార్యక్రమంలో భారత దేశ పేదరికం, నిరుద్యోగం అసమానతలను ఎత్తిచూపుతూ ఆర్ ఎస్ ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి, అవి  బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వా న్ని లక్ష్యంగా చేసుకున్నాయి.  బిజెపి అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ మాట్లాడుతూ, హోసబాలే చెప్పినదానిపై పార్టీకి ప్రత్యేక వైఖరి లేదని, అయితే సాధారణమైన కొన్ని సవాళ్లను ఆయన నొక్కిచెప్పారని, కాంగ్రెస్‌కు చెందిన కొం దరు నాయకులు - ఇది ఎదుగుదలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారు.  భారత్ జోడోయాత్ర  ప్రభావాన్ని చూడండి. దేశాన్ని విచ్ఛిన్నం చేసి, సమాజంలో విషాన్ని వ్యాపింపజేసే వారు నేడు తమ పరిధిని పెంచుకోవడానికి పేదరికం, నిరుద్యోగం అసమానతలను లేవనెత్తు తున్నారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ హిందీలో  ట్వీట్ చేశారు. బీజేపీ సైద్ధాంతిక గురువు, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత చేసిన ప్రకటన ప్రాముఖ్యతపై రాజకీయ నిపుణు లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సహచరుడు, రాజకీయ విశ్లేషకుడు రాహుల్ వర్మ దీనిని బీజేపీ ప్రభుత్వంపై చేసిన విమర్శగా పరిగణించడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ తరచుగా బీజేపీకి మనస్సాక్షిగా వ్యవహరిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో కూడా, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు భారతీయ కిసాన్ సంఘ్ మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిమాండ్ లు, నిరసనలు చేసేవ‌ని ఆయన అన్నారు. కానీ, మరొక రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ "హోసబాలే చెప్పినది చాలా స్పష్టంగా ఉంది, అయితే ఆర్ ఎస్ ఎస్‌ లేదా బీజేపీ నాయ కులలో ఒక వర్గం విభేదిస్తున్నారా అనేది బహిరంగ ప్రశ్న అని అన్నారు. ఎస్జెఎం వెబ్‌నార్‌లో, హోసబాలే పేదరికాన్ని వధించవలసిన రాక్షసుడితో పోల్చా డు. ఇక్కడ నివసిస్తున్న 20 కోట్ల మందికి పైగా ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. దాదాపు 23 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.375 ఆదాయం పొందుతున్నారు. నిరుద్యోగిత రేటు కూడా 7.6 శాతం వద్ద చాలా బాధ కలిగిస్తోంది. దేశంలో పేదరికం, నిరుద్యోగం ఉంది, అయితే పెరుగుతున్న అసమానతలను కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచంలోని మొదటి  ఆరు ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం  ఒకదానిలో ఒకటిగా ఉన్నప్పటికీ,  అంతా బాగానే ఉందని మేము చెప్పలేము. భారతదేశంలోని జనాభాలో ఒక శాతం మంది  దేశ సంపదలో 20 శాతం కలిగి ఉండగా, 50 శాతం మంది వద్ద 13 శాతం సంపద ఉందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఈ ఆర్థిక అసమానత గురించి మనం ఏదైనా చేయాలి. జనవరిలో, సంఘ్-అనుబంధ ఎస్ జె ఎం, ఏడు ఇతర మితవాద సంస్థలతో కలిసి, స్వావలంబి భారత్ అభియాన్ (ఎస్ బి ఏ) ను ప్రారంభించింది, ఇది 2030 నాటికి  దేశాన్ని నిరుద్యోగ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం నాటి కార్యక్రమం, 'స్వావలంబన్ కా శంఖనాద్స‌, ఎస్ బి ఏ బ్యానర్‌లో నిర్వహించబడుతున్న ఈవెంట్‌ల శ్రేణిలో భాగం. పేదరికం, అసమానత, నిరుద్యోగంపై హోసబాలే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అగర్వాల్  ఈ సవాళ్లను ప్రధానమంత్రి స్వయంగా ప్రసంగాలలో లేవనెత్తారని అన్నారు. ఒక సామాజిక సంస్థగా, ఆర్ ఎస్ ఎస్‌ తన స్వంత ప్రత్యేక చొరవను కలిగి  ఉంది, ఈ సమయంలో వ్యాఖ్య లు చేసింది, ఎప్పుడూ సామాజిక సవాళ్ల గురించి ఆలోచిస్తుంది. అయితే ఇది ఆర్‌ఎస్ఎస్ చేసిన విమర్శ లేదా స్థానం మార్పు కాదని ఆర్థిక వ్యవహారాల బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్  కార్యకర్త కూడా  అయిన  హోసబాలే ప్రసంగాన్ని పౌరుల భాగస్వామ్యం  ద్వారా పేదరికాన్ని మరింత ఎలా తగ్గించవచ్చనే నేపథ్యంలో చూడాలని అన్నారు, ఎందుకంటే ప్రభుత్వం మాత్రమే ప్రతిదీ చేయ గలదు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.  ప్రభుత్వ పథకాలు  ఎంత  బాగా పని చేస్తున్నాయో ఉదాహరణలను అందించారు, అయితే, పరిమిత సమయంలో పేదరికాన్ని తగ్గించలేము. మరింత స్వావలంబన అవసరం మరియు స్వావలంబి భారత్ అభియాన్  ఆ  దిశలో ఎలా ముందుకు వెళ్లా లనే  దానిపై  దృష్టి పెడుతుంది. ప్రతిపక్షం పనికిమాలిన వివాదాన్ని సృష్టిస్తోందని  సంఘ్ కార్యకర్త పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ తరచుగా స్వయం-విశ్వాసాన్ని సమర్ధిస్తారు, ఇది మరింత ఉపాధి కల్పనకు దారితీస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఏప్రిల్‌లో, రాబోయే 25 సంవత్సరాల వరకు ప్రజలు స్థానిక వస్తువులను ఉపయో గిస్తే, దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమయంలో దేశం స్తబ్దు గా ఉండలేదు, తప్పనిసరిగా ఆత్మనిర్భర్ (స్వయం-ఆధారపడాలి) అని  నొక్కి చెప్పాడు. పేదరికం, అసమానతలపై ఆందోళనలు లేవనెత్తినప్పటికీ మోడీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమా లను హోసబాలే ప్రశంసించారని వర్మ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు, అతను నిరుద్యోగం వెనుక ఉన్న కారణాలలో ఒకటిగా పేద స్థాయి విద్యను సూచించాడు మరియు దానిని పరిష్కరించడానికి జాతీ య విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. ఆ కోణంలో చూస్తే ఆయన వ్యాఖ్యలను ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలుగా చూడకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ముంజేతి కంకణానికి అద్దమెందుకు జగనన్నా?

ఏపీలో పాలన ఎంత దివ్యంగా సాగుతోందో తెలుసుకోవడానికి విపక్ష నేతల ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలనూ పట్టించుకోవలసిన అవసరం లేదు. జగన్ అధికారంలోకి వచ్చాకా ఎంతో ప్రేమతో ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీ సిబ్బందిని అడిగితే చెబుతారు. ఒక ఉద్యోగం దొరకడమే దుర్లభంగా మారిన ఈ రోజుల్లో జగన్ సర్కార్ ఇంచక్కగా ఆర్టీసీ సిబ్బందికి రెండు ఉద్యోగాలు ఇచ్చేసింది. ఒకటి ఆర్టీసీలో డ్రైవర్/ కండక్టర్ ఉద్యోగమైతే.. రెండోది వాళ్ల వాళ్ల బస్సులు వెళ్లే దారిలో రహదారుల వేసుకునే ఉద్యోగం మరొకటి. మరి వేతనం సంగతి అంటారా? ఆ విషయం అడగొద్దు. ఒక ఉద్యోగానికి జీతం ఇవ్వడమే గగనంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో రెండో ఉద్యోగం ఇవ్వడమే గొప్ప..దానికి వేతనం కూడా ఇవ్వాలా? అందుకే వేతనం సంగతి మరిచిపోయాం అంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. ఇక విషయానికి వస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లోనూ మనమే గెలుస్తాం.. గెలవాలి. ఇంత అద్భుతంగా పని చేస్తున్న మన ప్రభుత్వానికి కాకుండా ఇంకెవరికి ఓట్లేస్తారు అని పార్టీ నేలతను నిలదీస్తున్న జగన్ కు ఆయన పాలనలో రాష్ట్రం ఎంత వైభవంగా వెలిగిపోతోందో చెప్పడానికి రోడ్ల పరిస్థితి చాలు. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అన్నట్లుగా ఏపీ రోడ్లపై బస్సులు నడపడానికి ఆర్టీసీ సిబ్బంది పడుతున్న పాట్లు చూస్తే చాలు.   ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం నియోజకవర్గం నాతవరం నుంచి తాండవ మధ్య రోడ్డుపై పల్లె వెలుగు బస్సు ప్రయాణాన్ని  ప్రయాణీకులు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే చాలు. ఆ దారిలో వెళ్లే బస్సులను నడిపే డ్రైవర్, కండక్టర్లు ఎంత హ్యాపీగా తన విధులు నిర్వర్తిస్తున్నారో గమనిస్తే చాలు.  బస్సు ముందుకు కదలాలంటే ఆ బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ లే దారి వేసుకోవాలి. రోడ్డు నిర్మించుకోవాలి. ఆ పనే చేస్తున్నారు. బండలను తెచ్చి రోడ్డు లెవెల్ చేసుకుని గుంటలను పూడ్చుకుని ముందుకు కదులుతున్నారు. ఆర్టీసీ సిబ్బందే రోడ్డు వేసుకుని మరీ బస్సు నడుపుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయింది. జగన్ పాలనలో ఏపీ వైభవాన్ని ఈ వీడియో కళ్లకు కడుతోందంటూ నెటిజన్లు తెగ ‘ప్రశంసలు’ కురిపించేస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్లనే ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు స్వయంగా రోడ్లు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని ఆయన ట్వీట్ లో ఘాటుగానే విమర్శించారు. మీ పరిపాలన వల్లనే ప్రజలు అంతా ఇలాంటి కష్టాలు పడుతున్నారని మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి మరి వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇచ్చి తమను తాము డిఫెన్స్ చేసుకుంటారో చూడాలి.

బండ్ల గణేష్.. ఆ గట్టునున్నావా?.. ఈ గట్టునున్నావా?

ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుందంటారు. మనవూరి పాండవులు అనే సినిమాలో ముళ్ల పూడి వారి డైలాగ్ ఒకటి ఉంటుంది. అన్నీ వేటి కూతలు అవి కూస్తే.. నువ్వు మాత్రం అన్నిటి కూతలూ కూస్తావు అని అర్ధం వచ్చే డైలాగ్ అది. ఇప్పుడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తీరు అలాగే ఉంది. ఏపీలో రెండు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి బండ్ల గణేష్ అవసరాన్ని బట్టి ఒక్కో పార్టీ మాట మాట్లాడుతున్నారని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏవో చిన్న చిన్న కామెడీ పాత్రలు వేసుకుంటూ లాగిస్తూ హఠాత్తుగా నిర్మాత అవతారం ఎత్తిన బండ్ల గణేష్ జనసేనాని పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కల్యాణ్ మీద ఈగ వాలితేనే తెగ హడావుడి చేసే బండ్ల గణేష్ రాజకీయంగా మాత్రం పవన్ కల్యాణ్ తో అడుగులు కలిపి నడవడం లేదు. గతంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆయన అడుగులు వైసీపీ వైపు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ స్వయంగా బండ్ల గణేష్ అటువంటి ప్రకటన ఏదీ చేయకపోయినా.. వైసీపీ నేతలతో ఆయనకున్న సంబంధాలు, పరిచయాలు మాత్రం బండ్ల గణేష్ అడుగులు వైసీపీ వైపే అని చెప్పకనే చెబుతున్నాయి. బండ్ల గణేష్ అంటేనే వివాదానికి కేరాఫ్ అడ్రస్ అని సినీ వర్గాల్లోనే చెప్పుకుంటుంటారు. ఆయన అడుగేస్తే కాంట్రవర్సి, ఆయన మాట్లాడితే కాంట్రవర్సి, ఆయన మౌనంగా ఉంటే కాంట్రవర్సి.. కాట్రవర్సి..కాంట్రవర్సి..కాంట్రవర్సి అన్నట్లుగా ఉంటుంది బండ్ల గణేష్ తీరు. బండ్లగణేష్ సామాజిక మాధ్యమంలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. మా ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అప్పట్లో సెన్సేషన్. పవన్ కల్యాణ్ తనకు సినిమా తీసే చాన్స్ ఇస్తే వేయికోట్ల వసూళ్ల రేంజ్ ఎలా ఉంటుందో చూపుతానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా సంచలనం సృష్టించాయి. అటువంటి బండ్ల గణేష్ జనసేనలో కాకుండా వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలే ఆయన ఇక్కడ మాటలు ఇక్కడ, అక్కడి మాటలు అక్కడా చెబుతున్నారా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన లైవ్ లోనే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ తో లైవ్ లోనే ఫోన్లో మాట్లాడిన తీరు, ఆ సంభాషణలో మాజీ మంత్రితో బండ్ల గణేష్ కు ఉన్న చనువు చూస్తుంటే.. వైసీపీ నేతలతో ఆయనకు చక్కటి అనుబంధం, అండర్ స్టాండింగ్ ఉందని పించేలా ఉన్నది. పైగా వైసీపీ నేతలతో బండ్ల గణేష్ అనుబంధం గురించి గతంలోనే చాలా వార్తలు వచ్చాయి. బండ్ల గణేష్ నిర్మాతగా మారేందుకు, ఆయన ఎదిగేందుకు వైసీపీ ‘సహకారం’ మెండు అని ఇండస్ట్రీలోనే చెప్పుకుంటుంటారు. తాజాగా ఆయన చనువుగా మాజీ మంత్రికి ఫోన్ చేసి మరీ మాట్లాడటం దానినే ధృవపరిచింది. పవన్ కల్యాణ్ గురించి వేదికలెక్కీ, సామాజిక మాధ్యమం వేదికపైనా ప్రసంగాలు దంచే బండ్ల గణేష్ రాజకీయం వద్దకు వచ్చే సరికి వైసీపీవైపే మొగ్గు చూపుతున్నారనీ, దీని వెనుక కారణం ఏమిటన్నది అంతుబట్టకుందనీ బండ్ల గణేష్ సన్నిహితులే అంటున్నారు. ఏది ఏమైనా సినిమాల వరకూ పవన్ కల్యాణ్ రాజకీయాల వద్దకు వచ్చే సరికి బండ్ల గణేష్ కు వైసీపీలోనే తన భవిష్యత్ కనిపిస్తున్నట్లుందని సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలుతున్నాయి.   చూస్తుంటే తన బాస్ అయిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనను వదిలేసి వైసీపీలోకి బండ్ల గణేష్ చేరేలానే ఉన్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాల పరంగా పవన్ ను అభిమానించే బండ్ల.. రాజకీయంగా మాత్రం వేరే అడుగులు వేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరీ బండ్ల గణేష్ రాజకీయాలు ఎటువైపు సాగుతున్నాయది.?

తెలుగుదేశం వైపు కేసీఆర్ చూపు?

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఇంకా కుదరకపోతే ఎదుటి పార్టీని చీల్చు.. ఆవిర్బావం నుంచీ తెరాస రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఇదే పంథాలో సాగాయి. తన లక్ష్యసాధన కోసం..అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా చేస్తానని కేసీఆర్ అప్పట్లో చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునీ ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తరువాత అన్ని పొత్తులనూ వదులుకొని విమర్శలు గుప్పించింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత కొత్త రాష్ట్రంలో (తెలంగాణ) కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదిపిన సంగతి విదితమే. ఇప్పుడు కొత్త  జాతీయ పార్టీని ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్.. అవే పాత వ్యూహాలు, ఎత్తుగడలతో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తనకు జాతీయ పార్టీ విషయంలో అండగా నిలిచే పార్టీలను, వ్యక్తులను గాలించే పనిలో పడ్డారు. దేశ వ్యాప్తంగా క్రియాశీలంగా ఉన్న ఏ ఒక్క నాయకుడూ, ఏ ఒక్క పార్టీ ఆయనతో కలిసి అడుగులు వేయడానికి సుముఖత చూపకపోవడంతో.. ఆయన చూపు ఏపీ వైపు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం వైపు మళ్లిందని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో కేసీఆర్ పని చేసిన సంగతి విదితమే. అప్పట్లో తన కున్న పరిచయాలను ఇప్పుడు ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. తెరాస ఆవిర్భావం తరువాత, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితులైనది తొలుత తెలంగాణలోని తెలుగుదేశం నాయకులే.ప్రస్తుతం తెరాసలో కీలకంగా ఉన్న వారిలో అత్యధికులు గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారే.. అదే దారిలో ఇప్పుడు ఆయన ఏపీలోని తెలుగుదేశం నాయకులకు గాలం వేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా చెప్పారంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. ఎర్రబెల్లి కూడా మాజీ తెలుగుదేశం నాయకుడేనన్న సంగతి విదితమే. గతంలో టీఆర్ఎస్ లోకి తెలంగాణ తెలుగుదేశం నాయకులను ఆకర్షించిన విధంగానే ఇప్పుడు తన జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆయన ఏపీ తెలుగుదేశం నాయకులను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పెద్దగా చురుకుగా లేని నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా ఆయన టార్గెట్ అంతా మాజీ ఎంపీలపై ఉందని అంటున్నారు. తన కొత్త పార్టీ తరఫున  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ అభ్యర్థులను నిలపాలని భావిస్తున్న కేసీఆర్ ముందుగా అందుకు అభ్యర్థుల గాలింపు కోసం ఏపీని, అందులోనూ తెలుగుదేశం నేతలను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కడప జిల్లాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. ఇప్పటికే తన కొత్త రాజకీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆ జిల్లాలకు చెందిన కొందరు తెలుగుదేశం నాయకులకు కేసీఆర్ నుంచి పిలుపు వెళ్లిందని అంటున్నారు. ఏపీలో తన కొత్త రాజకీయ పార్టీ బీఆర్ఎస్ కు మార్గం సుగమం చేసే దిశగా కేసీఆర్ గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే మాజీ ఎంపీ, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తో సుదీర్ఘ భేటీ జరిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక తెరాస మంత్రులు, నాయకులూ కూడా తరచూ ఏపీపైనా, ఏపీలో పరిస్థితులపైనా చేసిన, చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు కూడా కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి ఏపీలో సానుకూలత ఏర్పరిచే వ్యూహంలో భాగమేనని అంటున్నారు.   ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ లో తనతో కలిసి పని చేసిన నేతలకు కేసీఆర్ నుంచి ఆహ్వానం వెళ్లిందని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారా? పెట్టరా అన్న అనుమానాలు ఉండేవి. కానీ ఈ నెల 2 (ఆదివారం) ఆయన పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో ఆయన ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసేశారు.  కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసేశారు. తాను స్థాపించనున్న జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున (అక్టోబర్ 5) టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. తాను స్థాపించబోయే కొత్త జాతీయ పార్టీ ఎదుర్కొనే తొలి ఎన్నిక మునుగోడే అవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక విజయంతో తన కొత్త జాతీయ పార్టీ శుభారంభం చేస్తుందని ఆయన భావిస్తున్నారు.  ఇక అసలు విషయానికి వస్తే ఏపీలో పాగా వేయాలని కేసీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు.కొంత కాలంగా టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ఏపీలోనూ విస్తరిస్తుందని, ఆ రాష్ట్రంలోనూ తాము రాజకీయం చేస్తామనీ చెబుతూ వస్తున్నారు. అంతెందుకు ఏపీలో పాలన అధ్వానంగా ఉందని, సమయం వచ్చినా రాకున్నా, సందర్భం అయినా కాకున్నా విమర్శలు గుప్పిస్తున్నారు.   ఏపీ నుంచి తన కొత్త రాజకీయ పార్టీకి మద్దతు లభిస్తుందన్న ఆశతో కేసీఆర్ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంద్రులపై విద్వేష పూరిత వ్యాఖ్యలు, విమర్శలతో చెలరేగిపోయి, ఆ తరువాత రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా ఏపీకి విభజన చట్టం ప్రకారం న్యాయంగా ఇవ్వాల్సిన వాటికి, రావాల్సిన వాటికీ అడుగడుగునా అడ్డం పడుతున్న కేసీఆర్ కు ఏపీ నుంచి ఏ విధమైన మద్దతైనా వస్తుందా అన్న అనుమానాలను అయితే పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీలోని వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా లోపాయికారీ మద్దతు ఇస్తూ, ఆ ప్రభుత్వాధినేత బలహీనతలను ఆసరాగా తీసుకుని అడుగడుగునా ఏపీపై విమర్శలు గుప్పిస్తున్న టీఆర్ఎస్ పైనా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పైనా ఏపీలో సానుకూలత వ్యక్తం అవుతుందా అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిలుపునకు, ఆహ్వానానికీ ఏపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నది చూడాల్సింది. ఇప్పటికైతే కేసీఆర్ ఆహ్వానానికి ఏపీ నేతల నుంచి ఎటువంటి స్పందనా రాలేదనే చెబుతున్నారు.  

