హైద‌రాబాద్‌కు అపూర్వ గౌర‌వం..ప్ర‌పంచ గ్రీన్ సిటీ అవార్డు

తెలంగాణా రాజ‌ధాని న‌గ‌రం, అనేకా చారిత్ర‌క క‌ట్ట‌డాల నెల‌వు హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ గ్రీన్ సిటీ అవార్డు ల‌భించింది. ఇంట‌ర్నేష‌నల్ అసోసియేష‌న్  ఆఫ్ హార్టిక‌ల్చ‌ర్ ప్రొడ్యుస‌ర్స్‌(ఏఐపిహెచ్‌) ప్ర‌తి ష్టాత్మ‌క అవార్డు ల‌భించ‌డం ప‌ట్ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఏఐపిహెచ్‌ 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ మొత్తం 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ విభాగంలో మరొకటి గెలుచు కుంది.  నగరానికి ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ అవార్డులు రావ డం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణ, దేశ ఖ్యాతిని మరింత బలోపేతం చేశాయన్నారు. శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఎంపిక చేయబడిన ఏకైక భారతీయ నగరం హైద రాబాద్ మాత్రమే, కేటగిరీ అవార్డు మాత్రమే కాకుండా మొత్తం 'వరల్డ్ గ్రీన్ సిటీ 2022 అవార్డును గెలుచుకో వడం తెలంగాణ, భారతదేశానికి గర్వకారణం. మొత్తం 6 వర్గాల్లో. మునిసిపల్ శాఖ‌ మంత్రి కె.టి రామారావు మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ బృం దాన్ని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ  అరవింద్ కుమార్‌ను అభినందించారు.

వైసీపీ బండారం బయటపెట్టిన నిడదవోలు క్లాత్ మర్చంట్స్

రైతుల మహా పాదయాత్రకు వ్యతిరేకంగా ఆ పాదయాత్ర మార్గంలో వెలుస్తున్న ఫ్లెక్సీల గుట్టు రట్టయ్యింది. వివిధ సంఘాలు, వ్యక్తుల పేర్లతో వైసీపీ ఏర్పాటు చేస్తున్న ఆ ఫ్లెక్సీల లోగుట్టును  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వెలిసిన ఓ పోస్టర్ వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయాన్ని ఎలుగెత్తి చాటింది. రైతుల మహాపాదయాత్రకు వ్యతిరేకంగా నిడదవోలులో క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో వైసీపీ ఎమ్మెల్లే శ్రీనివాసనాయుడి ఫోటో పెద్దగా ఉంది. అయితే ఆ పోస్టర్ వెలసిన వెంటనే క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యేను కలిసి తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా ఇలా ఫ్లెక్సీలు వేయడం సరికాదని ఆయనకు చెప్పారు. వాటిని వెంటనే తొలగించేయాలనీ కోరారు. అయితే ఎమ్మెల్యే మాత్రం.. మీకు ఏం కాదు.. వాటి సంగతి నేను చూసుకుంటానంటూ సర్ది చెప్పి పంపించేశారు. అయితే క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు మాత్రం ఎమ్మెల్యే సమాధానంతో సమాధాన పడలేకపోయారు. దీంతో వారే రైతులు, ప్రజలకు విజ్ణప్తి చేస్తూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీపై గత ఫ్లెక్సీతో తమకేమీ సంబంధం లేదనీ, వాటిని ఎవరు ఏర్పాటు చేశారో, ఎందుకు చేశారో అన్న విషయంపై తాము చర్చించదలచుకోలేదనీ, వారి విజ్ణతకే వదిలేస్తున్నామనీ పేర్కొన్నారు. దీంతో రైతుల మహాపాదయాత్ర మార్గంలో  ఆ పాదయాత్రను వ్యతిరేకిస్తూ వెలుస్తున్న ఫ్లెక్సీలు, నిరసనల లోగుట్టు ఏమిటన్నది అందరికీ బోధపడిపోయింది. వైసీపీ వారే కుట్ర పూరితంగా సంఘాలు, సంస్థల   అనుమతితో సంబంధం లేకుండా వారి, వాటి పేర్లతో రైతులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని నిడదవోలు క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తో తేటతెల్లమైపోయింది. వైసీపీ బండారం బయటపడిపోయింది. ఇక వికేంద్రీకరణకు అనుకూలంగా విశాఖలో తలపెట్టిన ర్యాలీకి డ్వాక్రా మహిళలను తీసుకురావడానికి మొత్తం అధికార యంత్రాంగాన్నే నియోగించిన తీరు వైసీపీ ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నది తేటతెల్లం చేసింది. 

రికార్డు స్థాయిలో యు.ఎస్‌.వీసాలు

పెద్ద చ‌దువుల‌కో,  పెద్ద ఉద్యోగాల్లో స్థిర‌ప‌డాల‌నుకుంటున్న యువ‌త చాలామంది  అమెరికా వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లోనే ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ఇంజ‌నీరింగ్ విద్యార్థులు చ‌దువు ముగియ‌గానే విమానం ఎక్కేయాల‌న్న ఆతృతే క‌న‌ప‌రుస్తున్న‌వారు. ఈ ఏడాది అమెరికా ప్ర‌భుత్వం కూడా భార‌త్ విద్యార్ధుల‌కు రికార్డు స్థాయిలో వీసాలు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. చాలామంది భార‌త్‌విద్యార్ధులు త‌మ దేశంలో విశ్వ‌విద్యాల‌యాల్లో సీట్లు సంపాదించి వీసా పొంద‌డం ప‌ట్ల అమెరికా వ్య‌వ‌హారాల‌భార‌త్ ప్ర‌తినిధి పెట్రీషియా ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు. గ‌తేదాడి కోవిడ్ కార‌ణంగా అక్క‌డి వ‌ర్సిటీల్లో అడ్మి ష‌న్ల‌లో జాప్యం వ‌ల్ల విద్యార్ధులు చేర‌లేక‌పోయారు. కాగా 2022 ఏడాదికి రికార్డుస్థాయిలో 82 వేల మంది విద్యార్థుల‌కు వీసాలు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.  స్వ‌ల్ప‌కాలం ఉ్య‌దోగ లేదా వ్యాపార‌నిమిత్తం అమెరికా వెళ్లాల‌నుకున్న వ్యాపారులు, టూరిస్టుల వీసాలు ముఖ్యంగా బి1, బి2 వీసాలు మాత్రం 2024 మ‌ధ్య‌కాలంలోనే అందుబాటులోకి వ‌స్తాయ‌ని  ఆమె ఒక ప్ర‌క‌ట న‌లో తెలియ‌జేశారు. అయితే అన్ని దేశాల కంటే అమెరికా లో విశ్వ‌విద్యాల‌యాలు, సంస్థ‌ల ప‌ట్ల భార‌త్ విద్యార్థులు, ఉద్యోగార్థులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూప‌డం ప‌ట్ల ఆమె ఆనందం వ్య‌క్తం చేశారు. ఉన్న‌త విద్య‌కు ప్ర‌పంచంలోకెల్లా ఎన్న‌ద‌గ్గ కేంద్రంగా అమెరికాను గుర్తించ‌డం ప‌ట్ల అమెరికా ఎంబ‌సీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేసింది. రెండు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాల‌ను విద్యార్ధులు, ఉద్యోగులు మ‌రింత ఉన్న‌త‌స్థాయికి తీసికెళుతుండ‌డం ప‌ట్ల అమెరికా ప్ర‌భుత్వం  రెండు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను మెరు గుప‌రుస్తుంద‌ని పెట్రీషియా అన్నారు. న్యూఢిల్లీ, చెన్నై,హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, ముంబైల‌లోని అమెరికా దౌత్య కార్యాల యాలు గ‌త నాలుగు మాసాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్ధి వీసాల‌కు ద‌ర‌ఖాస్తులు పంపాయి. కోవిడ్  త‌ర్వా త గ‌తేడాది కూడా అమెరికా రికార్డు స్థాయిలో 62వేల వీసాలు ప‌ర్యాట‌కుల‌కు జారీచేసింది. 

జగన్ తీరుతో పాలన అస్తవ్యస్తం.. భవిష్యత్ పై వైసీపీ నేతల అయోమయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరు కారణంగా వైసీపీ  నేతలలో అయోమయం నెలకొంటోంది. దీంతో వారు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో.. ఏ అంశానికి ఎలా స్పందిస్తున్నారో వారికే తెలియన పరిస్థితి ఆవిష్కృతమౌతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తాను అమరావతికి వ్యతిరేకమని ఎన్నడూ అనలేదని చెప్పడమే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని అంటూనే వికేంద్రీకరణే మా లక్ష్యం అని చెప్పడం ఆయనలో నెలకొన్న అయోమయానికి, ఎటూ తేల్చుకోలేని సందిగ్ధతకు నిదర్శనంగా చెబుతున్నారు. మరో వైపు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం.. రాష్ట్రం నలుమూలలా మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటమౌతుండటంతో జగన్ తీరుతో తమ రాజకీయ భవిష్యత్ ఏమౌతుందన్న భయం, ఆందోళన వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడేళ్ల పాలనలో బటన్ నొక్కడం తప్ప మరో పని చేయలేదంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ రేంజ్ లో వ్యక్తమౌతోందో గడపగడపకూ కార్యక్రమంలో కళ్లకు కడుతోంది. అయితే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకూ కార్యక్రమంలో పడుతున్న ఇబ్బందులు, ఎదొర్కొంటున్న నిరసన సెగలనూ పట్టించుకోకుండా జగన్.. ఆ కార్యక్రమంలో చురుకుగా లేని వారికి వచ్చే ఎన్నికలలో టికెట్లు హుళక్కి అంటూ హెచ్చరికలు జారీ చేస్తండటంతో వారిలో నిరాశ, నిస్తేజం పెరిగిపోతున్నది. అయ్యేది కాక మానదు.. అన్న నైరాశ్యంతో అధినేత మాటలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే పరిస్థితికి వచ్చినట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి విషయంలో ఒకే సమయంలో రెండు విధాలుగా అంటే అమరావతికి మద్దతుగా, వ్యతిరేకంగా మాట్లడడాన్నిఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. గడపగడపకూ సమీక్షలో జగన్ బొత్స తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బొత్స లాంటి సీనియర్ మంత్రికే ఉక్కపోత తప్పని విధంగా సీఎం జగన్ తీరు ఉందంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటో ఇట్టే అవగతం చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే మూడున్నరేళ్ల సమయం గడిచిపోయింది. మరో ఏడాదిన్నరలో ( ముందస్తు లేకపోతే) మళ్లీ ప్రజల ముందుకు వెళ్లాలి. ఏం చేశామని, ఏం సాధించామని మరో సారి అవకాశం ఇవ్వాలంటే ప్రజలను ఓట్లు అడగగలమన్న ఆందోళన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనిపిస్తోంది. రాజధాని అంశంలో స్థిరత్వం లేని జగన్ వైఖరిని ఇప్పుడు రాష్ట్రమంతా ప్రశ్నిస్తుంటే.. తమను మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజలలో ప్రచారం చేయాలని ఆదేశించడమేమిటని ఎమ్మెల్యేలు తమలో తాము మధన పడుతున్నారు. అమరావతే రాజధాని అంటూ రైతుల మహాపాదయాత్రను జనం నిరాజనాలు పలుకుతుంటే.. తాము ఆ మహాపాదయాత్రకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి తమను ప్రజలలో మరింత చులకన చేస్తున్నదని మధన పడుతున్నారు. ఈ విషయాన్ని పలువురు వైసీపీ నేతల అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేశారు. ఒక్క అమరావతే అని కాదు.. రాష్ట్రంలో ఏ వర్గం కూడా జగన్ పాలన పట్ల, తీరు పట్ల సంతృప్తిగా లేదని ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద అంగీకరిస్తున్న పరిస్థితి. గత ఎన్నికలలో తమ విజయంలో కీలక పాత్ర పోషించిన దాదాపు అన్ని వర్గాలలోనూ ఇప్పుడు అసంతృప్తి గూడుకట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని చూపుతున్నారు. ఇక వ్యవసాయ మీటర్లకు మోటర్లు బిగించడంతో రైతులలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయంటున్నారు. థర్మల్ స్టేషన్లను   అదానికి అప్పగించే కుట్ర, విశాఖలో భూ కబ్జా దందాలు.. ఇలా ఒకటనేమిటి.. జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రతి చర్య, ప్రతి నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటోందని పరిశీలకులు అంటున్నారు.   ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూలా మారిన మూడు రాజధానుల అంశాన్నే తీసుకుంటే.. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా మూడు రాజధానులంటూ మొండిగా జగన్ ముందుకు వెళ్లడాన్ని ఎలా అర్దం చేసుకోవాలో అర్ధం కావడం లేదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఏ విధంగా చూసినా మూడు రాజధానుల నిర్ణయంతో ముందుకు సాగలేని పరిస్థితి నెలకొని ఉంటే.. ఏ ఉద్దేశంతో మూడు రాజధానులే ముద్దంటూ ముందుకు సాగాలన్నది అవగతం కావడం లేదని వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. 

పెద్ద నోట్ల రద్దుపై సమీక్షకు సుప్రీం ఓకే..!

ఆరేళ్ల కిందట దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిన పెద్ద నోట్ల రద్దు చర్యపై సమీక్షకు సుప్రీం ఓకే చెప్పింది. అవినీతి నిర్మూలన, నల్ల ధనం వెలికితీత లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో (నవంబర్ 8, 2016) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా అన్న ప్రశ్నకు లేదనే సమాధానం నిర్ద్వంద్వంగా వస్తుందనడానికి ఈ ఆరేళ్లలో నల్లధనం రెండింతలు పెరగడమే.. అలాగే అవినీతి పెచ్చరిల్లడమే నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు లక్ష్యంపై ప్రశ్నలు సంధించిన వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేసే పరిస్థితి నేటికీ నెలకొని ఉంది. ఆరేళ్ల తరువాత కూడా ఇప్పటికీ పద్ద నోట్ల రద్దు ద్వారా సాధించిందేమిటీ, ఒనగూరిన ప్రయోజనం ఏమిటి అన్న విషయంలో కేంద్రం సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదు. అసలు నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు పార్లమెంటును కానీ, అఖిలపక్ష నేతలను కానీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యవహరించిన ప్రభుత్వం ఆ తరువాతనైనా ఎన్నడూ నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఒనగూరిన ప్రయోజనాలను జాతికి వివరించిన పాపాన పోలేదు.    పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల జనం దేశంలో ప్రజల దైనందిన కార్య కలాపాలు గందరగోళంలో పడ్డాయో అందరికీ తెలిసిందే.  దేశంలో నల్ల ధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన మంత్రి మోడీ స్వయంగా పలు సార్లు తెలిపారు. అయితే నోట్ల రద్దు వల్ల నల్లధనం అరికట్టడమన్న లక్ష్యం నెరవేరకపోగా... ఆ బెడద మరింత పెరిగింది.   పెద్దనోట్ల రద్దు నిర్ణయం బెడిసి కొట్టిందని అధికార పార్టీకి చెందిన నాయకులే పలు సందర్భాలలో అంగీకరించారు. ఆ నిర్ణయం వల్ల చిన్న వ్యాపారులు, తోపుడు బండ్లపై పళ్ళు, కూరగాయలు వంటి నిత్యావసరాలను అమ్ముకునే రోజువారీ వ్యాపారులే ఎక్కువగా దెబ్బతిన్నారన్నది ఎవరూ కాదనలేని  వాస్తవం. ఈ విషయంపై నిర్వహించిన పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలోనే పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై దాఖలైన పిల్ విచారణ సందర్బంగా సమీక్షకు సుప్రీం కోర్టు నిర్ణయించింది. అలాగే  పెద్ద నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులు, పర్యవసానాలు, ఫలితాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్నీ, రిజర్వు బ్యాంకును ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను, ముఖ్యమైన నిర్ణయాలను ప్రశ్నించకూడదన్న లక్ష్మణ రేఖ తమకు తెలుసుననీ, అయినా, దేశ ప్రజలను ప్రభావితం చేసిన ఈ నిర్ణయం గురించిన వివరాలను తెలుసుకుకోగోరు తున్నామని జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ బోపన్న, జస్టిస్‌ రామసు బ్రహ్మణ్యం, జస్టిస్‌ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 

