స‌మాజ్ వాదీ పార్టీకి  ఇక‌ క‌ఠిన ప‌రీక్షనే?

దేశ రాజ‌కీయ కుటుంబాల్లో పెద్ద‌దిగా పేర్కొనే కుటుంబ పెద్ద ములాయం సింగ్ యాద‌వ్‌. పైకి  ఎంతో స్నేహపూర్వ‌కంగా క‌నిపిస్తూనే క‌ఠిన నిర్ణ‌యాల‌తో ముందుకు న‌డిపించే స‌త్తా ఉన్న నాయ‌క‌త్వం ఆయ‌న ది. 36 సంవ‌త్స‌రాలు పాటు విక్ర‌మాదిత్య‌మార్గ్‌లో  వైట్ హౌస్ అని పార్టీ అభిమానులు పిలిచే విశాల‌మైన భ‌వంతిలో ఆయ‌న నిత్యం పార్టీ వారితో స‌మావేశ‌మ‌వుతూండేవారు. లోప‌ల రామ్‌సేవక్ యాద‌వ్‌, లోహి యా, మ‌ధు లిమాయే, చంద్ర‌శేఖ‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌, రాజ్‌నారాయ‌ణ్‌, జానేశ్వ‌ర్ మిశ్రా వంటి హేమాహేమీల ఫోటోలే క‌న‌ప‌డ‌తాయి. ఈ వ‌రుస‌లో అంత‌టి స్థాయిలో దేశంలో మ‌న్న‌న‌లు అందు కున్న నాయ‌కుడు ములాయం. మూడు ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రిగా చేసి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌వాదీ పార్టీకి తిరుగులేని చ‌రిత్ర‌ను సృష్టించ‌డంలో ములాయంసింగ్ యాద‌వ్ రాజ‌కీయ‌రంగంలో పార్టీల‌కు అతీతంగా అంద‌రి ఆద‌రాభిమానాలు పొందారు. ములాయం మరణంతో అఖిలేష్ తన తండ్రిని, ఎస్పీ దాని నాయకు డిని కోల్పోయారు. ఇక స‌వాళ్ల‌ను ధాటిగా ఎదుర్కొ నేందుకు మ‌రింత సిద్ధ‌ప‌డాలి. 1982లో ఫైర్‌బ్రాండ్ రాజ‌కీయ‌నాయ‌కునిగా తెర‌మీద‌కి వ‌చ్చి ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో త‌న ప్ర‌త్యేక ముద్ర వేశారు. 2018లో మాజీ ముఖ్య‌మంత్రులు త‌మ అధ‌కార నివాసాలు వ‌దిలేయాల‌ని తీర్పు ఇవ్వ‌ డంతో ములాయం విక్ర‌మాదిత్య‌మార్గ్ కు దూర‌మ‌య్యారు. అప్ప‌టి నుంచి ఆ బంగ్లా ఖాళీగానే ఉంది. ఇక్క‌డి నుంచే 1989లో అజిత్ సింగ్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయ యుద్ధం చేశారు. అప్ప‌ట్లో ప్ర‌ధాని వీ.పీ.సింగ్ అజిత్ కు ఎంతో మ‌ద్ద‌తునిచ్చారు. 1990లో పోలీసులు క‌ర‌సేవ‌కుల‌పై దాడులు చేయ‌డం జ‌రిగింది. ఆ సంఘ‌ట న తో ఆయ‌న మౌనం వ‌హించారు. 1992 అక్టోబ‌ర్ 4న ములాయం ఇక్క‌డి నుంచే స‌మాజ్ వాదీపార్టీ ఆరం భించారు. మ‌రు సంవ‌త్స‌ర‌మే ఆయ‌న  మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ ఈ ప‌ర్యాయం త‌న పార్టీ త‌ర‌ఫునే బహుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీ ఎస్‌పి) మ‌ద్ద‌తుతో పీఠం అధి ష్టించారు. 1995లో రెండు పార్టీలు వీడి పోయి తీవ్ర‌స్థాయిలో విభేదించుకున్నా, ములాయం మాత్రం అధి కారంలో ఉండ‌గ‌లిగారు. అంతేకాదు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను త‌న చుట్టూ రెండు ద‌శా బ్దాలు తిరిగేట్టు చేయ‌ గ‌లిగారు.  అలాగే, 1996లో లోక్‌స‌భ‌కు మొద‌టిసారిగా ఎన్నిక‌యిన వెంట‌నే కేంద్రంలో ర‌క్ష‌ణ మంత్రి గానూ ప‌దవి చేప‌ట్ట‌డంతో ఎస్ పి పార్టీ ప్రాంతీయ‌త నుంచీ జాతీయ స్థాయిలో కీల‌క‌పాత్ర వ‌హించే స్థాయికి గుర్తింపు తెచ్చుకుంది. 2012లో యుపి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ గెలిచిన‌ప్ప‌టికీ ములాయం మాత్రం త‌మ్ముడు శివ‌పాల్ యాద‌వ్ అడ్డుకుంటాడ‌ని తెలిసినా,  త‌న కుమారుడు అఖిలేష్ కు రాజ‌కీయ వారస త్వాన్ని అం దించారు ములాయం. వాస్త‌వానికి త‌న కుమారుడికి అధికారం పూర్తిగా అందించే వ‌ర‌కూ త‌మ్ముడి రాజకీయ ఎత్తుగ‌డ‌ల‌నుంచీ కాపాడుతూ వ‌చ్చారు. క్ర‌మేపీ కుటుంబంలో శివ‌పాల్‌, అఖిలేష్ విభేదాల‌తో కు టుంబం రాజ‌కీయ ప‌టం మీద స‌త్తువ త‌గ్గింది. దీంతో మోదీ సార‌ధ్యంలో బీజేపీ యుపీలో విజృంభించింది. ఫ‌లితంగా రాష్ట్రంలో ఎస్‌.పీ పార్టీ రెండు ప‌ర్యాయాలు భారీ ఓట్ల తేడాతో  ఓడి పోయింది.  ఇక ఇపు డు పార్టీ మ‌రింత స‌మ‌స్య‌ను ఎదుర్కొనే అవ‌కాశ‌మూ ఉంది.   ఇన్నాళ్లూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జాతీయ రాజ‌కీయాల్లోనూ చక్రం తిప్పిన స‌మాజ్ వాదీ పార్టీ ములాయంసింగ్ (82)  మ‌ర‌ణంతో స‌మ‌స్య‌ల్ని ఎద‌ర్కొన వ‌ల‌సిన ప‌రిస్థితుల్లో నిలిచింది. 2013లో ఒక‌సారి అఖిలేష్ త‌న రాజకీయ ఎదుగుద‌ల గురించి మాట్లాడు తూ, గురువును వెనుక నుంచి గ‌మ‌నిస్తూనే ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అన్నారు. ములాయం సింగ్ తో తండ్రిగా, రాజ‌కీయ గురువుగారూ  అఖిలేష్  గొప్ప అనుబంధంతో ఉన్నారు. కానీ త‌న కుమారుడు రాజ‌కీయాల్లో త‌ల‌మున‌క‌లై ఉండ‌డంతో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌లేక పోయాన‌ని ములాయం కూడా అన్నారు.  రెండోత‌రం నాయ‌కుడ‌యిన అఖిలేష్‌కీ రాజ‌కీయాలు  అంత సులువుగా సాగిపోయేంత‌టివి కావు. త‌న రాజ‌కీయ‌జీవితం అంతా రోల‌ర్ కోస్ట‌ర్ వంటిద‌ని ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటున్నానని,  తొలినాళ్ల‌లో రాష్ట్రంలో ఉన్న‌త‌వ‌ర్గాల ఆధిప‌త్యంతో ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాన‌ని, తాను వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తు ల‌కు చెందిన‌వాడిని క‌నుక రాజకీయంగా ఎన్న‌డూ మ‌ద్ద‌తు లేదని 1990ల్లో ఒక‌సారి ములాయం మీడియా తో మాట్లాడుతూ అన్నారు. అయితే 2012లో త‌న కుమారుడు అఖిలేష్‌కు త‌న రాజ‌కీయ‌వార‌స‌త్వాన్ని అంద‌జేస్తూ, ముఖ్య‌మంత్రి తండ్రిగా ఎంతో  గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని అన్నారు.  ఇక ఇప్పుడు పార్టీ అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌స్తుంది. ములాయం మృతితో  రాష్ట్రంలో మారు మూ ల గ్రామాల‌కు పార్టీతో  ఉన్న‌సంబంధాలు దెబ్బ‌తినే అవ‌కాశాలున్నాయి. ములాయం, ఆయ‌న పార్టీని  ఇప్పటివ‌ర‌కూ బీజేపీ ఆగ‌డాల‌ను ఎదుర్కొన‌గ‌లిగిన గ‌ట్టి శ‌క్తిగా  విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రజాదరణను సృష్టించేందుకు కుల ఆధారిత వ్యాప్తితో మతపరమైన సమీకరణ ను కలిపిన బిజెపి బలీయమైన రాజకీయ యంత్రాంగా నికి పార్టీ వ్యతిరేకంగా ఉంది. అంతే కాకుండా, పార్టీ కొన్ని వర్గాల కోసం మాత్రమే పనిచేస్తుందనే భావనను తొలగిం చడానికి పోరాడుతోంది, పోషకాహార నెట్ వర్క్ లపై దృష్టి పెడుతుంది. అందరికీ అభివృద్ధిని చేర్చడానికి దాని పాత తరహా కుల రాజకీయాలను తిరిగి ఊహించలేము. లక్నో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మనోజ్ దీక్షిత్  ఇలా అన్నారు.. ఎస్పీ తన బ్రాండ్ ములాయం ను కోల్పోవడంతో బాధ తప్పదు. పార్టీలోని  ప్రతి  అంగుళాన్ని ఆయనే నిర్మించారు. ఇప్పుడు, విధే యు లు, కుటుంబంతో  సహా చాలా మంది  విడిపోతారు.  కానీ అప్పుడు, పార్టీ కొత్త రూపు దాలుస్తుంది, అఖి లేష్ తర్వాత  21వ శతాబ్దపు పార్టీ  దాని పూర్తి నియంత్రణను పొందుతుంద‌ని ఆయన అన్నారు. ములాయం మరణంతో అఖిలేష్ తన తండ్రిని, ఎస్పీ దాని నాయకు డిని కోల్పోయారు. ఇక స‌వాళ్ల‌ను ధాటిగా ఎదుర్కొ నేందుకు మ‌రింత సిద్ధ‌ప‌డాలి. మ‌రీ ముఖ్యంగా ఎస్‌పి కి చాలాకాలం నుంచీ పెట్ట‌ని కోట‌గా ఉన్న మ‌ణి పూర్‌, క‌నోజ్‌, సంబ‌ల్ వంటి  నియోజ‌క వ‌ర్గాల్లో పార్టీ ప‌ట్టు త‌ప్పిపోకుండా కాపాడుకోవా ల్సిన బరువు బాధ్య త అఖిలేష్ ఏ మేర‌కు స్వీక‌రిస్తారని, విప‌క్షాలు, ప్ర‌త్య‌ర్ధుల నుంచి స‌వాళ్ల‌ను ఏమేర‌కు ఎదుర్కొన‌గ‌ల్గు తార‌న్న‌ది చూడాలి. 

ఆత్మగౌరవానికి... అహంకారానికి మధ్య పోటీ మునుగోడు ఉప ఎన్నిక!

మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మునుగోడు ఉప ఎన్నికను నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికీ, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అహంకారానికీ మధ్య జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు. విశేషమేమిటంటే ఇప్పటిదాకా తెలంగాణ ఆత్మగౌరవం అన్న పదాన్ని గుత్తాధిపత్యంగా అట్టే పెట్టుకున్న తెరాస ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని వదిలేసి జాతీయ నినాదాన్ని ఎత్తుకుంది. అయినా అలవాటులో పొరపాటు అన్నట్లుగా కేటీఆర్ మాత్రం మునుగోడు ప్రజల ఆత్మగౌరవం అన్న నినాదాన్నిఎత్తుకున్నారు. అయితే ప్రత్యర్థి అయిన కమలం పార్టీ మాత్రం ఈ సారి జాతీయ నినాదాన్ని, జాతీయ వాదాన్ని ప్రస్తావించకుండా మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తీసుకువచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గతఎనిమిదేళ్లుగా తెరాస అధినేత కేసీఆర్ కాలరాసారని, అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శిస్తుంటే... మంత్రి కేటీఆర్ మాత్రం మునుగోడు ఉప ఎన్నికకు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అహంకారము, బీజేపీ అధికార దాహమే కారణమని దుయ్యబడుతున్నారు. ఎవరికీ అవసరం లేని, ఎవరికీ అక్కర్లేని ఉప ఎన్నికను బీజేపీ బలవంతంగా ప్రజల మీద రుద్దిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బలప్రదర్శన కోసమా అన్నట్లుగా బీజేపీ రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు తెరతీసిందని ఆరోపించిన కేటీఆర్, బీజేపీకి, రాజగోపాలరెడ్డికి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.  వేలకోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన ధనబలంతో జనాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లుగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఈరోజు ఉప ఎన్నికలు తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలానికి మునుగోడు ప్రజల జన బలం కి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని కేటీఆర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ధన దాహం, వేల కోట్ల రూపాయల ఆయన కాంట్రాక్టుల కోసమే వచ్చిన ఎన్నిక ఇదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యేగా అభివర్ణించారు. నియోజకవర్గ అభివృద్దిని, ప్రజల కష్ట సుఖాల పట్టింపు లేకుండా  తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారిగా  రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అభివర్ణించారు. నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల   రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.   వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరారని విమర్శించిన కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి ధన దాహంతోనే ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దారన్నారు.   బీజేపీ ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమీషన్ పైసలతో బైకులు, కార్లుతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.   చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బిజెపికి రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు.  

శాఖాహార మొసలి తనువు చాలించింది!

సృష్ఠిలో హేతువుకు ఇంకా అందని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటికి కారణాలేమిటన్నవిషయంలో అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. అదిగో అలాంటి విశేషం, వింతే మాంసం ముట్టని మొసలి. నిజమే  కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయం కోనేరులో ఉన్న మొసలి మాంసం ముట్టదు. అది పూర్తిగా శాఖాహారి. దాని పేరు పబియా. భక్తులు కోనేరులో స్నానాలు చేస్తున్నప్పుడు వారి వద్దకు వచ్చే ఆ మొసలిని చూసి వారెవ్వరూ భయపడరు. ఎందుకంటే అది  వారికి ఎలాంటి హానీ చేయదని వారికి తెలుసు కనుక.  అంతే కాదు.. క్రమం  తప్పకుండా ఆలయంలో  పూజ సమయంతో ఆ మొసలి  చెరువులోంచి బయటకు వచ్చి గుడిలో  స్వామి వారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని  తిరిగి చెరువులోకి వెఢుతుంది. జీవితాంతం ఆ మొసలి ప్రసాదం తినే బతికింది. కనీసం చెరువులో ఉన్న చేపలను కూడా అది ఎన్నడూ ముట్టలేదు. అందుకే ఆ మొసలి పబియా శాఖాహార మొసలిగా గుర్తింపు పొందింది. ఎంతో భక్తితో నైవేద్య సమయానికి దేవాలయంలోకి చేరి  స్వామివారి దర్శనం చేసుకుని నైవేద్యం స్వీకరించి, మరలా కోనేరులోకి పయనించే ఆ మొసలిని గుడిలో పూజారులూ, గుడికి వచ్చే భక్తులూ కూడా ఎంతో ప్రేమగా, బక్తిగా చూసుకుంటారు. అయితే ఆ శాఖాహార మొసలి సోమవారం (అక్టోబర్ 10) తెల్లవారు జామున మరణించింది.  పబియా మరణం పట్ల పూజారులూ, స్థానికులూ, భక్తులూ కూడా ఎంతో బాధపడ్డారు.  ఆ మొసలికి దేవస్థానం అధికారులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. 

 సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక ఎందుకు  ఆగింది?

కేంద్ర ప్రభుత్వం తదుపరి ప్రధాన న్యాయమూర్తి నామినేషన్‌ను ప్రారంభించడంతో సుప్రీంకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. అంతకుముందు, ఈ నియామకాలపై నిర్ణ యం తీసుకునే కొలీజియంలోని ఐదుగురు న్యాయమూర్తులలో ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా సమావేశమై తుది నిర్ణయాలు తీసుకోలేని లేఖలను ఉపయోగించి ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళుతున్నా రని అభ్యంతరం వ్యక్తం చేశారు. గత నెలలో ఒక అపాయింట్‌మెంట్ ఓకే కాగా, మరో నలుగురిని నియ మించే అసంపూర్తిగా ఉన్న పని ఇప్పుడు మూసివేయబడిందని  కొలీజియం తాజా తీర్మానం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని కొలీజియంలో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు సభ్యులుగా ఉన్నారు, వీరిలో జస్టిస్ డివై చంద్రచూడ్ - సిజెఐగా తదుపరి వరుసలో ఉన్నారు . జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో విభేదించారు. సెప్టెం బరు 26న అధికారిక సమావేశం జరగడానికి ముందు “కొంత కాలంగా అనధికారిక చర్చలు జరుగుతున్నా యి, అక్కడ పదకొండు మంది పేర్లు పరిశీలించబడ్డాయని అక్టోబర్ 9  నాటి  ముగింపు తీర్మానం పేర్కొంది. సెప్టెంబరు 26న జరిగిన సమావేశంలో, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  దీపాంకర్  దత్తాను సుప్రీం కోర్టు కు ఎన్నుకోవడంపై  ఏకగ్రీవ అభిప్రాయం వచ్చింది”, కాబట్టి “ఆ మేరకు ఒక తీర్మానం ఆమోదించ బడింది. మిగిలిన 10 మంది న్యాయమూర్తుల పేర్ల పరిశీలన సెప్టెంబర్‌కు వాయిదా పడింది.  ఎందుకంటే కొంతమంది కొలీజియం సభ్యులు నిర్ణయం తీసుకునే ముందు ఇతర అభ్యర్థులపై మరిన్ని తీర్పులను కోరింది. దీంతో సమావేశం సెప్టెంబరు 30కి వాయిదా పడి మరిన్ని తీర్పులు వెలువడ్డాయని తాజా తీర్మానం పేర్కొంది. ముఖ్యంగా, సెప్టెంబర్ 26 మొదటి సారి గత తీర్పులను  ఒక ఆబ్జెక్టివ్ అసెస్ మెంట్ మేకింగ్  అనే  వ్యవస్థ ను ప్రవేశపెట్టింది. ఈ సమయంలోనే సీజేఐ తన నియామకాల ప్రతిపాదనను ఇతర నలుగురు సభ్యులకు లేఖలో పంపారు. జస్టిస్‌లు ఎస్‌కె కౌల్‌, జస్టిస్‌ కెఎమ్‌ జోసెఫ్‌ సమాధానాలు పంపగా, జస్టిస్‌లు చంద్రచూడ్‌, జస్టిస్‌ నజీర్‌లు అలంభించిన పద్ధతికి అభ్యంతరం తెలుపుతూ తిరిగి రాశారు. వారి లేఖలు ఈ అభ్య ర్థులలో ఎవరికీ వ్యతి రేకంగా ఎలాంటి అభిప్రాయాలను వెల్లడించలేదు" అని తాజా తీర్మానం పేర్కొంది. సీ.జేఐ  లలిత్ అక్టోబర్ 2న మరొక లేఖలో వారి కారణాలను లేదా పద్ధతికి ప్రత్యామ్నాయాలను కోరింది. ఇద్దరు న్యాయమూర్తులు సమాధానం ఇవ్వలేదు. "కాబట్టి, కొలీజియం ఏర్పాటు చేసే న్యాయమూర్తుల మధ్య చర్చ జరగడానికి ఈ విషయం చాలా సరైనది" అని అక్టోబర్ 9 నాటి తీర్మానం పేర్కొంది. ఈలోగా, తన వారసుడిని నామినేట్ చేయాలని సీ.జేఐ ని అభ్యర్థిస్తూ కేంద్ర న్యాయ మంత్రి నుండి ఒక లేఖ అందిందని అది జతచేస్తుంది. సీ.జేఐ లలిత్ పదవీకాలం నవంబర్ 9న ముగుస్తుంది.  ఈ పరిస్థి తుల్లో తదు పరి చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు మరియు సెప్టెంబర్ 30, 2022న జరిగిన సమా వేశంలో అసంపూర్తిగా ఉన్న పనులను తదుపరి చర్చలు లేకుండా ముగించారు” అని కొలీజియం చివ రికి తీర్మానించింది. అంటే వచ్చే నెలలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన నియామకాలు చేయవచ్చు.

పీక్స్ కు జగన్ ఫొటోల పిచ్చి!

ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అలా తయారైంది జగన్ పరిస్థితి. అ  వైసీపీ అధినేత‌, ఆంధ్ర సీఎం జగన్ కు ఫొటోల పిచ్చి బాగా ముదిరిపోయిందని అంటున్నారు పరిశీలకులు.  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జ‌గ‌న్ బొమ్మలతో రెవెన్యూ, స‌ర్వే శాఖ‌లు భారీ ఫోటో ఎగ్జిబిష‌న్ కూ సిద్ధ‌ప‌డ్డాయి. చిత్ర‌మేమంటే ఎల్‌పీఎం రికార్డుల్లోనూ ఆయ‌న ముఖ చిత్రం క‌న‌ప‌డేట్టు చేస్తున్నారు.  పూర్వం రాజుగారికి క‌లొచ్చింది.. హ‌ఠాత్తుగా ప్ర‌జ‌లంతా త‌న‌ను మ‌ర్చి పోయి ప‌క్క రాజ్యం రాజుని కుర్చీలో కూచోబెట్టిన‌ట్టు. అంతే పొద్దున్న లేవ‌గానే రాజ‌ధానిలో అన్ని గోడ‌ల‌కీ చిత్ర‌కారుల‌చేత త‌న బొమ్మ గీయించి పెట్టార‌ట‌! అలా ఉంది ప్రస్తుతం జగన్ తీరు.  ప్ర‌జ‌లు త‌నను మ‌ర్చిపోతారే మోన‌న్న భీతీ ప‌ట్టుకుందా అన్న అనుమానం కలుగుతోంది జగన్ కు పెరిగిన ఫొటోల పిచ్చి చూసి అంటున్నారు పరిశీలకులు. అన్ని ప్రాంతాల్లోనూ అన్ని కార్యాల‌యాల్లోనూ, వీల‌యితే అన్ని ప‌త్రాల మీదా  చిరునవ్వుతో చిద్విలాసంగా  ఉన్న త‌న ముఖార‌విందాన్ని జనానికి దర్శన భాగ్యం   క‌లిగించాల‌ని ప‌ట్టుద‌ల ప‌ట్టు కుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సమష్టి బాధ్యతను సాంతం ముఖ్యమంత్రి క్రెడిట్‌లో వేసి ఆయన్ను శాశ్వత ఆరాధ్యుడిగా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందుకోసం ఎన్నెన్నో కొత్త దారులు వెతుకుతు న్నారు. సీఎంతో పాటు తమకు కొంత చోటు ఉండాలనుకుని అధికారులు కూడా వారి ఫొటోలు సిద్ధం చేసుకుంటున్నారు. వేలకోట్ల ప్రజాధనంతో చేపడుతున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి, మంత్రి, అధికారుల ఫొటోలు ఎందుకు? రైతులకు ఇచ్చే వ్యక్తిగత పట్టాలు, రికార్డులపై వారి ముఖచిత్ర ప్రదర్శన  దేనికోసం? అన్న అభ్యంతరాలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి.  ఇప్ప‌టికే అన్నింటా త‌న, తన తండ్రి పేరు మారుమోగేట్లు చేయ‌డానికి సంస్థలకు పేర్ల మార్పిడి ఉద్య‌మాన్ని చేప‌ట్టా రు. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. కానీ వాటిని ఇసుమంతైనా పట్టించుకోని జగన్  ఇక ఇప్పుడు ఫోటోల‌ ఉద్యమం చేపట్టారు.  కరపత్రాల మీద బొమ్మ స‌హ‌జం. అది అన్ని పార్టీల‌వారూ ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసే ప‌నే. కానీ ఈయ‌నకు ఎన్నిక‌ల బొమ్మ స్ప‌ష్ట‌మ‌యిన‌ట్టుగా ఉంది. అందుకే అన్నింటా త‌న స్టాంప్ ఉండాల‌ని కోరుకుంటున్నారు.   అందుకే భూ రికార్డులపైనా తన ఫొటోలే. మూడేళ్ల పాల‌న త‌ర్వాత ప్ర‌జ‌ల‌నుంచి ఎలాంటి మంచి మాటా విన‌బడక పోవ‌డంతో ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా త‌న వేపు తిప్పుకోవ‌డానికి, చేస్తున్న విశ్వ‌య‌త్నాల్లో ఈ ఫోటోల దాడి ఒక‌టిగా విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. అనేకానేక స‌ర్వేలు, గ‌డ‌ప గ‌డ‌ప‌కు వంటి కార్య‌క్ర‌మాల‌తో స‌హా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ష్ట‌మ‌నే సూచ‌నే చేస్తుండ టంతో, ప్ర‌జ‌ల్లోకి ఈ విధంగా వెళ్లి ఫోటోతో విజ్ఞ‌ప్తులు చేయ‌డం గొప్ప మార్గంగా ఆలోచించార‌నే అనుకోవాలి.  ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల్లో ఎలాగూ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న బొమ్మే ఉంటుంది. కానీ అన‌వ‌స‌ర‌మ‌యిన చోట కూడా త‌న ముఖ‌ చిత్రంతో పొద్దున్నే ఎదురుకావ‌ల‌ని కోరుకోవ‌డం త‌నను, ప్ర‌భుత్వాన్ని కాపాడాల‌ని వేడు కోవ‌డ‌ంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికే విసిగెత్తిన ప్ర‌జ ఈ వేడుకోలును ఎలా అంగీక‌రిస్తారు. రాష్ట్రంలో ఎలాంటి ప్ర‌గ‌తీ లేదు, ఎవ‌రికీ పాల‌న ప‌ట్ల సంతృప్తి లేదు. ఈ పరిస్థితిలో అన్నిటా తన రూపే క‌న‌ప‌డాల‌న్న జగన్ ఆతృత  ఎబ్బెట్టుగా ఉందని జనమే అంటున్నారు.  

కమలం లక్ష్యం కారు కాదు కాంగ్రెస్సే!

మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అందులో అనుమానం లేదు. అధికార తెరాస మునుగోడును ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్న జాతీయ రాజకీయలకు లాంచింగ్ ప్యాడ్ గా భావిస్తోంది. అందుకే హడావిడిగా పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) గా మార్చుకుంది. అయితే, సాంకేతిక ఇబ్బందుల కారణంగా పేరు మార్పు ప్రక్రియ పూర్తి కాకపోయినా, పార్టీ నాయకత్వం మాత్రం బీఆర్ఎస్ ప్రస్థానం మునుగోడు గెలుపు నుంచే మొదలవుతుందని భావిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ మునుగోడుకు తోలారు. నియోజక వర్గాన్ని సాధ్యమైనన్ని ముక్కలు చేసి, ఒక్కొక్క ముక్కకు ఒక్కొక్క నేతను ఇంచార్జిగా నియమించారు. ఉపఎన్నిక పోలింగ్ వరకు ఇంటి ముఖం చూడకుండా, మునుగోడులోనే మకాం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. చివరకు ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా కేవలం 2500 ఓట్లున్న చిన్న గ్రామానికి ఇంచార్జిగా వెళుతున్నారు. అంటే  మునుగోడు ఉపన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చును.  మునుగోడు ఉప ఎన్నికను తెరాస జాతీయ రాజకీయ ప్రస్థానానికి లాంచింగ్ ప్యాడ్ గా భావిస్తుంటే, బీజేపీ, దక్షిణాదిన మరీ ముఖ్యంగా తెలంగాణలో పార్టీ విస్తరణకు ప్రవేశ ద్వారంగా భావిస్తోంది. మునుగోడులో గెలిస్తే తెలంగాణ తమ ఖాతాలో చేరినట్లేనని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా విశ్వశిస్తోంది.ఆ ప్రభావం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక పైనా ఎంతో కొంత ఉంటుందని భావిస్తున్నట్లు తెల్సుస్తోంది. అందుకే మునుగోడు  సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డిని, కాంట్రాక్టుతో కట్టిపడేసి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు.   నిజానికి, బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికకు తలుపులు తెరిచారు. నిజానికి మునుగోడు ఉపఎన్నిక బీజేపీ జాతీయ నాయకత్వం కోరి తెచ్చుకున్న ఉపఎన్నిక. కాబట్టి సహజంగానే  కమల పార్టీ, తమ  అంబుల పొదిలో ఉన్న, అన్నిఅస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అంతే కాదు ఉప ఎన్నికలో తెరాసను ఓడించేందుకంటే, కాంగ్రెస్ ను మూడవ స్థానానికి నేట్టివేసేందుకే వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి, కారుకు కమలానికి మధ్య కాంగ్రెస్  అడ్డులేకుండా చేసుకునేందుకే, కమల దళం మునుగోడు ఉప ఎన్నికను కోరి తెచ్చుకుందని అంటున్నారు.  అయితే కాంగ్రెస్ పార్టీని మూడవ స్థానానికి పరిమితం చేయడం అయ్యే పనేనా అంటే మాములుగా అయితే, కాకపోవచ్చును కానీ హస్తం పార్టీ  ప్రస్తుతం ఎదుర్కుంటున్న అసాధారణ పరిస్థితుల్లో అంత ఈజీ టాస్క్ కాకపోయినా అసాధ్యం అయితే కాదని అంటున్నారు. మునుగోడు నియోజక వర్గాన్ని ఎంచుకోవడంలోనే బీజేపీ సగం గమ్యం చేరిందని విశ్లేషకులు అంటున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ కు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో ఉన్న పలుకు బడిని, పట్టును, ఇతర అనుకూల, ప్రతికూల అంశాలను బేరీజు వేసుకునే బీజేపీ మునుగోడును ఎంపిక చేసుకుందని అంటున్నారు. అలాగే, రాష్ట్రంలో రాహుల గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలోనే ఉప ఎన్నిక జరిగేలా షెడ్యూలు ఖరారు చేయడం కూడా బీజేపీ వ్యూహంలో భాగంగానే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఉక్కరి బిక్కిరి చేసేందుకే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను ముందుకు తెచ్చిందని అంటున్నారు.  అదలా ఉంటే తాజా పరిణామాలను గమనిస్తే, బీజేపీ వ్యూహం కొంతవరకు పనిచేస్తున్నట్లే కనిపిస్తోంది. నిజానికి రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరినా, ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ కూడా అయిన వెంకటరెడ్డి  మునుగోడు ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. నిజానికి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని నమ్ముకునే, పాల్వాయి స్రవంతి పోటీకి సిద్ధమయ్యారని అంటారు. అంతేకాదు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇష్టం లేకున్నా, వెంకట రెడ్డి సిఫార్సు మేరకే కాంగ్రెస్ అధిష్టానం, ఆమెకు టికెట్ ఇచ్చిందని అంటారు. కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి కూడా కోమటి రెడ్డి మీద ఎన్నో ఆశలు పెట్టు కున్నారు. ఈరోజుకు  కూడా ఆమె ‘అన్న వస్తాడు, గెలిపిస్తాడు’ అనే ఆశతోనే ఉన్నారు.అయితే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, కుటుంబ సమేతంగా ఈ నెల ( అక్టోబర్) 15 న విదేశాలకు వెళుతున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ ఆయన ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన  తర్వాతనే తిరిగొస్తారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార సారధి మధు యాష్కీ గౌడ్ సహా మరి కొందరు ముఖ్య నాయకులు మునుగోడు బాధ్యతల నుంచి తప్పు కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటి రెడ్డి విమానం ఎక్కేస్తున్నారు. కాంగ్రెస్ కు ఇదొక సెట్ బ్యాక్ అయితే, రాష్ట్రంలోకి  రాహుల గాంధీ భారాత్ జోడో యాత్ర ప్రవేశిస్తున్న నేపధ్యంలో, యాత్ర ఏర్పాట్లు, పర్యవేక్షణకు ఇప్పటికే మునుగోడులో బాధ్యతలు నిర్వహిస్తున్న మరి కొందరు సీనియర్ నాయకులను వెనక్కి పిలిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సో .. ఈ పరిణామాలను  గమనిస్తే, బీజేపీ మునుగోడు లక్ష్యం తెరాసను ఓడించడం కాదు, కాంగ్రెస్ ను బలహీన పరచడమే  అని స్పష్ట మవుతోందని అంటున్నారు.

యాటిట్యూడే కేసీఆర్ జాతీయ ఆకాంక్షలకు అడ్డం పడుతోందా?

 టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణా ముఖ్య‌మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు మర్యాద గీత ఉంటుందన్న విషయాన్ని ఆయన ఎన్నడూ గుర్తించరు. రాజకీయ అవసరం, లబ్ధికి మించిన ప్రధానమైన అంశమేదీ  ఆయన దృష్టిలో ఉండదు. జాతీయ రాజకీయాలలో అజాత శత్రువుగా అందరూ గౌరవించే మలాయం సింగ్ యాదవ్ గత నెలన్నరగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నా ఒక్క‌సార‌యినా  వెళ్లి ప‌రామ‌ర్శించ లేదు.  కానీ  జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తన ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం ఆయన దేశ వ్యాప్తంగా పర్యటనలు చేసి పలువురు రాజకీయ నేతలతో భేటీ అయ్యారు. అంతేనాతనకు మద్దతు లభిస్తుందనుకుంటే.. వారికి చార్టర్ విమానాలు పంపి మరీ ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. అలాగే ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు చార్టర్ విమానాన్ని పంపించి మరీ రాష్ట్రానికి రప్పించారు. ఆయనతో భేటీ అయ్యారు. అయితే కేసీఆర్ జతీయ పార్టీ ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల నుంచీ, ఇతర పార్టీల నాయకుల నుంచీ అనుకున్నవిధంగా స్పందన  రాలేదు. ఇందుకు ఆయన యాటిట్యూడ్  కారణమని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆయ‌న‌కు రాజ‌కీయ ల‌బ్ధి ఆలోచ‌నే తప్ప ఏ రాజ‌కీయ‌పార్టీతోనూ, నాయ‌కుల‌తోనూ ప్ర‌త్యేకించి సత్సంబంధాలు పెట్టుకున్న‌ట్టు ప్రత్యేకించి రాజకీయ నేతలతో స్నేహ సంబధాలు పెనవేసుకున్న సందర్భమూ లేదు. ఆయన పొత్తులూ, ములాఖత్ లూ అన్నీ రాజకీయమే.  అందుకే అఖిలేష్ కు చార్టర్ ఫ్లైట్ పంపి మరీ ఆహ్వానించిన కేసీఆర్.. అదే అఖిలేష్ తండ్రి తీవ్ర అనారోగ్యంతో దాదాపు నెలన్నరగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే కేసీఆర్ కనీసం ఒక్కటంటే ఒక్కసారైనా వెళ్లి పరామర్శించలేదని రాజకీయ వర్గాలలో విమర్శలు వినవస్తున్నాయి.   ఇపుడు బీఆర్ ఎస్ పేర జాతీయ రాజకీయాల్లో  చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్‌కు ద‌క్షిణాది కంటే ఉత్త‌రాది రాజ‌కీయ పార్టీలు, నాయ కుల‌తో స్నేహ‌బంధాలను పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. చిత్ర‌మేమంటే ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న‌కు  ఉత్తరాది నుంచి ఎటువంటి మద్దతూ, ప్రోత్సాహం అభించలేదు. చివరాఖరికి పార్టీ పేరు మార్చిన సభకు హాజరైన   క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార స్వామి కూడా సభ తరువాత స్వరాష్ట్రానికి వెళ్లి తమరాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేయదనీ, తమ పార్టీకి బీఆర్ఎస్ కూ ఎలాంటి పొత్తూ లేదని ప్రకటించారు.  అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ములాయం సింగ్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు కేసీఆర్ యూపీ వెళుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం (అక్టోబర్ 11) జరుగుతాయి.

ఐసిసి ప్లేయ‌ర్స్ ఆఫ్ ద మంత్‌...హ‌ర్మ‌న్‌ప్రీత్‌, రిజ్వాన్‌

భార‌త్ మ‌హిళ‌ల క్రికెట్ కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌, పాకిస్తాన్ వికెట్‌కీప‌ర్ బ్యాట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ ఐసిసి ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నారు. ఇంగ్లండ్ తో భార‌త్ త‌ల‌ప‌డిన వ‌న్డే సిరీస్ లో హ‌ర్మ‌న్ ప్రీత్ అద్బుత ప్ర‌తిభ క‌న‌ప‌ర‌చిన సంగ‌తి తెలిసిందే. ఐసిసి సెప్టెంబ‌ర్ నెల అవార్డు పోటీలో భార‌త్ వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన‌, బంగ్లా కెప్టెన్ నిగ‌ర్ సుల్తానాల‌ను హ‌ర్మ‌న్ అధిగ‌మించింది. వాస్త‌వా నికి వారిద్ద‌రూ గ‌త టోర్నీల్లో ఎంతో అద్భుత ప్ర‌తిభ క‌న‌ప‌రిచారు.  నిగ‌ర్‌, స్మృతీతో పోటీప‌డి ఈ అవార్డు గెలుచుకోవ‌డం గొప్ప ఆనందాన్నిస్తోంద‌ని హ‌ర్మ‌న్ ప్రీత్  అన్న‌ది. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్ మీద వ‌న్డే సిరీస్ గెల‌వ‌డం భార‌త మ‌హిళా క్రికెట్ చ‌రిత్ర‌లో ఎన్న‌ద‌గ్గ విజ‌య‌మ‌ని, అందుకు ప్ర‌జ‌లు,  క్రికెట్ అభిమానుల నుంచి ఇప్ప‌టికే శుభాకాంక్ష‌లు అందుకున్నామ‌ని భార‌త్ కెప్టెన్ అన్న‌ది. 1999 త‌ర్వాత ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించ‌డం అదే మొద‌టిసారి కావ‌డం విశేషం. పైగా కెప్టెన్ గా ఆమెకు ఎంతో ప్ర‌త్యేకం. ఈ సిరీస్ లో ఆమె 103.27 స్ట్ర‌యిక్‌రేట్‌తో 221 యావ‌రేజ్‌తో అత్య‌ధి కంగా 221 ప‌రుగులు చేసింది.  ఐసీసీఅవార్డుల పోటీలో భార‌త్‌స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్రీన్‌ల‌ను అధిగ‌మిం చాడు పాక్ ఆల్‌రౌండ‌ర్ రిజ్వాన్‌. సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన టి20 ల్లో అద్భుత బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శించి అంద‌రి దృష్టీ ఆక‌ట్టుకున్నాడు. త‌న అవార్డును ఇటీవ‌ల పాకిస్తాన్‌లో భారీ వ‌ర్షాల‌కు క‌ష్టాల్లో చిక్కుకున్న ప్ర‌జ‌ల‌కు అంకిత‌మిస్తున్నాన‌ని రిజ్వాన్ ప్ర‌క‌టించాడు. సెప్టెంబ‌ర్‌లో పాక్ స్టార్ ఆడిన ప‌ది మ్యాచ్‌ల్లో ఏడు అర్ధ సెంచ‌రీలు చేశాడు. ఆసియాక‌ప్‌లో హాంకాంగ్‌, భార‌త్ ల మీద విజృంభించా డు. టోర్నీలో అత్య‌ధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మ‌న్‌గా నిలిచాడు.  కాగా విజేత‌లు హ‌ర్మ‌న్ ప్రీత్‌, రిజ్వాన్‌లు ఐసిసి నుంచి బంగారు ప‌త‌కాలు అందుకుంటారు.

కాంగ్రెస్ ఇక కుటుంబ పార్టీ కాదు ..కానీ ..

కారణాలు ఏవైనా  రేపటి పరిణామాలు ఏలా ఉన్నా  ప్రస్తుతానికి అయితే, కాంగ్రెస్ పార్టీ కుటుంబ బంధనాల నుంచి కొంతవరకు బయట పడింది. ఒక అడుగు ముందుకేసింది. కుటుంబ పార్టీ ముద్రను తొలిగించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. నిజానికి  ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ మార్పుకు మూల కారణం రాహుల్ గాంధీయే. ఎన్ని వైపుల నుంచి ఎన్నెన్ని వత్తిళ్ళు వచ్చినా, గాంధీ ఫ్యామిలీ బయటి వ్యక్తులే పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని 2019లో తీసుకున్ననిర్ణయం నుంచి రాహుల్ అంగుళం అయినా అటూ ఇటూ కదల లేదు. మూడేళ్ళు గడిచిపోయినా పార్టీ అధ్యక్ష పదవిని తీసుకోవాలని కార్యకర్తలు, నాయకులు ఎన్నివిథాలుగా వేడుకున్నా, ప్రాధేయ పడినా చివరకు కుటుంబ సభ్యుల నుంచి వత్తిళ్ళు వచ్చినా  ఆయన, మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. మనసు మార్చుకోలేదు  అదే మాట మీద నిలబడ్డారు. అందు చేతనే ఇంచుమించుగా రెండున్నర దశాబ్దాల తర్వాత  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అనివార్య మయ్యాయి. అయితే కుటుంబ రాజకీయాలకు పర్యాయ పదంగా నిలిచిన కాంగ్రెస్ ‘ఫ్యామిలీ పార్టీ’ ట్యాగ్ వదుల్చుకున్నా  దేశంలో కుటుంబ,వారసత్వ రాజకీయాల హవా మాత్రం అలాగే సాగు తోంది.  నిజానికి, దేశంలో చాలా కాలంగా బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు మినహా మిగిలిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏదో విధంగా కుటుంబ పార్టీలుగానే చెలామణి అవుతున్నాయి.  ఇందుకు తాజా ఉదాహరణ ఆర్జేడీ, డిఎంకే. అది యాద్రుచ్ఛికమే అయినా  రెండు పార్టీలూ ఒకే రోజున ఆదివారం (అక్టోబర్ 9) మరోమారు కుటుంబ పాలనకు జై కొట్టాయి. ఆర్జేడీ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద యాదవ్ వరసగా 12 వ సారి ఎన్నికయ్యారు. ఎంకే స్టాలిన్ రెండవ సారి డీఎమ్ కే పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లాలూ ప్రసాద యాదవ్  1977లో జనతాదళ్ నుంచి విడిపోయి ఆర్జేడీని స్థాపించినాటి నుంచి, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే  డిఎమ్ కే పెద్దాయన కరుణానిధి కన్నుమూసిన తర్వాత 2018లో పార్టీ అధ్యక్ష  బాధ్యతలు చేపట్టిన స్టాలిన్  వరసగా రెండవసారి పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజానికి  లాలూ, స్టాలిన్ ఎన్నిక ముందుగా ఉహించిందే అయినా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపధ్యంగా దేశంలో కుటుంబ ఆధిపత్య రాజకీయాల పై చర్చ జరుగతున్న సమయంలోనే ఆర్జేడీ  డిఎమ్ కే అధ్యక్షులుగా లాలూ, స్టాలిన్ తిరిగి పార్టీపై కుటుంబ జెండా ఎగరేయడంతో జాతీయ మీడియాలో మరో మారు కుటుంబ రాజకీయాలపై చర్చ మొదలైంది. నిజమే  ప్రాంతీయ కుటుంబ పార్టీలలోనే కాదు, బీజేపీ, వామపక్ష పార్టీలు సహా, అన్ని పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం అటూ ఇటుగా ఒకేలా అఘోరించింది. ఇది కాదనలేని నిజం.  అదలా ఉంటే  పుట్టుక నుంచే కుటుంబ పార్టీగా చెలామణి అవుతున్న డిఎంకే  వ్యవస్థాపకుడు కరుణానిది ఇతర కుటుంబ సభ్యులతో పాటుగా  బంధువులకు కూడా రాజకీయం రుచి చూపించారు. అయినా మొదటి నుంచి పార్టీలో కుమారుడు స్టాలిన్ కే ఎత్తు పీట వేస్తూ వచ్చారు. కరుణానిథి వారసుడు ఎవరు  అనే ప్రశ్న రాకుండా ముందు నుంచే పార్టీలో ప్రభుత్వంలో రెండవ స్థానంలో కుర్చోపెట్టారు.  సో ..కరుణానిథి కన్నుమూసిన తర్వాత ఎలాంటి పోటీ లేకుండా  స్టాలిన్ పార్టీ అధ్యక్ష పదవిని అదే విధంగా ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ఇప్పుడు రెండవసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  కరుణానిధి చూపిన బాటలోనే స్టాలిన్ తన కుమారుదు ఉదయనిథిని... తన వారసునిగా తీర్చి దిద్దుతున్నారు. ఇక లాలూ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. దానా కుంభకోణం కేసులో జైలుకు వెళుతూ కూడా లాలూ తన భార్య రబ్డీ దేవిని ముఖ్యమంత్రిని చేసి వెళ్ళారు. అంతే కానీ మరొకరిని నమ్మలేదు.  అలాగే ఆయన తన రెండవ కుమారుడు తేజస్వి యాదవ్ ను తమ రాజకీయ వారసునిగా నిలబెట్టారు. తేజస్వి ప్రస్తుతం బీహార్ ఉపముఖ్య మంత్రిగా ఉన్నారు. లాలూ పెద్ద కుమారుడు ప్రతాప్ యాదవ్ కూడా రాజకీయాల్లో ఉన్నా, ఆయన చిన్న కుమారుడికే పెద్ద పీట వేశారు.  ఇక తెలుగు రాష్టాల విషయానికి వస్తే ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు టీడీపీ. వైసీపీ కుటుంబ పార్టీలుగానే చెలామణి అవుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస విషయం అయితే చెప్పనే అక్కలేదు. పార్టీ ఆవిర్భావం (2001) నుంచి ఈరోజు వరకు కేసీఆరే ఒక్కరే పార్టీ అధ్యక్షునిగా, గత ఎనిమిదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పడు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళితే  ఇప్పటికే ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న కుమారుడు కేటీఆర్ జోడు పదవులను జాయింట్ గా టేకోవర్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. సో... కాంగ్రెస్  మారినా, కుటుంబ , వారసత్వ రాజకీయాలు మాత్రం దేశాన్ని వదిలేదే ..లే అంటున్నాయి.