మాన‌వ ప‌రిణామంపై ప‌రిశోధ‌న..నోబెల్ అందుకున్న పాబో

స్వీడిష్ శాస్త్రవేత్త  మానవ పరిణా మంలో ఆవిష్కరణలకు మెడిసిన్ నోబెల్ గెలుచుకున్నాడు. అంత రించిపోయిన హోమినిన్‌ల జన్యు వులు, మానవ పరిణామానికి సంబంధించి కనుగొన్నందుకు శాస్త్రవేత్త స్వంటే పాబో 2022 ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని గెలుచుకు న్నారని అవార్డు సంఘం సోమ వారం ప్ర‌క‌టించింది. లక్షల ఏళ్ల కిందట అంతరించి పోయిన నియాండర్తల్‌ జాతితో ఆధునిక మానవ జాతికున్న సంబంధం, రోగనిరోధక వ్యవస్థపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. నియాండర్తల్‌, డెనిసోవన్‌ జాతుల జన్యువులతో ప్రస్తుత మానవ జాతి జన్యువులను పోల్చుతూ పాబో పరిశోధనలు చేశారు. నియాండర్తల్‌ జాతితో ఆధునిక మానవులు కలిసి జీవించినట్లు ఆయన నిరూపిం చారు. ఈ క్రమంలో ఇరు జాతుల కలయిక ద్వారా పిల్లలు కూడా పుట్టినట్లు తెలియజేశారు. సుమారు 8 లక్షల ఏళ్ల కిందట ఇది జరిగినట్లు పాబో పరిశోధనల్లో తేలింది. నియాండర్తల్‌  జన్యువుల కలయిక ద్వారా ఆధునిక మానవుల్లో ప్రత్యేక రోగ నిరోధక వ్యవస్థ ఏర్పడింది. కోవిడ్‌19 మహమ్మారి ప్రపంచాన్ని కొంత సాధారణ స్థితికి తీసుకురావడానికి అనుమతించిన వ్యాక్సిన్‌ల అభివృద్ధికి చివరికి బహుమతి లభిస్తుందని చాలా మంది ఆశించడంతో వైద్య పరిశోధనా కేంద్రం ఆశించింది. అయినప్పటికీ, ఏ పరిశోధన అయినా గౌరవించబడటానికి చాలా సంవత్సరాలు పడుతుంది, విజేతలను ఎన్నుకునే బాధ్యత కలిగిన కమిటీలు ఎల్లప్పుడూ పోటీదా రులతో నిండిన రంగంలో కొంత ఖచ్చితంగా దాని పూర్తి విలువను నిర్ణయించాలని చూస్తాయి. మానవ చర్మంలో ఉష్ణోగ్రత, స్పర్శను గ్రహించి, భౌతిక ప్రభావాన్ని నరాల ప్రేరణలుగా మార్చే గ్రాహకాలను కనుగొన్నందుకు అమెరికన్లు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌లకు గత సంవత్సరం ఔషధ బహుమతి లభించింది. 67 ఏళ్ల స్వాంటే పాబో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిక్‌, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎవొల్యూషనరీ ఆంత్రోపాలజీలో పరిశోధనలు చేశారు.

జాతీయ రాజకీయాల్లో విపక్షాల గురి తప్పుతోందా?

2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి. కురువృద్ద కాంగ్రెస్ పార్టీ  అధినాయకురాలు సోనియా గాంధీ మొదలు రేపో మాపో జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు  బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులు అందరిదీ అదే మాట. అందుకోసమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ‘భారత్ జోడో’ యాత్ర చేస్తున్నారు. అందుకోసమే, కమ్యూనిస్టులు ఎవరితో అంటే వారితో చేతులు కలిపేందుకు సిద్డమవుతున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ ఎవరి శక్తి కొలది వారు  ప్రయత్నిస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. మరోవంక, బీజీపే వ్యతిరేక పార్టీల నేతలు అందరినీ  రింగ్ మాస్టర్ లా ఆడిస్తున్న, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  కూడా అదే ధ్యేయంతో బీహార్ లో పాద యాత్ర ప్రారంభించారు.   సరే 2024 ఎన్నికలకు ఇంకా చాలా దూరముంది. అంతకంటే ముందుగా తెలంగాణ సహా మరో ఐదారు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలున్నాయి, ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గానూ భావిస్తునారు. అందులోనూ ఇప్పుడు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముందు వరసలో ఉన్నాయి.మరో రెండు నెలల్లోనే ఈ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుంది. ఈ రెండు రాష్ట్ర్రాలలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే 2024 లోక్ సభ ఎన్నికలపై, విపక్షాలు ఆశలు పెట్టుకోవచ్చని రాజకీయ పండితులు విశ్లేస్తున్నారు.  అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించే స్థితిలో ప్రతిపక్ష పార్టీలున్నాయా? అంటే, రాజకీయ విశ్లేషకులే కాదు, వివిధ సంస్థలు నిర్వహిచిన సర్వేలు కూడా లేదనే అంటున్నాయి. గుజరాత్,  హిమాచల్ ప్రదేశ్‌  రెండు రాష్ట్రాలలోనూ మళ్ళీ బీజేపీదే గెలుపని  సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.ఇప్పటికే, వేరు వేరు సంస్థలు నిర్వహించిన సర్వేలు అదే చెప్పాయి. ఇప్పడు తాజాగా, ఏబీపీ న్యూస్‌-సీఓటర్‌  నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ కూడా  రెండు రాష్ట్రాల్లో మరోసారి బీజేపీదే గెలుపని తేల్చి చెబుతున్నది.  ఏబీపీ న్యూస్‌-సీఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం గుజరాత్‌ అసెంబ్లీలో ఎన్నికలలో బీజేపే అధికారాని నిలబెట్టుకోవడమే కాకుండా, గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. గత ఎన్నికలలో బీజేపీ  అతికష్టం మీద  మొత్తం  182 స్థానాలకు గానూ 99 స్థానాలలో గెలిచి పరువు నిలుపుకుంది. అయితే  ఈసారి 135 నుంచి 143 వరకు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఒపీనియన్  పోల్‌ పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 స్థానాల వరకు సీట్లు దక్కవచ్చని ఒపీనియన్ పోల్ అంచనావేసింది. అలాగే 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 37-45 సీట్లలో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ తెలిపింది.  ఒపీనియన్ పోల్స్ తోపాటుగా గుజరాత్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను విశ్లేషించినా బీజేపీ విజయం ఖాయంగానే కనిపిస్తోందని రాజకీయ పండితులు  పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉంది. బీజ్పీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ గడచిన ఐదేళ్ల కాలంలో  ముఖ్యంగా అహ్మద్ పటేల్ కన్ను మూసిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది.అంతే కాకుండా పటేదార్ ఆందోళనతో ఫేమ్ లోకి వచ్చిన యువనేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌  హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ  నాయకత్వ సమస్యను ఎదుర్కుంటోంది. ఇది హస్తం పార్టీ నేతలను కలవరపెడుతోంది.  మరోవంక, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీ గుజరాత్ లోనూ కాంగ్రెస్ ఓటుకు గండి కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వరసగా ఆరు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీకి సహజంగానే రాష్ట్రంలో కొంత వ్యతిరేకత ఉంది, అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్,  ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య చీలిపోవడంతో  అది బీజేపీకి మేలు చేస్తుందని అంటున్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ సమర్ధ నాయకత్వం లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారిందని అంటున్నారు,. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గుజరాత్ లో సాగితే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రయోజనం ఉంటుందని స్థానిక నాయలు ఆశించారు. అయితే, రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ లో  గుజరాత్’, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాలను చేర్చలేదు. దీంతో, గుజరాత్,హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో, రాహుల్ యాత్ర వలన వస్తుందనుకున్న మైలేజి రాకపోగా  నెగటివ్ ప్రచారానికి అవకాశం ఇచ్చిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు, అరవింద్ కేజ్రీవాల్ వారంలో రెండు సార్లు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ అదే పరిస్థితి, కని పిస్తోంది. అందుకే  బీజేపీ వ్యతిరేక పార్టీలు, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం  ఇప్పటికైతే, అయ్యే పని కాదనే అనిపిస్తోంది. అయితే, రాజకీయాలలో ఎప్పుడైనా, ఏదైనా జరగ వచ్చును.

