ఇక మిగిలింది రాజే..!!

అన‌గ‌న‌గా ఓ రాజు. ఆయ‌న అతిక‌ష్టంమీద రాజ‌యిన‌ప్ప‌టినుంచీ మ‌ళ్లీ ఛాన్స్ సంగ‌తి ఎలా ఉన్నా దండు కోవాలి, ద‌బాయించి పాలించాల‌న్న‌సూత్రాన్నే న‌మ్ముకుని కోరి కొంద‌రిని ద‌గ్గ‌రికితీసుకుని ఆ ప‌నుల్లో ఉండ‌డ్రా అయ్యా అని పంపాడు. వారు దొరికిన చోట‌ల్లా భ‌జ‌న‌లు, భోజ‌నాలు చేస్తూ అయ్య‌వారికి క‌డుపారా సంతోషం క‌లిగిస్తూండేవారు. అప్ప‌టికే ప్ర‌జ‌లు అస‌హ్యించుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఏటి చేయాలి? అని ఆలోచించుకునే స‌మ‌యం ఇవ్వ‌కుండానే ఓ రాజుగారు కొంద‌రిని వెంట‌బెట్టుకుని రాజ ధానికి వ‌చ్చి జ‌నాన్ని, రాజుగారి అనుయాయుల్నీ హెచ్చ‌రించి మ‌రీ వెళ్లారు. అంతే రాజుగారికి మ‌రింత కోపం వ‌చ్చి రాత్రికి రాత్రే కొత్త రూల్స్ పెట్టి ప్ర‌జ‌ల్ని ఇబ్బందిపెట్ట‌డం ఆరంభించారు. ఎందుకొచ్చిన గోల ఈయ‌న కాదుగాని మొన్నొచ్చినాయ‌న్నే గ‌ద్దె ఎక్కి ద్దామ‌ని ఓ గ్రామంలో పంచాయితీ నిర్ణ‌యించింది. అదే త‌డ‌వుగా అన్ని గ్రామాలూ క‌లిసాయి. ఇక్క‌డ రాజుగారు ఏమ‌న్నా ప‌ట్టించుకోవ‌డం మానేశారు. దీనికి తోడు మంత్రి ని, సైన్యాధ్య‌క్షుడిని ఓ పాలి అలా తిరిగిరాండ్రా అని పుర‌మాయించారు.  వారు డాలు, క‌త్తి స‌ద్దుకుని గుర్రానికి ప‌నిచెప్పి బ‌య‌లుదేరారు. వారికి అరిటిప‌ళ్లు, నీళ్లు ఇచ్చి వ‌చ్చిన చోట‌ల్లా వారి మాట‌లు, వాక్చాతుర్యాన్ని ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌లు వారి ప‌నులు చేసుకుంటూండి పోయారు. దొరా, ఈళ్లు మారిపోయార‌య్యా, మ‌నోళ్లు గాదు..! అన్నాడు సైన్యాధ్య‌క్షుడు.. అవునేమో అను కున్నారు మంత్రిగారు. మెల్ల‌గా జారుకుని రాజుగారి జ‌రిగిన‌దంతా చెప్పారు. ఆయ‌న ఆశ్చ‌ర్య‌ పోయారు. కానీ ఏమీ ఎరగ‌న‌ట్టు న‌టించి ..ఆళ్ల‌కి అలా చేయ‌మ‌ని నేనే సెప్పినాలే.. నీకెలా ఉంట‌దో చూద్దామ‌ని అలా జేసినా.. ఏమ‌నుకోద్దు. ఈసారి ఎడం చేతి వేపు ఎల్లండి ఆడ బాగానే ఉంటారు. అన్నారు ఈసారి మంత్రితో పాటు కొంద‌రు సైనికుల‌నూ పంపారు. ఆయ‌న్ను తిట్ట‌డం, కొట్ట‌డం చేస్తార‌నే భ‌యంతో! ఆ ముచ్చ‌టా అయింది.  రాజ‌ధాని న‌గ‌రంలో పేద్ధ బంగ్లాలో అంద‌ర్నీ పిలిచి మీటింగ్‌పెట్టారు రాజుగారు. స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల తీరు అన్ని వివ‌రించి ఇపుడేం చేయాలా అని ప్ర‌శ్నించారు. ఏమి చెబుతామ‌ని త‌ల గోక్కున్నారంతా. ఏది చెప్పినా చివ‌రి త‌న మాటే శాస‌నం రాజుగదా.. ఏం చెప్పిన విన‌డాయా.. ఎందుకు చెప్ప‌డ‌మ‌ని ఆయ‌నకే ఆ అవ‌కాశం ఇచ్చారంతా. ఒకే.. ఇంకా బాగా ప‌నిచేయండి.. ఆనంద ప‌ర్చండి.. మీరు కావ‌ల్సింది అడ‌గం డి.. అని విందుపెట్టి పంపించేరు. భుక్తాయాసం తీర్చుకుని ఇళ్ల‌కు వెళ్లారంతే.  మ‌ర్నాడు తాకీదులు వ‌చ్చాయి..మీ ప‌నేం బాగాలేదు ఉంటారా తీసేయాలా అని. అంతా కంగారుప‌డి ప‌రిగెట్టుకొచ్చారు రాజు గారి ద‌గ్గ‌రికి. నిన్న భోజ‌నం బాగుందా? అని అడిగి వంటోడిని రావ‌ద్ద‌న్నా అన్నారు రాజుగారు. మ‌న‌ప‌నీ అంతేనేమో అనుకునేలోగానే న‌లుగురికి తాకీదులు ఇచ్చారు. మీసంగ‌తేంది అని. వారు న‌వ్వున‌టించా రు. మీ సంగ‌తేంది అనుకున్నారు! తాకీదులు అందుకోవ‌డంలో సిద్ద‌హ‌స్తుడు ఇవ్వ‌డంలో ఆతృతా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నుకున్నారంతా. ఏమై న్పటికీ స‌త్య‌ద‌ర్శ‌నం అయిన త‌ర్వాత ప్ర‌జ‌లే రాజులు. మ‌నం కేవ‌లం సేవ‌కుల‌మే రాజా అన్నా రంతా. అయినా రాజు విన‌డం లేదు. మ‌ళ్లీ తిట్టి పం పారు. తిట్టించుకోవ‌డంలో వారికి ఆనంద‌ మేమోగాని బ‌రువు మోయ‌డానికి ప్ర‌జ‌లు స‌సెమిరా అంటున్నారు. మొన్నొచ్చి మీటింగ్ పెట్టినాయ‌న్నే క‌లుస్తు న్నారంతా. రాజుగారికి ఆ సంగ‌తి తెలిసి రెండు విభాగాల‌కు తాయిలాలు పంచారు. వారు ఆ క్షణం కాస్తంత ఆనం దించారు. కానీ తాయిలాల కంటే రోజూ ప్ర‌శాంతంగా తిండి, నిద్ర కావాల‌నుకున్నారు. రాజుగారికి విన్న వించుకు న్నారు.. ఆ రెండు త‌ప్ప మ‌రేమ‌యినా కోరుకోండి ..అని మంత్రిచేత చెప్పించారు.  కాలం మారింది, ప్ర‌జ‌లూ మార్పు ఆశిస్తు న్నారు ప్ర‌భూ.. మ‌నం మార‌డానికి టిక్కెట్లు కొన్నాను..హిమాల యాల‌కు వెళ దామ‌న్నారు మంత్రి సేనాప‌తీను. ఏమీ సేతురా నాయ‌నా.. అని ఈసారి త‌న‌కు త‌ప్ప అం ద‌రికీ తాకీదులు ఇచ్చారు. .ప‌క్క‌నే ఉండి ఇష్ట‌మొచ్చిన పాట‌లు పాడి వినిపించే సన్ని హితుడితో స‌హా! స‌ద‌రు స‌న్నిహితుడు రాజుగారు లెక్క‌ల్లో పూర్‌.. ఎవ‌రికి ఎన్ని తాకీదులు ఇస్తారో తెలుసుకోలేక పోతున్నా ర‌ని న‌వ్వుకున్నాడు.. గ‌దిలో గ‌ద్దె మీద కూచున్న ఒక్క‌డినే చూసి!

అలీ జనసేన వైపు చూస్తున్నారా?

సినీ నటుడు, కమేడియన్ అలీ జనసేన వైపు చూస్తున్నారా? ఆయన వైసీపీతో విసిగిపోయారా? అసలీ ప్రశ్నలన్నీ ఉత్పన్నం కావడానికి ఆయన పేరుతో విడుదలైన ఒక ప్రకటనే కారణం. అసలు అలీ జనసేన పార్టీలో చేరుతానని కానీ, పార్టీ మారతానని కానీ ఎక్కడా ఎప్పుడూ అన్న సందర్భం లేదు. ఆ దిశగా ఎటువంటి ప్రచారం కూడా జరిగిన దాఖలాలు లేవు. అయినా హఠాత్తుగా ఆ అనుమానాలు కలిగేలా అలీ పేర ఒక ప్రకటన వెలువడింది. జగన్ మైనారిటీల కోసం ఎవరూ చేయనంతగా చేశారంటూ పొగడ్తల వర్షంతో వెలువడిన ఆ ప్రకటన అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆ ప్రకటన నేపథ్యంలోనే అలీకి నామినేటెడ్ పోస్టు వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. సినీ నటుడు అలీకి ఇక ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి.   అమరావతి నుంచి అలీ పేరుతో విడుదలైన ప్రకటనలో   తాను జనసేనలో చేరడం లేదనీ, మైనారిటీల అభ్యున్నతి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్ చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అందుకే జగన్ ను మరోసారి సీఎం చేయడానికి తన వంతు కృషి తాను చేస్తాననీ అలీ పేర విడుదలైన ఆ ప్రకటన సారాంశం. పదవులు ఆశించి తాను వైసీపీలో చేరలేదననీ, జగన్ పట్ల అభిమానంతో ఆయనను సీఎం చేయాలన్న లక్ష్యంతో పార్టీలో చేరాననీ కూడా అలీ పేర విడుదలైన ఆ ప్రకటన పేర్కొంది. అంతా బానే ఉంది కానీ.. అసలు అలీ జనసేన తీర్ధం పుచ్చుకుంటున్నారన్న వార్తలు కానీ ప్రచారం కానీ ఇప్పటి వరకూ ఎక్కడా కనిపించలేదు. జనసేనాని నటించే ఓ సినిమాలో అలీ నటిస్తారన్న వార్త మాత్రం.. (అది నిజమో కాదో తెలియదు) బయటకు వచ్చింది. అది కూడా సినిమా వర్గాల నుంచి లీక్ రూపంలో బయటకు వచ్చినదే. జనసేనాని నటించే ఏ సినిమాలో అలీ నటిస్తున్నారన్న స్పష్టత కూడా లేదు. అది పక్కన పెడితే.. అలీ జనసేన పార్టీలో చేరతారని ఆయన స్వయంగా ఎక్కడా ప్రకటించలేదు. అసలు జనసేన ప్రస్తావనే ఇప్పటి వరకూ అలీ నోటి వెంట రాలేదు. అదేమీ లేకుండా అలీ పేరుతో.. ఒక ప్రకటన విడుదల కావడమే అన్ని వర్గాలలోనూ సందేహాలను రేకెత్తిస్తోంది.  వైసీపీ వర్గాలే ఆయన పేరుతో ఓ ప్రకటన విడుదల చేశాయా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. వాస్తవానికి అలీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ పార్టీలో చేరిన సందర్భంలోనే ఆయన ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న తన కోరికను జగన్ కు తెలియ జేశారు. పార్టీలో చేరే వరకూ ఓకే అంటూ వచ్చిన జగన్ ఆ తరువాత హ్యాండిచ్చారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రాకపోతేనేం..రాజ్యసభ పంపించడమో, కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వడమో చేస్తామంటూ ఆశ చూపి ఇంత కాలం అలీని ఆశల పల్లకిలో ఊరేగించారు. ఆ మధ్యలో ఓ సారి అలీని రాజ్యసభకు పంపించేస్తున్నారంటూ వార్తలు, వదంతులూ షికారు చేశాయి. ఆ సమయంలో అలీ కూడా ఇక రాజ్యసభ సీటు గ్యారంటీ అన్న ఆనందంతో సతీసమేతంగా జగన్ దర్శనం చేసుకుని వచ్చారు. ఆ సందర్భంలో కూడా ఓ వారంలో గుడ్ న్యూస్ చెబుతానంటూ జగన్ అలీని ఊరించారు. ఆ సంగతి అలీయే స్వయంగా మీడియాతో కూడా చెప్పారు. అప్పటి నుంచీ గోడమీద రేపు అని రాసి చూసుకుంటున్నట్లుగా ఆ వారం కోసం అలీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ వారం ఇంకా రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ మధ్యలో అలీకి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అనీ, మరొకటనీ ప్రచారం జరిగినా అవేమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే అలీ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అందుకే వైసీపీలో ఈ ఖంగారు. ఈ ప్రకటన అని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి అలీ వైసీపీ మధ్య బలమైన బంధం ఏమీ లేదు. అలీ రాజకీయంగా చురుకుగా ఉన్న సందర్భం ఏనాడూ లేదు. ఆయన గత ఎన్నికలకు ముందు అన్ని పార్టీల మెట్లూ ఎక్కి పోటీ అవకాశం ఇస్తామన్న హామీని నమ్మే వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారనడంలో సందేహం లేదు. తీరా పార్టీలో చేరిన తరువాత పోటీకి అవకాశం లేదు.. ఏదో ఒకటి చేస్తామన్న హామీతో గత్యంతరం లేక పార్టీలో కొనసాగారే తప్ప అలీ వైసీపీలో చురుకుగా వ్యవహరించిందీ లేదు. జగన్ కు నచ్చేలా, ఆయన మెప్పు పొందేలా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడిందీ లేదు. తన సినిమాలూ, తన షోలు చేసుకుంటూ.. పేరుకు పార్టీలో కొనసాగుతూ ఉన్నారంతే. అయినా వైసీపీ అలీ పార్టీ మారుతారేమోనని ముందుగానే ఊహించేసుకుని ఆయన పేర ప్రకటన విడుదల చేసేయడమే ఆ పార్టీలో ఖంగారు, ఎంతో కొంత జనాకర్షణ ఉన్న అలీ జారిపోతారన్న భయం కనిపిస్తోంది. అందుకే అలీ పేర జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రకటన వెలువడిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఇక ఇంత వరకూ వచ్చింది కనుక కంటి తుడుపులా ఏదో ఒక పోస్టు అలీకి ఇచ్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఓ ఏడాదిన్నర కోసం నామమాత్రంగా ఓ నామినేటెడ్ పోస్టులో అలీని కూర్చోపెట్టేసి జగన్ మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు అని అలీ చేతే అనిపించేయాలన్న ఆత్రం వైపీపీలో కనిపిస్తోందనడానికి అలీ పేరుతో విడుదలైన ప్రకటనే నిదర్శనమంటున్నారు.  