మునుగోడు సిత్రాలు  సూడ‌రో ఓట‌రో ఓట‌రా!

‘సిత్రాలు చేయరో.. శివుడా.. శివుడా.. శివమెత్తి ఆడరో నరుడా.. నరుడా’ అని మనవూరి పాండవులు సినిమా పాట మాదిరిగా మారింది తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం. ఒక పార్టీ వారు ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బుల్ని సంచుల్లో ఇస్తున్నారని, మరో పార్టీ వారు స్థానికంగా ఉండే తమ పార్టీ నేతలకు ఖరీదైన కార్లు, బైక్ లు బుక్ చేశారని, ఇంకో పార్టీ వారు విహారయాత్రకు యువకులకు ఫ్లైట్ టికెట్లు కొని ఇస్తున్నారని, ముంబై, సూరత్ లలో ఉంటున్న నియోజకవర్గంలోని ఓటర్ల కోసం విమానం టికెట్లు పంపించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు టికెట్లు, బీఫాంలు ఇవ్వడంతో ఆగకుండా వారి గెలుపు కోసం అతిరథ మహారథులను రంగంలోకి దింపు తున్నాయి. విచ్చల విడి గా ప్రలోభాల పర్వానికి తెరలేపాయంటున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే స్థానిక నేతలు, అనుచరుల ఖర్చులకు కొన్ని డబ్బులు, ఖుషీ కోసం కాస్త మద్యం, బిర్యాని ప్యాకెట్లు ఇవ్వడం మామూలైంది. ఓటర్లకు డబ్బులివ్వడమూ ఆనవాయిగా మారిం ది. మునుగోడు ఉప ఎన్నికలో ఒక పార్టీ ఓటుకు 30 నుంచి 40 వేల దాకా డబ్బులు ఇస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒక అభ్యర్థి మునుగోడులోని తమపార్టీ లీడర్ల కోసం రెండు వందల బ్రిజా కార్లు, రెండు వేల మోటార్ బైక్ లు బుక్ చేశారని మంత్రి హరీశ్ రావు ఆరోపించడం గమనార్హం. గతంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు, బంగారు, వెండి వస్తువులు ఇచ్చిన దాఖలాలున్నాయి. కానీ.. పెద్ద మొత్తంలో డబ్బులివ్వడం, కార్లు, బైక్ లు బుక్ చేయడం, ఫ్లైట్ టికెట్లు ఇవ్వడం ‘మునుగోడు ఉప ఎన్నిక చాలా రిచ్ గురూ!’ అన్నట్లు మారిందని అంటున్నారు. మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రచారం చేస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలకు మల్లారెడ్డి స్వయంగా మద్యం బాటిల్ ఎత్తి వారి గ్లాసుల్లో మందు పోసిన విజువల్స్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మల్లారెడ్డి పార్టీ చేసుకున్న హొటల్ ను మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ వరకు ఆయన బుక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మునుగోడులో అద్దె ఇంటి కోసం నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఏకంగా లక్ష రూపాయల అద్దె చెల్లించారంటూ ఓ వార్త గుప్పుమంటోంది. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఓ ప్రధాన పార్టీ తెప్పించిన ఐదు లక్షల కండువాలు పోలింగ్ కు 20 రోజుల ముందే అయిపోయాయని చెబుతున్నారు. మునుగోడులో ఉన్న మొత్తం ఓటర్లు 2 లక్షల 27 వేల మంది అయితే.. ఐదు లక్షల కండువాలు అయిపోవడం విడ్డూరం కాక మరేమిటి అంటున్నారు. తమ పార్టీ కండువా కప్పుకుంటే వెయ్యి నుంచి రెండువేల రూపాయల దాకా నజరానా ఇస్తున్నట్లు సమా చారం. తమ పార్టీలో చేరే యువకునికి 10 వేలు, మరో నరుగుర్ని తీసుకొస్తే మరో 50 వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వార్డు సభ్యులు, ఉప సర్పంచుల్లాంటి వారి చేతుల్లో 50 నుంచి 100 ఓట్లు ఉంటే 50 వేకు పైగా నగదు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ సర్పంచ్ ఆ గ్రామ ఇన్ చార్జిగా ఉన్న ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ మారినందుకు 15 లక్షల ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి స్థానికులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాయి. టీఆర్ఎస్ అయితే.. పలువురు మంత్రులను ఇన్ చార్జులుగా నియమించింది. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో ఒక్కో ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గంలోని ఒక్కో గ్రామానికి ఒక టీఆర్ఎస్ నేతను ఇన్ చార్జిగా పెట్టింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టు పనులు తీసుకుని బీజేపీలో చేరడం క్విడ్ ప్రొ కోకు పాల్పటమే అని ఈసీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రాజగోపాల్ రెడ్డిని  అన ర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరడం గమనార్హం. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో  ఆ పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడులో గెలుపు కాంగ్రెస్ పార్టీకి అనివార్యమే. ఇటీవలే జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించిన కేసీఆర్ కు కూడా మునుగోడులో విజయం తప్పనిసరే. జాతీయ పార్టీగా తొలిసారి ఎన్నిక ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు మునుగోడులో గెలుపు ఆవశ్యకమే. మునుగోడులో విజయం సాధించిన ఊపుతో జాతీయ రాజకీయాలు చేయాలనుకుంటున్న కేసీఆర్ కు ఇక్కడ ఓడితే పెద్ద ఎదురు దెబ్బే. ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ వ్యూహాలు వేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను స్వయంగా ఒక గ్రామం ఇన్ చార్జిగా బాధ్యతలు తీసుకోవడం విశేషం. మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరిని ముంచుతారో.. ఎవరినీ గట్టెక్కిస్తారో వారి నిర్ణయం వచ్చే దాకా వేచి ఉండాల్సిందే.

జగన్ రెడ్డి పాలనలో జనానికే కాదు .. దేవుళ్ళకూ వాతలే

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ  ప్రభుత్వం, గడచిన మూడేళ్ళలో ఓ చేత్తో తాయిలాలు పంచుతూ మరో చేత్తో భారీగా వడ్డనలు సాగిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ మూడేళ్ళ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి, రెండు సార్లు కాదు, ఏకంగా ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచింది. మూడు సార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచింది. చివరకు బహుశా దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  జగనన్న సర్కార్ చెత్త పన్ను వేసి ‘చెత్త’ చరిత్ర సృష్టించింది.  ఇక మద్యం ధరల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఎన్నిసార్లు పెంచిందో, ఎంతెంత పెంచిందో లెక్కే లేదు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే బీరు ధర మూడు రెట్లు ఎక్కువగా ఉందని అధికారులే చెపుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం మద్యం పై వచ్చే ఆదాయం మూడేళ్ళలో నాలుగు రెట్లు పెరిగి  రూ. 25,023  కోట్లకు చేరింది. అన్నిటినీ మించి అంచెల వారీగా మధ్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన  జగన్ రెడ్డి ప్రభుత్వం, ‘ముందు’ చూపుతో మద్యం అదాయాన్ని రాబడిగా చూపించి,  ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ ద్వారా రూ. 8,300 కోట్లు అప్పు చేసింది. ఆ అప్పు, దానిపై వడ్డీ కట్టేందుకు  2025 సంవత్సరం వరకు ప్రజలు నిత్యం మద్యం తాగుతూనే ఉండాలి, అప్పు చెల్లిస్తూనే ఉండాలి.   అలాగే ప్రభుత్వం మరో రూ.25 వేల కోట్ల రుణం కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసే ఆలోచన చేస్తోంది. అది ఎంత వరకు వచ్చిందో ఏమో కానీ,  అది కూడా కలిస్తే, మరి కొన్నేళ్ళపాటు, మందుబాబులు ప్రభుత్వాన్ని పోషించక తప్పదు.     సరే  ప్రజలను పీక్కుతింటున్నవైనం అట్లా ఉంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం దేవుళ్ళను కూడా వదిలి పెట్టడం లేదు.  అఫ్కోర్స్ దేవుళ్లంటే అందరు దేవుళ్లు, అన్ని మతాల దేవుళ్ళు కాదు ఓన్లీ హిందూ దేవుళ్లు, దేవాలయాల ఆదాయం పైనే  జగన్ రెడ్డి ప్రభుత్వం కన్ను పడింది. భక్తుల జేబుల కత్తిరించేందుకు సిద్దమైంది. మద్యం ధరలు పెంచి, తాగుబోతుల సంఖ్యను తగ్గించామని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, అదే విధంగా హిందువులు దేవాలయాల వైపు కన్నెత్తి చూడకుండా చేసేందుకా అన్నట్లుగా అర్జిత సేవలు, ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనం టికెట్ల ధరలను అడ్డగోలుగా పెంచుతోందని భక్తులు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది.  కొద్ది రోజుల క్రితం కాణిపాకం వరరసిద్ధి వినాయకుని దేవాలయంలో నిత్యం జరిగే, పంచామృత అభిషేకం టికెట్ ధరను ఒక్క సారిగా, రూ. 750 నుంచి రూ.5000లకు పెంచారు. అయితే  భక్తులు హిందూ ధార్మిక సంస్థలు ఆందోళనకు దిగడంతో, అబ్బే అదేమీ లేదు అలా పెంచితే ఎలా ఉంటుందని భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకే బోర్డు పెట్టామని, అధికారులు సంజాయిషీ ఇచ్చుకున్నారు. అయితే అధికారులు చెబుతున్నదే నిజం అయితే  దేవాలయం ఈఓను ఎందుకు బదిలీ చేశారు అనే ప్రశ్నకు సమాధానం లేదు.  అదలా ఉంటే, ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సర్కార్ స్వాములు సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని మరింత దూరం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దసరాలో వీఐపీల కోసం అంటూ టికెట్‌ ధరను పెంచడం.. ఆ తర్వాత ఉత్సవాలు ముగిసినా అదే కొనసాగించేయడంతో సామాన్య భక్తులు అమ్మవారి దర్శనానికి దూరమవుతున్నారు. అయితే ఇది ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం వస్తున్నదే అని భక్తులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. గత సంవత్సం దర్శనం టికెట్ ధరలు రూ.50, రూ.100 ఉండగా.. దసరాలో వీఐపీ టికెట్‌ అంటూ రూ.300 పెట్టారు.ఆ తర్వాత దసరా ముగిసినా.. టికెట్‌ మాత్రం తగ్గించలేదు. అంతరాలయం రూ.100 టికెట్‌ను రూ.300కు ఒకేసారి రెండు రెట్లు పెంచేశారు. రూ.50 టికెట్‌ తీసేసి.. రూ.100 చేశారు.  దానిపైనే తీవ్ర విమర్శలు రావడం, అప్పటి పాలకమండలి సభ్యులు సైతం వ్యతిరేకించడంతో ఇదిగో తగ్గిస్తాం.. అదిగో తగ్గిస్తామంటూ అప్పటి ఈవో కాలయాపన చేస్తూ వచ్చారు. ప్రస్తుతం రూ.300 టిక్కెటే భారంగా మారిందని భక్తులు బాధపడుతుంటే, ఈ సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా టికెట్ ధరను ఏకంగా రూ.500కు పెంచేశారు. మరో వంక రూ.30 విలువ చేసే రెండు లడ్డూల ధరను ఒకేసారి రూ.200కు పెంచారు. అంటే భక్తులకు అమ్మ దర్శనమే కాదు, ప్రసాద భాగ్యం లేకుండా చేస్తున్నారనే   విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నిజానికి ఒక కాణిపాకం, ఒక విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం అని మాత్రమే కాదు, తిరుమల వెంకన్న దేవుడు మొదలు రాష్టంలోని ప్రముఖ ఆలయాలు అన్నింటినీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయ వనరులుగానే చూస్తోందని, మరో వంక భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల సహా అన్ని ప్రముఖ ఆలయాలలో అన్యమత జోక్యం పెరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ముడుపులు కట్టి స్వామి వారలకు సంర్పించుకుంటున్న కోట్లాది రూపాయల సొమ్ములను జగన్ రెడ్డి ప్రభుత్వం కొల్ల గొడుతోందని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. హిందూ ధార్మిక కార్యక్రమాలు, హిందూధర్మ ప్రచారం కోసం ఖర్చు చేయవలసిన స్వామి వారి సొమ్మును, అన్యమత ప్రచారానికి, పాస్టర్లు, ఇమాములలకు నెల జీతాలు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, తగ్గేదే ..లే అంటూ దేవుని సొమ్మును యదేచ్చగా కైంకర్యం చేస్తునే వుంది, గుడిని గుడిలో లింగాన్ని మింగే చర్యలకు పాల్పడుతోంది. అయితే ఏదో ఒక రోజు ఆ దేవునికే లెక్కలు చెప్పవలసి వస్తుందని భక్తులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా వెళ్లిన కల్వకుంట్ల కవిత.. కారణమిదేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హఠాత్తుగా అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఆదివారం రాత్రి ఆమె ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా వినామనం ఎక్కారు. ఇంత హఠాత్తుగా కవిత అమెరికా పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాలలో పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తన నాటి నుంచి ఆమె ప్రతి అడుగూ, ప్రతి చర్యా ఆమె ఒకింత గందరగోళంలో ఉన్నట్లు తేటతెల్లం చేస్తూనే ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పిన ఆమె ఆ తరువాత కోర్టుకు వెళ్లి పరువునష్టం దావా వేయకుండా తనపై ఎవరూ ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ తరువాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని కూడా ఒక దశలో వార్తలు వినవచ్చాయి. అయితే వాటిని కవిత ఖండించారు. అయితే ఆమె సన్నిహితులకు ఈడీ నోటీసులు జారీ చేయడమే కాకుండా వారి నివాసాలలో సోదాలు కూడా నిర్వహించింది. అదలా ఉంచితే తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి తెలంగాణలో తొలి అరెస్టు జరిగింది. అదీ కవితకు సన్నిహితుడిగా  చెప్పే బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ సోమవారం ( అక్టోబర్ 10) అరెస్టు చేసింది. హైదరాబాద్ లో అభిషేక్ ను అరెస్టు చేసిన సీబీఐ ఆయనను ఢిల్లీకి తరలించింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ, సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత హఠాత్తుగా అమెరికా వెళ్లడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అదీ బోయిన పల్లి  అభిషేక్ అరెస్టుకు ఒక రోజు ముందే ఆమె హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లడం వెనుక ఆంతర్యమేమిటా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈడీ, సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకే ఆమె చెప్పా పెట్టకుండా అమెరికా పర్యటన పెట్టుకుని దేశం విడిచి వెళ్లారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే   ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి  హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే  అభిషేక్ రావును అరెస్ట్ చేసింది. అలాగే ఇప్పటికే  హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ నగర్ లోని ఒక రెసిడెన్సీలో నివాసం ఉంటున్ కవిత వ్యక్తిగత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే కవిత అమెరికా యాత్ర పట్ల రాజకీయవర్గాలలో సందేహాలూ, అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఈసీ గుర్తింపు సాధ్యమేనా?  