సీనియర్ల సహాయ నిరాకరణ.. చిక్కుల్లో రేవంత్ ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సమస్యలు చుట్టుముడుతున్నాయా?, ఇటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు,  అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సన్నాహాల మధ్య ఆయన నలిగి పోతున్నారా?  ఇదే అదనుగా  సీనియర్లు తమ వంతు సమస్యలు సృష్టిస్తున్నారా?  అంటే, గాంధీ భవన్ వర్గాలు అవునననే అంటున్నాయి.   నిజానికి, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి పార్టీ సీనియర్లు ఆయన పట్ల కొంత గుర్రుగానే ఉన్నారు. అదేమీ, రహస్యం కాదు. అయినా, ముందు కొంత కాలం, రేవంత్ రెడ్డి, సర్దుకు పోయే ధోరణి అవలంబించారు. అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేశారు. పార్టీ సీనియర్లలోనూ  ఒకరిద్దరు మినహా మిగిలి నేతలందరూ రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉండడం వల్లనో ఏమో కానీ అలివి కాని చోట అధికుల మనరాదు అన్నట్లు మౌనంగా ఉండిపోయారు. కానీ, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సేనియర్లను హోం గార్డ్స్ తో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారో, ఇక అక్కడి నుంచి, సీన్ మారిపోయింది. నిజానికి,అప్పటికే రెంత్ రెడ్డి ఒకటికి రెండు సార్లు గీత దాటి, సీనియర్ నాయకులను హర్ట్ చేసే వ్యాఖ్యలు చేశారు. అలాగే, రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి, అద్దంకి దయాకర్ మునుగోడు సభలో పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఉద్దేశించి  పార్టీలో ఉంటే ఉండు, పొతే ..’ అంటూ చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి, సేనియర్ల మధ్య దూరాన్ని మరింత పెంచింది. దయాకర్ తో పాటుగా, రేవంత్ రెడ్డి కూడా కోమటి రెడ్డికి క్షమాపణలు చెప్పినా, అటు రేవంత్, ఇటు దయాకర్ చేసిన వ్యాఖ్యలు సీనియర్లను వెంటాడుతూనే ఉన్నాయి. పైకి అంతా సర్డుకున్నట్లు కనిపించినా లోలోపల అగ్గి రగులుతూనే వుందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని న్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇంతకాలం ఒక విధంగా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నాయకులు, ఇటు నుంచి మునుగోడు  అటు నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయంలో బాధ్యత మొత్తాన్ని, రేవంత్ రెడ్డిపై వదిలేసి, తమాషా చూస్తున్నారని, అందుకే రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు.   ఓ వంక మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు వచ్చేసింది. ఈ రోజుకు ఖచ్చితంగా నెల రోజుల తర్వాత, నవంబర్ 3 న పోలింగ్ జరుగుతుంది. మరో వంక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిస్తున్న భారత్ జోడో పాదయాత్ర ఈ నెల ( అక్టోబర్) 24 న రాష్ట్రంలో ప్రవేశిస్తోంది. ఇదే అదనుగా  సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా, మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి నెగ్గితే రేవంత్ రెడ్డి మరింతగా రెచ్చి పోతారని, దానికి తోదు రాహుల్ యాత్ర రాష్ట్రంలో సక్సెస్ అయితే  ఇక తమకు కాంగ్రెస్ పార్టీలో నూకలు చెల్లినట్లే భావిస్తున్న సీనియర్లు  ముందు జాగ్రత్తగా ఒక విధంగా సహాయ నిరాకరణ సూత్రాన్ని పాటిస్తున్నారని అంటున్నారు.   రేవంత్ రెడ్డి, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలతోనే కాకుండా, ఇటు సొంత పార్టీలోని అంతర్గత శత్రువులతోనూ ఏకకాలంలలో  పోరాడా వలసి వస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అదలా ఉంటే, మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు, రేవంత్ రెడ్డితో కొంత సఖ్యతగా ఉంటున్న మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు గీతా రెడ్డి, షబ్బీర్ ఆలీ సహా మరి కొందరికి  నేషనల్ హెరాల్డ్ కేసులో  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.  విచారణకు ఢిల్లీ పిలిపించింది. దీంతో  రేవంత్ రెడ్డి,  కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా  విరుచుకు పడుతున్నారు. ఈడీ నోటీసుల పేరుతో కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించడం.. వారిని భయభ్రాంతులకు గురిచేసి బీజేపీలో చేర్చుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ  ఈడీని ఎలక్షన్ డిపార్ట్‌మెంట్‌గా మార్చిందని పేర్కొన్నారు. అయితే, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కు అసలు కారణం సీనియర్లు సహకరించక పోవడమే  అంటున్నాయి పార్టీ వర్గాలు.కారాణాలు ఏవైనా రేవంత్ రెడ్డి బయటి నుంచే కాకుండా లోపలి నుంచి కూడా సమస్యలు ఎదుర్కుంటున్నది మాత్రం నిజమని పరిశీలకులు అంటున్నారు.

హైదరాబాద్ పై మళ్లీ ఉగ్ర పడగ?.. దాడుల కుట్ర భగ్నంతో ఉలిక్కిపడిన విశ్వనగరం

ప్ర‌జ‌లలో మ‌ళ్లీ ఉగ్ర‌ దాడులు భయం పెచ్చరిల్లింది. సమాజంలో ద్వేష భావం పెరగడం, మత ఉద్రిక్తతలు నెలకొనడానికి తోడు ఆదివారం( అక్టోబర్ 2) హైద‌రాబాద్‌లో ఉగ్రదాడులకు కుట్రను భగ్నం చేస్తూ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఆ భ‌యం, ఆ ఆందోళన రెండింత‌ల‌యింది.  ప్ర‌ధానంగా వారు ఆర్ ఎస్ ఎస్‌, బీజేపీ నాయ‌కుల‌పై  ఉగ్రదాడులకు కుట్ర పన్నారన్న సమాచారం ఆ భయాందోళనను మరింత పెంచింది.  ఏమ‌యిన‌ప్ప‌టికీ హైదరాబాదీయులు మ‌రో మారు మత ఘర్షణలను సహించేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. చాలాకాలం క్రితం కోటీలోని గోకుల్ చాట్ భండార్, లుంబినీ పార్కులలో జరిగిన జంట పేలుళ్లు, దిల్‌సుఖ్ న‌గ‌ర్ ల‌లో జ‌రిగిన   పేలుడు ఘటనల గాయాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో  దసరా పండుగ సమయంలో మరో ఉగ్రదాడికి కుట్రను పోలీసులు భగ్నం చేశారన్న వార్త వారిని మరో సారి భయాందోళనలకు గురి చేసింది. కుట్ర భగ్నమైంది కనుక సరిపోయింది.. లేకుంటే అన్న ఊహా హైదరాబాదీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.  తాజాగా ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులకు పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది.   కేంద్రం ఇటీవ‌ల దేశవ్యాప్తంగా  పిఎఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థ‌ల‌పై ఎన్ ఐ ఏ దాడులు దూకుడుగా చేప‌ట్టిన నేపథ్యమే.. హైద‌రాబాద్‌పై ఉగ్రవాదుల కన్నుపడటానికి కారణంగా భావిస్తున్నారు.   దీనికి తోడు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవ‌ల ఢిల్లీలోని మ‌ద‌ర‌సా లో ముస్లిం నేత‌తో స‌మావేశం కావ‌డాన్ని, భగవత్ ను కొందరు ముస్లిం మత పెద్దలు ప్రస్తుతించడాన్ని కూడా తీవ్ర‌వాద   సంస్థ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నాయనీ, ఆ పర్యవశానమే ఉగ్ర దాడులకు కుట్రలని అంటున్నారు.  బీజేపీ పాల‌నా ప‌రమైన నిర్ణ‌యాలు, దేశంలో ముస్లింల అణ‌చివేత‌కు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టుగా బీజేపీ వ‌ర్గాలు  మాట‌లలు కూడా ఆ సంస్థ‌ల‌ను రెచ్చ‌గొడుతోంద‌న్న అభిప్రాయాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉంది. తెలంగాణాలో అధికారంలోకి రావాల‌న్న ల‌క్ష్యంతోనే  మైనారిటీలపైనా, మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాదీయుల‌మీద కేంద్రం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం, నిఘా పేరుతో మైనారిటీలను వేధిస్తున్నారంటూ ఎంఐ ఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని విమర్శించిన నేపథ్యం కూడా ఇదే.  కాగా పోలీసులు తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిలో జాహిద్ అనే వ్యక్తి 2005న హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో బాంబు పేలుడు కేసులో నిందితునిగా ఉన్నాడు. దానికి సంబంధించి కేసును 2017లో కొట్టివేశారు. అయితే కొంతకాలంగా ఉగ్రకార్యకలాపాలకు దూరంగా ఉన్న జాహిద్ తాజా కుట్ర కోణంలో భాగమయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా గతంలో మక్కా మసీద్ పేలుళ్ల ఘటనలో కూడా జాహిద్ ను పోలీసులు ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం జాహిద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధీ నంలో ఉన్నాడు. రద్దీ ప్రదేశాలే లక్ష్యంగా గ్రనేడ్‌  దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి.. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు.  ఈ సందర్బంగా పాకిస్థాన్ మేడ్ గ్రనేడ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణుష్య ప్రాంతంలో గ్రనేడ్ ట్రయల్ బ్లాస్ట్ ప్రయత్నాలలో ఉండగా  పోలీసులు అరెస్ట్ చేశారు. 

క్ష‌మించ‌మ్మా..!

అవాంత‌రాలు చెప్పిరావు, వ‌చ్చివెళ్లిన త‌ర్వాత గాని ప్ర‌భావం తెలీదు. ఎతిక్ అనే పెద్దామె ఇండోనే షియా మ‌లాంగ్న‌గ‌రం సైఫాల్అన్వ‌ర్ ఆస్ప‌త్రిలో నేల‌మీద దిగులుగా కూచునుంది. క‌న్నీళ్లింకిన క‌ళ్లు ఐసియూనే చూస్తున్నాయి. లోప‌ల ఆమె ఏకైక కుమార్తె 21ఏళ్ల డ‌యాన్ పుష్పిత చావుబ‌తుకుల మ‌ధ్య ఉంది. డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ చేస్తున్నారు.  కూతురు కోరిన కోరిక‌ను కాద‌న‌లేక ఆ రోజు ఫుట్‌బాల్ మ్యాచ్‌చూడ్డానికి పిల్ల స్నేహితురాలితో పంపింది. మృత్యువే పిలిచిన‌ట్ట‌యిందని బావురుమంటోంది పుడు. అస‌లా తొక్కిస‌లాట దృశ్యం టీవీలో చూస్తేనే  దాదాపు ప్రాణం పోయినంత అయింది.  పోలీసులు టియ‌ర్‌గ్యాస్ వ‌ల్ల క‌నీసం ఊపిరాడుతోంది పిల్ల‌కి.. అంటూ రోదిస్తోంది.  ఆ సంఘ‌ట‌న జ‌ర‌గ‌గానే ఆమె స్నేహితురాలి ద‌గ్గ‌ర నుంచి ఫోన్ వ‌స్తే ఆస్ప‌త్రికి చేరుకుంది ఎతిక్‌.  క్రీడాచ‌రిత్ర‌లో భ‌విష్య‌త్తులో ఏ త‌ర‌మూ మ‌ర్చిపోలేని ఘోరం జ‌రిగిపోయింది. అభిమానుల ఉన్మాద‌మే ఇంత‌మంది చావుకు కార‌ణ‌మైంద‌ని అంటున్నారు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌వారు. ఆట ఆట లానే చూడాలి, ఆట‌ను ఉన్మాదంతో చూస్తే ఇలానే ఫ‌లితం ఉంటుంది మ‌రి. తొక్కిస‌లాట‌లో చ‌ని పోయిం ది 125 మంది, గాయ‌ప‌డింది 300 మంది. కానీ మ‌ర‌ణిస్తున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. ఎంద‌రో త‌మ పిల్లల్ని, బంధువుల్నీ, స్నేహితుల్నీ పోగొట్టుకుంటున్నారు. త‌న కూతురికి భుజం ఎముక విరిగిం దిట‌, మొహం వాచిపోయింది, చెవి అంచు చీలి ర‌క్తం వ‌ర‌ద‌లైందిట‌! ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 12 గంట‌లపాటు ఆస్ప‌త్రిలో ఆ పెద్దామె అలా ప‌డుంది. తిండి లేదు, క‌ళ్లు మూత‌లు ప‌డ‌టం లేదు, దాహమూ లేదు.. పిల్ల బ‌తికి బ‌య‌ట‌ప‌డితే బాగుండ‌న‌ని ఐసీయూ త‌లుపుల‌కే క‌ళ్ల‌ప్ప‌గించింది ఎతిక్‌. పోలీసులు నేరుగా జ‌నాల‌మీద‌కే గురిపెట్టి టియ‌ర్ గ్యాస్ షెల్స్ కొట్ట‌డంతో ఆ పొగ లో ఎవ‌రు ఎక్క‌డు న్నారో కూడా తెలీకుండా పోయింద‌ని, ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఖంగారుగా ప‌రిగెట్ట‌డంలో ఇద్ద‌రం అనేక‌ మందిని దాటుకుంటూ రావ‌డంలో నేను చాలాసార్లు కింద‌ప‌డ్డాన‌ని, కొంద‌రు కాళ్లూ చేతుల మీద తొక్కు కుంటూ వెళ్లార‌ని అయినా నా స్నేహితురాలిని వీడ‌కుండా బ‌య‌టికి లాక్కురాగ‌లిగాన‌ని ఎతిక్ కుమార్తె ఫ్రెండ్  అప్ప‌టి సంఘ‌ట‌న వివ‌రిస్తూంటే ప్రాణంతో ఈ ఇద్ద‌రూ ఎలా బ‌య‌ట‌ప‌డినందుకు వేయి దేవేళ్ల‌ కు మొక్కు కున్నారు డాక్ట‌ర్లు, న‌ర్సులూ, ఎతిక్‌తో పాటు!  ఆప‌రేష‌న్ త‌ర్వాత ఎతిక్ త‌న కుమార్తెను చూడ్డానికి డాక్ట‌ర్లు అంగీక‌రించారు. పిల్ల‌కు మాట రావ‌డం లేదు. చేయి మెల్ల‌గా క‌దిలిస్తూ పెద్దామె క‌న్నీళ్లు తుడిచింది.. క్ష‌మించ‌మ్మా... ఇంకెప్పుడూ ఎక్క‌డికీ వెళ్ల‌ను.. మొండికేయ‌ను.. అంది!