కొత్త పార్టీ వచ్చేస్తోంది ముహూర్తం ఖరార్

తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయ ప్రస్థానం ఒక ప్రహసనంగా ఆగుతోంది.నిజానికి ముఖ్యమంత్రి మనసులో ఏముందో, ఏమి లేదో కానీ, ఇంచు మించుగా సంవత్సర కాలంగా, సాగుతున్న, జాతీయ సన్నాహాలు, ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు ఆన్నట్లు సాగుతున్నాయి. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్, జాతీయ యాత్ర మొదలైంది. అయితే, ఎన్నికలు ముగిసి అధికారం తిరిగి హస్తగతం అయిన తర్వాత, ఎందుకనో ఆ ఆలోచన అటకెక్కింది.  కానీ, హుజూరాబాద్ ఓటమి తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మరోసారి, జాతీయ ఆలోచనలను తెర మీదకు తెచ్చారు. ఇక  అప్పటి నుంచి ఒక చేత్తో కేంద్రంతో యుద్ధం చేస్తూ మరో చేత్తో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, అదేమిటో కానీ, ఆయన జాతీయ రాజకీయాల ఆలోచన ఆయనకు అచ్చిరాలేదో ఏమో కానీ, ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి ఆలోచనతో ఎన్ని రాష్ట్రాలు తిరిగినా, ఎవరిని కలిసినా, ప్రయోజనం కనిపించలేదు. ఎక్కడి కెళితే అక్కడ చుక్కెదురైంది.   ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాక్ మార్చారు.  ఫ్రంట్’లేదు టెంట్ లేదంటూ జాతీయ పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చారు. పార్టీ వేదికలు, బహిరంగ్ సభల్లో జాతీయ పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. పెట్టాలా .. వద్దా అంటూ ప్రశ్నించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, చప్పట్లో ఆమోదం తెలిపారు. అయితే,   రాజకీయ పండితుల మొదలు సామాన్య ప్రజల వరకు, కేసీఆర్ జాతీయ ఆలోచనలు ముడి పడేవి కాదనే అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసేఆర్ జాతీయ రాజకీయాల చర్చను సజీవంగా ఉంచడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.నిజానికి పార్టీ పేరు రిజిస్టర్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ, బీఆర్ఎస్ ( భారతీయ రాష్ట్ర సమితి/ భారతీయ రైతు సంఘటన) పేరును అయితే ప్రచారంలోకి తెచ్చారు.  ఆ ప్రయత్నాలలో భాగంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ప్రజలు,ప్రజా ప్రతినిధులు, తెలంగాణలో కేసీఆర్ అద్భుత పాలన చూసి మురిషి, ముగ్దులవుతున్నారని,  తమ రాష్ట్రంలోనూ, కేసీఆర్ పాలన కావాలని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, చాలా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు.  కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత పత్రికలలో కథలు, కథనాలు ప్రచురించారు. అయితే, కేసీఆర్ సొంత పత్రికలో వచ్చిన తప్పుడు కథనాలను పొరుగు రాష్ట్రాల ప్రజలు, రైతులు, ప్రజా ప్రతినిధులు ఖండించడమే కాకుండా, ఆ రెండు పత్రికలను తగల పెట్టి  నిరసన తెలిపారు. మహారాష్ట్ర రైతులు అయితే, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తమ నోట్లో మట్టి కొట్టారని, మేడిగట్టు బ్యాక్ వాటర్’తో తమ పంట పొలాలు నీట మునిగి పోతున్నాయని మండిపడుతున్నారు. అలాగే, పెట్టుబడి పెట్టి కర్ణాటక, గుజరాత్ తదిర  బీజేపీ పాలిత రాష్ట్రాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలను ప్లాన్ చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘీలా ఇటీవల్ హైదరాబాద్ వచ్చి వెళ్ళింది అందుకేనని అంటున్నారు.      అయితే, అదెలాగున్నా, ముఖ్యమంత్రి కేసేఆర్ మాత్రం జాతీయ రాజకీయాల విషయంలో, తగ్గేదే..లే’ అంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి, దసరా రోజున కొత్త పార్టీ ప్రకటన ఉంటుదని ముందు నుంచి ప్రచారం జరుగతున్న విధంగా, అక్టోబర్ 5న దసరా రోజున, జాతీయ పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసేందుకు, రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే రోజున పార్టీ పేరుతో పాటుగా జెండా -అజెండాను ఖరారు చేస్తారని, అంటున్నారు.  అయితే, ఇది ఎంతవరకు ముడిపడుతుందనే విషయంలో మాత్రం ఎవరి అనుమానాలు వారికున్నాయని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ సన్నిహితునిగా పేర్కొంటున్న, విజయ్ నాయర్’ ను ఆయనతో పాటుగా, ఆయనకు సన్నిహితునిగా భావిస్తున్న, మద్యం వ్యాపారి, సమీర్ మహేంద్రను ఎన్ఫోర్స్మెంట్  డైక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో పాటుగా తెరాస కీలక నేతలు కొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి, వాయిదా వేసుకున్న జాతీయ పార్టీ ప్రకటన ముహూర్తాన్ని మళ్ళీ ముందుకు తెచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి, నిన్నటి వరకు కూడా తెరాస నాయకులే, దసరాకు జాతీయ పార్టీ ప్రకటన ఉండదనే సంకేతాలు ఇచ్చారు. అసలు దసరాకు జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని ఎవరు చెప్పారని, మీడియా చర్చల్లో ఎదురు ప్రశ్నించారు.కానీ ఇంతలోనే, మళ్ళీ ఫార్మ్ హౌస్’నుంచి దసరా ముహూర్తం ఖరారైందని ప్రచారం మొదలైంది. అందుకే, ఈ ముహూర్తానికి జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు పార్టీ వర్గాలే వ్యక్త పరుస్తున్నాయి.  నిజానికి గతంలో ఇలా ఒకే రోజున మంత్రి వర్గ సమావేశం, అదే రోజున తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసన సభ పక్షం, పార్టీ కార్యవర్గ  విస్తృత స్థాయి సమావేశం ఒకే రోజున నిర్వహించిన సందర్భాలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే, చివరకు అదేమీ లేకుండా, ఆ రోజు వచ్చి వెళ్ళింది. కానీ, అంతకు మించి ఏమే జరగలేదు.   సో .. ఇప్పుడు అక్టోబర్ 5న దసరా నాడు పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటుగా ఎంపీలు - ఎమ్మెల్సీలు- ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని పార్టీ సూచించింది.దీంతో మళ్ళీ మరోమారు, జాతీయ పార్టీ ప్రకటన మీద ఉహాగానాలు ఉపందుకున్నాయి. కానీ, చివరకు ఏమవుతుంది? అసలు ఈలోగా, ఇంకేమి జరుగుతుంది? ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కాం అరెస్టులు హైదరాబాద్ చేరుకుంటాయా? ఈడీ ఎవరి తలుపు తడుతుంది?  ఇవవ్నీ జరిగినప్పుడు కానీ, జరిగింది అనుకోవడానికి లేదు. అందుకే, రాజకీయ విశ్లేషకులు అంతవరకు అన్నీ ఊహాగానాలే, అంటున్నారు.