స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి అన్నారు అప్పట్లో శ్రీశ్రీ.. కొంచం అటూ ఇటూగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఇది వర్తిస్తుంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేసి కొత్త జాతీయ పార్టీ స్థాపించేశానని ఆయన సంబరపడిపోతున్నారు. సభలు చేసేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్  గా మారిందే కానీ  అది ఇంకా ప్రాంతీయ పార్టీయే. రంగూ, రుచీ, వాసనా అంతా ప్రాంతీయమే. అసలు ముందుగా బీఆర్ఎస్ కు  కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో బీఆర్ఎస్ పేరుతో రెండు రాజకీయ పార్టీలు రిజస్టర్ అయి ఉన్నాయి. వాటిలో ఒకటి బహుజన రాష్ట్ర సమితి(బీఆర్ఎస్).  ఈ పార్టీ కేంద్ర కార్యాలయం  వెస్ట్ మారేడ్ పల్లిలోని లలితా నగర్ లో ఉంది. బహుజన సమాజ్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది. అలాగే  దేశంలో బీఆర్ఎస్ పేరు మీద మరో  పార్టీ కూడా రిజిస్టర్ అయి ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేర కేసీఆర్ స్థాపించిన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేస్తూ ఒక తీర్మానం ఆమోదించేసి.. గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపేయగానే పార్టీకి గుర్తింపు వచ్చేసినట్లు కాదని పరిశీలకులు అంటున్నారు. తెరాస సర్వ సభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానం తో పాటు తెరాసను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ రాసిన లేఖను తీసుకుని మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి హస్తిన వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించి వచ్చారు. బీఆర్ఎస్ విషయంలో ఇప్పటి వరకూ పడిన అడుగు ఇదొక్కటే. అంత మాత్రానే జాతీయ పార్టీ ఆవిర్బవించేసిందనీ, ఇక జాతీయ స్థాయిలో చక్రం తప్పిడమే తరువాయి అన్నట్లుగా టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న హడావుడి.. ఆలూ లేదు.. చూలూ లేదు అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. ఒక పార్టీ పేరు మార్చుకోవడానికి పెద్ద అభ్యంతరాలేమీ ఉండవని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ పేరు మార్పుతోనే జాతీయ గుర్తింపు వచ్చేసినట్లు కాదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ గుర్తింపు రావాలంటే అందుకు అవసరమైన ఓట్ల శాతం, సీట్ల సంఖ్య ఉండాలని అప్పుడే జాతీయ గుర్తింపు వస్తుందని స్పష్టం చేస్తున్నాయి.  అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో మరో రెండు పార్టీలు ఉండటంతో కేసీఆర్ బీఆర్ఎస్ కు గుర్తింపు లభిస్తుందా అన్న విషయంలో తెరాస వర్గాలలో సైతం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే పార్టీ పేరు వేరు, అబ్రివేషన్ వేరు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు అయితే లభించే అవకాశాలు లేవనీ, నిబంధనల ప్రకారం అన్ని పారామీటర్స్ కు అనుగుణంగా ఉంటేనే బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం గుర్తింపు లభించే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

తాతా అమ్మ‌మ్మ ఇక త‌న వెంటే!

జీతు త‌న ల‌వ‌ర్ పేరు టాటూ వేయించుకున్నాడు, అమితా త‌న భ‌ర్త‌పేరుని, నాని వాళ్ల నాన్న పేరునీ టాటూ వేయించుకుని తెగ‌మురిసిపోయారు..విట్జెల్ మాత్రం త‌న అమ్మ‌మ్మ‌తాత‌య్య‌ల పేర్లు వేయించు కుంది! అది తెలిస్తే మ‌న దేశంలో ప్ర‌భాస్‌, చింటూలు అబ్బే ఈ పిల్ల మ‌న ఫ్రెండు కావ‌డానికి అర్హురాలు కాద‌నే వారేమో! విట్జెల్ మాత్రం ఆ పెద్ద‌వాళ్ల అపార ప్రేమ‌ను బ‌హుమ‌తిగా పొందింది. ఇంట్లో త‌ల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్లూ ఉండ‌వ‌చ్చు. అంద‌రితోనూ మంచి ప్రేమానుబంధాలూ ఉండ‌వ చ్చు. కానీ ఎంతో జీవితానుభవం ఉన్న అమ్మ‌మ్మ‌తాత‌య్య‌ల‌తో స్నేహంగా ఉండేవారెంద‌రు? ఈ ప్ర‌శ్న‌కు చాలామంది హాల్లోనో, వేరే గ‌దిలోనో పేప‌రు చ‌దువుతూనో, టీవీ చూస్తూనో, క‌బ‌ర్లు చెప్పుకుంటూనో ఉండే పెద్ద‌వాళ్లిద్ద‌రు క‌న‌ప‌డ‌వ‌చ్చు. ఇంట్లో పెద్ద‌వాళ్ల‌తో అనుబంధం, స్నేహ‌బంధం ఓ చిత్ర‌మైన శ‌క్తినిస్తుంద న్నది గ్ర‌హించ‌డం చాలా త‌క్కువ‌మందిలోనే ఈ రోజుల్లో ఉంటోంది. ఇది ఓ స‌ర్వే చెప్పిన సంగ‌తి.  స‌ర్వే మాట ఎలా ఉన్నా వాస్త‌వంగానూ చిన్న‌పుడు తాత‌, అమ్మ‌మ్మ‌ల సాంగ‌త్యంతో పొందిన ఆనందం కేవ‌లం నెమ‌రేసుకునే జ్ఞాప‌కం మాత్ర‌మే కాదు..అది పురాత‌న ఫోటో చెప్పే క‌థ‌ల‌సారం. ఇంట్లో పెద్ద‌వాళ్లు వేరే లోకంలో ఏమీ ఉండ‌రు.. మీతోనే క‌ల‌వాల‌ని పిల్ల‌లు అనుకోవాలి..అనుకుంటున్న వారు ఎంత‌మంది అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. పిల్ల‌ల‌కు వారి అనుభ‌వాల వివ‌రాలు వారు చెప్పే విధానాలు ఎంతో నేర్పుతాయ‌న్న‌ది ఖాయం. ఒక్క‌సారి ఆ లోకంలోకి వెళితే బావుంటుంది. ఎంతో ఆనందాన్నిస్తుంది, అంత‌కు మించి ఎన్నో రెట్ల ప్రేమ‌ని పంచుతుంది. వీటికి అగ‌స్టినా వెట్జ‌ల్ ఓ ఉదాహ‌ర‌ణ‌! అవును ఆమె త‌న అమ్మ‌మ్మ తాత‌ల ప్రేమ నిత్యం టాటూగా ఉండాల‌న్న ఆలోచ‌న చేసింది. మామూలుగా అడిగితే, అదేవిటే పిచ్చి ఆలోచ‌నా అంటార‌ని అనుకుంది. అందుకే వారితో చిన్న అబ‌ద్ధ‌మాడింది. యూనివ‌ర్సిటీలో ప్రాజెక్టు వ‌ర్క్ కోసం అక్క‌డి అధికారులు అడిగార‌ని వారి పేర్లు రాసిమ్మ‌ని కాయితం ఇచ్చిందిట‌. వారు సంత‌కాలు చేసిచ్చారు. అంతే ఈమె వెంట‌నే టాటూ దుకాణానికి వెళ్లి చేతిమీద టాటూ వేయించుకుంది!   దాన్ని చెర‌ప‌లేరు, చెర‌ప‌మ‌ని అడ‌గ‌నూ లేరు..  అప్ప‌టికీ కోప‌గిస్తే రెండు రోజులు క‌న‌ప‌డ‌కుండా తిర‌గ డ‌మే అనుకుంది. ఆ ముచ్చ‌టా అయింది. ఆన‌క పెద్ద‌వాళ్లిద్ద‌రూ మ‌న‌వ‌రాలి తెలివికి మెచ్చుకుని న‌వ్వుకు న్నారు. పిలిచి మొట్టికాయ వేసి భ‌డ‌వా! అన్నారంతే. ఆమె మ‌న‌సులోకి కొండంత ప్రేమ ఇంకింది!