తెర‌వెనుక  కొట్లాట‌లు...బూమ‌రాంగ్‌లే! 

రెండు వీధుల వారికి ప‌డ‌న‌ప్పుడు అటు వేపు, ఇటువేపు వీల‌యిన‌పుడ‌ల్లా బ‌హిరంగంగానో, ర‌హ‌స్యంగానో ప‌ట్టుకుని కొట్టుకోవ‌డం, ఆస్ప‌త్రి పాలుకావ‌డం సాధార‌ణంగా జ‌రుగుతూంటుంది. ఇది అన్ని ప్రాంతాల్లో చాలా కాలం నుంచి ఉన్న‌దే. క్ర‌మేపీ కొట్టుకోవ‌డం, తిట్టుకోవ‌డానికి ఒక వేదిక చాలా ఆధునికంగా త‌యారు చేసుకున్నారు. తిట్టుకోవ‌డానికి పూర్వం ఫోన్లు ఉండేవి. ఇపుడు సోష‌ల్ మీడియా పేర పెద్ద వేదిక త‌యార యింది. ఇక కొట్టుకుంటూ ర‌క్తాలు కార్చుకునే కంటే చ‌క్క‌గా తిట్టుకుంటూ వీయినంత ఆనందిస్తున్నారు.  ఇది మ‌రింతగా పెరిగిపోయి, నాయ‌కుల వ్య‌క్తిగ‌త అంశాల‌నీ తెర‌మీద‌కి తీసుకువ‌స్తున్నారు. దీనివ‌ల్ల వైసీపీ, టీడీపీ వీరాభిమానులు వారి ప‌రువునే బ‌జారున పెడుతున్నార‌న్న స్పృహ కోల్పోతున్నార‌నే అనా లి. అయితే రాష్ట్రంలో పాల‌నాప‌రంగా పెద్ద‌గా పేరుప్ర‌తిష్ట‌లు సంపాదించుకోలేక వెనుక‌బ‌డిన ఉక్రో షంలో వైసీపీ ఉంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అందుకే విప‌క్షం మీద వీల‌యిన‌న్ని విధాలా విరుచు కుప‌డేందుకు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.  ఇంట‌గెల‌వ‌లేక ర‌చ్చ‌గెలిచే య‌త్నాలు చేయ‌డంలో అవ‌మాన ప‌డ‌ట‌మే త‌ప్ప జ‌రుగుతున్న‌దేమీ లేదు. త‌న ప‌రిస్థితిని గ‌మ‌నించుకోకుండా వైసీపీ విప‌క్షం మీద లేనిపోని అభాం డాల‌తో సోష‌ల్ మీడియాని అడ్డుపెట్టుకుని నోటిదూల తీర్చుకోవ‌డం అన్న‌ది మాన‌సిక రుగ్మ‌త‌కు ప‌రాకాష్ట గానే చెప్పుకోవాలి. దీనికి అంతులేదు. సోష‌ల్  మీడియా  మీద గౌర‌వం ప్ర‌జ‌ల్లో స‌న్న‌గిల్ల‌డానికి  ఇదో  కారణంగా చెప్పాలి. ఈరోజుల్లో ఎవ‌రైనా సోష‌ల్ మీడియాలోకి తొంగిచూసి నా వైసీపీవారి అవాకులు, చ‌వాకులే క‌నిపించేది!  పూర్వం బాణాలేసుకునేవారు, ఇపుడు ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. పూర్వం త‌గునా.. అనుక‌నేవారు ఇపు డు త‌గ్గేదేలా.. అంటున్నారు. వారు ఒక‌టంటే వీరు రెండు, నాలుగు అన‌డానికి వెనుకాడ‌టం లేదు. మ‌రీ దారుణ‌మేమంటే అస‌లు పార్టీ తో, రాజ‌కీయాల‌తోనూ సంబంధం లేని నాయ‌కుల  కుటుంబీకులనూ  తెర‌మీద‌కి తేవాల‌న్న తాప‌త్ర‌యం మాత్రం అంగీకారం కాదు. ఆగ్ర‌హావేశంలో అదీ చేస్తున్నారు.  రాజ‌కీ య వైరం ఈ  త‌ర‌హా  కొత్త రంగు వేసుకుని ప్ర‌త్య‌క్షం కావ‌డం స‌బ‌బు కాద‌ని విశ్లేష‌కుల మాట‌. ఫోటోలు, అర్ధం లేని కామెంట్ల‌తో పోస్టు చేయ‌డం వంటివి ఆ మ‌నుషుల మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట‌పెడుతుంది. ఫ‌లి తంగా ప్ర‌జ‌ల్లో ఆ పార్టీ, ఆ నాయ‌కుల మీదా ఉన్న‌గౌర‌వం మ‌రింత దిగ‌జారి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట్లు అడిగే అవ‌కాశం కూడా లేకుండా పోతుంది. ఇప్ప‌టికే ఈ సామాజిక మాధ్య‌మాల రొద ప్ర‌జ‌ల‌కూ  ఇబ్బం దిక‌రం గానే మారింది.  తాజాగా తీసుకుంటే, ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని జగన్ నిర్ణయించి బిల్లు పాస్ చేసిన తర్వాత రెండు రోజుల పాటు అంశంపై చర్చ ఓ మాదిరిగా సాగింది. ఈ అంశంపై టీడీపీ సానుభూతిపరులందరూ  విప‌రీతంగా స్పందించారు. ఒకరికొకరు పోటీగా వీడియోలు పోస్ట్ చేసు కుంటున్నారు. ఎన్టీఆర్‌పై దాడిశెట్టి  రాజా లాంటి నేతలు చేసే రకరకాల వ్యాఖ్యాలను సోషల్ మీడి యాలో రక రకాలుగా ప్రజెంట్ చేస్తున్నారు. పోటీగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గతంలో రోశయ్య మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు.  నేనేమైనా త‌క్కువా అన్న‌ట్టుగా  జగ్గారెడ్డి వైఎస్ చనిపోయిన  సమయం లో ఏ మాత్రం బాధ లేకుండా కుటుంబం అంతా కూర్చుని ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించుకు న్నారని చేసిన వ్యాఖ్యలనూ హైలెట్ చేస్తూ కామెంట్లు చేశారు.   వైసీపీ నేత‌లు  చంద్రబాబు మాకు ఎన్టీఆర్ అవసరం లేదని అన్నారంటూ రెండు ద‌శాబ్దాల  క్రింద‌ట ఒక‌  పత్రికలో వచ్చిన  వార్త  క్లి ప్పింగ్‌ను పోస్టర్లుగా ప్రింట్ చేసి అంటించారు. వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు భారతీపే అనే పోస్టర్లు అంటిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేటీఎంకు పేర డీగా పేసీఎం పోస్టర్లు తెచ్చి నలభై శాతం  కమిషన్లు యాక్సెప్ట్ చేస్తార న్నట్లుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పుడు భారతీ పే పేరుతో టీడీపీ నేతలు పోస్టర్లు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయాలు కుటుంబాలను టార్గెట్ చేసుకోవడం కామన్ అయిపోయింది.  ప్రస్తు తం లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి సమీప బంధువు విచారణ ఎదుర్కొంటున్నారు.  ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టిన పెట్టుబడి అంతా.. ఏపీ నుంచి వచ్చిందని టీడీపీ నేతలు  ఆరోపణలు చేస్తు న్నారు. పోటీ గా ఇప్పుడు భారతీ పే పేరుతో పోస్టర్లు వైరల్ చేస్తున్నారు.  ఇటీవ‌లి కాలంలో  స్ట్రాటజిస్టులను పెట్టుకుని మరీ సోషల్ మీడియా సైన్యాలను నడిపిస్తున్నాయి.  కోట్ల రూపాయ‌లు  ఖర్చు పెట్ట‌డానికీ వెనుకాడ‌టం లేదు.  అయితే ఎన్ని కోట్లు పెట్టినా సోషల్ మీడియా రాజకీ యం ఎప్పుడూ  ఏ మాత్రం సభ్యత.. సంస్కారం ఉండటం లేదు.  ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీ లదీ అదే తీరు. ఇదే పార్టీల వీరాభిమానులు గ్ర‌హించాలి. అభిమానం డోస్ ఎక్కువైతే త‌మ నాయ‌ కుల‌కే ప్ర‌మాద‌మ‌న్న‌ది వీరాభిమానులు, వీర‌సేన‌లు తెలుసుకోవాలని విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు.

మునుగోడులో మూడు పార్టీల్లో ముందున్నదెవరో?

మునుగోడు ఉప ఎన్నిక నగారా మోగింది. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14 వరకూ నామినేషన్ల దాఖలకు గడువు ఉంది. మునుగోడుతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్,, ఒడిశా ల్లోని ఒక్కో నియోజకవర్గానికి, బీహార్‌ లో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక, అధికార తెరాస మాత్రమే కాదు, కాంగ్రెస్, బీజేపీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకాగా తీసుకున్నాయి. ఒక విధంగా, 2023 అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ కానుందని, పరిశీలకులు ప్రజలు భావిస్తున్నారు. అలాగే, మునుగోడు ఉప ఎన్నిక అధికార తెరాస ఎనిమిదేళ్ళ పాలనకు రెఫరెండం, అయితే, బీజేపీ తెలంగాణలో కాషాయ జెండా ఎంట్రీకి గేట్’వే (ముఖ ద్వారం)గా భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టికుని సత్తాచాటేందుకు చూస్తోంది. ముఖ్యంగా, సిట్టింగ్ స్థానం, హుజూర్’ నగర్  సహా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉపన్నికల్లోనూ ఓటమిని ఎదుర్కున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి అయినా, మరో సిట్టింగ్ స్థానం మునుగోడును ఎలాగైనా నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జరుగతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో  రాజగోపాల రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. అధికారికంగా, బీజేపే అధిష్టానం ఇంకా ఆయన పేరు ప్రకటించక పోయినా, పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు ఇప్పటికే అయన తరపున పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. మరోవంక, కాంగ్రెస్ పార్టీ పాల్వాయ్ స్రవంతిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ముమ్మరంగా ప్రచ్రాం సాగిస్తోంది. అయితే అధికార తెరాస మాత్రం ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. కానీ, జిల్లా మంత్రి జగీష్ రెడ్డి సారధ్యంలో కేసీఆర్’ బొమ్మతో ప్రచారం సాగిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతొ విందులు, వినోదాలతో పెద్ద ఎత్తున ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు నియోజక వర్గంలో ఇంకా ఎంతో కొంత పట్టున్న వామపక్ష పార్టీలు తెరాసకు మద్దతు ప్రకటించాయి. అయితే  మునుగోడు, ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో, ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

హిమాలయాలను మించిన ఔన్నత్యం లాల్ బహదూర్ శాస్త్రి వ్యక్తిత్వం

కాలేజీ పిల్ల‌ల‌కి, పెద్ద ఉద్యోగాల‌కు శిక్ష‌ణ‌కు వెళ్లే వారికి ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్మెంట్ కోర్సుల‌ని  చాలా చెబు తుంటారు. కానీ నిస్వార్ధ నాయ‌కుడు, మాజీ ప్రధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి  జీవితంలో కొన్ని అంశాలను తీసుకుని   బోధిస్తే విలువలతో కూడిన వ్యక్తిత్తం,  హిమాలయాలను మించిన ఔన్నత్యం పిల్లలలో సమకూరుతాయి. లాల్ బహదూర్ శాస్త్రి జీవితానికి మించిన  గొప్ప‌తనం ఏ పర్సనాలిటీ డెవలెప్ మెంట్ కోర్సూ బోధించలేదు.  దేశాన్ని జైజ‌వాన్‌..జైకిసాన్ అంటూ ముందుకు న‌డిపించిన ధీరుడు లాల్‌బ‌హ‌దూర్‌. భార‌త్‌,పాకిస్తాన్ యుద్ధం త‌ర్వాత దేశ ప్ర‌గ‌తికి బాట‌లు వేసి ముంద‌డుగు వేయించిన రాజ‌కీయ‌వేత్త ఆయ‌న‌.  దేశ ర‌క్ష‌ణ‌కు సైనికుడు ఎలాగో దేశ ప్ర‌జ ల‌కు తిండి అందించే రైతూ అంతే స‌మానుడే అనే ఒక  గొప్ప నినాదంతో దేశాన్ని సైనిక‌, రైతు సంక్షేమ ప‌థంలో న‌డి పించిన మ‌హానాయ‌కుడాయ‌న‌.  పాల ఉత్పత్తి పెంచేందుకు దోహదపడిన శ్వేత విప్లవం, వ్యవసాయం అభివృద్ధికి బాటలు వేసిన హరిత విప్లవం లాంటి ఉద్యమాలను ప్రోత్సహించిన తొలితరం రాజకీయ నాయకులలో అతి ముఖ్యులు లాల్ బహదూర్.  1965లో ఎం.ఎస్. స్వామినాథన్ హరిత విప్లవానికి నాంది పలకగా.. ప్రభుత్వ పెద్దగా ఆ ఉద్యమా నికి స‌హ‌క‌రించి ఆ మిషన్ విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి ఎన్న‌డూ ప‌దవులు, వాటితో  వ‌చ్చే ప్ర‌తిష్ట‌, పలుకుబడి కోసం పాకులాడ‌లేదు. ప్ర‌ధాని గా  ఉన్న కాలంలో  కూడా చాలా సామాన్యునిలానే జీవించారు. చిత్ర‌మేమంటే అప్ప‌ట్లో ఆయ‌న‌కు కొంత‌ కాలం కారు కూడా లేదు. త‌ర్వాత ఎప్పుడో పిల్ల‌ల‌ కోసం ఒక ఫియెట్ కొన్నారు.. అదీ అప్పుచేసి! అంతేకాదు మ‌రో గ‌ర్వించ ద‌గ్గ అంశ‌మేమిటంటే,  ప‌ద‌వులును అడ్డుపెట్టుకుని ఉన్న‌తోద్యోగాలు ఇప్పించ‌డం వంటివి ఆయ‌న ఎన్నడూ  చేయలేదు. అంతెందుకు ఆయ‌న కుమారుడు హ‌రికృష్ణ‌శాస్త్రికి అత‌ను ప‌నిచేసే అశోక్ లేలాండ్ కంపెనీ లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్ర‌మోష‌న్ వచ్చింది. లాల్‌బ‌హ‌దూర్ కి భ‌విష్య‌త్తు గోచ‌ర‌మై, హ‌రికృష్ణ‌ను ఉద్యోగం మానిపించేరు. కార‌ణం ఆ కంపెనీవారు త‌ర్వాత త‌న‌ను ఏదో ఒక ప‌ని గురించి వేధించ‌కుండా ఉంటార‌ని.  ఇప్ప‌టి రాజ‌కీయ‌నాయ‌కుల్లాగా ఆయ‌న పెద్ద పెద్ద భ‌వంతుల్లో ఉండాల‌నుకోలేదు. చిత్ర‌మేమంటే, ఆయన‌కు క‌నీసం స్వంత ఇల్లే లేదు. ఒక‌సారి అంటే  లాల్‌బ‌హదూర్ ఇంకా ప్ర‌ధాని కావ‌డానికి  చాలా కాలం ముందు ఆయ‌న స్నేహితుడు ఒకాయ‌న ఆయ‌న‌కు తెలీకుండా ఇంటి ఏర్పాటు చేయబోయాడు. ప్ర‌జా ప్ర‌తినిధులు ఇలాంటివాటికి ఆశ‌ప‌డ‌కూడ‌ద‌ని వారించి అత‌ని ప్ర‌య‌త్నాన్ని ఆపించాడు. ఇలాంటి వ్యక్తిత్వాలే జాతిని నిర్మస్తాయి ! భవిష్యత్ తరానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. 

ఇంతోటి దానికి అంతోటి రాగ మెందుకో..!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు, చివరాఖరుకు, జాతీయ రాజకీయాల గురించి ఒక నిర్ణయానికి వచ్చారు. అనేక కోణాల్లో అలోచించి, ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల ముందు మొదలైన ‘జాతీయ’ అలోచనకు చుక్క పెట్టారు. పాత పార్టీకి కొత్త లేబుల్ తగిలించే నామకరణ మహోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజున తెలంగాణకు పర్యాయ పదంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారు చేశారు. తెలంగాణ ప్రజలు, చివరకు కేసీఆర్ మార్క్ రాజకీయాలతో విభేదించే వారు కూడా ఇంటి పార్టీగా అక్కున చేర్చుకుని, ఆదరించిన తెరాసను చెరిపేస్తున్నారు. పజల గుండెల్లోంచి తొలిగించేస్తున్నారు.  తెరాస స్థానంలో కొత్త పేరు వచ్చి చేరుతుంది. తెరాస చరిత్ర పుటల్లో చేరిపోతుంది. ఇప్పుడు ఒక  ప్రాతీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్ జాతీయ పార్టీ అధ్యక్షుడు అవుతారు.  కొత్త పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కేటీఆర్, కొలువు తీరతారు.  నిజానికి, కారణాలు ఏవైనా కేసీఆర్ చాలా కాలంగా జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. ఒక దశలో రాష్ట్ర రాజకీయాలు బోర్ కొడుతున్నాయని కుడా అన్నారు. అందుకే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే  ముఖ్యమంత్రి  జాతీయ రాజకేయాల ఆలోచన చేశారు.  అయితే, ఎందుకనో ఏమో ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమ,(థర్డ్ ఫ్రంట్)గా మొదలైన ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అయితే, అలా థర్డ్ ఫ్రంట్ గా మొదలైన ఆలోచన జాతీయ పార్టీ ఏర్పాటు అంచుల దాకా వెళ్లి, యూటర్న్ తీసుకుంది. చివరకు, ప్రాంతీయ పార్టీ (తెరాస) పేరుమార్చి కొత్త పేరు (బీఆర్ఎస్. నవభారత్ పార్టీ) తో జాతీయ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాలనే గమ్యానికి చేరింది.  అయితే, ఇంతోటి దానికి అంతోటి రాగం ఎందుకని, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి,ప్రాంతీయ పార్టీలుగా పుట్టిన తృణమూల్, ఎన్సీపీ, ఆప్, లాంటి అనేక పార్టీలు జాతీయ హోదా పొందక ముందు నుంచి కూడా ఇతర రాష్ట్రాలలోనూ పోటీ చేస్తున్నాయి. సీట్లు గెలుచుకుంటున్నాయి. తెరాస పుట్టిన దశాబ్ద కాలానికి, అంటే  2011లో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)అయితే, పుట్టిన ఢిల్లీతో పాటుగా, పంజాబ్ లోనూ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గుజారత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీకి దిగుతోంది. కానీ, తెరాస మాత్రం ఇంతవరకు తెలంగాణ గడప దాటలేదు. ఇప్పుడే  తొలి అడుగు వేస్తోంది.  అయితే, నిజానికి ముఖ్యమంత్రి కేసేఆర్ మనసులో ఏమున్నా, పైకి చెపుతున్న మాటలను, ఇతర  రాష్ట్రాల ప్రజలు, నాయకులు నమ్మడం లేదు. ఇతర రాష్ట్రాల నాయకులు , ప్రజలే కాదు,  రాష్ట్ర ప్రజలు, చివరకు, సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా విశ్వసించడం లేదు. కేవలం, తెలంగాణలో వీస్తున్న ఎదురు గాలులను తట్టుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ ఎజెండాను భుజానికి ఎత్తుకున్నారన్నది స్పష్టమై పోయిందని  అంటున్నారు. నిజానికి, కేసీఆర్ గతంలోనే  రాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకు తమ వ్యూహం  తమకు ఉందని అనేక సందర్భాలలో ప్రకటించారు.  బహుసా అది ఇదే కావచ్చని అంటున్నారు.  అంతే కాకుండా, దేశమంతా తెలంగాణ మోడల్ కోరుకుంటోందని తెరాస నాయకులు ప్రచారం చేసుకోవడమే కానీ  తెరాస ప్రభుత్వం వందల వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి  దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తుకున్నా  ఊరు పేరున్న నాయకులు ఎవరూ కూడా, కేసీఆర్ కు జై కొట్టలేదు. కనీసం చేతులు కలపలేదు.  నిజానికి  కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని దేశం చుట్టి వచ్చారు. అరడజను మంది వరకు ముఖ్యమంత్రులను, ఇతర పార్టీల పెద్దలను కలిసి వచ్చారు. కానీ, అందులో ఏ ఒక్కరూ కూడా తెలంగాణ మోడల్ అద్భుతంగా ఉందని కితాబు ఇవ్వలేదు. అసలు ఒక సారి కలిసిన వారు ఎవరూ రెండవసారి అయనతో రాజకీయ సంబంధాలు కొనసాగించలేదు. ఒక విధంగా, జాతీయ రాజకేయాల్లో కేసీఆర్ ఒంటరి అయిపోయారనే అభిప్రాయం బలపడింది. అందుకే, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచను అటకెక్కించారని, ఇతర రాజకీయ పండితులు విశ్లేషించారు. ఆ తర్వాతనే జాతీయ పార్టీ ఆలోచను తెర పైకి తెచ్చారు. అయితే అదీ వర్క్అవుట్ కాలేదు.అందుకే చివరకు ఏ దారి లేకనే  తెరాస పేరును మార్చి పరవు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఇదైనా వర్కౌట్ అవుతుందా అంటే, అవకాశమే లేదని అంటున్నారు. అలాగే జాతీయ రాజకీయాలకు సంబంధించి ఇంతవరకు కేసీఆర్ చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. ఇది కూడా అంతే అంటున్నారు రాజకీయ పండితులు. 

నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

తెలంగాణే కాక మొత్తం దేశం  అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగ నుంచి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ స్ధానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్, హర్యానా, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడ నుంది. ఈ నెల 14 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 15న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు ఈ నెల 17. ఇక పోలింగ్ వచ్చే నెల అంటే నవంబర్ 3న జరుగుతుంది. అదే నెల 6వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి కమలం గూటికి చేరడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసింది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికలో విజయం ఒక రాజమార్గంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు భావిస్తున్నాయి. ఎలాగైనా సిట్టింగ్ స్టానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంటే.. మునుగోడులో విజయం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్  పట్టు సడలలేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక  బీజేపీ అయితే.. వచ్చే ఎన్నికలలో విజయం ఖాయం అన్న భావనను ప్రజలలో వ్యాప్తి చేయడానికి మునుగోడులో విజయం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతోంది. పైగా రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు కారణమైన బీజేపీ ఆ స్థానంలో అభ్యర్థిగా రాజగోపాలరెడ్డినే నిలబెట్టి విజయం సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇక బీజేపీ ఎలాగూ రాజగోపాలరెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దింపుతుంది. అయితే టీఆర్ఎస్ మాత్రం మునుగోడు అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించలేదు. మునుగోడులో పోటీకి టీఆర్ఎస్ నుంచి పలువురు ఆశావహులు ఉండటంతో అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడటం.. నామినేషన్ల స్వీకరణకు ముందే తెరాస అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. 

ఎల‌క అనుకున్నా.. అండ‌ర్‌వేరా..!? 

పులి మేక‌ను తింటుంది, గేదె గ‌డ్డి తింటుంది, పాము ఎలుక‌ల్ని ఆహారం చేసుకుంటుంది..కానీ క‌ర్ణాట‌ క‌లో ఒక పాము మాత్రం ఎల‌క అనుకుని గుడ్డ‌ముక్క తిన్న‌ది! క‌ర్ణాట‌క చామ‌రాజ్‌న‌గ‌ర్  కొట్టుతిట్ట గ్రామం. మామూలుగానే ఆహారం కోసం పాము ప‌రిస‌ర ప్రాంతాలన్నీ తిరుగుతూ ఇళ్ల మ‌ధ్య‌కు వ‌చ్చేసింది. పెర‌ట్లో చెట్ల‌మ‌ధ్య నుంచి ఎవ‌రూ చూడ‌కుండా ఒక ఇంట్లోకి దూరింది. అది ఎవ‌రూ గ‌మ‌నించ‌నే లేదు. ఇంట్లోవారు ఆరుబ‌య‌ట మాట‌ల్లో ప‌డ్డారు. కానీ లోప‌ల పాము మాత్రం తిండి కోసం వెతికింది.. ఒక్క ఎల‌కా ఇవాళ దొర‌క‌లేద‌నుకుంది.. అది మ‌రింత‌ సేపు అటూ ఇటూ తిరిగి మొత్తానికి ఒక‌చోట అలా ప‌డున్న గుడ్డ‌ముక్క‌ని ఎలుక అనుకుని తెగ ఆనం దించి అమాం తం  మింగేసింది. ఆన‌క తీరిగ్గా  కొరికినా, ఏం చేసినా అది గొంతులోనే అడ్డుకుని క‌ద‌ల్లేదు. పాము కీ ఆఖ‌రికి  క‌ద‌ల్లేని  ప‌రిస్థితి వ‌చ్చింది. మెల్ల‌గా పాకుతున్న పాముని చూసి ముందు ఆ యింటివాళ్లు భ‌య‌ప‌డ్డారు. కానీ అదేమీ చేసేట్టు లేద‌ని అర్ధమ‌యింది. చూస్తే క‌డుపు గొంతు ద‌గ్గ‌ర లావుగా ఉంది. ఏదో మింగ‌లేనిదే తినబోయింద‌ని అర్ధ‌మ యింది. వెంట‌నే పాముల న‌ర్స‌య్య‌లాంటి స్పెష‌లిస్ట్ని పిలిచారు. ఆయ‌న వ‌చ్చి అమాంతం ప‌ట్టే సారు. నెమ్మ‌దిగా ప‌రిశీలిస్తే పాము ఎల‌క అనుకుని ఇంట్లో నేల‌మీద ప‌డున్న అండ‌ర్‌వేర్ తిన‌బోయి జ‌నం అలికిడి అయి మింగ‌బోయింది. దానివ‌ల్ల కాలేదు.  అది పూర్తిగా మింగ‌లేక‌, క‌క్క‌లేక నానా అవ‌స్థాప‌డుతూ అలా ఉదరం పెరిగి మెల్ల‌గా క‌దులు తోంది. పూర్వం పిల్ల‌లు ఏద‌యినా మింగితే త‌ల‌కిందులు చేసి బ‌య‌టికి వ‌చ్చేలా చేసేవారు గుర్తుందా! స‌రిగ్గా అదే మ‌హాప్ర‌యోగం చేశాడు ఆ వ‌చ్చి వ్య‌క్తి. అపుడు వాడికి అది పాము భ‌య‌మూ అనేది లేదు. అమాం తం దాని తోక‌ప‌ట్టుకుని నేల‌కేసి కొట్ట‌లేదుగాని వేగంగా ఆడించేస‌రికి నోట్లో కుక్క‌నట్టు ఉన్న అండ‌ర్ వేర్ బ‌య‌ట‌ప‌డింది. పామును ప‌ట్టుకుని దూరంగా వ‌దిలేశారు. అది టాటా కూడా చెప్ప‌లేదు.. చంపుతార‌ని.. మ‌ళ్లీ ఇటు రాననుకుంటూ వెళిపోయి బ‌తికిపోయింది. 

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు బుద్ధిలేని నిర్ణయం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీలో సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. జగన్ నిర్ణయాన్ని వైసీపీలోనే పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఆ పార్టీ నాయకులు కొందరు మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు. ఇక విపక్ష తెలుగుదేశం అయితే జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హెల్త్ వర్సిటీకి   ఎన్టీఆర్ పేరు మార్చేసి వైఎస్ పేరు పెట్టాల్సిన అవసరమేమిటని గట్టిగా నిలదీస్తోంది.   యూనివర్శిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.. తన పదవికి   రాజీనామా చేశారు. ఇక మంత్రి విడదల రజనీ జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ  యూనివర్శిటీకి పేరు మార్పు వల్ల భవిష్యత్  తరాలకు ఒనగూడే ప్రయోజనాలను విపులీకరించారు.  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీ పార్వతీ  హైల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తీసివేయడాన్ని సమర్ధించారు.  రూపాయి డాక్టర్‌గా పేరున్న వైయస్ రాజశేఖరరెడ్డి పేరు వర్సిటీకి పెట్టడం సబబేనంటూ జగన్ కు మద్దతుగా మాట్లాడారు. మరో ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటూ.. సీఎం జగన్ వద్దకు ఓ ప్రతిపాదన తీసుకు వెళ్తానన్న ఆమె అసలు ఎన్టీఆర్ పేరుతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడం గోప్ప విషయమన్నారు.   రోజా అయితే తనదైన భాషా ప్రావీణ్యంలో జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. అయితే  తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి ఆ తరువాత  జగన్ పార్టీలోకి వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే  వర్సిటీ పేరు మార్పు విషయం పునరాలోచించాలంటూ ఏకంగా జగన్ కే బహిరంగ లేఖ రాసి, ఆ తరువాత మౌనం వహించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన రాజకీయ సన్యాసం స్వీకరించే ఉద్దేశంలో ఉన్నారన్న వార్తలు వినవస్తున్నాయి.  ఇక ఎప్పుడూ వైలెంట్‌గా ఉంటూ.. జగన్ కుమద్దతుగా విపక్షాలపై వైలెంట్‌గా విమర్శలతో విరుచుకుపడే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని  ఊహాతీతమైన మౌనం పాటిస్తున్నారు. అంతే కాకుండా తన సన్నిహితుల వద్ద జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ అవన్నీ పిల్ల చేష్టలని వ్యాఖ్యలు చేశారని తెలిసింది. జగన్ సోదరి,    వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సైతం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును తప్పుపట్టారు. అలాగే తెలంగాణకు చెందిన  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  . యూనివర్శిటీ పేరు మార్పు విషయంలో జగన్ తీరును తప్పు పట్టారు.  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఇంత చర్చ జరుగుతున్నా ముఖ్యమంత్రి  జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల... వైసీపీ అగ్ర నేతలే ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే   హెల్త్ వర్సిటీ పేరు మార్పు ఎందుకు అసంబద్ధమో వివరిస్తూ  విడుదలైన ఒ 2 నిమిషాల.. 18 సెకన్ల క వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది. ఆ వీడియో  తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌,  ముఖ్యమంత్రిగా ప్రజల కోసం అందించిన వివిధ సంక్షేమ పథకాలతో పాటు వైద్య విద్యను సంస్కరించే దిశగా అడుగులు వేశారని.. ఆ క్రమంలోనే  విజయవాడలో హెల్త్ యూనివర్సిటీని  స్థాపించారని... ఆ తర్వాత ఆ యూనివర్శిటీ  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిందంటూ సవివరంగా పేర్కొంది. అలాగే    జగన్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు ప్రముఖుల, సామాన్యుల అభిప్రాయాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.  గత ఏడాది  ఈ హెల్త్ యూనివర్శిటీ చెందిన  దాదాపు 400 కోట్ల రూపాయిల నిధులను  జగన్ సర్కారు దారి మళ్లీంచిందంటూ మీడియాలో అప్పట్లో వెల్లువెత్తిన కథనాలను సైతం ఈ వీడియాలో పొందుపరిచారు. అలాగే ఎన్టీఆర్ పేరు ఈ యూనివర్శిటీకి కొనసాగించేలా.. ఈ నంబర్‌కు 92612 92612 మిస్డ్ కాల్ ఇచ్చి జగన్ కి బుద్ది చెప్పండంటూ ఈ వీడియో ప్రజలకు పిలుపునిచ్చింది.