రెచ్చిపోయిన అర్ష్‌దీప్‌, సూర్య‌, రాహుల్ .. భారత్ విజ‌యం

ఇటీవ‌ల టీమ్ ఇండియా విజ‌యానికి కీల‌క‌పాత్ర వ‌హిస్తు న్న డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ సూర్య‌ కుమార్ యాద‌వ్, ఓపెన‌ర్ కె. ఎల్‌. రాహుల్ స‌మ‌యోచిత బ్యాటింగ్ ప్రావీణ్యం క‌లిసి భార‌త్‌కు సునాయాస విజ‌యాన్ని అందించాడు. తిరువ‌నంత‌పురంలో దక్షిణా ఫ్రికాతో జ‌రిగిన టీ-20లో భార‌త్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొద‌ట బ్యాట్ చేసిన ద‌క్షిణాఫ్రికా 20 ఓవ‌ర్ల లో 8 వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులుచేసింది. భార‌త్ బౌల‌ర్లు అర్ష‌దీప్‌, అక్ష‌ర్ ప‌టేల్ అద్భుత బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. కాగా భార‌త్ 16.3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి విజ‌యం సాధించింది. ఫామ్‌లో దూసుకు పోతున్న సూర్య‌ కుమార్ యాద‌వ్ తో క‌లిసి ఓపెన‌ర్ కె.ఎల్‌. రాహుల్ రెచ్చిపోయారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను సునాయా సంగా ఆడు కున్నారు. రాహుల్ 51 ప‌రుగులు 56 బంతుల్లో చేసి, సూర్య‌కుమార్ 33 బంతుల్లో 50 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచారు.  వీరి ద్ద‌రూ 3వ వికెట్‌కి 65 బంతుల్లో 93 ప‌రుగులుచేశారు.  మొదట బ్యాట్ చేసిన ద‌క్షిణాఫ్రికాకు తొలి ఓవ‌ర్ నుంచే క‌ష్టాలు మొద‌లయ్యాయి. దీప‌క్ చాహ‌ర్ తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీశాడు. రెండో ఓవ‌ర్‌లో అర్ష్‌దీప్ తానేమీ త‌క్కువ‌తిన‌లేద‌ని విజృంభించి డీకాక్‌, ర‌సోల్‌, మిల్ల‌ర్ వికెట్ల తీసి జ‌ట్టుని, ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచి అమితానందాన్నిచ్చాడు. అద్భుత ఇన్‌స్వింగ్‌తో డీకాక్ వంటి ఎంతో అనుభ‌వం ఉన్న బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. అలానే చాహ‌ర్ కూడా రెచ్చిపోయాడు. వీరిద్ద‌రి బౌలింగ్ ధాటిని ఎదుర్కొన‌లేక ద‌క్షిణాఫ్రికా పేక‌ముక్క‌ల్లా వికెట్లు కోల్పోవ‌డంతో 2.3 ఓవ‌ర్ల లోనే కేవ‌లం 9 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయింది. ఇంత‌టి దారున‌మైన బ్యాటింగ్‌ను ప్రేక్ష‌కులు ద‌క్షిణాఫ్రికా నుంచి ఎన్న‌డూ ఊహించ‌లేదు. మొద‌టి ఆరు ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా 5 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 30 ప‌రుగులే చేసింది. అయితే ఒక ఎండ్‌లో మాక్ర‌మ్ ఎంతో జాగ్ర‌త్త‌గా ఆడుతూ జ‌ట్టు స్కోర్‌ను ముందుకు తీసికెళ్లాడు. కానీ 8వ ఓవ‌ర్లో హ‌ర్ష‌ల్ కి దొరికి పోయాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోరు 42 ప‌రుగుల‌కు చేరుకుంది. మ‌క్ర‌మ్ 25 ప‌నుగులు చేశాడు. 9వ ఓవ‌ర్లో సీనియ‌ర్ స్పిన్నర్ అశ్విన్ వ‌చ్చి ప‌రుగులు ఇవ్వ‌కుండా మైడిన్ చేయ‌డంతో ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు మ‌రింత కంగారెత్తారు. 10 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి ద‌క్షిణాఫ్రికా 6 వికెట్ల న‌ష్టానికి 48 ప‌రుగులు చేసింది. అప్ప‌టికి ర‌న్ రేట్ 4.86 ఉంది. అక్ష‌ర్ వేసిన 12వ ఓవ‌ర్లో ద‌క్షిణాఫ్రికా 50 ప‌రుగులు పూర్తి చేసింది. 15 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి 4.20 ర‌న్‌రేట్‌తో 6 వికెట్ల న‌ష్టానికి 63 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. పార్న‌ల్ చ‌క్క‌గా బ్యాట్ చేస్తున్నాడ‌నుకుంటుండ‌గానే 16వ ఓవ‌ర్లో అక్ష‌ర్‌కి దొరికిపోయాడు. పార్న‌ల్ 37 బంతుల్లో 24 ప‌రుగులు చేశాడు. కాగా 19 ఓవ‌ర్ వేసిన అర్ష‌దీప్ 14 ప‌రుగులు ఇచ్చాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా 7 వికెట్ల న‌ష్టానికి 100 ప‌రుగులు పూర్తి చేసుకుంది. చివ‌రి ఓవ‌ర్లో మహారాజ్ వెనుదిర‌గ‌డంతో ద‌క్షిణాఫ్రికా 5.26 ర‌న్ రేట్‌తో 8 వికెట్ల న‌ష్టానికి 101 ప‌రుగులే చేయ‌గ‌లిగింది.  109 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన భార‌త్ కూడా తొలి ఓవ‌ర్ల‌లో త‌డ‌బ‌డింది. పార్న‌ల్ వేసిన రెండో ఓవ‌ర్లోనే కెప్టెన్ శ‌ర్మ వెనుదిరిగాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ కేవ‌లం9 ప‌రుగులే. త‌ర్వాత 7 వ ఓవ‌ర్లో ఊహించ‌ని వ‌ధంగా కింగ్‌కోహ్లీ పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. అప్పుడు హీరో సూర్య‌కుమార్ రంగంలోకి దిగాడు. అత‌ని రాక‌తో, మ‌రో ఎండ్‌లో కె.ఎల్‌. రాహుల్ కూడా రెట్టించిన ఉత్సాహంతో ప‌రుగుల వ‌ర‌దే సృష్టించాడు. ఇద్ద‌రూ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను బాదుడే బాదుడు. రాహుల్ ఎంతో తెలివిగా నిల‌క‌ డ‌గా ఆడి ఇన్నింగ్ నిల‌బెట్టాడు. మొద‌టి ప‌ది ఓవ‌ర్ల‌లో భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 47 ప‌రుగులు చేయగా, 15 ఓవ‌ర్ల‌కు 91 ప‌రు గులు చేసింది. 13 ఓవ‌ర్‌కి రాహుల్, సూర్య 3వ వికెట్‌కి 39 బంతుల్లో 51 ప‌రుగులు చేశారు. అక్క‌డి నుంచి మ‌రింత రెచ్చి పోయారు. దీనికి తోడు ద‌క్షిణాఫ్రికా ఫీల్డింగ్ చెప్పుకోద‌గ్గ స్థాయిలో లేక‌పోవ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది. 16వ ఓవ‌ర్లో భార‌త్ వంద ప‌రుగులు పూర్తి చేసింది. ర‌బాడా వేసిన ఆ ఓవ‌ర్లో కెప్టెన్ బ‌హుమా క్యాచ్ వ‌దిలేయ‌డం కొంత ఇబ్బందిపెట్టింది. అయితే అప్ప‌టికే ఆట వారి చేతిలోంచి వెళిపోయింది గ‌నుక కెప్టెన్ పెద్ద‌గా బాధ‌ప‌డిన‌ట్టు క‌న‌ప‌డ‌లేదు. మొత్తానికి భార‌త్ 16.4 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌స్టానికి విజ‌యం సాధించింది. కె.ఎల్. రాహుల్ 56 బంతుల్లో 51 ప‌రుగులు చేయగా, డాషింగ్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ 33 బంతుల్లోనే 50 ప‌రుగులుచేశాడు. ఇద్ద‌రూ క‌లిసి 3వ వికెట్‌కి 65 బంతుల్లో 93 ప‌రుగులు జోడించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర‌పోషించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మార‌దా?

ఆస్ప‌త్రులు దేవాల‌యాలు, డాక్ట‌ర్లు దేవుళ్లు అనేది అనాదిగా ఉన్న భావ‌న‌. ఏ ప్రాంత‌మైనా ఎక్క‌డ‌యినా డాక్ట‌ర్ల‌కు ప్ర‌జ‌లు ఇచ్చే గౌర‌వం అది. ప్రాణ‌దాతులుగానే భావిస్తారు. వారు చెప్పిన‌ట్టే అన్ని చేస్తారు. ఆస్పత్ర‌ల ప‌రిస్థితి బావున్నా, బాగోక‌పోయినా, బొత్త‌గా అన్యాయంగా ఉన్నా సామాన్యులు అంత‌గా ప‌ట్టించుకోరు. కార‌ణం అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప్రాణ‌ర‌క్ష‌ణ క‌ల్పించేది, అందుకు న‌మ్మ‌కంగా నిలుస్తా య‌ని ఆస్ప‌త్రులు, డాక్ట‌ర్ల ప‌ట్ల అంద‌రి న‌మ్మ‌కం. కానీ కాల‌క్ర‌మంలో ఆ న‌మ్మ‌కం దెబ్బ‌తింటోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు మెరుగుకు డాక్టర్ల పై నిఘా లేదా వారి ఫోన్లలో జి పి ఎస్ ట్రాకర్లు మాత్రమే సరిపోదు వైద్యు ల ప్రవర్తన తీరులో  మార్పు రావాలి.  డాక్ట‌ర్లు కూడా ధ‌నార్జ‌న పిచ్చిలో ప‌డి ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో కంటే ప్రైవేటు ప్రాక్టీస్‌మీద‌నే ధ్యాస పెట్ట‌డం సామాన్యుల పాలిటి దుర‌దృష్టంగా మారింది. ప్ర‌భుత్వాస్ప‌త్రుల ప‌రిస్థితులు దెబ్బ‌తిన‌డానికి ఇదో కార ణంగా చెప్ప‌వ‌చ్చు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ స్థాయివారు ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్న‌ది ప్ర‌భుత్వ ఆస్ప త్రుల మీద‌నే. కానీ అవి కాల‌క్ర‌మంలో మౌలిక స‌దుపాయాలుకూడా స‌వ్యంగా క‌ల్పించ‌లేని స్థితికి జారిపో వ‌డం వారికి ప్రాణ‌సంక‌టంగా మారింది. అన్ని ప్రాంతాల్లోనూ ప్ర‌బుత్వాస్పత్రులు, డాక్ట‌ర్ల తీరులో పెద్ద‌గా అంత‌రం లేకుండా పోయింది. రోగుల‌ను నిర్ల‌క్ష్యంగా చూడ‌టం ఎక్కువ‌యింద‌ని రోగుల బంధువులే ఫిర్యాదులు చేయ‌డం, కొన్నిప్రాంతాల్లో ఏకంగా పోలీసు కేసులు పెట్ట‌డం కూడా జ‌రిగింది. ఇది ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ‌కు కంక‌ణం క‌ట్టుక‌న్నామ‌ని చెప్పే ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్టే. కానీ ఆ ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఏవో కుంటిసాకులు చెప్ప‌డం త‌ప్ప ఇద‌మిద్ధం గ‌ట్టి ప్ర‌య‌త్నాలేవీ చేయ‌డం లేదు.  ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సామాన్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అక్కడి వైద్యులు పట్టించుకోరు. రోగి బాధను తెలుసుకునే ప్రయత్నం కూడా కనీసం చేయరు.. పైగా మాకు తెలుసు మీరేంటి చెప్పేదంటూ రోగి తన రోగ లక్షణాలు చెప్పుకునే అవకాశం ఇవ్వరు. సందేహాల నివృత్తి మాటే ఉండ దు. రోగి తన బాధ చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. వైద్యులు పట్టించుకోరు సరి కదా..మేం చేసింది చేస్తాం  మీ సందేహాలు అనుమానాలు తీర్చాల్సిన అవసరం లేదు.  మేము చేయా ల్సింది  చేస్తాం దిక్కు న్న చోట చెప్పుకోండి అంటూ రోగిపట్ల అవమానకరంగా ప్రవర్తిస్తారన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.   అంద‌రి ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసిన ఇటీవ‌లి క‌రోనా స‌మ‌యంలో కూడా ప్ర‌భుత్వాస్ప‌త్రులు ప్ర‌భుత్వాల ప్ర‌చారం కంటే అద్బుతంగా ఏమీ లేవు. వాస్త‌వానికి రోగి బంధువుల‌ను కూడా ఉండేందుకు అనుమ‌తిం చ‌క పోవ‌డం దారుణం. రోగి మ‌ర‌ణిస్తే మృత‌దేహాన్ని బంధువుల‌కు అప్పగించ‌డంలోనూ సిబ్బంది వ్య‌వ హ‌రించిన ప‌ద్ధ‌తి ఊహించ‌లేనిద‌ని చాలామంది రోగులు ఆస్ప‌త్రి సిబ్బందిపై తిర‌గ‌బ‌డ‌టం అనేక ప్రాం తాల్లో జ‌రిగింది. మ‌రీ చిత్ర‌మేమంటే, ఒకరికి ఇవ్వాల్సిన మృత‌దేహాన్ని మ‌రో కుటుంబానికి ఇవ్వ‌డం! ఇది ప్ర‌భుత్వాస్ప‌త్రుల నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌గా చెప్పాలి. ప్ర‌చారంతో ఊద‌ర‌గొట్టే ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఇలాంటి విష‌యాల్లో ఎంతో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి స‌మా ధానం గాని, వివ‌ర‌ణ గానీ ఆయా ఆస్ప‌త్రివ‌ర్గాల నుంచి రాలేదు, వ‌స్తుంద‌న్న ఆశా లేదు.  కోరోనా సమయం క్రిటికల్ కేర్ లో ఉన్న డాక్టర్ ఆ రోజు కాక  వారం రోజులకు వచ్చేవాడని  రోగి  పరిస్థితి అర్ధం చేసుకుని ఒక్కొక్క రు ఒక్కో ట్రీట్మెంట్ ఇచ్చా రని అసలు ఏ  చికిత్చ చేసారో కూడా తెలియని చికి త్స‌ రోగులకు అందించారు.? అన్నది ప్రశ్నా ర్ధకం గా మారింది. కొందరు  ప్రభుత్వ డాక్టర్లు నేరుగా తమ క్లినిక్ కు రావాలాని ఈ శస్త్రచికిత్చ చేయమని  తమ క్లినిక్ లో 4౦ వేలు  ఆపైన ఎంతైనా అవ్వచ్చని చెపు తూ రోగిని నిలివు దోపిడీ చేస్తున్నారు.  ఇటీవల రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరే షన్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సర్జరీ తరువాత సమస్యలు వచ్చాయని రోగి అంటున్నా అలాగే ఉంటుంది అంటూ చెప్పిన సమాధానం ప్రాణాలకు డాక్టర్ వెలకట్టిన తీరు బాధ్యత రాహిత్యం సిబ్బంది ప్రవార్తనా తీరు విస్మయం కలిగిస్తోంది సగటు మధ్య తరగతి వారిపట్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకింత నిర్లక్ష్యం.?  గ్రామీణ‌ప్రాంతాలు, గిరిజ‌న ప్రాంతాల్లో ప‌రిస్థితులు వ‌ర్ణ‌నాతీతం. అనాదిగా ఈ ప్రాంతాల్లో రోగుల‌ను చేరేం దుకు రోడ్డు సౌక‌ర్యం కూడా లేక‌పోవ‌డం విచార‌క‌రం. రోగులను త‌ర‌లించ‌డం కూడా డోలీలో జ‌రుగుతోంది. శాసన సభలో ఏళ్ల తరబడి ప్ర‌జారోగ్యం గురించి  విప‌క్షాలు గొంతు చించుకున్నా,  ఎం ఎల్ ఏ నిధులు రావు ఎం పి నిధులు రావు సగటు గిరిజనుల గోడు ప్రభుత్వాలకి కనపడదు వినపడదు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సైతం దేశ వ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రా లలో ఒకే డాక్టర్ సరిగా లేని వైద్య సిబ్బంది. సిబ్బంది కొరత, మండులకోరత ,అత్యవ సరమైన సమయం లో చేయాల్సిన చికిత్చకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనించారు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్,లో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూర్ జిల్లలో మహారాష్ట్రా, తమిళనాడు, రాజస్థాన్, కేరళ, అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో సైతం ఇదే దుస్థితి నేల కొనడాన్ని తీవ్రంగా  తప్పుపట్టింది. ఒకవైపు నిధులు లేవని రాష్ట్రాలు అంటుంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహించాల్సిన బాధ్యత  రాష్ట్రాలదే అని కేంద్రం  అందం మీరంటే మీరంటు సగటు మధ్యతరగతి వర్గానికి ఆరోగ్యాన్ని అందించే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను నిర్లక్ష్యం చేసాయని అన డంలో ఏమాత్రంసందేహం లేదు. 

వెంకన్న దేవునికి జగనన్న అవమానం...అందుకేనా ?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ ‘రెడ్డి’ ది ఏ కులం? ఏ మతం? ఇలా ప్రశ్నించడం, ‘సభ్య’ సమాజానికి  సమంజసం అనిపించక పోవచ్చును, కానీ, ఎంత కాదనుకున్నా, కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన కులం ఏమిటి? ఆయన మత విశ్వాసం ఏమిటి? అనే అంశం చర్చకు వస్తూనే వుంది. వస్తూనే ఉంటుంది కూడా. ముఖ్యంగా, ఇతర మతస్తుల, ముఖ్యంగా మెజారిటీ మతస్తులు, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ముఖ్యమంత్రి లేదా ఆయన కుటుంబ సభ్యులు ప్రవర్తించి నప్పుడు, తప్పయినా, ఒప్పయినా ఇంకేదైనా, ముఖ్యమంత్రి  మత విశ్వాసాలు తప్పని సరిగా చర్చకు వస్తూనే ఉంటాయి. అందులోనూ  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందూ దేవాలయాల పై వరుస దాడులు పెరిగాయి. దేవీ, దేవతల విగ్రాహాలు ద్వంసం చేసే దురాగతాలు పెరిగి పోయాయి. రథాలను దుండగలు తగల బెట్టారు. మరో వంక క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు మహా జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు ప్రతి రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందంటే, క్రైస్తవులకు ప్రత్యేక దేశం కావాలనే, డిమాండ్ వరకు వెళ్ళింది. ఇదంతా ముఖ్యమంత్రి ప్రోత్సాహం, ప్రోద్బలంతో సాగుతోందా లేదా అనేది పక్కన పెడితే, జరుగతున్న పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి మత  విశ్వాలు చర్చకు రావడం తప్పు కాదు. వస్తాయి, వస్తూనే ఉంటాయి.  నిజానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,అయన కుటుంబ మత విశ్వాసాల గురించి ఎవరికీ, ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఇందుకు సమబందించి జగన్ రెడ్డి తల్లి   విజయమ్మ బైబిల్ సాక్షిగా, చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చాలా కాలం క్రితం, ఒక ఇంటర్వ్యూలో ఆమెను ఇదే ప్రశ్న అడిగినప్పుడు, ఆమె ఏ మాత్రం తడబాటు లేకుండా, “మాది క్రైస్తవ కుటుంబం. ఏసు ప్రభువు ఒకడే దేవుడు అని నమ్మే క్రైస్తవ ధర్మాన్ని, మా కుటుంబం దేవుని వాక్కుగా విశ్వసిస్తుంది. కుటుంబంలో జరిగే శుభ, అశుభ కార్యాలు అన్నీ, క్రైస్తవ ధర్మం ప్రకారమే జరుగుతాయి” అని స్పష్టంగా చెప్పారు. అంతే కాదు, రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) కానీ, జగన్  కానీ, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, రాజకీయ అవసరాల కోసం హిందూ దేవాలయాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హిందువుల పండగలు, పబ్బాలలో మొక్కుబడిగా మాత్రమే పాల్గొంటారని నిర్మొహమాటంగా తెగేసి చెప్పారు. అంతే కానీ, క్రైస్తవ ధర్మాన్ని మాత్రం ఆ క్షణంలో కూడా మరవరని విజయమ్మ అంతే స్పష్టంగా చెప్పారు. విజయమ్మ చెప్పిన సత్య్యాన్ని పక్కన పెట్టినా, కళ్ళ ముందు జరుగతున్న పరిణామాలు  జగన్మోహన్ రెడ్డికి, ఆయన  కుటుంబానికి,“ఏసు దేవుడు ఒక్కడే దేవుడు”, ఇతర మతాలను, ఇతర దేవుళ్ళను వారు వారు విశ్వసించరు అనే నిజం, వారి చర్యలలో స్పష్టంగా దర్శనమిస్తూనే వుంది. అందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు. జగన్ రెడ్డి చాలా సందర్భాలలో మాటకు ముందో మారు, చివరో మరో మారు దేవుని ప్రస్తావన చేస్తారు. దైవ స్తుతి చేస్తారు. అయితే, అమాయకంగా, హిందువులు ఎవరైనా, ఆయన ప్రస్తావించిన, దేవుడు, ముక్కోటి దేవతలు ఆరాధించే,  వెంకన్న దేవుడనో, కనకదుర్గమ్మ తల్లనో, అనుకుంటే, అది పొరపాటే అవుతుంది. ఆయన పగటి పూట పలవరించినా, రాత్రులలో కలవరించినా ‘ఏసు’ దేవుని నామమును మాత్రమే పలుకుదురు. మరో, దేవున్ని మనసులోకి రానీయరు. ఆలాగే ఆయన రాత్రులలో నేరుగా దేవునితో మాట్లాడినా, ఏసు దేవునితోనే మాట్లాడతారు కానీ , పక్కనే ఉన్నారు కదా అని మంగళగిరి పానకాల స్వామితోనో, మన వైజాగ్’ కు దగ్గరగా ఉన్నారని  సింహాద్రి అప్పన్నతోనో మాట్లాడరు. ఆయన ఏసు ప్రభువునే ధ్యానిస్తారు, ఏసు ప్రభువునే ఆరాధిస్తారు. ఏసు ప్రభువుతోనే మాట్లాడతారు. కలలో అయినా, ఆయన, ఏ ‘హిందూ’ దేవుడిని దేవుడినిగా గుర్తించరు. ముక్కోటి హిందూ దేవీ దేవతలలో ఏ ఒక్కరి పేరూ పొరపటున అయినా  ఉచ్చరించరు. అయితే, ఇప్పడు ఇదంతా ఎందుకంటే, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నుదుటున బొట్టు లేదని, అయన వెంట వారి సతీమణి రాలేదని, లేరనీ, సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో, ఇప్పుడు మళ్ళీ మరో మారు ముఖ్యమంత్రి మత విశ్వాసాల విషయం చర్చకు వచ్చింది.  నిజానికి ముఖ్యమంత్రి తమ మత విశ్వాసాలను పాటిస్తే, ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఇతర మత విశ్వాసాలను, ముఖ్యంగా హిందువుల విశ్వాసాలు, ఆచార, వ్యవహారాలను అగౌరవ పరిచే విధంగా, ముఖ్యమంత్రి ప్రవర్తన, సర్కార్ తీరు ఉంటున్నాయనేదే హిందూ ధార్మిక సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ. ప్రస్తుత విషయానికే వస్తే, తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆచారంగా వస్తోంది. నిజానికి, దేవుని కార్యానికి అనే కాదు, హిందూ ధర్మం,ఆచార, వ్యవహారాల  ప్రకారం పెళ్లి, పేరంటం ఏదైనా, తల్లి తండ్రులు, పెద్దలు, పిల్లలు ఎవరైనా  దంపతులకు దంపతులే బట్టలు పెడతారు. అంతేకానీ, ఇలా ఒంటరిగా వచ్చి బట్టలు పెట్టడం ఉండదు. అలాంటిది, ఆ దేవ దేవునికి ముఖ్యమత్రి ఒంటరిగా పట్టు వస్త్రాలు సమర్పించడం,అపచారం. అవమానం. హిందువుల మనోభావాలను కించపరిచే, అపరాధం. నిజమే, ఏసు నాథుని తప్ప మరో దేవుని పేరును ఉచ్చరించడమే మహా పాపమని, ‘సెక్యులర్’ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భావిస్తే భావించ వచ్చును, అది వారి విశ్వాసం. అలాటప్పుడు, ముఖ్యంత్రి అయినా, మనసు చంపుకుని మొక్కుబడి తంతుగా కార్యక్రమలో పాల్గొనడం ఎందుకు?   ఇంచక్కా దేవాదాయ శాఖ మంత్రి దంపతులకో, లేదా మరో మంత్రికో ఆ కార్యం అప్పగిస్తే, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు కాదా? ముఖాన బొట్టు పెట్టుకోవలసిన అవసరం ఉండదు కదా?  ఇలా, తమ మనస్సును కష్ట పెట్టుకొంటూ, కోట్లాది హిందువుల మనోభావాలను కించే పరచడం అవసరమా? ఇదే ఇప్పడు హిందూ సమాజం, హిందూ ధార్మిక సంస్థలు ముఖ్యమంత్రిని అడుగుతున్న ప్రశ్న.