మల్లయోధుడే కాదు.. రాజకీయ దురంధరుడు ములాయం

స్వతంత్ర భారత  రాజకీయాల్లో ముఖ్యంగా రెండవ తరం రాజకీయ నేతల్లో ప్రముఖునిగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ సోమవారం(అక్టోబర్ 10) ఉదయం కన్ను మూశారు. సుమారు నెలన్నర రోజులుగా రోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ములాయం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. అయన వయసు 82 ఏళ్ళు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడు పర్యాయాలు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఏడుసార్లు ఎంపీగా, పది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేంద్రమంత్రిగానూ సేవలందించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ములాయం సింగ్ యాదవ్ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించినా, మల్ల యోధునిగా, రాజకీయ నేతగానే పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. సోషలిస్ట్ నేత రామమనోహర్ లోహియా అంతేవాసిగా  రాజకీయ రంగ ప్రవేశం చేసిన ములాయం సింగ్ యాదవ్  జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో సాగిన, ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనతో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు.  నవంబర్‌ 22, 1939లో యూపీలోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆగ్రా వర్సిటీ పరిధిలోని బీఆర్‌ కళాశాల నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ అందుకున్నారు. అనంతరం కర్హైల్‌లో లెక్చరర్‌గానూ పనిచేశారు. రెజ్లింగ్‌ పట్ల ఎంతో మక్కువ ప్రదర్శించే ములాయం.. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయ మల్ల యోధుడిగా ఎదిగారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మాలతి దేవి కన్ను మూసిన తర్వాత, సాధనా యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ములాయం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అఖిలేష్ యాదవ్, మొదటి భార్య కుమారుదు. రెండవ భార్య కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌. ప్రతీక్‌ భార్య అపర్ణా యాదవ్‌ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. స్వతహాగా మల్ల విద్యలో పట్టున్న ములాయం రాజకీయాల్లోనూ మల్లయోధునిగా పేరు తెచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రేమతో నేతాజీగా పిలుచుకునే ములాయం 1960లలో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం దేశంలో తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు. 1967లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లో తన జైత్రయాత్రను కొనసాగించారు. మూడు పర్యాయాలు సీఎంగా, ఏడు సార్లు ఎంపీగా, ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని విశ్వాసం చూరగొన్నారు. 1996లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో 1996 నుంచి 1998 మధ్య దేశ రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు. అనంతరం మూడు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. 1989 నుంచి 1991వరకు తొలిసారి సీఎంగా కొనసాగగా.. 1993 నుంచి 1995, చివరగా 2003 నుంచి 2007 వరకు యూపీ సీఎంగా సేవలందించారు. దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో గానీ, అధికార కూటమికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో గానీ ములాయం నిర్మాణాత్మక పాత్ర పోషించారు.  సోషలిస్టు నాయకుడు డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ములాయం చిన్న వయసులోనే రాజకీయాల వైపు ఆసక్తి కనబరిచారు. మధు లిమాయే, రామ్ సేవక్ యాదవ్, కర్పూరి ఠాకూర్, జనేశ్వర్ మిశ్రా, రాజ్ నారాయణ్ వంటి వ్యక్తులతో పరిచయం తర్వాత 15 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లో చేరారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, వీపీ సింగ్‌, చంద్రశేఖర్ పనితీరుతో ప్రేరణ పొందారు. కార్మికులు, రైతులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, విద్యార్థుల సంక్షేమం, హక్కుల రక్షణ కోరుతూ ములాయం అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలో 1962 నుంచి 1963 వరకు ఇటావా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అరెస్టయి జైలుకు వెళ్లిన ములాయం.. 19 నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు. 1977లో తొలిసారి మంత్రి అయ్యారు. సహకార, పశుసంవర్దకశాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1980లో లోక్‌దళ్‌ పార్టీ అధ్యక్షుడిగా అయ్యారు. ఈ పార్టీ తర్వాత జనతాదళ్‌లో భాగమైంది. ఇక అక్కడి నుంచి జనతా పరివార్ లో భాగంగా అడుగులు వేస్తూ కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో అనేక పత్రాలు కీలక పదవులు చేపట్టారు. 1982లో యూపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ఆయన.. 1985 దాకా ఆ పదవిలో కొనసాగారు. లోక్‌దళ్‌ పార్టీలో చీలిక ఏర్పడిన తర్వాత క్రాంతికారి మోర్చా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 1990లో కేంద్రంలోని వీపీ సింగ్‌ ప్రభుత్వం పడిపోవడంతో చంద్రశేఖర్‌ సారథ్యంలోని జనతాదళ్‌‌ (సోషలిస్టు) పార్టీలో ములాయం చేరారు. కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో యూపీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1991లో కాంగ్రెస్‌ తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో యూపీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ములాయం సింగ్‌ పార్టీపై బీజేపీ నెగ్గింది. అనంతరం 1992లో ములాయం సింగ్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ములాయం సింగ్ యాదవ్ కు అన్ని పార్టీలలో మంచి మిత్రులున్నారు. అంతే కాదు తుది శ్వాస వరకు రాజకీయాలనే శ్వాశించిన ములాయం ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు.

ఎస్‌.పి వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ ఇక‌లేరు

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ,యూపీ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాద‌వ్‌ కన్నుమూశారు. గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం సోమవారం (అక్టోబర్ 10) ఉదయం 8.30 గంటలకు మరణించారు.  ఆయన వయస్సు 82 ఏళ్లు.  ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 22వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నమూలాయం ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. 1939 నవం బర్ 22వతేదీన యూపీలో జన్మించిన ములాయం యూపీ సీఎంగా మూడుసార్లు పని చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ  పనిచేశారు.   ములాయం మ‌ర‌ణ‌వార్త విన‌గానే ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాళులు అర్పించారు.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో, దేశ రాజ‌కీయాల్లోనూ ములాయం సింగ్ ఎన్న‌ద‌గ్గ రాజ‌కీయ‌వేత్త  అని  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తన సంతాప సందేశంలో తెలిపారు.  ముఖ్యంగా ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ప్ర‌జాస్వామ్య విలువ‌లు కాపాడుతూ ఆయ‌న చేసిన పోరాటం ఎంతో  కీల‌క‌మ‌ని శ్లాఘించారు.  ర‌క్ష‌ణ మంత్రిగా ఎంతో సేవ‌చేశార‌ని, పార్ల‌మెంటు స‌భ్యునిగా అనేక కీల‌కాంశాల్లో ఆయ‌న ఆలోచ‌న‌లు, సూచ‌న‌లు ప్ర‌జాహితంగా ఉన్నాయ‌ని ప్ర‌ధాని ట్వీట్ చేశారు.   స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ర‌క్ష‌ణ‌మంత్రి ములాయంసింగ్ యాద‌వ్ మృతి ప‌ట్ల కాంగ్రెస్ పార్టీ త‌న ట్విట‌ర్ హాండిల్‌లో సంతాపం ప్ర‌క‌టించింది. ఆయ‌న లేని లోటు పూడ్చలేనిద‌ని  పేర్కొన్న‌ది.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ స‌తీష్ మ‌హాన ములాయం మృతికి సంతాపం వ్య‌క్తం చేస్తూ, మాజీ ముఖ్య మంత్రి మృతి ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.  ఇటీవ‌లే ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డుతోంద‌ని తెలుసు కున్నామ‌ని ఇంత‌లో ఈ విషాద వార్త విన‌వ‌ల‌సివ‌స్తుంద‌నుకోలేద‌ని ఆయ‌న అన్నారు. అధికారంలో ఉన్న‌ా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ములాయం  రాజ‌కీయాల్లో ఎంతో కీల‌క‌పాత్ర పోషించారని శ్లాఘించారు.   ములాయం సింగ్ యాద‌వ్‌జీ మ‌ర‌ణ‌వార్త ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పేర్కొన్నారు. ఆయ‌న‌తో త‌న‌కు నాలుగు ద‌శాబ్దాల అనుబంధం ఉంద‌ని, సోద‌రుడిని కోల్పోయాన‌ని ఆయ‌న ట్విట్ చేశారు. వెనుక బ‌డిన త‌ర‌గ‌తుల మ‌హానేత‌గా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఎన‌లేని సేవ‌లు చేశార‌ని, ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయ‌న గొప్ప స్పూర్తి ప్ర‌దాత అంటూ శ్లాఘించారు. మృదుస్వ‌భావి, సామాజిక న్యాయం కోసం పాటుబ‌డుతూ ల‌క్ష‌లాదిమంది జీవితాలకు వెలుగునిచ్చిన మాస్ నాయ‌కునిగా ఆయ‌న ఎన‌లేని కీర్తి గ‌డించార‌ని అన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని భవగంతుడ్ని కోరుతున్నానన్నారు.

శివసేన పిట్ట పోరును ఈసీ తీర్చింది!