దేశంలో నిరుద్యోగం, పేద‌రికం,అస‌మాన‌త‌ల‌దే రాజ్యం..ఆర్ ఎస్ ఎస్‌

ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినప్పటికీ, దశాబ్దాలుగా భారత్‌ను అనాదిగా పీడిస్తున్న‌ నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు సమస్యలుగా కొనసాగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే  అన్నారు. భారతదేశం స్వావలంబన కోసం సానుకూలంగా ప్రయత్నించింది,  ఇటీవలి కాలంలో దేశం ఆర్థిక రంగం లో విజయం సాధించినప్పటికీ, కొన్ని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని హోసబాలే అన్నారు. నవరాత్రి తొమ్మిది రోజుల తరువాత, మా దుర్గ విజయదశమి సందర్భం గా రాక్షసు లను సంహరించే విధానం, దేశం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి దెయ్యాన్ని వదిలించుకోవాలి, వాటిలో ఒకటి పేదరికం, ఇది తక్షణమే తొలగించబడాలి. ఈ ఛాలెంజ్‌ని మనం గెలవాలన్నారు.ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశ్ జాగరణ్ మంచ్ (ఎస్‌జెఎమ్) దాని కొనసాగు తున్న స్వావలంబి భారత్ అభి యాన్  కింద నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ కార్యకర్త ప్రసం గించారు, ఇది యువత లో వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించే ప్రయత్నం.మహాత్మా గాంధీ , లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వెబ్‌నార్ నిర్వహించారు.  దేశ జ‌నాభాలో  అనేక‌మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, ఇది చాలా నిరాశాజనకంగా ఉందని హోసబాలే అన్నారు.  23 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ. 375 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నార‌ని,  జూన్‌లో ప్రచురిత‌మైన లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో నాలుగు కోట్ల మంది నిరుద్యోగు లు ఉన్నారని, నిరుద్యోగిత రేటు 7.6% అని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త చెప్పారు. ప‌దేళ్ల‌ క్రితం దేశంలో 22శాతం ఉన్న పేదరికంతో పోలిస్తే గతకొన్నేళ్లలో పరిస్థితి మెరుగుపడిందని, ఇప్పుడు18 శాతం ఉందని ఆయన అన్నారు. 2020లో, తలసరి ఆదాయం సంవత్సరానికి రూ. 1.35 లక్షలుగా ఉంది, ఇది 2022 నాటికి రూ. 1.5 లక్షలకు పెరిగిందన్నారు. అయితే, దశాబ్దాలుగా కొనసాగుతున్న నిరుద్యోగం, పేదరికం అనే సమస్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని, ఆర్థిక అసమానత ప్రాబల్యంపై దేశం దృష్టి పెట్టాల్సిన మరో ప్రధాన సమస్య అని ఆయన అన్నారు. దేశం ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ర్యాంక్ పొందడం విశేషం. కానీ భారతదేశ జనాభాలో అగ్రశ్రేణి ఒక శాతం మంది దేశ ఆదాయంలో ఐదవ వంతు (20%) కలిగి ఉన్నారు. అదే సమయంలో, దేశ జనాభాలో 50% మంది దేశ ఆదాయంలో 13% మాత్రమే కలిగి ఉన్నారు. ఈ ఆర్థిక అసమానత గురించి మనం ఆలోచించాలని హోసబాలే అన్నారు. భారతదేశంలోని పేదరికం, అభి వృద్ధి స్థితిపై ఐక్యరాజ్య సమితి చేసిన పరిశీలనలను ప్రస్తావిస్తూ, హోసబాలే ఇలా అన్నారు, భారత దేశం సందర్భంలో యుఎన్ నివేదిక ప్రకారం దేశంలోని అధిక భాగం ఇప్పటికీ స్వచ్ఛమైన నీరు, పోషకమైన ఆహారం అందుబాటులో లేదు. పేదరికం కూడా సమాజంలో ఉద్రిక్తతకు, విద్యా స్థాయి తక్కు వగా ఉండటానికి కారణం. ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని అమలు చేసిందని, ఆశిం చిన ఫలితాలు వస్తాయని భావించాలన్నారు. దశాబ్దాల లోపభూయిష్ట విధానాల ఫలితంగా గ్రామాల నుండి నగరాలకు పెద్ద ఎత్తున వలసలు వచ్చా యి. గ్రామాలు ఖాళీ కాగా, నగరాల్లో జీవితం నరకంలా మారింది. ప్రస్తుత ప్రభుత్వం నమూనా మార్పులు చేసేం దుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే, సవాళ్లు కొనసాగే విధానం, మరింత అవగాహన మరియు చైతన్యాన్ని కలిగించడానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని హోసబాలే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభించిన స్వయంశక్తి భారత్  ప్రచారమే మహాత్మా గాంధీ, లాల్ బహ దూర్ శాస్త్రి వంటి నాయకులకు నిజమైన నివాళి అని ఆయన అన్నారు.

ములాయం ఆరోగ్యం అత్యంత విషమం- ఐసీయూలో చికిత్స

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా ఉంది. గత కొంత కాలంగా నారోగ్యంతో బాధపడుతున్న ములాయం ఆగస్టు 22వ తేదీ నుంచి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.   ఆంకాలజిస్టులు డాక్టన్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల్ కటారియాల పర్యవేక్షణలో ఐసీయూలో ములాయంకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి ములాయం ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ఆయన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్  ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వద్దకు వచ్చారు.   ములాయం త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ దాస్ మౌర్య అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ములాయం ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.  ములాయం   మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనీ, దానికి తోడు వయస్సుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయనీ  వైద్యులు తెలిపారు.   ములాయం సింగ్ యాదవ్ వరుసగా మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.  ప్రస్తుతం మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. నేతాజీ అని పిలవబడే ములాయం యాదవ్.. తొలిసారిగా 1967లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి బాలుడు మృతి

ఇప్పుడంతా ఎల‌క్ట్రిక‌ల్ బైక్ ల ట్రెండ్ నడుస్తోంది. పెట్రోల్‌, డీజిల్ రేట్లు అమాంతం పెర‌గిపోవడంతో  మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లంతా బ్యాట‌రీ బైక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ర‌క‌ర‌కాల మోడ‌ల్స్‌.. ర‌క‌ర‌కాల బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. పైగా పర్యావరణ హితం అంటూ ప్రభుత్వాలు కూడా ప్రకటనలతో ఊదరగొట్టేస్తున్నాయి. మామూలు బైకుల ధరతో పోలిస్తే ఎలక్ట్రిక్ బైక్ ల ధర మరీ ఎక్కవ ఏమీ కాదనిపించేలాగే ఉండటం, అలాగు  డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గొడ‌వ లేక‌పోవ‌డంతో.. చార్జింగ్ స్కూట‌ర్లకు డిమాండ్ పెరిగింది. ఓలా లాంటి కంపెనీలు సైతం రంగంలోకి దిగ‌డంతో ఎల‌క్ట్రిక‌ల్ బైక్స్‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. ఇదే ఛాన్స్ అనుకొని.. ఊరూపేరు లేని సంస్థ‌లు సైతం బ్యాట‌రీ బైక్స్ త‌యారు చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. అయితే, వ‌రుస‌గా జ‌రుగుతున్న  ఘ‌ట‌న‌లు ఎల‌క్ట్రిక్ బైక్ అంటేనే ద‌డ పుట్టేలా చేస్తున్నాయి.  నాసిర‌కం త‌యారీ విధాన‌మో.. ఏమో కానీ ఈ మ‌ధ్య ఎల‌క్ట్రిక్ బైకులు బాంబుల్లా పేలిపోతున్నాయి. మంట‌ల‌తో త‌గ‌ల‌బ‌డుతున్నాయి. తాజాగా ఇటువంటిదే మరో సంఘటన ఎలక్ట్రిక్ వాహనాలంటేనే భయపడేలా చేసింది. మహారాష్ట్రలోని వసాయ్ ఈస్ట్ లోని రామ్ దాస్ నగర్ ప్రాంతంలో  ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఏడేళ్ల బాలుడు చనిపోయాడు.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 23న షానవాజ్ అన్సారీ అనే వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. తెల్లవారుజామున అది ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షానవాజ్ కొడుకు షబ్బీర్ అన్సారీ తీవ్రంగా గాయపడి  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. షానవాజ్ అన్సారీ తన భార్య, కొడుకు, తల్లితో కలిసి రామ్ దాస్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో షానవాజ్ తన బైక్ బ్యాటరీ తీసుకుని హాల్ లో ఛార్జింగ్ పెట్టాడు. ఆ తర్వాత బెడ్ రూమ్ కి వెళ్లి నిద్రపోయాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. హాల్ లో మంటలు చెలరేగాయి. భారీ శబ్దం రావడంతో షానవాజ్ అన్సారీ ఉలిక్కిపడి లేచాడు. బయటకు వచ్చి చూసే సరికి షాక్ తిన్నాడు. తన ఏడేళ్ల కొడుకు షబ్బీర్ మంటల్లో చిక్కుకుని ఉన్నాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ, ప్రయోజనం లేదు. చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బ్యాటరీ పేలిపోవడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.  ఈ ఘటనతో ఎలక్ట్రిక్ బైక్ ల సేఫ్టీ పై మరోసారి  అనుమానాలు తలెత్తాయి.