మ‌రో జంతువ‌నుకుని ఢీకొట్టి గాయ‌ప‌డ్డ రైనో సేఫ్

రోడ్డుమీద వెళుతున్న టీవీల‌ర్ వేగంగా వ‌స్తూ అక్క‌డ ఆగిన ఆటోకి త‌గులుకుంది, కుర్రాడు కింద‌ప‌డ్డాడు. వాడికి దెబ్బలు త‌గిలాయా లేదా అన్న‌ది కాకుండా అస‌లు పార్కింగ్ ప్లేస్ కానిచోట ఆటో నిలిపిన ఆటో డ్రైవ ర్ ఆటో మీద గీత ప‌డింద‌ని ఆ కుర్రాడిని తిటిపోశాడు. కొద్దిరోజుల త‌ర్వాత ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది మ‌రో వ్య‌క్తికి గాయాల‌య్యాయి. ఆ సంగ‌తి వ‌దిలి కారు పెద్ద మ‌నిషి రెండువేలు క‌ట్టించుకు న్నా డు. మ‌నుషులం గ‌నుక గాయ‌ప‌డినా, బండికి దెబ్బ‌త‌గిలినా గొడ‌వ‌ప‌డ‌తాం, ఆస్ప‌త్రికి వెళ‌తాం. మ‌రి నోరులేని జంతువు ఢీకొని గాయ‌ప‌డితే? అవును ఇది ఊహించ‌ని ప్ర‌మాద‌మే. చాలా ప్రాంతాల్లో అట‌వీ ప్రాంతాల్లోంచి రోడ్డు దాటి వెళుతూ గాయ‌ప‌డుతూంటాయి, ఒక‌టో అరో చ‌నిపోతూనూ ఉంటాయి. కానీ ఏ ప్ర‌భుత్వం కూడా వాటి సంగ‌తి ప‌ట్టించుకోవు.  కానీ అస్సాం ముఖ్య‌మంత్రి బిశ్వ‌శ‌ర్మ మాత్రం ప‌ట్టించుకు ని రైనో బాగోగులు క‌ను గొన్నారు.  క‌జిరంగా నేష‌న‌ల్ పార్కు స‌మీపంలో ఒక లారీ ఆగిఉంది. సాధార‌ణంగా జింక‌లు, లేళ్లు, కుందేళ్లు వంటివి ఆ ప్రాంతాల్లో రోడ్డు దాటి వెళుతూంటాయి. అలాగే మొన్నామ‌ధ్య ఒక రైనో రోడ్డుమీద‌కి వ‌చ్చింది. లారీని చూసింది. ఇదేదో త‌న‌వంటి పెద్ద జంతువు అనుకుని పొడ‌వ‌డానికి దూసుకువెళ్లింది. దానికి  అది ఆగి  ఉన్న లారీ అన్న‌ది తెలీదుగదా. లారీ ప‌క్క‌భాగాన్ని బ‌లంగా ఢీకొట్టింది. కానీ లారీ కాస్తంత క‌దిలిం ది. మ‌ళ్లీ ఢీకొట్టిం ది కానీ లారీ ప‌క్క‌భాగానికి ఉండే రేకు సొట్ట‌బ‌డిందంతే. రైనో మాత్రం బాగానే గాయ‌ప‌డి ప‌డి పో యింది. లేవ బోయింది..కానీ దానివ‌ల్ల కాలేదు. ఇంత‌లో లారీ వెళిపోయింది. రైనో లేచి మెల్ల‌గా అడ‌విలోకి వెళిపోయింది. దాని సంగ‌తి తెలిసి అధికారులు డ్రోన్ స‌హాయంతో అది ఎక్క‌డుందో తెలుసు కుని ప్రాణాపాయం లేద‌ని తెలిసి హ‌మ్మ‌య్య అనుకున్నారు. అదే సంగ‌తి ముఖ్య‌ మంత్రి బిశ్వ‌శ‌ర్మ‌కి తెలియ‌జేశారు.  అస‌లు అట‌వీ ప్రాంతం ద‌గ్గ‌ర్లోని హైవేల‌కు స్పీడ్ బ్రేక‌ర్లు గురించి చాలాకాలం నుంచే అక్క‌డి వారు గోడు పెడుతున్నారు. కానీ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అక్క‌డే కాదు దేశంలో చాలాప్రాంతాల్లో ఈ ప‌రిస్థితి ఉంది. క‌నీసం ఆ ప్రాంతాల్లో వేగం త‌గ్గించి వాహ‌నాలు వెళ్లాల‌న్న హోర్డింగ్ హెచ్చ‌రిక‌లూ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే మూగ‌జీవాలు చాలా ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అట‌వీశాఖ‌, రైల్వే శాఖ‌కు, రోడ్డుర‌వాణాశాఖ‌కు అనేక ఫిర్యాదులు వెళ్లినా ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మూగ‌జీవాల సంర‌క్ష‌ణ గురించి పెద్ద ప్ర‌చారం చేసేవారంతా ప్ర‌ధానంగా ఈ విష‌యంలో వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. 

గద్దర్ గాయెబ్.. మునుగోడు ప్రజాశాంతి పార్టీ ఆభ్యర్థిగా పాల్

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ రంగంలోకి దిగుతారని ప్రచారమైనా చివరి నిముషంలో ఆయన గాయబ్ కావడంతో రంగంలోకి స్వయంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దిగారు. ఇక నామినేషన్ లకు గుడువు ముగుస్తుందనగా చివరి నిముషంలో కేఏ పాల్ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఈ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ ను నిలబెడుతున్నట్లు పాల్ స్వయంగా కొద్ది రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఏం జరిగిందో కానీ.. చివరి నిముషంలో పాల్ స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే తానే స్వయంగా నిమినేషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందో పాల్ వివరించారు. నామినేషన్ వేయకుండా గద్దర్ ను పోలీసులు అడ్డుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తానే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పాల్ ఆరోపించారు. డబ్బు ఆశ చూపుతూ జనాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో ఓటుకు  రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