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నచందంగా  మహారాష్ట్రలో రెండుగా చీలిన శివసేన విషయంలో జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం అదే చేసింది. శివసేన పార్టీ పేరును, పార్టీ గుర్తును ఇద్దరికీ కాకుండా తాత్కాలికంగా సీజ్ చేసింది. అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3 వ తేదీన జరిగే ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో  కేంద్ర ఏన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3 ఉప ఎన్నికలో ఏ పార్టీ పేరున, ఏ గుర్తు పై పోటీ చేయాలనుకుంటున్నాయో, ప్రాధాన్యతా క్రమంలో సోమవారం (అక్టోబర్ 10) నాటికి తెలియచేయాలని ఎన్నికల సంఘం చీలిక వర్గాలు రెంటినీ  ఆదేశించింది. కాగా, గత జూన్ లో శివసేన రెండుగా చీలి  షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి, ఇటు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వర్గం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం అసలు శివసేన తమదేనని, తమ వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, పార్టీ గుర్తును తమకు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కోరిన సమాచారం ఇచ్చేందుకు థాకరే వర్గం  పదే పదే గడవు పొడిగింపు కోరడంతో, ఎన్నికల సంఘం నిర్ణయం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రావడంతో ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, పార్టీ ఎన్నికల  చిహ్నాని స్తంభింప చేసింది.రెండు వర్గాలకు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తాత్కాలికంగా పార్టీ పేరును, గుర్తును ప్రాధాన్యతా క్రమంలో కోరింది.  ఇదలా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి షిండే వర్గం స్వాగతించింది. అయితే, మాజీ ముఖ్యమంత్రి థాకరే వర్గం మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాని తప్పు పట్టింది. అన్యాయంగా పేర్కొంది. అయినా చివరకు సత్యమే గెలుస్తుందని థాకరే వర్గం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.  అదలా ఉంటే, శివసేనలో చీలిక వచ్చిన అనంతరం జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో, అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక ప్రాధాన్యతను సంతరించుకుంది. శివసేన సిటింగ్ ఎమ్మెల్యే రమేష్ లట్కే ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన థాకరే వర్గం అభ్యర్హ్దిగా ఆయన సతీమణిని రుజుత లట్కేను  బరిలో దింపింది. మహా వికాస్ ఘటబంధన్ భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ ఆమెకు మద్దతు ప్రకటించాయి. మరోవంక  షిండే వర్గం తరపున, బీజేపీ కార్పొరేటర్ ముర్జి పటేల్,ను బరిలో దింపుతోంది. నవంబర్ 3 న పోలిగ్ జరుగుతుంది, నవంబర్ 6 న ఫలితం వెలువడుతుంది. ప్రజలు ఎటున్నారో తేలిపోతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం.. బోయినపల్లి అభిషేక్ అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఈ స్కాం కు సంబంధించి తెలంగాణలొ తొలి అరెస్టు జరిగింది. తెరాస అగ్రనేతలకు సన్నిహితుడైన బోయనపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్ కు చెందిన బొయినపల్లి అభిషేక్ అరెస్టు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ లో బోయినపల్లి అభిషేక్ ను అదుపులోనికి తీసుకున్న సీబీఐ ఆయనను ఢిల్లీకి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించినంత వరకూ తెలుగు రాష్ట్రాలలో జరిగిన తొలి అరెస్టు ఇది. రాబిన్ డిస్టలరీస్ లో డైరెక్టర్ గా ఉన్న అభిషేక్ రావు, హైదరాబాద్ కు చెందిన   లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. అంతే కాకుండా దాదాపు 9 కంపెనీల్లో అబిషేక్ రావు డైరెక్టర్ గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఢిల్లీ లిక్కర్ స్కింఇటీవల హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సోదాలు ముగిసిన క్రమంలో అభిషేక్ రావును అరెస్ట్ చేయడం చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్‌ నేతలతో అభిషేక్ రావుకు సంబంధాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు  అభిషేక్ రావు అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారింది. దసరా తురువాత ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో సీబీ, ఈడీ దూకుడు పెంచాయి.  హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిం పలు కీలక ఆధారాలు సేకరించింది.  ఈ సోదాల  నేపథ్యంలోనే అభిషేక్ రావును అరెస్ట్  చేసింది. 

రాంచీలో రెచ్చిపోయిన శ్రేయ‌స్‌, కిష‌న్‌...రెండో వ‌న్డేలో భార‌త్ విజ‌యం

రాంచీలో  బ్యాట‌ర్లు హెండ్రిక్స్‌, మార్క‌ర‌మ్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ బ్యాటింగ్ విన్యాసం ఝార్ఖండ్ క్రికెట్ అభిమానుల‌కు ధోనీ ధ‌నాధ‌న్‌ను గుర్తు చేశారు. ధోనీ త‌ర్వాత వారికి అంత‌టా అద్భుత డాషింగ్ బ్య‌టింగ్ ఆ న‌లుగురూ ప్ర‌ద‌ర్శించ‌డం చూసి తీరాల్సిందే! శ్రేయ‌స్ సెంచ‌రీ దంచ‌డం, కిష‌న్ దూకుడు బ్యాటింగ్‌తో 96 ప‌రుగుల‌తో భార‌త్ రెండో వ‌న్డేలో 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ ధాటి త‌ర్వాత భార‌త్ అంత స్కోర్ అధిగ‌మిస్తుందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌ య్యాయి.కానీ ఇషాన్‌, శ్రేయ‌స్ దంచికొట్ట‌డం మ‌ర్క‌ర‌మ్‌, హెండ్రిక్స్‌ల ప‌రుగుల వర‌ద‌ను ప్రేక్ష‌కులు మ‌ర్చిపోయారు. ద‌క్షిణాఫ్రికా 50 ఓవ‌ర్ల‌లో  6 వికెట్ల న‌ష్టానికి 278 ప‌రుగులు చేయ‌గా భార‌త్ 3 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు చేసింది. ఇక్క‌డ భార‌త్ తో త‌ల‌ప‌డిన రెండో వ‌న్డే లో ద‌క్షిణాఫ్రికా  భారీ స్కోర్ చేసింది. మ‌ర్క ర‌మ్ 79, హెండ్రిక్స్ 74 ప‌రుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభం బెరుగ్గానే ఉంది. భార‌త్ పేస‌ర్ సిరాజ్ బ్యాట‌ర్ల‌ను ఖంగారు పెట్టా డు. మొద‌టి మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన డీకాక్ కేవ‌లం 5 ప‌రుగుల‌కే సిరాజ్‌కు దొరికాడు. జ‌ట్టు స్కోర్ ప‌ది ప‌రుగుల‌కే మొదటి వికెట్ కోల్పోయింది. మొద‌టి ఐదు ఓవ‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికా ఒక వికెట్ న‌ష్టానికి 19 ప‌రుగులు చేసింది. మొదటి ప‌వ‌ర్‌ప్లే 10 ఓవ‌ర్ ముగిసే సమ‌యానికి 2 వికెట్లు కోల్పోయి 40 ప‌రుగులు చేసింది. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ ప‌రుగులెత్తి స్తున్న మ‌లాన్ వెను దిరిగాడు. అత‌ను 31 బంతుల్లో 25 ప‌రుగులు చేశాడు. 12 వ ఓవ‌ర్‌కి 50 ప‌రుగులు పూర్తి చేసింది. అపుడు వ‌చ్చాడు మ‌ర్క ర‌మ్ రంగం లోకి. వ‌స్తూనే ధాటిగా ఆడ‌టం మొద లెట్టా డు. ఫ‌లితంగా జ‌ట్టు 15 ఓవ‌ర్ల‌కు 60 పరుగులు చేసింది. 20 ఓవ‌ర్లు అయ్యే స‌రికి ద‌క్షిణాఫ్రికా 2 వికెట్ల న‌ష్టానికి 91 ప‌రుగులు చేసింది. వంద ప‌రుగులు 20 ఓవ‌ర్ల‌లో పూర్తిచేసింది. హెండ్రిక్స్‌, మ‌ర్క ర‌మ్ క‌లిసి 50 ప‌రుగులు 60 బంతుల్లో చేశారు.26 ఓవ‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికా 2 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగు లు చేసింది. అందుకు ప్ర‌ధానం గా హెండ్రిక్స్ వీరబాదుడు తోడ‌యింది. అత‌ను భార‌త్‌పై మొద‌టి అర్ధ‌సెంచ‌రీని 58 బంతుల్లో చేశాడు. కాగా 39వ ఓవ‌ర్లో జ‌ట్టు స్కోర్ 200 ప‌రుగులు దాటింది. ఆ వెంట‌నే మ‌ర్క‌ర‌మ్ ఎట్ట‌కేల‌కు వెనుదిరిగాడు. అత‌ను 88 బంతుల్లో 79 ప‌రుగులు చేశాడు. కానీ ఆ త‌ర్వాత జ‌ట్టు ఇన్నింగ్స్ అత‌నిలో ఎవ్వ‌రూ నిల‌బెట్ట‌లేక‌పోయారు. 40 ఓవ‌ర్ల‌కు 5 వికెట్లు కోల్పోయి 221 ప‌రుగుల చేసిం ది. 45వ ఓవ‌ర్‌కి 252  ప‌రుగులు చేసింది. 50 ఓవ‌ర్ పూర్త‌య్యే స‌రికి ద‌క్షిణా ఫ్రికా 7 వికెట్ల న‌ష్టానికి 278 ప‌రుగులు చేసింది. భార‌త్ బౌల‌ర్ల‌లో సిరాజ్ 3.8 ఓవ‌ర్ల లో 3 వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ అత్య‌ధికంగా 6.67 ర‌న్‌రేట్‌తో 60 ప‌రుగు లిచ్చాడు.  భార‌త్  279 ప‌రుగుల ల‌క్ష్యంతో దిగింది. మొద‌టి ఓవ‌ర్లో ప‌రుగులు చేయ‌లేదు కానీ రెండో ఓవ‌ర్నుంచీ ప‌రుగులు సాధించారు. భార‌త్ 28 ప‌రుగుల వ‌ద్ద  కెప్టెన్ ధావ‌న్ వెనుదిరిగాడు. అత‌ను కేవ‌లం 13 ప‌రుగులే చేశాడు. రెండో వికెట్ గా గిల్ 26 ప‌రుగుల‌కే జ‌ట్టు స్కోర్ 48 వ‌ద్ద పెవిలియ‌న్ చేరాడు. వీరిద్ద‌రి స్థానంలో వ‌చ్చిన శ్రేయాస్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్ మెరుపులు ప్ర‌ద‌ర్శించారు. దక్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను ఆడుకున్నారు. ఎవ‌రు ఎలా వేయాలో అర్ధంగాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఫీల్డ‌ర్లు చ‌మటో ర్చారు కానీ భార‌త్ ద్వ‌యం ధాటిని నిలువ‌రించ‌లేక‌పోయారు. భార‌త్ ప‌ది ఓవ‌ర్ల‌కు 2 వికెట్లు కోల్పోయి 55 ప‌రుగులు చేసింది. ఇదే స‌మ‌యంలో ద‌క్షిణాఫ్రికా 2 వికెట్ల న‌ష్టానికి 41ప‌రుగులు చేసింది. 15 ఓవ‌ర్ల‌కు భార‌త్‌75ప‌రుగులు చేసింది. 21ఓవ‌ర్లో భార‌త్ వంద‌ప‌రుగులు పూర్తి చేసింది. అప్ప‌టికి అయ్య‌ర్ 26, కిష‌న్ 42 ప‌రుగుల‌తో ఉన్నారు. ఇద్ద‌రూ క‌లిసి 50 ప‌రుగులు 72 బంతుల్లో చేశారు. ఆ త‌ర్వాత కిష‌న్ మ‌రింత దూకుడు పెంచి త‌న మొద‌టి అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేశాడు. ఆ వెంట‌నే అయ్య‌ర్ కూడా పూర్తి చేశాడు. అయ్య‌ర్‌కి ఇది 6 ఇన్నింగ్స్‌లో 5వ అర్ధ‌సెంచ‌రీ. ఇద్ద‌రూ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను బౌలింగ్ మ‌ర్చేలా బాదారు. ఇద్ద‌రూ 3వ వికెట్‌కు 107 బంతుల్లో 100 ప‌రుగులు చేశారు. భార‌త్ 150 ప‌రుగులు 27 ఒవ‌ర్ల‌లో పూర్త‌ య్యాయి. భార‌త్ సూప‌ర్స్టార్స్ ఇద్ద‌రూ 140 బంతుల్లో 150 ప‌రుగుల‌ను ఇన్నింగ్స్ 31ఓవ‌ర్లో పూర్తిచేయ‌డంలో అద్భుత ప్ర‌తిభ క‌న‌ప‌ర్చారు. భార‌త్ 200 ప‌రుగులు 33వ ఓవ‌ర్లో పూర్త‌య్యాయి. 35వ ఓవ‌ర్లో ఓవ‌ర్లో ఇషాన్ కిష‌న్ వెనుదిరిగాడు. త‌న సెంచ‌రీకి ఏడు ప‌రుగుల దూరంలో అవుట‌య్యాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ 209 ప‌రుగులు. ఆ త‌ర్వాత అయ్య‌ర్ మ‌రింత రెచ్చిపోయి విజ‌యాన్ని అందించాడు. అయ్య‌ర్ 113 ప‌రు గులు త‌న వ‌న్డే కెరీర్‌లో రెండ‌వ అత్య‌ధిక స్కోర్‌. శ్రేయ‌స్ అయ్య‌ర్ 113 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. కిష‌న్, అయ్య‌ర్ ఇద్ద‌రూ  ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు.