ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం

దేశంలో తెలంగాణ మోడల్ అంటూ మొదలు పెట్టి ఏకంగా జాతీయ పార్టీనే ఏర్పాటు చేసిన కేసీఆర్ కు నిస్సందేహంగా ఆ పార్టీ ఆవిర్బావ వేడుక నిరుత్సాహాన్ని కలిగించి ఉంటుంది. థర్డ్ ఫ్రంట్ అంటూ మొదలు పెట్టి.. అనేక ఆప్షన్లను పరిశీలించి.. ఏవీ కలిసి రాక చివరకు తానే సొంతంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రారంభించారు. అట్టహాసంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదనేలా సాగింది.     తెరాస రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొన్న కార్యక్రమంలో, పార్టీ ముఖ్యుల్లో ముఖ్య నాయకురాలు, కేసేఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎందుకు కనిపించలేదు. ఆమె ఎక్కడున్నారు? ఆమె ఎందుకు దూరంగా ఉన్నారు?  ఢిల్లీ లిక్కర్ మరకల కారణంగా పెద్దలు ఆమెను పక్కన పెట్టారా? జాతీయ మీడియా కంట పడకుండా ఉండేందుకు ఆమె తెర చాటున ఉండి పోయారా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే బీఆర్ఎస్ ఆవిర్బావ వేడుకకు ఎవరెవరో వస్తారని ప్రచారం జరిగినా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామీ, ఆయన వెంట వచ్చిన  ముగ్గురు  నలుగురు ఎమ్మెల్యేలు మినహా  నలుగురికీ తెలిసిన ముఖం మరోటి కనిపించలేదు. రైతు నాయకులు కొద్ది మంది వచ్చారు కానీ ప్రముఖులు లేరనే అంటున్నారు. అందుకు కారణం వచ్చిన రైతు నాయకులలో రాకేశ్ తికాయత్ లేకపోవడమే. నిజానికి తికాయత్ కేసీఆర్ జాతీయ రాజకీయాలకు రైతుల తరఫున పెద్ద మద్దతుదారుగా ఇప్పటి వరకూ కనిపించారు. ఆయన నాయకత్వంలోనే జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల రైతు నాయకులు ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. అటువంటి తికాయత్ బీఆర్ఎస్ ఆరంబ వేడుకకు రాలేదు. అలాగే నెల రోజుల కిందట పలు రాష్ట్రాల నుంచి వచ్చి ప్రగతి భవన్ ఆతిథ్యం అద్నుకున్న రైతు నాయకులలో సగం మంది కూడా బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో కనిపించలేదు. అంటే దీనిని బట్టి కేసీఆర్ జాతీయ పార్టీ దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపలేదనే చెప్పాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఏదైనా ఒకటే.  కేసీఆర్ సర్కార్ కీ, కేసీఆర్ పార్టీకీ సమస్యలూ, ఇబ్బందులు, అసంతృప్తి బెడదలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు. పేరు మార్పుతో అన్ని చిటికెలో మారిపోతాయి, సమసిపోతాయి అన్నట్లుగా కేసీఆర్ ఇచ్చిన బిల్డప్ అంతా ఉత్తిదేనని తేలిపోయింది. దీంతో ఇంత కాలంగా దేశ్ కీ నేతా అంటూ దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల వ్యయంతో జారీ చేసిన ప్రకటనల ఫలితం దక్కకుండా పోయిందనే చెప్పాలి. కాలికి బలపం కట్టుకుని తిరిగినట్లుగా ఆయన రాష్ట్రాలు తిరిగి పలువురు బీజేపీయేతర పార్టీల అధినేతలతో జరిపిన చర్చలన్నీ విఫలమయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్జేడీ, జేడీయూలపై ఆయన పెట్టుకున్న ఆశలు సైతం నీరుగారిపోయాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ కానీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కానీ కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభకు రాలేదు. వారిని తానే వద్దన్నానని ఫేస్ సేవింగ్ కోసం కేసీఆర్ చెప్పుకున్నా.. కనీసం కేసీఆర్ కొత్త పార్టీ ఆవిర్భావ సందర్భంగా అభినందనలు తెలుపుతూ కనీసం ఒక్కటంటే ఒక్క సందేశం కూడా వారి నుంచి రాలేదు. వాళ్లిద్దరనేమిటి ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ ను తీవ్రంగా వ్యతిరేకించే.. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్.. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్..ఇలా ఎవరూ కూడా బీఆర్ఎస్ ఆవిర్బావాన్ని గుర్తించలేదు, అక్నాలెడ్జ్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన జాతీయ పార్టీయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కనీసం సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచి కూడా ఆయనకు ఎటువంటి మద్దతూ లభించినట్లు కనిపించదు. బీఆర్ఎస్ కు మద్దతుగా ఇప్పటి వరకూ బహిరంగంగా మాట్లాడిన ఒకే ఒక్క ఏపీ వ్యక్తి.. రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ ఎప్పుడూ రాజకీయాల గురించే మాట్లాడే ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రమే. ఒక ఫాలోయింగ్ లేదు, ఒక పార్టీ ప్రతినిథి కాదు.. కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే ఉండవల్లి మద్దతు ఇచ్చారని  చెప్పుకోవాలి. అది కూడా ఆయన ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే.. అదీ తనకు ఓటు ఉన్న రాజమహేంద్ర వరం నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెడితే తన ఓటు వేస్తానని చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టినా.. తెలంగాణ వాదానికి బద్ధ వ్యతిరేకి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయాలకే దూరం అయిన వ్యక్తి ఇప్పుడు ఆ తెలంగాణ భావజాలానికి కేరాఫ్ అడ్రస్ లాంటి కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు ఇవ్వడమే విశేషం.   ఇక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏపీపై ఎలా ఉంటుందన్న విషయంపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఏపీలో ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అన్న విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పేరు మార్చుకుని జాతీయ పార్టీ అన్నంత మాత్రాన ఆ పార్టీకి ఆదరణ వచ్చేస్తుందని భావించడం భ్రమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ఏపీపై దృష్టి సారించడం ఇదే ప్రథమం కాదు. గతంలో అంటే రాష్ట్ర విభజన సమయంలోనే అంటే 2014 ఎన్నికలలోనే ఏపీలో తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా జగన్ కు మద్దతు పలికారు. అయితే ఆ మద్దతు అప్పుడు ఎలాంటి ప్రభావాన్నీ చూపలేదు. అయితే ఆ తరువాతి ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో మాత్రం కేసీఆర్, జగన్ ల ‘మైత్రి’ ఇక్కడ అంటే ఏపీలో జగన్ కు ఫలించింది. అయితే అది ఏపీ జనం తెలంగాణ రాష్ట్ర సమితిని ఆదరించారని కానీ, కేసీఆర్ తెలంగాణ వాదానికి మద్దతుగా నిలిచారనీ అర్ధం కాదు. కేసీఆర్ అప్పట్లో వైసీపీకి ఇచ్చిన మద్దతు ఆర్ధిక సంబంధమైనది. హైదరాబాద్ నుంచి ఏపీలో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సహకారమూ అందకుండా కట్టడి చేయడానికి సంబంధించింది. అంతే కానీ విభజన నాటి గాయాలను ఏపీ జనం మరచిపోయారని అనుకోవడానికి లేదు. అలాగే అప్పట్లో తెలుగుదేశం పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత, జగన్, కేసీఆర్ ల మైత్రి కారణంగా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస లబ్ధి పొందింది. అందుకు ప్రత్యుపకారంగానే 2019 ఎన్నికలలో వైసీపీకి తెరాస సహకారం అందించింది. అయితే ఈ ఐదేళ్లలో పరిస్థితులలో మార్పు వచ్చింది. అప్పటి మైత్రి ఇప్పుడు ఇరు పార్టీలూ గౌరవించి పరస్పర సహకారం అందించుకునే పరిస్థితులు లేవు. సమయం వచ్చినా రాకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా.. తెరాస మంత్రులు తమ పాలనను పొగుడుకునేందుకు పొరుగున ఉన్న ఏపీనీ, ఏపీలో అధ్వాన పాలననూ తూర్పారపడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు వైసీపీ అండగా నిలిచే అవకాశాలు అంతంత మాత్రమే. అలా కాకుండా, గత ఎన్నికలలో కలిగిన లబ్ధిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ, బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ లు జట్టు కట్టినా ఒనగూరే రాజకీయ ప్రయోజనం శూన్యమేనని అంటున్నారు.  