దేశ్ కీ నేతా కేసీఆర్ ప్రచారం పట్ల ‘మహా’ రైతుల ఆగ్రహం

దేశ్ కీ నేత అనిపించుకోవాలన్న అత్యుత్సాహంతో కేసీఆర్ నేల విడిచి చేస్తున్న సాము బూమరాంగ్ అయ్యింది. తెలంగాణ అభివృద్ధిని జాతీయ పత్రికలు మీడియాలో కూడా కోట్లాది రూపాయల ప్రజా ధనంతో పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేసి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ఉత్సాహంతోనే పక్కనున్న మహారాష్ట్ర రైతులు కూడా  కేసీఆరే ప్రధాని కావాలని, జాతీయనేతగా ఉండాలని కోరుతున్న ట్టు ఒక వార్త  తెలంగాణకు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైంది.  ఆ వార్తే ఇప్పుడు కేసీఆర్ బిల్డప్ నంతా ఒక్క సారిగా కుప్పకూల్చేసింది. తాము కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకోవడం లేదనీ, అసలు కేసీఆర్ వల్ల తమకు వీసమెత్తు ఉపయోగం లేకపోగా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తీవ్రంగా నష్టపోయామనీ మహారైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా కాళేశ్వరం కారణంగా తాము భూములు కోల్పోయామనీ, ఇంత వరకూ తెలంగాణ తమకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని వారు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం కారణంగా మహారాష్ట్రలోని  15 గ్రామాల రైతులు పంటలు పండిం చు కోలేకపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు నష్టపోయిన తమకు తెలంగాణ ప్రభుత్వం కనీసం పరి హారం కూడా ఇవ్వలేదని వారంతా వాపోయారు. కేసీఆర్ పనితీరుతో తీవ్రంగా నష్టపోయిన తాము ఆయన్ని ఎలా సమర్థిస్తామని మండిపడ్డారు. నష్టపరిహారం కోసం కోర్టుకు వెళతామని హెచ్చరించారు. తాము కేసీఆర్ ను జాతీయ నేతగా ఆహ్వానిస్తు న్నట్లుగా వచ్చిన వార్తలోని ఫొటోలు తమవే కానీ వాటిని ఫేస్ బుక్ లోంచి తస్కరించి ఆ వార్తకు వాడుకు న్నారని వారు ఆరోపిస్తున్నారు.  కేసీఆర్ ప్రచారం కోసం తమ ఫొటోలను తమ అనుమతి లేకుండా వాడుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తెలం గాణాకు చెందిన ఆ వార్తాప‌త్రిక త‌మ అభిప్రాయం తెలుసుకోకుండానే తమ ఫొటోలు వేసి తామేదో కేసీఆర్ కు ఆహ్వానాలు పలుకుతున్నట్లు, బ్రహ్మరథం పడుతున్నట్లు వార్తలు ప్రచురించి ప్రచారం చేసుకోవడమేమిటంటూ మండి పడుతు న్నారు.  తెలంగాణా, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతంలో  సిరోంచ తాసీల్దా రు కార్యాల‌యం వ‌ద్ద   రైతులు నిర‌స‌న తెలియ‌జేస్తూ ఆ వార్తాప‌త్రిక కాపీల‌ను  త‌గుల‌బెట్టారు.  వాస్త‌వానికి, తాము కేసీఆర్‌ను జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోర‌నే లేద‌ని, అస‌లు కేసీఆర్ ఆశ‌ల‌కి, కంటున్న క‌ల‌ల‌కి త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌నివారు కుండబద్దలు కొట్టారు. సదరు పత్రికలో వచ్చిన వార్తతో తమకు ఇసుమంతైనా సంబంధం లేదని స్పష్టం చేశారు.   మహారాష్ట్ర రైతుల నిరసనతో జాతీయ రాజకీయాలంటూ దూకుడు ప్రదర్శిస్తున్న కేసీఆర్ పరువు జాతీ యస్థాయిలో మంటగలిసిందని బీజేపీ వారు సంబరపడుతున్నారు. కర్నాటక రైతు లు కూడా కేసీఆర్ చేసుకుంటున్న ఇటువంటి ప్రచారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు  ఆ రాష్ట్రా నికి చెందిన నాయ కులు చెబుతున్నారు.  కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు ఇతర రాష్ట్రాల రైతుల నుంచి ఆగ్రహా వేశాలు వ్యక్తం కావడంతో ఆయన జాతీయ రాజకీయాల వైపు ఆయన అడుగులు ఎలా ముందుకు పడతా యన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ ను కించపరిచే పోస్టులు తొలగించండి.. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఆప్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాల మధ్య విభేదాలు కోర్టు మెట్లెక్కాయి. ఆప్ నేతలపై సక్సేనా పరువు నష్టం దావా వేశారు. ఆ దావాలో కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సక్సేనాకు ఊరటనిచ్చాయి. అయితే ఆప్ నేతలు మాత్రం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారి అవినీతిని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిథులుగా తమపై ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా కోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు.  తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ నేతలపై వేసిన పరువు నష్టం దావాలో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ కు ఊరట కలిగేలా ఇచ్చిన ఆ మధ్యంతర ఉత్తర్వులలో లెఫ్టినెంట్ గవర్నర్ ను కించపరిచే పోస్టులు, వీడియోలు, ట్వీట్లను సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలని, అలాగే ఆయనపై ఆరోపణల విషయంలో సంయమనం పాటించాలనీ ఆప్ నేతలను  ఆదేశించింది. తనను కించపరిచే విధంగా తప్పుడు ఆరోపణలు, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాథక్, జాస్మిన్షా లపై పరువునష్టం దావా వేశారు. తనకు కించపరిచేలా ఉన్న, తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న పోస్టులు, వీడియోలు తొలగించాలని వారిని ఆదేశించాలని సక్సేనా ఆ పిటిషన్ లో కోరారు. అలాగే తన పరువుకు నష్టం కలిగించినందుకు ఆప్ నేతలు ఐదుగురూ తనకు రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా సక్సేనా ఆ డిఫమేషన్ దావాలో కోరారు.   అయితే ఆ తీర్పు పట్ల ఆప్ నేతలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామంటూనే న్యాయస్థానం ఇచ్చినది మధ్యంతర ఉత్తర్వులేనని పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు తీసుకునే నిర్ణయాలపై సమగ్ర అధ్యయనం చేసి వాస్తవాలను ప్రజలకు విరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిథులదేనని, ఆ బాధ్యతను తాము ఎన్నడూ విస్మరించజాలమనీ పేర్కొన్నారు. తాము లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాపై చేసిన ఆరోపణలు ఆ కోవలోనివేనని కోర్టుకు తెలిపినట్లు ఆప్ నేతలు చెప్పారు. తాము చేసిన ఆరోపణలపై  స్వతంత్ర దర్యాప్తు డిమాండ్ చేయాలని, అందుకు భిన్నంగా ఆయన ఏ తప్పూ చేయనప్పుడు దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. కాగా ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేశారు. 

లాప్‌టాప్ ఆర్డ‌ర్ చేస్తే బ‌ట్ట‌ల స‌బ్బులు వ‌చ్చాయి!

ఇప్పుడంతా ఆన్‌లైన్ వ్యాపార‌మే. తినే ప‌దార్ధాలు, వ్యాపార వ‌స్తువులు, లాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్లు కూడా ఫ్లిప్ కార్ట్ వంటివాటిలో బుక్ చేసి తెప్పించుకుంటున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి గంట‌ల త‌ర బ‌డి వెత‌క‌డం, కావ‌ల‌సిన వ‌స్తువుని వెతికి తెచ్చుకోవ‌డం అనేది స‌మ‌యంతో కూడిన ప‌ని. చాలామంది ఆ స‌మ‌యం వెచ్చించ‌లేక‌నే ఆన్‌లైన్‌లో కొనుగోలుకే ఇష్ట‌ప‌డుతున్నారు. ఫ్లిప్ కార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకో వ‌డం, కావ‌ల‌సినవి ఆర్డ‌ర్ చేసుకుంటే పెద్ద‌గా శ్ర‌మ‌ప‌డ‌కుండానే ఇంటికే అన్ని చేర‌డం ఈ రోజు ల్లో ప‌రిపాటి అయింది. అయితే ఈ ర‌ద్దీ ఎక్కువ‌యింది. క‌నుక ఎవ‌రు ఏమి తెప్పించుకుంటున్నార‌న్న‌ ది కాస్తంత గ‌మ‌నించుకోవాలి. డెలివ‌రీ బాయ్ ఇచ్చి వెళ్లిన చాలాసేప‌టికి చూసుకుంటే మీరు ఆర్డ‌ర్ చేసిన‌ది కాకుం డా మ‌రోటి ఉండావ‌చ్చు! అవును అదే జ‌రిగింది య‌శ‌స్వీ శ‌ర్మ‌కి.  అహ్మ‌దాబాద్ ఐఐ ఎం విద్యార్ధి య‌శ‌స్వీ శ‌ర్మ‌. త‌న తండ్రికి లాప్ టాప్ కొనాల‌నుకున్నాడు. ఈమ‌ధ్య బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ అని ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. స‌రే త‌క్కువ‌లో వ‌స్తుంద‌ని య‌శ‌స్వీ లాప్ టాప్ బుక్ చేశాడు.  అదే రోజు య‌శ‌స్వీ తండ్రి ఆ ప్యాక్‌ను అందుకున్న‌ట్టు య‌శ‌స్వీకి ఫ్లిప్ కార్ట్ మెసేజ్ వ‌చ్చింది. ఓకే అనుకున్నాడు ఈ కుర్రాడు. తీరా పాకెట్ విప్పి చూస్తే ఇంటిల్ల‌పాదీ ఆశ్చ‌ర్య‌పోయారు. లాప్ టాప్‌కి బ‌దులు  అం దులో బ‌ట్ట‌లు ఉతికే స‌బ్బులు ఉన్నాయి!  ఇదేందిరా నాయ‌నా! అనుకున్నారు. ఫ్లిప్ కార్ట్ కి బుక్ చేస్తే ఎన్నడూ ఇలా జ‌ర‌గ‌లేదే అనుకున్నారు.  పైగా ఏద‌యినా వ‌స్తువు తెచ్చినా డెలివ‌రీ బాయ్ దాన్ని ఆ అడ్రస్లో ఉన్న‌వారి  చేత తీయించి చూసి ఓకే అనుకునే వెళుతూంటారు. కానీ ఈసారి మాత్రం ఇలా జ‌రిగిం దనుకున్నారు య‌శ‌స్వీ కుటుంబంలో అంతా.  బ‌హుశా, డెలివ‌రీ బాయ్ ప‌ని ఒత్తిడిలోనో, త్వ‌ర‌గా ప‌ని ముగించుకోవాల‌నుకునో హ‌డావుడిలో ఒక‌రిది మ‌రొకరికి ఇచ్చాడేమో అనీ అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌డానికి వీలేలేదు. ఎందుకంటే య‌శ‌స్వీ తండ్రి అందుకున్న ప్యాకెట్ మీద అడ్ర‌స్ వాళ్ల‌దే ఉంది! మ‌రి ఇదెలా జ‌రిగింది. మూడు నాలుగు రోజుల త‌ర్వాత దీన్ని గురించి ఫిర్యాదు చేశారు. జ‌రిగిన న‌ష్టానికి డ‌బ్బు చెల్లించ‌డానికి ఫ్లిప్‌కార్ట్  ఓకే అనేసింది. కానీ చిత్ర‌మేమంటే, ఈ స‌బ్బులు బుక్ చేసిన‌వారు ఇంకెంత కంగారుప‌డుతూంటారో. వారికి లాప్ టాప్ వెళ్లి ఉంటే, అక్క‌డ దాని అవ‌స‌రంలేని బామ్మ‌లు ఉంటే ప‌రిస్థితి ఏమిటి?!