వెన్నుపోటు వక్ర భాష్యానికి ఫుల్ స్టాప్ పెట్టిన బాలయ్య అన్ స్టాపబుల్ షో

అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు. అలాగే, నిప్పులాంటి నిజాన్నిగుప్పిట పట్టి దాచలేరు. అందుకే పెద్దలు నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటారు. కానీ, నిజం గడపదాటే లోగా, అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. అబద్ధాన్ని నిజం చేస్తుంది అదీ నిజమే.  అదీ పెద్దలు చెప్పిన మాటే.  అయితే, సత్యాన్వేషణ క్సోం జరిగే సంఘర్షణలో  అసత్యాన్నే నమ్ముకుని, రాజకీయం చేయాలనుకునే వారు, తాత్కాలికంగా కొంత పైచేయి సాధిస్తే సాధించవచ్చును కానీ, చివరకు సత్యమే జయిస్తుంది. సత్యమేవ జయతే.  అదే అంతిమ సత్యం.కానీ, ఈలోగా జరగకూడని అనర్ధం జరిగిపోతుంది. నిజం,నిలకడ మీద తెలిసినా మచ్చ మాత్రం అలాగే మిగిలి పోతుంది.   తెలుగు దేశం పార్టీ చరిత్రలో, అలా మిగిలిన మచ్చే, ఆగస్టు  సంక్షోభం. నిజం, 1995లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన ఆగస్టు సంక్షోభానికి సంబంధించి ఇన్నేళ్ళుగా దుష్ప్రచారం జరుగుతూనే వుంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని,నిలబెట్టే పవిత్ర ఆశయంతో, నందమూరి తారక రామా రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీని మొగ్గలోనే  తుంచేందుకు, దుష్ట శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాయి. నాదెండ్ల భాస్కర రావు (30 రోజుల ముఖ్యమంత్రి) కుముద్ బెన్ జోషీ (అప్పటి రాష్ట్ర గవర్నర్) ను పావులుగా, ప్రయోగించి తెలుగు దేశం పార్టీని,  ఎన్టీఆర్ ఆశయాలను రాజకీయంగా హత్యచేసేందుకు,రాజకీయ దుష్టశక్తులు చేసిన విఫల ప్రయత్నాలు చెరిపేస్తే చెరిగి పోయేవి కాదు. అవే దుష్ట శక్తులు లక్ష్మీ పార్వతి రూపంలో మరో ప్రయత్నం చేశాయి. ఇది నిజం. నిజమైన చరిత్ర. అయితే, చరిత్రను వక్రీకరించిన, ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తున్న దుష్ట శక్తుల దుష్ట పన్నాగాలను, సమర్ధవంతంగా ఎదుర్కుని, పార్టీని, ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు చంద్రబాబు చేసిన విరుగుడు యజ్ఞాన్ని  ‘వెన్నుపోటు’ గా చిత్రించిన, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఈ రోజుకు కూడా జరుగుతూనే వుంది. అయితే, ఇప్పడు, ఆనాటి సంక్షోభానికి సూత్రదారులుగా, పాత్రదారులుగా అపవాదులు మోస్తున్న, ఎన్టీఅర్ నిజమైన వారసులు, చంద్రబాబు నాయుడు, నందమూరి బాల కృష్ణ నోరు విప్పారు. నిజాన్ని అవిష్కరించారు. ఇదుకు వేదికగా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2. సక్సెస్‘ఫుల్’గా సాగిన సీజన వన్, కొనసాగింపుగా మొదలైన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే  సీజన్-2, ప్రేక్షకులలో సహజంగానే ఆసక్తిని పెంచింది. అందులోనూ, బావా, బావ మరుదుల సంవాదం మధ్యలో బాలయ్యా  అల్లుడు, మేనల్లుడు లోకేష్ బాబు ఎంట్రీతో  రక్తికట్టించిన సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆ ఆసక్తిని మరింతగా పెంచింది ఈ ప్రోమో విడుదలైన నాలుగు రోజుల్లోనే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 7,996 కామెంట్లు లభించాయి. ఈ రియాల్టీ షోలో చంద్రబాబు తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఎలాంటి ముసుగులు లేకుండా అవిష్కరించారు. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఎప్పుడూ, ఎన్నడూ బయట పెట్టని కాలేజీ అల్లర్ల మొదలు, వైఎసార్ తో స్నేహం వరకు, అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రాజకీయంగా తప్పయిందని అంగీకరించడం వరకు చాలా విషయాలను ప్రస్తావించారు. అయితే, ఈ అన్నిటినీ మించి రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఒక మలుపుగా మిగిలిన 1995 ఎపిసోడ్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు, బాలయ్య బాబు  మనసు విప్పి మాట్లాడారు.. చంద్రబాబు నాయుడు తమ రాజకీయ జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం గురించి, బాలయ్య  అడిగిన ప్రశ్నకు చంద్రబాబు  చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించారు.  1995 డెసిషన్‌. దీనికి ముందు వచ్చిన ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. అధికారంలోకి వచ్చాం. అయితే.. దీనికి ముందే.. ఫ్యామిలీలో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. ఐదుగురు ఆ నిర్ణయం వెనుక సాక్ష్యంగా ఉన్నారు. ఐదుగురం కలిసి ఎన్టీఆర్‌ను కలి శాం. రాజకీయాలపై చర్చించాలని కోరాం. అప్పుడు వచ్చిన వారిలో ఇద్దరిని (హరికృష్ణ, బాలకృష్ణ) బయటకు పంపించాక. 3 గంటలు చర్చించారు. నేను చాలా సేపు రిక్వెస్ట్‌ చేశాను.  మీటింగ్‌ పెట్టుకుందామన్నా. చివరకు కాళ్లు పట్టుకుని అడుక్కున్నా. మీరు ఒక్కటంటే ఒక్క  మీటింగ్‌ పెట్టి ధైర్యం ఇస్తే చాలండి.. ఇంకేం జరగదని చెప్పా. ఆయన వినలేదు. తర్వాత మీకు కూడా తెలిసిందే.  రామాంజనేయ యుద్ధమే జరిగింది. అది చరిత్ర. ఎన్టీఆర్‌తో ముందుకు వెళ్లాలనేది అందరి అభీష్టం. అయినా.. వ్యక్తి కన్నా.. ఆయన సిద్ధాంతాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరం ముందుకువెళ్లాం. అప్పుడు ఆ సమయం లో మీరు (బాలయ్య) కూడా ఉన్నారు. అప్పుడు.. ఆ సమయం లో మనం తీసుకున్న నిర్ణయం తప్పా? బయట నుంచి వచ్చి న వ్యక్తి ప్రభావం ఆయనపై పెరిగింది. ఆయన అడిగింది ఎప్పుడూ కాదనలేదు. అనేక ప్రయత్నాలు విఫలమయ్యాకే.. ఈ ‘నిర్ణయం’ వచ్చింది. ఆ రెండు మూడు నెలలు.. మీరు ఎంత మథనపడ్డారు? ఆయనకు చాలా రకాలుగా చెప్పాం. ఆయనకు నమ్మినబంట్లుగా ఉన్నవారు కూడా చాలా సార్లు చెప్పారు” అంటూ ఆరోజు జరిగిన వాస్తవ చిత్రాన్ని అవిష్కరించారు. ఆలాగే, ఆ రోజు తీసుకున్న నిర్ణయం తప్పా? అంటూ చంద్రబాబు నాయుడు, అడిగిన ప్రశ్నకు బాలయ్య   కాదని, స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అంటే కాదు, బాలయ్య   నందమూరి కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా. ఒక పార్టీ సభ్యుడిగా చెబుతున్నా. ఒక పౌరుడిగా చెబుతున్నా.1999 ఎన్నికలు అదే నిరూపించాయి. ఇవాల్టికీ ఆయన చరిత్రలో మిగిలారంటే.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు  ఆయనకు ఇచ్చిన గౌరవమే కారణం అని స్పష్టం చేశారు.   తమిళనాడులో రామస్వామి నాయకర్‌ విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆయన ఓ 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఉన్నవారు ఆయనతో విభేదించారు. తర్వాత,  ఆయన సిద్ధాంతాలను మాత్రం ముందుకు తీసుకువెళ్లారు. అదే ఎన్టీఆర్‌ చరిత్ర కూడా!!  ఇది.. మీ బిగ్‌ డెసిషన్‌ కాదు.. మన కుటుంబాల డెసిషన్‌.  ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, అని చెప్పారు.   అయితే, చరితను చరిత్రగా చూడలేని, కొందరు, ముఖ్యంగా తల్లికి చెల్లికి, వెన్నుపోటు పొడిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భజన బృందం  ఇప్పటికీ నిజాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. అయిత విచిత్రం ఏమంటే,  బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లు  అబద్ధాలలో పీహెచ్డీలు చేసిన వైసేపీ నేతలు లక్ష్మీ పార్వతిని, నాదెండ్ల భాస్కరరావు, దగ్గుబాటి వెంకటేశ్వర రావును, వారు రాసిన ‘పవిత్ర’ గ్రంధాలను ఉటంకిస్తున్నారు. అయితే, ఇప్పటికే 1999 ఎన్నికలు మొదలు ఇప్పటివరకు నిజం ఏమిటో ప్రజలే నిరూపించారు. మళ్ళీ మళ్ళీ నిరుపిస్తునే ఉంటారు. అందులో సందేహం లేదు.

తెలంగాణకు వరుణ గండం.. మరో మూడు రోజులు వానలే వానలు

తెలంగాణను వరుణుడు విడవడం లేదు. భారీ వర్షాలు తెరిపిచ్చాయన్న ఆనందం ఒక్క రోజులోనే ఆవిరయ్యేలా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికకు తగినట్లుగానే హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వాతావరణ కేంద్రం హెచ్చరికతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలలో సిబ్బందిని మోహరించింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. 

కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు?

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా మీడియాలో ఆయన పర్యటన వివరాలు, ఎవరెవరితో భేటీ అయ్యారు. ఎవరెవరు ఆయనను కలిశారు అన్న వివరాలు ప్రముఖంగా వస్తాయి. ముఖ్యంగా తెరాస సామాజిక మాధ్యమంలో ఈ వివరాలను, విషయాలనూ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. గత కొంత కాలంగా ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలతో విరుచుకుపడుతుండటంతో ఆయన ప్రసంగాలూ, ప్రకటనలూ జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా వస్తున్నాయి. అలాంటిది ఆయన జాతీయ పార్టీని ప్రకటించిన తరువాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేతగా తొలి సారి హస్తిన పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆయన పర్యటనకు సంబంధించి ఎటువంటి వార్తలూ బయటకు పొక్కడం లేదు. అసలు ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారు. ఎవరెవరితో భేటీ అవుతున్నారు అన్న విషయాలను కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే ఆయన హస్తినలో బస చేసి నాలుగు రోజులు అయ్యింది. తొలి రెండు రోజులలో ఆయన బీఆర్ఎస్ కోసం కిరాయికి తీసుకున్న భవనాన్ని పరిశీలించారనీ, అలాగే ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న తెరాస భవనాన్ని పరిశీలించి కొన్ని సూచనలు చేశారనీ మాత్రమే వార్తలు వచ్చాయి. అంతే ఆ తరువాత ఆయన హస్తినలో ఏం చేస్తున్నారు అన్న విషయాలపై ఎటువంటి సమాచారం తెలియడం లేదు. పార్టీ వర్గాలు కూడా ఈ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గోప్యతను పాటిస్తున్నారు. అన్నిటికీ మించి ఈ పర్యటనలో ఆయన వెంట ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమార్తె కల్వకుంట్ల కవిత, మరో బంధువు సంతోష్ ఉన్నారు. దీంతో ఆయన హస్తిన పర్యటనకు కారణాలపై రాజకీయ వర్గాలలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే తాను కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ గురించి ఆయన హస్తినలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిందీ లేదు. అలాగే పార్టీ ప్రకటన తరువాత ఇప్పటి వరకూ ఒక బహిరంగ సభ నిర్వహించిందీ లేదు. పార్టీ జెండా, అజెండాలపై వివరాలేవీ వెల్లడించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చాలని చేసిన తీర్మానాన్ని పార్టీ ప్రతినిథుల ద్వారా ఈసీకి సమర్పించి ఇక ఆ విషయంపై నోరెత్తడం లేదు. కేసీఆర్ సహజంగా చిన్న విషయానికి కూడా బ్రహ్మాండమైన ప్రచారం ఇస్తారు. బ్రహ్మాండం అన్నది ఆయన ఊతపదంలా వాడుతారు. అయితే బీఆర్ఎస్ విషయంలో మాత్రం ఆయన బ్రహ్మాండమైన మౌనం మాత్రమే పాటిస్తున్నారు. కనీసం తెలంగాణ ప్రజలకు కూడా ఆయన బీఆర్ఎస్ గురించి తన నోటి ద్వారా ఒక్క మాట చెప్పలేదు. ప్రజలతో సంబంధం లేకుండానే పేరు మార్పు తంతును కానిచ్చేశారు.  జాతీయ పార్టీని ప్రకటించిన దసరా రోజున ఆయన మీడియాతో మాట్లాడలేదు. జాతీయ పార్టీ కదా హస్తిన వేదికగా ఆయన మాట్లాడతారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఆయన హస్తినలో బస చేసి నాలుగు రోజులైనా ఇప్పటి వరకూ కొత్త పార్టీ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. దీంతో ఆయన హస్తిన పర్యటన వెనుక జాతీయ పార్టీకి మద్దతు కూడగట్టడానికి మించిన స్వకార్యమేదో ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.

వివేకా హత్య కేసులో సాక్షుల భద్రతపై ఏపీ సర్కార్ కు సుప్రీం అక్షింతలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ బయట విచారించాలని ఆయన కుమార్తె సునీత  దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు సాక్షుల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు తీవ్రతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ స్పందన లేదని వ్యాఖ్యానించింది.  సాక్షులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించలేని దుస్థితిలో ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 1+1 భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పగా, అది సరిపోతుందా అని ప్రశ్నించింది. ఈ కేసు విషయంలో మీ(రాష్ట్ర ప్రభుత్వం) తీరు ఎలా ఉందో అర్దమౌతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానదరెడ్డి హత్య కేసులో సాక్షుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సాక్షులకు భద్రత కల్పించే విషయంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విస్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని.. సాక్షులకు ఏమైనా జరిగితే పరిస్థితేంటని నిలదీసింది. ఈ దశలో సాక్షులకు ఉన్న ముప్పు వివరాలను కోర్టుకు సమర్పించామని, ఇప్పటికే ఇద్దరు సాక్షులు మరణించారని సునీత తరఫు న్యాయవాది పేర్కొన్నారు.    తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల  19వ తేదీకి వాయిదావేసింది. కాగా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతామని కోరుతూ వివేకా బంధువు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. కాగా ఇదే కేసులో ఇంప్లీడ్‌కు   నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన దరఖాస్తును అనుమతించింది. 

తెదేపా గూటికి కాసాని జ్ణానేశ్వర్

కాసాని జ్ఞానేశ్వర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీసీ నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి.  రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా పని  చేసిన కసాని జ్ణానేశ్వర్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2007లో మన పార్టీ స్థాపించి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీసీ నేతగా ఆయనకు ఉన్న గుర్తింపు ప్రత్యేకం. ఆయన తెలుగుదేశం గూటికి చేరారు. కాసాని జ్ణానేశ్వర్ న తమ పార్టీలో చేరాల్సిందిగా తెరాస, బీజేపీలు కోరాయి. మంత్రి హరీష్ రావు స్వయంగా జ్ణానేశ్వర్ నివాసానికి వెళ్లి మరీ తెరాసలోకి ఆహ్వానించారు. అలాగే ఈటెల కూడా బీజేపీ గూటికి రావాల్సిందిగా ఆయనను కోరారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈటెల ఆహ్వానాన్ని కాసాని మన్నిస్తారనీ, ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనీ అంతా భావించారు. అయితే అనూహ్యంగా కాసాని హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. కాసాని తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్‌ సిద్ధాంతాలతో పార్టీని తెలంగాణలో బలోపేతం చేద్దాం. సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టండి  అని కాసానికి సూచించారు.     

హిమాచల్ లో ఎన్నికల నగారా.. గుజరాత్ ఊసే లేదు!

కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం వచ్చెనెల 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం   హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 17న విడుదల కానుంది. అదే రోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు సమయం ఉంటుంది. సాధారణంగా 6 నెలల్లోపు అసెంబ్లీల పదవీ కాలం ముగుస్తున్న రాష్ట్రాలన్నిటికీ కలిపి ఒకే సారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ మాత్రం గుజరాత్ ను వదిలి కేవలం హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయడం పట్ల విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8కి ముగుస్తుండగా, గుజరాత్ అసెంబ్లీ గడువు  వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ముగుస్తుంది.  హిమాచల్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, ప్రతిపక్షాలను తిప్పిగొట్టేందుకు వ్యూహరచన చేసే అవకాశం మోదీ సర్కారుకు ఇచ్చేందుకే వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిమాచల్‌ అసెంబ్లీతో పాటు గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకపోవడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తప్పుపట్టారు.  గుజరాత్ లో భారీ వాగ్దానాలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోదీకి తగిన సమయం లభించాలన్న ఉద్దేశంతోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండా జాప్యం చేశారని విమర్శించారు. అయితే ఈ విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేయడంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని స్పష్టం చేసింది. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హిమాచల్‌ షెడ్యూల్‌ను ముందుగా విడుదల చేసినట్లు పేర్కొంది.  రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగియడానికి  మధ్య 40 రోజుల వ్యవధి ఉందనీ, నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే 30 రోజుల వ్యవధి సరిపోతుందని చెప్పారు. అంతే కాకుండా 2017లో కూడా ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా షెడ్యూల్‌ ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు చేసింది. అప్పట్లో అక్టోబరు 13న హిమాచల్‌ ప్రదేశ్‌కు, 25న గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినట్లు  తెలిపింది.

 కోహ్లీ, శ‌ర్మ‌,అశ్విన్ విజృంభిస్తే క‌ప్పు మ‌న‌దే

డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రే లియా ఈసారి హై-వోల్టేజ్ టీ20 ప్రపంచ కప్ 2022కి ఆతిథ్యం ఇస్తోంది. పొరుగు నున్న‌ న్యూజి లాండ్ కూడా ఫేవరెట్‌గా ఉంటుంది. ఆసీస్‌ లో పెద్ద మైదానాలను పరిశీ లిస్తే, కివీస్‌కు చక్కటి స్పిన్ బౌలింగ్, ఫీల్డింగ్ యూనిట్ ఉంది. అదే సమయంలో, దక్షిణాఫ్రికా,ఇంగ్లండ్‌లు కూడా గేమ్  పొట్టి వెర్షన్ కు కావలసిన నైపుణ్యం  కలిగి ఉన్నాయి. ఆసీస్ పిచ్‌ల దృష్ట్యా కింగ్ కోహ్లీ, కెప్టెన్ శ‌ర్మ‌, ఎంతో అనుభ‌వం ఉన్న స్పిన్న‌ర్ అశ్విన్ విజృంభిస్తే క‌ప్పు మ‌న‌దే అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు.  భారత్ విషయానికొస్తే, వారి ఆశలు కచ్చితంగా బ్యాటింగ్‌పైనే ఉంటాయి. టీమ్ ఇండియా మాత్రమే ఈ విభాగంలో బలీయంగా కనిపిస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సిక్స్ కొట్టే సామర్ధ్యాలతో పాటు, ఇటీవ‌ల ప్ర‌త్య‌ర్ధుల‌ను ఒణికించిన బ్యాట‌ర్ సూర్య‌కుమార్ భార‌త్‌కు వెన్నుద‌న్నుగా ఉన్నాడు. అత‌ని ప్ర‌తిభ‌ను ఈ టోర్నీలో మ‌రింత చూడ‌వ‌చ్చు. విరాట్ కోహ్లీ కూడా ఇటీవల ముగి సిన ఆసియా కప్‌లో సెంచరీ కరువును ముగించడం ద్వారా తన ఫామ్‌ను దెబ్బతీశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా లోయర్ మిడిల్ఆర్డర్‌లో ఉప‌యోగ‌ప‌డే బ్యాటర్ అని ఆలస్యంగా నిరూపించుకున్నాడు. గొప్ప బ్యాట్ వేగంతో అతను ఎలివే షన్‌ను అందుకుంటాడు, అతని బ్యాటింగ్ నైపుణ్యం స్లాగ్ ఓవర్ల సమయంలో స్కోరింగ్ రేటుకు అవసరమైన వేగాన్ని అంది స్తుంది. ఫాస్ట్, బౌన్సీ ఆస్ట్రేలియన్ పిచ్‌లలో ఆడటానికి భారత్ కూడా చాలాదూరం వచ్చింది. మానసిక అడ్డంకి నుండి బయట పడింది. మెన్ ఇన్ బ్లూ  12 టీ20 గేమ్‌లలో ఏడింటిని గెలిచిన రికార్డును కలిగి ఉంది. అయితే,టీమ్ఇండియాకు బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఇటీ వల ముగిసిన ఆసియా కప్, టీ20 సిరీస్లలో వారు ఇప్పటికే దానికోసం బాధపడ్డారు. అను భవజ్ఞుడైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ప్రపంచ కప్ జట్టు నుండి మినహాయిం చడం తో డిపార్ట్‌మెంట్‌లో భారత సమ స్య మరింత జటిలమైంది. కానీ, ఆస్ట్రేలియాలోని పెద్ద మైదా నాలు భారత బౌలర్లలో కొంత ఆశను నింపాయి. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకారం, డెలి వరీలను ఎగరవేయడం, స్లో బౌన్సర్లను సమర్థవంతంగా ఉప యోగించడం వంటి వైవిధ్యాలపై పని చేయడానికి ఇది బౌలర్లకు లైసెన్స్ ఇస్తుంది. గాయం కారణంగా ఆధునిక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను కూడా భారత్ కోల్పోయింది. అతని సమర్థవంతమైన బౌలింగ్ ఎల క్ట్రిక్ ఫీల్డింగ్‌తో పాటు, అందుబాటులోని ఆల్-రౌండర్ దూకుడుగా బ్యాటింగ్ చేయడం ద్వారా జట్టుకు అవసరమైన బ్యాలెన్స్‌ను అందించాడు. పాండ్యాతో పాటు, డెలివరీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు అక్షర్ పటేల్, దీపక్ హుడాపై ఉంది. ఫీల్డింగ్ విషయానికొస్తే, ఇటీవలి కాలంలో భారత్‌ ప్రమాణం సమానంగా పడిపోయింది. ఫీల్డింగ్ కోచ్ దాని గురించి నిజం గా ఆందోళన చెందాలి. ఇటీవల ముగిసిన ఆసియా కప్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో, భారత్‌ తమ పేలవమైన ఫీల్డింగ్ కారణం గా ఇప్పటికే చాలా నష్టపోయింది. మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రకారం, జడేజా లేకపోవడంతో, జట్టులో ఎక్స్-ఫాక్టర్ లేదు. ప్రతి మ్యాచ్‌లో ఆ అదనపు 20, 30 పరుగులు చేయడం బ్యాట్స్‌మెన్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఆధునిక ఆటలలో, క్యాచ్‌ లు తరచుగా మ్యాచ్లను గెలుస్తాయి, అయితే చాలా మంది యువకుల జారే వేళ్లు జట్టు థింక్ ట్యాంక్‌కు ఆందోళన కలిగిస్తాయి. అయితే, కోచ్ రాహుల్ ద్రవిడ్వంటి లెజెండ్ వ్యవహారాలకు నాయకత్వం వహిస్తున్నందున, మెగా ఈవెంట్ కీలక మైన క్షణా లలో పతనాన్ని నిరోధించడానికి ‘ది వాల్’ మాత్రమే భారత జట్టును ప్రేరేపించగలదని గట్టి అభిమానులు ఆశిస్తున్నారు. ఈ టోర్నమెంట్ వాస్తవానికి 2020 చివరిలో షెడ్యూల్ చేయబడింది, కానీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదా వేయ బడింది. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో భారత్ ఏడో ఎడిషన్‌ను నిర్వహించింది. 45 మ్యాచ్‌లు గీలాంగ్, హోబర్ట్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల్లో జరుగుతాయి. సెమీ-ఫైనల్‌లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, అడి లైడ్ ఓవల్‌లో జరుగుతాయి. ఫైనల్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. గతేడాది దుబాయ్‌లో జరిగి న ఫైనల్‌లో న్యూజి లాండ్‌ను ఓడించి తొలి టైటిల్ ను గెలుచుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా ప్రస్తుత ఛాంపియన్‌గా నిలిచింది.వెస్టిండీస్ (2012, 2016) రెండుసార్లు టైటిల్ గెలు చుకోగా, భారత్ (2007), పాకిస్థాన్ (2009), ఇంగ్లండ్ (2010), శ్రీలంక (2014) ఒకసారి టైటిల్ గెలుచుకున్న ఇతర జట్లు. మాజీ చాంపియన్‌లు అయినా వెస్టిండీస్‌, శ్రీలంక తొలి క్వాలిఫయింగ్‌ దశలో ఆడనున్నాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూపు లుగా విభజించారు, వాటిలో మొదటి రెండు స్థానాలు సూపర్ 12కి చేరుకుంటాయి. గ్రూప్ ఏలో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యుఏఇ., గ్రూప్ లో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి.

కళా తపస్వి విశ్వనాథ్ కు వైయ‌స్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు

 ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వైయ‌స్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైయ‌స్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. వివిధ విభాగాల‌లో మొత్తం 30మందికి ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. క‌ళ‌లు, సంస్కృతి విభాగంలో క‌ళాత‌పస్వి కె. విశ్వ‌నాథ్‌, ఆర్ నారాయ‌ణ మూర్తిల‌కు వైయ‌స్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్ర‌క‌టించింది. అలాగే రంగ‌స్థ‌ల క‌ళాకారుడు నాయుడు గోపి, క‌లంకారీ క‌ళాకారుడు పిచుక శ్రీ‌నివాస్‌, షేక్ గౌసియా బేగంల‌కు కూడా ఈ అవార్డు  ప్ర‌క‌టించారు. అలాగే సాహిత్య సేవ విభాగంలో విశాలాంధ్ర ప‌బ్లిషింగ్ హౌస్‌, ఎమెస్కో ప్ర‌చుర‌ణాల‌యం, ర‌చ‌యిత డాక్ట‌ర్ శాంతినారాయ‌ణ‌కు, వ్యవసాయ విభాగంలో ఆదివాసీ కేష్యూనట్ ఫార్మర్స్ కంపెనీ సోడెం ముక్కయ్య, కుశలవ కుశ‌ల‌వ కోకోన‌ట్ ఫార్మ‌ర్స్ కంపెనీ యజమాని ఎ. గోపాల‌కృష్ణ‌,అన్న‌మ‌య్య మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్ కు చెందిన జ‌య‌బ్బ నాయుడు, అమృత‌ఫ‌ల ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్ కంపెనీ  ఓనర్ కె.ఎల్.ఎన్. మౌక్తిక‌, క‌ట్ట‌మంచి బాల‌కృష్ణారెడ్డిలకు ఈ అవార్డును ప్రకటించింది. ఇక మహిళా సాధికారత, రక్షణ విభాగంలో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రజ్వల ఫౌండేషన్ కు చెందిన సునీతా కృష్ణన్, శిరీషా రీహేబిలిటేష‌న్ సెంట‌ర్‌, దిశ పోలీసింగ్ లకు ఇచ్చింది. మూడో అవార్డును దిశ – పోలీసింగ్‌కు అలాగే వైయ‌స్ అచీవ్‌మెంట్ అవార్డుల‌ను ర‌వాడ జ‌యంతి, ఎస్వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, రాయుడు సుబ్ర‌హ్మ‌ణ్యం, హ‌జ్ర‌త‌య్య‌, పి. శ్రీ‌నివాసులులకు సంయుక్తంగా ప్ర‌క‌టించింది ఏపీ సర్కార్. అలాగే విద్యారంగంలో మ‌ద‌న‌ప‌ల్లి రుషి వ్యాలీ, కావ‌లి జ‌వ‌హ‌ర్ భార‌తి విద్యా సంస్థ‌లకు, వ్యక్తిత్వ వికాసం విభాగంలో బీవీ పట్టాభిరామ్ కు ఈ అవార్డు ప్రకటించింది. మీడియా రంగంలో భండారు శ్రీనివాసరావు, సతీష్ చందర్, మంగు రాజగోపాల్, ఎంఈవీ ప్రసాదరెడ్డిలకు, వైద్య రంగంలో డాక్ట‌ర్ బి. నాగేశ్వ‌ర‌రెడ్డి, డాక్ట‌ర్ వ‌ర‌ప్రసాద‌రెడ్డి, ప్ర‌తాప్ సి రెడ్డి, గుళ్ళ‌ప‌ల్లి నాగేశ్వ‌ర‌రావులకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రకటించింది.  గ్రంధి మ‌ల్లికార్జున రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రకటించింది. వీరందరికీ ఈ పురస్కారాలను సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అంటే నవంబర్ 1న ప్రదానం చేస్తారు.

నగరి బరిలో తెలుగుదేశం అభ్యర్థి వాణీ విశ్వనాథ్?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నగరి బరి నుంచి మాజీ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ను బరిలో నిలపాలని తెలుగుదేశం యోచిస్తోందా? నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేకు దీటుగా పోటీ ఇవ్వగలిగే అభ్యర్థి వాణీ విశ్వనాథ్ అని భావిస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే ఔననే అనాల్సి ఉంటుందంటున్నారు పరిశీలకులు. అప్పుడెప్పుడో గత ఎన్నికల ముందు నగరిలో తెలుగుదేశం అభ్యర్థిగా వాణి విశ్వనాథ్ పేరును తెలుగుదేశం పరిశీలించింది. అయితే అప్పట్లో ఆ పరిశీలన పరిశీలన స్థాయిలోనే ఆగిపోయింది. వాణి విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరిందీ లేదు.. నగరి అభ్యర్థిగా రంగంలోకీ దిగలేదు. మళ్లి ఇన్నాళ్లకు మరోసారి నగరి తెలుగుదేశం అభ్యర్థిగా వాణి విశ్వనాథ్ పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం నగరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా  గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు ఉన్నారు. ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనే ఇప్పటి వరకూ అంతా భావిస్తున్నారు. అయితే హఠాత్తుగా వాణి విశ్వనాథ్ తెరపైకి వచ్చారు. పార్టీ పరంగా ఇప్పటి వరకూ అధికారికంగా ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. అలాగే ఆమె పార్టీలో చేరిందీ లేదు. కానీ ఇటీవల ఆమె నగరిలో పర్యటించి చేసిన ప్రసంగాలు మాత్రం ఆమె నగరి బరిలోకి దిగుతారని అంతా భావించే విధంగా ఉన్నాయి. ఆమె నగరి పర్యటన సందర్భంగా ఆమెతో కొందరు కౌన్సిలర్లు, మాజీ కౌన్నిలర్లు ఉన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరి నుంచి ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించారు. అయితే తెలుగుదేశం అభ్యర్థిగానే రంగంలో ఉంటానని ఆమె చెప్పలేదు. కానీ నగరిలో తమిళ ఓటర్ల సంఖ్య దృష్ట్యా, ఆమె అభ్యర్థి అయితే ఆ మేరకు పార్టీకి లబ్ధి జరుగుతుందని తెలుగుదేశం భావిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం బలంగా ఉన్న నగరి నియోజకవర్గంలో గత ఎన్నికలలో రోజా గెలుపునకు తమిళ ఓట్లే దోహదపడ్డాయన్న అభిప్రాయం అయితే బలంగా ఉంది. ఇప్పుడు రోజాకు ఆ అవకాశం, తమిళ ఓట్ల మద్దతు దూరం చేసే వ్యూహంతోనే వాణి విశ్వనాథ్ ను బరిలోకి దింపాలని తెలుగుదేశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే వాణి విశ్వనాథ్ పర్యటన వెనుక, ప్రకటనల వెనుకా తెలుగుదేశం మద్దతు ఉందా లేదన్న అన్నది ఇదమిద్థంగా తేలలేదు. కాగా తెలుగు సినిమాలలో ఒక సమయంలో వాణి విశ్వనాథ్, రోజాల మధ్య వృత్తిపరమైన పోటీ ఉండేది. ఇరువురూ కలిసి సర్పయాగం అనే సినిమాలో కూడా నటించారు. మొత్తం మీద నగరిలో వాణి విశ్వనాథ్ పోటీ చేయడమన్నది జరిగితే నగరిలో పోటీ రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు అంటున్నారు.

చ‌ట్టాన్ని అతిక్ర‌మిస్తే గుండెల్లో నిద్ర‌పోతా...చంద్ర‌బాబు

చట్టాన్ని అతిక్ర‌మిస్తే మీ గుండెల్లో నిద్ర‌పోతా, త‌ప్పు చేసిన‌వాడిని వ‌దిలిపెట్టే  ప్ర‌స‌క్తే లేద‌ని టీడీపీ అధి నేత చంద్ర‌బాబునాయుడు హెచ్చ‌రించారు. శుక్ర‌వారం త‌మ పార్టీ లీగ‌ల్ సెల్ నూత‌న క‌మిటీ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొని ప్ర‌సంగించారు. చ‌ట్టాన్ని ఉల్లంఘించేవారు అధికారులైనా స‌రే శిక్ష త‌ప్ప‌ద‌ని బాబు అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానంప‌ట్ల ఆయ‌న మండిప‌డ్డారు.  తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర ఉంద‌ని, దేశంలో చ‌రిత్ర సృష్టించిన ఘ‌న‌త త‌మ పార్టీకి ఉందన్నారు. వైసీపీ ప్ర‌భుత్వం లాంటి దిక్కుమాలిన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని  త‌న జీవితంలో క‌నీసం ఊహించ‌లేద‌న్నారు. ఇంత‌వ‌ర‌కూ ఏ ముఖ్య‌మంత్రి క‌క్ష‌సాధించే తీరులో  ప్ర‌వ‌ర్తిం చ‌లేద‌న్నారు. ఈ  ప్ర‌భు త్వం పోలీసు వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టుప‌ట్టింద‌ని,  ఆయ‌న విమ‌ర్శించారు.  రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని బాబు మండిప‌డ్డారు. వైసీపీ ఎంపీ ర‌ఘురామ పైనా పోలీసులు ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తిస్తుండ‌టాన్ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఆయ‌న్ను క‌స్ట‌డీలోకి తీసుకుని పోలీసులు దారుణంగా వేధించార‌ని, ఆయ‌న రాష్ట్రానికి రాలేని ప‌రిస్థితి క‌ల్పించార‌న్నారు.  వైసీపీ అధికారంలోకి రాగానే ముందు ఇచ్చిన హామీలు, మ‌ద్ద‌తులు మ‌ర్చిపోయార‌న్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఒప్పుకుని, ఇపుడు అధికారంలో అమ‌రావ‌తిని రాజ‌ధాని విష‌యంలో మాట‌మార్చి మూడు రాజ‌ధానుల పేరుతో ప్రాంతీయద్వేషాలు రెచ్చ‌\గొడుతున్నార‌ని ఆరోపించారు. 

కేంద్రం నిర్ణ‌యం క్రికెట్ బోర్డు కొంప‌ముంచుతుందా?

బోర్డు నివేదిక ప్రకారం, 2023 వ‌న్డే వరల్డ్ కప్ నుండి ఐసీసీ ప్రసార ఆదాయంపై 21.84 శాతం పన్ను సర్ చార్జి విధించాలనే తన నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే బీసీసీ ఐ దాదాపు రూ. 955 కోట్లు కోల్పోవచ్చు. వచ్చే ఏడాది  50 ఓవర్ల షోపీస్‌ను  అక్టోబర్-నవంబర్‌లో భారత్ నిర్వహించనుంది. పన్ను సర్‌ఛార్జ్ అనేది ప్రారంభంలో కోట్ చేసిన ధర కంటే ఒక వస్తువు లేదా సేవ  ధరకు జోడించబడే అదనపు ఛార్జీ, రుసుము లేదా పన్ను సూచిస్తుంది. ఇప్పటికే ఉన్న పన్నుకు సర్‌ఛార్జ్ తరచుగా జోడించబడుతుంది. వస్తువు లేదా సేవ పేర్కొన్న ధరలో చేర్చబడదు. ఐసీసీ ప్రమాణం ప్రకారం, గ్లోబల్ బాడీ నిర్వహించే టోర్నమెంట్‌లను హోస్ట్ చేయడానికి ఆతిథ్య దేశం ప్రభుత్వం నుండి పన్ను మినహాయింపు పొందాలి. భారతదేశ పన్ను నియమాలు అటువంటి మినహాయింపులను అనుమతించవు కాబట్టి, 2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం పన్ను సర్‌ఛార్జ్‌ను మినహాయించనందున  బీసీసీ ఐ ఇప్పటికే దాదాపు రూ. 193 కోట్ల నష్టపోయింది. ఆ కేసుపై బీసీసీఐ ఐసీసీ ట్రిబ్యునల్‌లో ఇంకా పోరాడు తోంది. తదుపరి ఐసీసీ ప్రధాన పురుషుల ఈవెంట్, ఇది ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023, 2023 అక్టోబర్ , నవంబర్ నెలల్లో దేశంలో నిర్వహించ‌నున్నారు. ఐసీసీకి పన్ను మినహాయింపు లేదా పన్ను పరిష్కా రాన్ని అందించడానికి  బీసీసీ ఐబాధ్యత వహించింది. ఈ ఈవెంట్ కోసం, ఏప్రిల్ 2022 నాటికి తాజాద‌ని ముంబైలో బోర్డ్ అక్టోబర్ 18 ఏజీఎంకి ముందు రాష్ట్ర యూనిట్ల మధ్య నివేదిక పంపారు. ఈ సమయ రేఖను ఐసీసీ బోర్డు 31 మే 2022 వరకు పొడిగించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో,  బీసీసీ ఐ ఐసీసీకి సలహా ఇచ్చింది, 2016 ఈవెంట్ కోసం పన్ను ఆర్డర్‌కు అనుగుణంగా, ఇది 10శాతం ( సర్‌ఛార్జ్‌లు మినహా) 2023 ఈవెంట్‌కు అవసరమైన సమయ వ్యవధిలో మధ్యంతర చర్యగా పన్ను ఆర్డర్‌ను పొందవచ్చు. ఐసీసీ ఇప్పుడు దేశంలోని పన్ను అధికారుల నుండి 2023 ఈవెంట్ కోసం ప్రసార ఆదాయం కోసం 20 శాతం (సర్‌ఛార్జ్‌లు మినహా) పన్ను ఆర్డర్‌ను పొందింది. రాష్ట్ర సంస్థలతో పంచుకున్న బీసీసీఐ పత్రం ప్రకారం, 21.84 శాతం పన్ను చెల్లిస్తే, ఐసీసీ నుండి బోర్డు ఆదాయంపై ప్రతికూల ప్రభావం  116.47 మిలియన్ డాల ర్లు  ఉంటుంది. బిసిసిఐ ఇంకా చర్చలు జరిపి పన్ను సర్‌ఛార్జ్ శాతాన్ని ప్రస్తుత డిమాండ్ 21.84 నుండి 10.92 శాతానికి తగ్గించడానికి ప్రయత్నిస్తోందని అర్థం. బీసీసీఐ పన్ను సర్‌ఛార్జ్‌ను 10.92 శాతానికి తగ్గించగలిగితే, ఆదా య నష్టం దాదాపు రూ. 430 కోట్లు అవుతుంది. బీసీసీ ఐ ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభు త్వంతో కలిసి పనిచేస్తోంది మరియు ఈ 20శాతం (సర్‌ఛార్జ్‌లు మినహా) పన్ను ఆర్డర్‌కు వ్యతిరేకంగా అత్యధిక స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తోంది. త్వరలో 10 శాతం (సర్‌ఛార్జ్‌లు మినహా) పన్ను ఆర్డర్ రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేసింది. భార‌త్‌లో 2023 ఈవెంట్ కోసం ఐసిసి చేసే ఏదైనా పన్ను ఖర్చు ఐసిసి నుండి బిసిసిఐకి వచ్చే ఆదాయం తో సర్దుబాటు చేయబడుతుందని గమనించాలి" అని నివేదిక పేర్కొంది. 2016 నుండి 2023 వరకు ఐసీసీ సెంట్రల్ రెవిన్యూ పూల్ నుండి బీసీసీ ఐ వాటా 405 మిలియన్ డాల‌ర్లు (సు మారు రూ. 3336 కోట్లు). భారతదేశంలో 2023 ఈవెంట్ ప్రసార ఆదాయం నుండి ఐసీసీ  సుమారు రూ. 4400 కోట్లు) ఆశిస్తోంది.

మునుగోడులో ముగ్గురిలో ముందుండేదెవరో ?

మూడు పార్టీలకే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకే కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియలో ఒక ప్రధాన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు (శుక్రవారం) తో నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెరాస అభ్యర్ధి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ముందుగానే నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. మరోవంక మునుగోడు బరిలో దిగేందుకు ఇప్పటికే 30 మందికి పైగా అభ్యర్ధులు నామినేషన్లు దాఖాలు చేశారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఇంకెంత మంది నామినేషన్ వేస్తారనేది పక్కన పెడితే, ఈ నెల 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత ఎంతమంది బరిలో మిగులుతారో చూడవలసి వుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, మునుగోడు బరిలో ఎందరున్నా, ప్రధాన పోటీ మాత్రం తెరాస, బీజీపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్యనే ఉంటుందని పరిశీలకులు ముందు నుంచి చెపుతూనే ఉన్నారు. అయితే, పోటీలో నిలిచే ఇతర పార్టీలు, అభ్యర్ధులను బట్టి, ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములు నిర్నయమవుతాయ్నై అంటున్నారు. పొతే ముగ్గురి మధ్యనే, కానీ, ఫలితాన్ని నిర్ణయించేది మాత్రం, ఇతరులే అంటున్నారు.    అయితే, మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలో దించడంతో ఇతర సామాజిక వర్గాలు ఎలా స్పందిస్తాయనేది, ఆసక్తికరంగా మారింది. బీస్పీపీ తరపున  దళిత బహుజన వర్గానికి చెందిన  అందోజు శంకరా చారి నామినేషన్ దాఖలు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇతర ముఖ్యనేతలు నియోజక వర్గంలోని ఏడు మండలాలలో ప్రచారం సాగిస్తున్నారు.మరో వంక , కేఏ పాల్ పార్టీ ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన నామినేషన్ అయితే వేయలేదు. అలాగే, వైఎస్ షర్మిల పార్టీ  వైఎస్సార్ - టీపీ కూడా పోటీ చేస్తుందని ప్రచారం జరిగినా,షర్మిలఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆ ప్రచారం ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ప్రజాప్రస్థానం పాద యాత్రలో ఉన్న, షర్మిల మునుగోడు ఉపఎన్నికలు నేపధ్యంగా తెరాసపై జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మునిగి తేలుతున్నారని ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అదలా ఉంటే, వివిద సంస్థలు నిర్వహిస్తున్న అధికార, అనధికార సర్వేలు మునుగోడులో అధికార తెరాస,  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటోందనే సంకేతాలు ఇస్తున్నాయి. ఒక దశలో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకంటే చాలా ముందున్నా, ఇప్పడు తెరాస, బీజేపీల మధ్య దూరం రోజురోజుకు తగ్గిపోతోందని అంటున్నారు. ముఖ్యంగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత పరిస్థితి వేగంగా మారిపోతోందని అంటున్నారు. కూసుకుంట్లకు పార్టీలోనే మద్దతు లేదని, దీంతో కింది స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల మద్దతు ఏ మేరకు ఉంటుందనే విషయంలో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  మరో వంక కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి, పాల్వాయి గోవర్ధన రెడ్డి పలుకుబడి పై ఎక్కువగా ఆధార పడుతున్నారు, అలాగే, మహిళా కార్డును ఉపయోగిస్తున్నారు. ఇంతవరకు ప్రధాన పార్టీలు ఏవీ మహిళలకు అవకాశం ఇవ్వలేదని, తొలి సారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక మహిళకు అవకాశం ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్. రెడ్డి  మహిళలను గెలిపించే బాధ్యత మహిళలే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్రవంతిని గెలిపిస్తే, ములుగు ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే  స్రవంతి సమ్మక్క సారలమ్మలలా అసెంబ్లీలో మహిళల గళం వినిపిస్తారని రేవంత్ రెడ్డి మహిళా కార్డ్’ను ప్రయోగించారు.అయితే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారంలో పాల్గొనకపోవడం కాంగ్రెస్ పార్టీకి మైనస్సే అవుతుందని అంటున్నారు.  ఇక బీజేపే అభ్యర్ధి రాజగోపాల రెడ్డి, కోమటి రెడ్డి సోదరుల కార్డును, వ్యక్తిగత పలుకుబడి, కేంద్ర ప్రభుత్వ పథకాలను  ప్రధాని మోడీ, షా నాయకత్వం ప్రధాన అస్త్రాలుగా ప్రచారం సాగితున్నారు. అలాగే నియోజక వర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని ప్రచారం చేస్తున్నారు. తన రాజీనామాతో నియోజక వర్గంలో పనులు జరుగుతున్నాయని ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మూడు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నా, ఇంకా ప్రచారపర్వం పతాక స్థాయికి చేరుకోలేదు. మూడు పార్టీల ముఖ్యనేతలు పూర్తి స్థాయిలో ప్రచార బరిలో దిగలేదు. దీంతో ముందు ముందు ప్రచారం జోరందుకున్న తర్వాత గానీ, వాస్తవ పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని పరిశీలకులు అంటున్నారు.  అదలా ఉంటే, మునుగోడు ఉపఎన్నికకు ఈ నెల 3న ఈసీ షెడ్యూల్ విడుదల చేయగా.. 7న నోటిఫికేషన్ వచ్చింది. 7వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 14తో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్లను అధికారుల స్వీకరిస్తారు. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. 6న కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.