లార్డ్స్ పెవిలియ‌న్ లా   దుర్గా పూజా మందిరం

భార‌త్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌(బిసిసిఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీకి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోని పెవిలియ‌న్ ప‌ట్ల ఇష్టం ఇంకా త‌గ్గ‌లేదు. కోల్‌క‌తాలో మిథాలీ సంఘం వారు ఏర్పాటు చేసిన దుర్గాపూజ మందిరం అచ్చం లార్డ్స్ పెవిలియ‌న్‌లానే ఉన్న‌ది. దీన్ని మంగ‌ళ‌వారం గంగూలీ ఆరంభించాడు.  ప్ర‌పంచ క్రికెట్ మ‌క్కాగా పేర్కొనే ఇంగ్లండ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తో  బీసీసీఐ అధ్య‌క్షుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్‌కు గొప్ప అనుబంధం ఉన్న‌ది. 2002 ఇంగ్లండ్‌, భార‌త్ సిరీస్‌లో చివ‌రి మ్యాచ్ అక్క‌డ భార‌త్ అద్బుత విజ‌యం సాధించింది. ఆ ఆనందంలో గంగూలీ అక్క‌డి పెవిలియ‌న్ నుంచి మ్యాచ్  చివ‌రి క్ష‌ణాలు ఆస్వాదిస్తూ, విజ‌యం సాధించిన వెంట‌నే టీష‌ర్ట్ విప్పి గాల్లోకి తిప్పుతూ త‌న అమితానందాన్ని ప్రేక్ష‌కు ల‌కు, క్రికెట్ వీరాభిమానుల‌కు తెలియ‌జేయ‌డం ఎప్ప‌టికీ ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో అప్ప‌టి సూప‌ర్ స్టార్ యువ‌రాజ్ సింగ్, మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ తో క‌లిసి ఇంగ్లండ్ బౌల‌ర్లను ధీటుగా ఎదుర్కొన డం ఇప్ప టికీ క్రికెట్ వీరాభిమానులు మ‌రువ‌లేరు. ఇంగ్లండ్‌లో ఆ జ‌ట్టు మీద‌నే  భార‌త్   లార్డ్స్లో చివ‌రి మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవ‌డం క్రికెట్ చ‌రిత్ర‌లో చెప్పుకోద‌గ్గ అంశం. కెప్టెన్ గంగూలీ  ఆ విజ‌యానందాన్ని అత్యంత ఆహ్లాదంతో, విజ‌య‌గ‌ర్వంతో  లార్డ్స్ బాల్క‌నీ నుంచి  ప్ర‌క‌టించ‌డం ఎప్ప‌ టికీ గుర్తుండిపోతుంది.  గంగూలీ భార‌త్ త‌ర‌ఫున 113 టెస్టులు ఆడి 7,212 ప‌రుగులు చేశాడు. ఇందులో 16 సెంచ‌రీలు, 13 అర్ధ సెం చ‌రీలు ఉన్నాయి. బౌలర్‌గానూ ఎంతో ప్ర‌తిభ ప్ర‌ద‌ర్శించి 32 వికెట్లు తీశాడు. ఓడీఐల్లో మాజీ కెప్టెన్ గంగూలీ 311 మ్యాచ్‌ల్లో 11,363 ప‌రుగులు చేశాడు. అందులో 22 సెంచ‌రీలు ఉన్నాయి.

ఎన్ ఐ ఏ దాడుల్లో  2047 డాక్యుమెంట్  ల‌భ్యం

ఇటీవ‌ల ఎన్ఐఏ సోదాల్లో పిఎఫ్ఐ కి సంబంధించిన బాంబుల త‌యారీ, మిష‌న్ 2047 ప‌త్రాలు ల‌భ్య‌మ‌ య్యాయ‌ని ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారులు తెలిపారు. అయితే పి ఎఫ్ ఐ పై కేంద్రం నిషేధాజ్ఞ‌లు జారీ చేయ‌డం ప్ర‌జాస్వామ్యానికి, రాజ్యాంగంలో పేర్కొన్న పౌర‌హ‌క్కుల‌కు విఘాతం క‌లిగించ‌డ‌మేన‌ని పి ఎఫ్ ఐకి చెందిన సోష‌ల డ‌మోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా పేర్కొన్న‌ది.  కానీ దేశంలో ఎన్ ఐ ఏ చేప‌ట్టిన దాడుల్లో అనేక ప్రాంతాల్లో తీవ్ర‌వాదులతో పి ఎప్ ఐకి  సంబంధాలు ఉన్నట్టుగా రుజువు చేయ‌గ‌ల ప‌త్రాలు ల‌భించాయ‌ని అధికారులు తెలిపారు. ముప్ప‌య్యేళ్ల క్రితం స్థాపిం చిన పి ఎఫ్ ఐ దేశంలో యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు వారికి తీవ్ర‌వాద శిక్ష‌ణ‌ను కూడా ఇస్తోంద‌ని, వారిని దేశంలో అశాంతి ప్రేరేపించేందుకు ఉప‌యోగించుకోవ‌డానికి సిద్ధ‌ప‌రుస్తోంద‌న్నది దాడుల్లో వెల్ల‌డ‌యిందని ఎన్ ఐఏ అధికారులు తెలిపారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కూ దేశం మొత్తం మీద 300 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలిపారు.  దేశంలో చాలా ప్రాంతాల్లో జ‌రిగిన దాడుల స‌మాచారాన్ని ప‌రిశీలించిన త‌ర్వాత‌నే ఈ సంస్థ వాస్త‌వ కార్య క‌లాపాలు మ‌రింత తెలిశాయ‌ని, అందువ‌ల్ల‌నే సంస్థ‌పై నిషేధ నిర్ణ‌యం తీసుకున్నట్టు అధికారులు తెలి పారు. దేశంలో త్వ‌ర‌లో భారీ బాంబు దాడుల‌కు ఈ సంస్థ శిక్ష‌ణ‌లో ఉన్న‌వారు సిద్ధ‌మ‌యిన స‌మా చారం అందిన మీద‌ట‌నే దాడులు చేప‌ట్టారు. ముఖ్యంగా పి ఎఫ్ ఐ నాయ‌కుడు మొహ‌మ్మ‌ద్ న‌దీమ్ ను ఉత్త‌ర ప్ర‌దేశ్ బారాబంకీలో ప‌ట్టుకుని అత‌ని వద్ద ల‌భించిన కీల‌క ప‌త్రాలతో  దేశంలో దాడుల‌కు సిద్ధ ప‌డిన సంగ‌తి వాస్త‌వ‌మేన‌ని తేలింది. ఐఇడి ఎలా త‌యారు చేయాలి, ఎలా ఉప‌యోగించాల‌నే అంశా లపై ప్ర‌త్యేక  శిక్ష‌ణ గురించిన డాక్యుమెంట్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పి ఎఫ్ ఐ నాయ‌కుడు ఖాద్రా వ‌ద్ద ల‌భించా య‌ని అధికారులు తెలిపారు.  ఇదిలా ఉండ‌గా, దేశంలో ప్ర‌జార‌క్ష‌ణ ప‌ట్ల కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందని విప‌క్షాలు విరుచుకు ప‌డుతున్నాయి. కేవ‌లం ప్ర‌చార ఆర్భాటం, ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం, అధికార కాంక్ష త‌ప్ప బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం, ర‌క్ష‌ణ గురించి నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నాయి. ఎన్ ఐ ఏ దాడులతో దేశం లో అనేక ప్రాంతాల్లో సంఘ‌విద్రోహ‌శ‌క్తులు బ‌లోపేతం అవుతున్నార‌న్న‌ది వెలుగులోకి వ‌చ్చింది. కానీ వారికి విదేశాల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం, దేశంలో దాడుల‌కు పాల్ప‌డేందుకు సిద్ధ‌ప‌ డ‌టం చివ‌రి నిమిషంలోనే అవి బ‌య‌ట‌ప‌డ‌టం ప‌ట్ల ప్ర‌జ‌లు ఎంతో ఆందోళ‌న‌ప‌డుతున్నారు.   ఇదిలా ఉండ‌గా, దేశంలో త‌మ సంస్థ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం దాడులు చేప‌ట్ట‌డం ఒక డ్రామాగా పి ఎఫ్ ఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. తీవ్ర‌వాద వ్య‌తిరేక కేసుల‌ను ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకునే ఎన్ ఐఏ, ఆర్దిక నేరాల సంబంధించి ప‌నిచేసే ఈడీ రెండు కీల‌క సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టు కుంద‌ని ఆరోపించింది.  

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు.. వైసీపీకి మరణశాసమేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి, ఏ సామాజిక వర్గాన్ని జనానికి దూరం చేసి లబ్ధి పొందుదామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రయోజనం చేకూరలేదు, ఆ లబ్ధి ఒనగూరలేదు సరి కదా.. మూడేళ్ల జగన్ పాలనలో మూటగట్టకున్న అపఖ్యాతి అంతా ఒకెత్తు అయితే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో ఆయన మూటగట్టుకున్న అపఖ్యాతి మరొక ఎత్తు అన్నట్లుగా మారింది. పరిశీలకుల విశ్లేషణల మేరకు జగన్ సర్కార్ ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల మనోభావాలనూ దెబ్బతీశారు. ముఖ్యమంత్రి కనుక ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒకరిద్దరు మంత్రులూ, నలుగురైదుగురు ఎమ్మెల్యేలూ, మరి కొంత మంది వైసీపీ నేతలూ ట్వీట్ల ద్వారానో, మీడియా మందు మాట్లాడారేమో కానీ.. వైసీపీలో అత్యధికులు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. యార్లగడ్డ రాజీనామా, వల్లభనేని వంశీ బహిరంగంగా వ్యతిరేకిస్తూ నిర్ణయంపై పునరాలోచించాలని  జగన్ కు సూచించడం, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను ధిక్కరించి మరీ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఎన్టీఆర్  ఒక సామాజిక వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయనో మహానుభావుడు, యుగపురుషుడు. తెలుగు వాడిని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన వ్యక్తి. రాజకీయ నాయకుడిగా ఆయన సమాజిక వైద్యం చేశారు. ఆయన రాజకీయ ప్రవేశం వరకూ వెనుకబడి ఉన్న బీసీ వర్గాలు రాజకీయంగా ఉన్నత పదవులు అందుకోవడానికి సోపానమయ్యారు. మధ్య తరగతి జీవులకు బతుకు భరోసా అయ్యారు. పేదవారికి నోటికాడ అన్నం ముద్దగా మారారు. అందుకే రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కు అన్ని వర్గాలలోనూ అభిమానులున్నారు. దైవాంశ సంభూతుడిగా ఆరాధించే వారు కోకొల్లలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీకి మరణశాసనం రాసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల మాట పక్కన పెడితే ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం తరువాత జగన్ గ్రాఫ్, వైసీపీ గ్రాఫ్ గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిందంటున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలోనూ కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సటీ పేరు మార్పు అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటున్నారు. జగన్ ఆశించినట్లుగా సామాజిక వర్గాల వారీగా మద్దతు, వ్యతిరేకతగా విడిపోలేదనీ, జనం ముక్త కంఠంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనీ నిఘావర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించారని తెలుస్తోంది. ప్రధానంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నదని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జగన్ పార్టీ విజయం వెనుక ఈ జిల్లాలలో వీచిన అనుకూల పవనాలు ఉన్నాయనీ, ఇప్పుడవి వ్యతిరేక పవనాలుగా కాక వ్యతిరేక ప్రభంజనంలా మారే అవకాశం ఉందనీ నిఘావర్గాలు చెబుతున్నాయి. బీసీలను ఒక సామాజిక వర్గానికి దూరం చేయాలన్న దురాలోచనతో తీసుకున్న హెల్త్ వర్సిటీ మార్పు బూమరాంగ్ అయ్యిందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. బీసీలలోనే ఎక్కువగా ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం పట్ల ఆగ్రహం, వ్యతిరేకతా వ్యక్త మౌతోందంటున్నారు. ఇప్పుడు నష్ట నివారణ కోసం ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామంటూ వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించినా అది చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందమే అవుతోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 

సోనియా గాంధీ ఫిర్ ఏక్ బార్ ?!

అవును. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు సోనియా చెంతకు చేరుతుందా? మరోసారి, ఆమె ఆ బాధ్యతలను భుజానికి ఎత్తుకోక తప్పదా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న బహుముఖ సంక్షోభం వెనక పైకి కనిపించే కోణం ఒకటైతే, అంతర్గతంగా వినిపిస్తున్నకథనం మరోలా ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. పార్టీ పగ్గాలు కుటుంబేతరులకు అప్పగించేందుకు సోనియా గాంధీ ఎంత మాత్రం సుముఖంగా లేరు. అంతే కాదు, చివరకు ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఆమె మనసు అంగీకరించడం  లేదు. కూతురు మనమ్మాయే అయినా అల్లుడు మన వాడు కాదు, పైగా, అతగాడు మామూలోడు కూడా కాదు. నిజానికి, ఇప్పటికే పార్టీలో ఒక వర్గం వాద్రా కనుసన్నల్లో పనిచేస్తోందనే అనుమాన, భయాలు సోనియాను వెంటాడు తున్నాయి. అందుకే 2019లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సందర్భంగా, సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితిని సృష్టించి, తాత్కాలిక అనే ట్యాగ్ లైన్ తో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు అదే పద్దతిలోనే మరో మారు, అదే పరిస్థితి క్రియేట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని, పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి పార్టీ పగ్గాలు వదిలితే, ఇక మళ్ళీ పార్టీని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం అయ్యే పని కాదని సోనియా గాంధీ చాలా గట్టిగా నమ్ముతారనేది ఎవరూ కాదనలేని నిజం. నిజానికి, ఒక్క కాంగ్రెస్ అనే కాదు, ఏ కుటుంబ పార్టీ కూడా పార్టీ పగ్గాలు కుటుంబ వ్యక్తులకు అప్పగించరు. అలాంటిది  ఒకసారి పార్టీ పగ్గాలు వదిలితే ఎమౌవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసు కున్న సోనియా గాంధీ, అందుకు అసలే ఇష్టపడరని అంటున్నారు.  రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం తర్వాత, పీవీ నరసింహ రావు, సీతారాం కేసరికి పార్టీ ప్రభుత్వ పగ్గాలు వదిలేసిన సమయంలో ఎదురైన చేదు అనుభవాలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే 2019లో రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా గాంధీ కుటుంబం బయటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పట్టు పట్టినా ఆమె అది తమకు మోయలేని భారమే అయినా ఆ బరువు బాధ్యతలను నెత్తి కెత్తుకున్నారు. ఏదో ఒకనాటికి రాహుల్ గాంధీ మనసు మార్చుకుని పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఆశించారు. అయితే మూడేళ్లయినా, రాహుల్ తీరు మాలేదు. బాధ్యతలు లేని అధికారాలకు అలవాటు పడిన రాహుల్  పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇప్పటిలానే, ఎప్పటికీ ‘అధినాయకుడు’ గా ఉండి పోయేందుకే నిర్ణయించుకున్నారు.  ఈ నేపధ్యంలో విధేయుడు అనుకున్న అశోక్ గెహ్లాట్ ను, అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే ఎన్నికకు ముందే తిరుగుబాటు జెండా ఎగరేశారు. అఫ్కోర్స్, అది కూడా సోనియా స్క్రిప్ట్ లో భాగమనే వాదన మరొకటి ఉందనుకోండి అంది వేరే విషయం. గెహ్లాట్ తిరుగుబాటు, సోనియా  రాహుల్  స్క్రిప్ట్ ప్రకారం జరిగినా  గెహ్లాట్ స్వయంగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కథ నడిపినా, సోనియా గాంధీ మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించే  అవకాశం లేదని, అంతర్గత వర్గాల వర్గాల సమాచారం.అందుకే మళ్ళీ మరోమారు రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే  రాగాలు మొదలయ్యాయని అంటున్నారు. అలాగే కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, ఏకే అంటోనీ, ముకుల్ వాస్నిక్, ఖర్గే వంటి మరికొందరు ‘విధేయుల’ పేర్లు ప్రచారం లోకి వచ్చినా, చివరకు రాహుల్ గాంధీ అంగీకరించని పక్షంలో మళ్ళీ  ఫిర్ ఏక బార్ సోనియానే పార్టీ చీఫ్ అంటున్నారు.  అయితే ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇది ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు శుభం కార్డు ఎప్పుడు, ఎలా పడుతుందో ... చూడవలసిందే అంటున్నారు.

ఐరాస భార‌త్ శాశ్వ‌త స‌భ్య‌త్వానికి లంక మ‌ద్ద‌తు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం కల్పించేందుకు శ్రీలంక మద్దతు తెలి పింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అధ్యక్షుడు విక్రమసింఘే ప్రస్తు తం జపాన్‌లో ఉన్నారు. మంగళవారం జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషితో జరిగిన సమావేశంలో, విక్రమసింఘే అంతర్జాతీయ వేదికపై జపాన్ శ్రీలంక అందించిన మద్దతును ప్రశంసించారు యుఎన్ భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం కోసం జపాన్ మరియు భారతదేశం చేస్తున్న ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి ప్రభు త్వ సుముఖతను వ్యక్తం చేశార‌ని  రాష్ట్రపతి కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 21వ శతాబ్దపు భౌగోళిక-రాజకీయ వాస్తవికతలకు ప్రాతినిధ్యం వహించని యుఎన్‌లో శాశ్వత సభ్యునిగా స్థానానికి తగిన అర్హత ఉందని చెబుతూ భద్రతా మండలిని సంస్కరించడానికి భారతదేశం సంవత్సరా ల తరబడి చేస్తున్న ప్రయత్నాలలో ముందంజలో ఉంది. ప్రస్తుతం, యుఎన్ ఎస్‌సీ ఐదు శాశ్వత సభ్యు లు ప‌ది శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి, ఇవి ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలా నికి ఎన్నుకోబడతాయి. ఐదు శాశ్వత సభ్యులు రష్యా, యుకె, చైనా, ఫ్రాన్స్, యుఎస్  ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేయ గలవు. సమకాలీన ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించేలా శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎన్నుకోబడిన నాన్-పర్మనెంట్ మెంబర్‌ గా భారతదేశం తన రెండేళ్ల పదవీ కాలం యొక్క రెండవ సంవత్సరంలో ప్రస్తుతం సగంలో ఉంది. కౌన్సిల్లో భారతదేశ పదవీకాలం డిసెంబర్‌లో ముగుస్తుంది, ఆ నెలలో దేశం శక్తివంతమైన యుఎన్ విభాగానికి  అధ్యక్షుడిగా కూడా అధ్యక్షత వహిస్తుంది. శనివారం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, యుఎన్ జనరల్ అసెంబ్లీ 77వ సద‌స్సు  సాధారణ చర్చలో ప్రసంగిస్తూ, భారతదేశం గొప్ప బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. సంస్క రించబడిన బహుపాక్షికత కోసం పిలుపు - భద్రతా మండలి యొక్క సంస్కరణలతో దాని ప్రధాన భాగం  యుఎన్‌ సభ్యులలో గణనీయమైన మద్దతును పొందుతుంది, అతను చెప్పాడు. ప్రస్తుత నిర్మాణం కాలానుగుణంగా, అసమర్థంగా ఉందని విస్తృతంగా గుర్తించినందున ఇది అలా చేస్తుం ది. ఇది చాలా అన్యాయంగా భావించబడుతుంది, మొత్తం ఖండాలు, ప్రాంతాలు, వారి భవిష్యత్తును చర్చించే ఫోరమ్‌లో వాయిస్‌ని తిరస్కరించింది" అని ఎస్ జైశంకర్ చెప్పారు. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి అందించే సదుపాయాన్ని పొందేందుకు ద్వీపం  బిడ్ కు కీలకమైన శ్రీలంక రుణ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించడానికి జపాన్ సుముఖత వ్యక్తం చేసి న ట్లు అధ్యక్షుడు విక్రమసింఘే కార్యాలయం తెలిపింది. రుణ పునర్వ్యవస్థీకరణకు షరతులతో కూడిన శ్రీలంకతో సిబ్బంది స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఐఎంఎఫ్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఏప్రిల్ మధ్యలో, ఫారెక్స్ సంక్షోభం కారణంగా శ్రీలంక అంతర్జాతీయ రుణ ఎగవేతని ప్రకటించింది. దేశం 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది, అందులో 28 బిలియన్ డాలర్లు 2027 నాటికి చెల్లించాలి. ఐఎంఎఫ్‌ రుణాలు భరించలేని దేశాలకు రుణాలు ఇవ్వదు, శ్రీలంక ముందస్తుగా సమగ్ర రుణ చికిత్సను చేపట్టాలి. చైనా ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడిబి)తో పాటు భారత్‌, జపాన్ రెండూ  శ్రీలంకకు ప్రధాన రుణదాతలు. శ్రీలంక తన తరపున రుణ పునర్నిర్మాణ సదస్సును నిర్వహించడానికి జపాన్‌తో బ్యాంకింగ్ చేస్తోంది. శ్రీలంకలో ఆగిపోయిన జపాన్ ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని విక్రమ సింఘే సూచించినట్లు అధికారులు తెలిపారు.

టిక్కెట్ మీద మ్యాచ్ టైమ్ త‌ప్పు.. హెచ్‌సిఏ పై కేసు న‌మోదు

భారత్- ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట ర్నేషనల్ స్టేడియంలో జరిగింది. సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగిన టిక్కెట్ల  అమ్మ కంలో జ‌రిగిన త‌ప్పిదాలు, తొక్కిస‌లాట‌ల విష‌యంలో ఇపుడు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సి ఏ) పై కేసు న‌మోద‌యింది. మ్యాచ్ ఏడింటికి మొద‌ల‌యింది. కానీ టిక్కెట్‌మీద మాత్రం మ్యాచ్ 7.30కి ప్రారంభ‌మ వుతుంద‌ని ముద్రించారు. దీనిపై ఆగ్ర‌హించిన ఒక యువ‌కుడు బేగంపేట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు.  ఎంతో కాలం త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్‌కి పెద్ద సంఖ్య‌లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తి చూపి టికెట్ల‌కు ఎగ‌బ‌డ్డారు. ముందు ఆన్‌లైన్ లో అమ్మ‌కాలు అన్నారు. త‌ర్వాత విడిగా కూడా అమ్మ‌కాలు ఉన్నాయ న్నా రు. ఆన్‌లైన్‌లో కేవ‌లం గంట‌సేప‌ట్లోనే టిక్కెట్లు అమ్మ‌కాలు అయ్యాయ‌ని వార్త‌లు రావ‌డంతో క్రికెట్ అభి మానులు ఆగ్ర‌హించారు. త‌ర్వాత  అందులో స‌గ‌మే అయ్య‌య‌ని  త‌ర్వాత విడిగా అమ్మ‌కాలు  చేప‌ట్టారు. అయితే  ఇందులో కూడా  పొర‌పాట్లు జ‌రిగాయి.  టికెట్ల సమయంలో జరిగిన తొక్కిసలాటపై ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. తాజా ఫిర్యాదుతో హెచ్‌సీఏపై మొత్తం నాలుగు కేసులు నమో దు అయ్యాయి. టిక్క‌ట్ల‌మీద మ్యాచ్ స‌మ యం గురించి కూడా పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. టిక్కెట్ల స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస లాట లో చాలామంది గాయ‌ప‌డ్డారు. హెచ్‌సిఏ టిక్కెట్ల విక్ర‌యానికి త‌గిన ఏర్పాట్లు చేయ‌లేద‌ని, నియం త్రణా లోపాలున్నాయ‌ని చాలామంది ఇప్పటికీ మండిప‌డుతున్నారు. 

పీఎఫ్ఐ పై ఐదేళ్ల బ్యాన్

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాపై  కేంద్రం నిషేధం విధించింది.   పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలను కూడా ఐదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం తక్షణమే అమలులోనికి వస్తుంది. పీఎఫ్ ఐ, దాని అనుబంధ సంస్థలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఐపై దేశంలో ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల పీఎఫ్ఐపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఈడీ వరుసదాడులు నిర్వహించిన సంగతి విదితమే. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తోందన్న ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. ఈ నెల 22న, మళ్లీ 27(మంగళవారం) దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ దాదాపు 300 మందిని అరెస్టు చేసింది. యూపీ, గుజరాత్, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్ళలో జరిపిన సోదాలలో పలు కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశంలో ప్రముఖుల హత్యకు, రాష్ట్రాలలో హింసాత్మక ఘటనలకు పీఎఫ్ఐ కుట్రపన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలైన రిహబ్‌ ఇండి ఫౌండేషన్‌, క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌, నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌, రిహబ్‌ ఫౌండేషన్‌ కేరళపై ఐదేండ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  దేశంలో హింస‌కు పీఎఫ్ఐ కుట్రపన్నిందని  బ‌య‌ట ప‌డింది. ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలో భారీ పేలుళ్లు చేపట్ట‌డానికి పీఎఫ్ ఐ కుట్ర ప‌న్నిందని ఎన్ఐఏ పేర్కొంది.   ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన సంగ‌తి తెలిసిన కొద్ది రోజు ల‌కే బీజే పీ ఆర్ ఎస్ ఎస్ నేత‌లే ల‌క్ష్యంగా వ్యూహ ర‌చ‌న జ‌రిగిన‌ట్టు తెలిపింది. నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించింద‌నీ, నవరాత్రి ఉత్సవాల్లో భారీ కుట్రకు ప్లాన్ చేసిందనీ,  పీఎఫ్ఐ హిట్‌ లిస్టులో దర్యాప్తు సంస్థ అధికారులు సైతం ఉందనీ ఎన్ఐఏ పేర్కొంది.

మరో మూడు రోజులు వానలే వానలు! నగరవాసులకు నరకయాతన తప్పదా?

తెలంగాణలో మరోమూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే గత రెండు రోజులుగా (సోమ, మంగళ వారాలు) కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన సంగతి విదితమే. ఇప్పుడు మరో మూడు రోజులు(బుధ, గురు, శుక్ర) వారాలలో భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. ఇలా ఉండగా వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచామని పేర్కొంది. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఇలా ఉండగా వర్షసూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఉండగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు ఇక్కట్లు పడ్డారు. లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, ట్రూప్ బజార్, నాంపల్లి  తదితర ప్రాంతాల్లో భారీ కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సోమవారం కూడా నగరంలో భారీ వర్షం కురిసన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జనం ఆందోళనకు గురౌతున్నారు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి కేకే రాజీనామా.. కారణమదేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపించారు. అంతకు ముందే తన నిర్ణయాన్ని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు తెలియజేశారు. రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నప్పటికీ కేకే రాజీనామాకు కేంద్రం తీరు పట్ల అసంతృప్తే కారణమని అంటున్నారు. మీడియా పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆయనీ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తన రాజీనామాతో తన అసంతృప్తిని, అసమ్మతినీ తెలియజేశారని అంటున్నారు. తన రాజీనామాకు ఎలాంటి రాజకీయ కారణాలు లేవని కేకే చెప్పినప్పటికీ  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఏకపక్ష విధానాలకు నిరసనగానే   ఆయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని వదులుకున్నారని చెబుతున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిస్థితి పేరుగొప్ప-ఊరుదిబ్బగా మారిపోయిందన్న భావన ఆయన పలు సందర్భాలలో తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారంటున్నారు. ప్రెస్ కౌన్సిల్    ప్రతిపాదనలు,సిఫారసులను గానీ కేంద్ర ప్రభుత్వం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే కేకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేకే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా  పెయిడ్ న్యూస్‌పై ముఖ్య‌మైన అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించిన సంగతి విదితమే. మీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగానే కేకే ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు

అధ్యక్ష రేసు నుంచి గెహ్లాట్ ఔట్.. రాహుల్ వైపే అందరి చూపు!

కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది.  పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం బయటి వ్యక్తులకు అప్పగిస్తే ఏం జరుగుతుందన్నదానికి గెహ్లాట్ ఎపిసోడ్ ఒక ట్రయిలర్ మాత్రమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. గెహ్లాట్ ఉదంతంతోనైనా రాహుల్ గాంధీ అధ్యక్ష పగ్గాలు అందుకోవాలని ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఆరంభమై నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతున్న  పార్టీకి వీరవిధేయుడిగా ఇంత కాలం భావించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తిరుగుబావుటా ఎగురవేశారు. రాజస్ధాన్ సీఎంగా తన విధేయుడిని నియమించి తీరాల్సిందేనని భీష్మించారు. తన వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటూ బెదరించేలా వారిని ప్రోత్సహించారు. ఇదంతా తనకు తెలియకుండా జరిగిందని గెహ్లాట్ బుకాయిస్తున్నా ఆయన మాటలను అధిష్ఠానం నమ్మడం లేదు. సీఎంకు తెలియకుండా ఎమ్మెల్యేలు, అదీ ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఇంత సీన్ క్రియేట్ చేయలేరంటున్నారు.  దీంతో అశోక్‌ గహ్లోత్‌పై అధిష్ఠానం కన్నెర్రజేసింది.   రాజస్థాన్‌ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం తీవ్రరూపం దాల్చడానికి కారణమైన గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా   అవకాశం ఇవ్వకూడదని  నిర్ణయించింది. వాస్తవానికి ఆయన బుధవారం(సెప్టెంబర్28) పార్టీ అధ్యక్ష  ఎన్నికకు నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే  రాజస్థాన్ లో సంక్షోభం కొలిక్కి వచ్చాకే నామినేషన్‌ వేయాలని అధిష్ఠానం ఆదేశించడంతో ఆయన నామినేషన్ కార్యక్రమం వాయిదా పడింది. నిజానికి అనూహ్యంగా ఆయన ధిక్కారం   సోనియాగాంధీ,  రాహుల్‌గాంధీలకు ఊహించిన ఎదురుదెబ్బగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  సరిగ్గా మూడు రోజుల కిందట గెహ్లాట్   కోచిలో రాహుల్‌ గాంధీని కలిశారు. ఆయనతో  కలిసి  భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పట్ల తన విధేయతను ప్రదర్శించారు. అంతకు ముందు సోనియాగాంధీతో కూడా భేటీ అయ్యారు. ఆమె ఆదేశాల మేరకే రాజస్థాన్ సీఎం పదవిని వదులుకుని పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతానని మాటిచ్చారు. కానీ తిరిగి జైపూర్ వెళ్లిన వెంటనే ఆయన తన తిరుగుబావుటా ఎగురవేశారు. తన వర్గం ఎమ్మెల్యేలను అధిష్ఠానంపైకి ఉసిగొల్పి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికే కాకుండా అధ్యక్ష ఎన్నిక ముందు పార్టీలో కూడా సంక్షోభం ఏర్పడేందుకు కారణమయ్యారు. ఇప్పుడు ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేస్తే అసలుకే మోసం వస్తుందని పార్టీ హై కమాండ్ భావిస్తోంది. అలాగే సీడబ్ల్యుసీ కూడా పార్టీ అధ్యక్ష పదవికి ఆయన వద్దని సూచిస్తోంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ మరో విధేయ నేత కోసం గాలిస్తోంది. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ఆదివారం జరగాల్సిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం రద్దైంది.  తదుపరి సీఎంను నియమించే అధికారాన్ని సోనియాగాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేయాలన్న అధిష్ఠానం  ఆదేదాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు తిరస్కరించారు. గెహ్లాట్ వర్గీయులైన 83 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో సీఎల్పీ జరగలేదు. అయితే ఎమ్మెల్యేలు రాలేదు.  మాజీ ఉపముఖ్యమంత్రి, తమ ప్రత్యర్థి సచిన్‌ పైలట్‌ను సీఎంగా నియమిస్తామంటే అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. తమలో ఎవరో ఒకరిని సీఎం చేయాలని కండీషన్ పెట్టారు. అదే రోజు అంటే ఆదివారం(సెప్టెంబర్ 26)  అర్ధరాత్రి దాటాకా స్పీకర్‌ సీపీ జోషీ నివాసానికి వెళ్లి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలు సమర్పించారు. రాజీనామాలు సమర్పించిన 83 మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యేందుకు పరిశీలకులుగా వచ్చిన అధిష్టానం దూతలను మాకెన్‌, ఖర్గే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత సీఎం వర్గంలో కీలకమైన ఎమ్మెల్యేలు ప్రతా్‌పసింగ్‌ కచరియవాస్‌, మహేశ్‌ జోషీ, మంత్రి శాంతి ధరివాల్‌లు మకేన్, ఖర్గేలను సోమవారం (సెప్టెంబర్ 27) కలిశారు. సంక్షోభ పరిష్కారానికి వారు మూడు డిమాండ్లు చేశారు.  వాటిలో ప్రధానమైనది గెహ్లాట్ కు విధేయులుగా  ఉన్న తమలో నుంచే ఎవరినో ఒకరిని   సీఎంను ఎంపిక చేయాలన్నది. వారి డిమాండ్లను అధినేత్రి సోనియాకు నివేదిస్తామనీ, ఆమె నిర్ణయం తీసుకుంటారని అజయ్‌ మాకెన్‌ మీడియా సమావేశంలో తెలిపారు. ఆ వెంటనే మకేన్, ఖర్గేలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ సోనియాతో భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ను సోనియా ఢిల్లీ పిలిపించి సంక్షోభ నివారణ బాధ్యతలు అప్పగించారు.  రాజస్థాన్ సీఎంగా   పైలట్‌ అంగీకరించేలా గెహ్లాట్ వర్గీయులను ఒప్పించాలని సోనియా కమల్ నాథ్ కు చెప్పారు. ఇలా ఉండగా    ఎమ్మెల్యేలను రెచ్చగొట్టిన గెహ్లాట్ మాత్రం వారి తిరుగుబాటుతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.  సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు రాకపోవడం సరికాదని అంటున్నారు.  తాజా సంక్షోభానికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే పార్టీ మాత్రం ఆయనదంతా డ్రామా అని భావిస్తోంది.  సీఎం అండ లేకుండా ఎమ్మెల్యేలు ఇంత రచ్చ చేయరని అంటోంది. ఓ వైపు  భారత్‌ జోడో యాత్ర జయప్రదంగా సాగుతూ కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపుతుంటే మరో పక్క  కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాము స్వయంగా ఎంపిక చేసి నిలబెడదామనుకున్న నేతే ధిక్కార స్వరం వినిపించడం పట్ల పార్టీలో ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం చేతులు దాటితే పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందనడానికి ఇదే తార్కానమని అంటున్నాయి. ఆ పరిస్థితి రాకుండా నివారించడానికి  అధ్యక్షుడిగా తాము ఎంపిక చేయాలనుకున్న నాయకుడే ధిక్కార వైఖరి అవలంబించడంపై వారు ఆగ్రహంతో ఉన్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబం చేతిలో పార్టీ పగ్గాలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి రాజస్థాన్‌ పరిణామాలే తార్కాణమని.. అందుచేత ఇకనైనా మనసు మార్చుకుని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న ఒత్తిడి రాహుల్ పై పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒక దశలో పార్టీ అధ్యక్షుడిగా కమల్ నాథ్ ను పోటీలోకి దించాలని సోనియా భావించినా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదంటున్నారు. గాంధీ కుటుంబం బయటి వ్యక్తులు పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకుంటే ముందు ముందు కాంగ్రెస్ లో ఇటువంటి సంక్షోభాలు మరిన్ని సంభవించే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఐక్యంగా ఉండాలన్నా, మరింత బలోపేతమై, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి దీటుగా నిలవాలన్నా రాహుల్ గాంధీ తన పంతం వీడి పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకోవాలని కోరుతున్నారు.