ఎందుకంటే.. ఆ ఎక్స్ పరిమెంట్ కాలపరిమితి నాటి ఎన్నికలతోనే ముగిసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇప్పటి వరకూ తెలంగాణలో అధికారంలో ఉండి ఏపీ ప్రయోజనాలకు అడుగడుగునా అవరోధాలు కల్పించిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు ఏపీలో జనం మద్దతు పలకడం అనుమానమే అంటున్నారు. ఇక అదే బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహన ఉంటే.. 2019 ఎన్నికలలో వైసీపీకి ఒనగూరిన ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత (యాంటి ఇంకంబెన్సీ) కారణంగా తెలంగాణలోని టీడీపీ అభిమానులు, సీమాంధ్రులు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో గత ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఏపీలో వైసీపీకి ఎటువంటి సహకారం అందిందో.. అటువంటి సహకారం ఈ సారి తెలుగుదేశంకు అందే అవకాశాలున్నాయి. అంటే పరస్పరం ఇరు పార్టీలూ లాబపడతాయన్నది పరిశీలకుల విశ్లేషణగా ఉంది. బీఆర్ఎస్, తెలుగుదేశం మైత్రిని బూచిగా చూపి ఏపీలో వైసీపీ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేసినా అది పెద్దగా ఫలితం ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఇంత కాలం అధికారంలో ఉండి కూడా ఆంధ్రకు తెలంగాణ చేస్తున్న అన్యాయంపై గొంతెత్తకపోవడమే కాకుండా   హైదరాబాద్ లో ఏపీకి సంబంధించిన  వేల కోట్ల రూపాయల అస్తు ల‌నుఅప్పనంగా అప్పగించి, ఇప్పుడు రాజకీయ అవసరం కనుక సెంటిమెంటును రెచ్చగొట్టాలని చూస్తే అది బూమరాంగ్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు.  అంటే  బిఆర్ ఎస్‌, టీడీపీతో  జతకడితే దాని వల్ల తెలంగాణలో కేసిఆర్ తిరిగి అధికారం నిల బెట్టుకునే అవకాశం, ఆంధ్రలో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి పెరిగిన సానుకూలతకు తోడు పోల్ మేనేజ్ మెంట్ కు  కావలసిన అదనపు హంగులు తెరాస నుంచి పొంది టీడీపీ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, ప్రదాన ప్రతిపక్షంపై ప్రజల్లో సానుకూలత ఉన్న ఈ సమయంలో ప్రయెూగాలు చేసి పాడు చేసుకోవాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశం లేదని అంటున్నారు. బీఆర్ఎస్ తో అవగాహనా, మైత్రీ, పొత్తూ లేకున్నా తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఉండదనీ అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పై ప్రజావ్యతిరేకత తీవ్రతను బట్టి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం ఉందన్నది ప్రస్ఫుటమౌతోంది. జనసేన వంటి పార్టీలు రంగంలో ఉన్నా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు బలమైన విపక్షం వైపే మొగ్గు చూపుతారు తప్ప జనసేన వంటి చిన్న పార్టీలవైపు కాదని విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా 2019 ఎన్నికలలో దాదాపు అన్ని స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమవ్వడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ ఏపీలో సొంతంగా పోటీ చేసినా ఆ పార్టీకి పడే ఓట్లు వైసీపీ నుంచే చీలుతాయనీ, ఇది వైసీపీ విజయావకాశాలను తక్కువలో తక్కువ 15 స్థానాలలో ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో విపక్షం ఓట్లు కూడా కొన్ని బీఆర్ఎస్ వైపు మళ్లినా అది అర శాతం కూడా ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. బీఆర్ఎస్ ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపినా ఆ మేరకు తెలుగుదేశం పార్టీకే లబ్ధి చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు.  

సంస్కృతంలో క్రికెట్ కామెంట‌రీ!

క్రికెట్ అన‌గానే చెవులు కోసుకునేవారంతా రేడియో కామెంట్రీ తెగ యిష్ట‌ప‌డేవారు. టీవీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారా ల‌కు ముందు రేడియోలో హిందీ, ఇంగ్లీషు కామెంటరీకి ఎంతో క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ఇంగ్లీషులు డాక్ట‌ర్ చక్ర‌వ‌ర్తి అనే ఆయ‌న కామెంట్రీ అద్బుతం. ఆయ‌న 1975 వ‌ర‌ల్డ్‌క‌ప్ కామెంట్రీకి దేశంలో క్రికెట్ వీరాభిమానులంతా ఫిదా అయ్యారు.   అంటే హిందీ, ఇంగ్లీషుల్లో విన‌డానికి ఎగ‌ప డ‌టం ఇప్ప‌టికీ ఉంది. టీవీల్లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌రింత ఆద‌ర‌ణ‌కు నోచుకున్నారు. కాగా తెలుగు, త‌మిళం, గుజ‌రాతీ కామెంట‌రీ, ప్ర‌త్యేక కార్య క్ర మాలు నిర్వ‌హించ‌డం అనేవి ఇపుడు చూస్తున్నాం, వింటున్నాం. కానీ మ‌న‌దేశంలో భాష‌ల‌కు మూల మయిన‌దిగా చెప్పుకునే సంస్కృతంలోనూ క్రికెట్ కామెంట‌రీ చెబితే!  140 కి.మీవేగ‌శ్య బూమ్రా బంతేన గ‌చ్ఛ‌తి, బ్యాట‌రేన సాస్టాంగ‌...అంటూ చెబితే వినేవాడికి పిచ్చెక్కుతుంది. పుస్త‌కాల భాషలో ఈ విధంగా చెబితే వినేవాడికి వాడి భాష మ‌ర్చిపోయే అవ‌కాశ‌మూ ఉంటుంది. కానీ క‌ర్ణాట‌కాలో ఏకంగా  ఒక గ్రామం అంతా సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. రోజూవారీ దిన‌చ‌ర్య‌ అదే భాషలో సాగుతుంది.  కొంత‌ కాలం క్రితం వార‌ణాసిలో సంస్కృత విశ్వ‌విద్యాల‌యంవారు ఒక టోర్నీ నిర్వ‌హించారు.  ప్లేయ‌ర్లంతా శుబ్భ‌రంగా పంచ‌క‌ట్టుకుని మ‌రీ ఆడార‌ట‌! తెలుగులో కామెంట్రీ ఆరంభ‌మ‌యిన కొత్త‌ల్లో అంతా న‌వ్వుకున్నారు. కానీ ఇపుడు అదే చాలామంది ఇష్ట‌ప డుతున్నారు. కానీ సంస్కృతం క‌ష్ట‌మే. అయితే బెంగుళూరులో స‌ర‌దాకి ఓ పెద్ద‌మ‌నిషి లోక‌ల్ టాలెంట్‌ని ఉత్సాహ‌ప‌ర్చేందుకు ఓ ఆట‌కి స‌ర‌దాగా సంస్కృతంలో కామెంట‌రీ చెప్పారు. స‌రే అది గ‌ల్లీ మ్యాచ్ గ‌నుక వీడియో చూసిన‌వారు, విన్న‌వారు ఎంతో ఆనందించారు. ఆ వీడియో ఇపుడు వైర‌ల్ అయింది. కార‌ణం ఆయ‌న ఇంగ్లీషులో చెప్పినంత వేగంగా చెప్ప‌డం! అరే ఎంత అద్భుతంగా చెప్పాడో అంటున్నారు నెటిజ‌న్లు!  స‌రే క్రికెట్ గ‌నుక ఆట చాలామందికి తెలుస్తుంది గ‌నుక ఏదో తంటాలు ప‌డి విన్నా ఆట తెలుస్తుంది. మ‌రీ అదే ఏ ఉత్స‌వాల‌కో, మ‌రేద‌యినా పెద్ద ఫంక్ష‌న్ తాలూకు కామెంట‌రీనో అయితే !?

ఐసిసి అవార్డ్  పోటీలో  హ‌ర్మ‌న్‌ప్రీత్‌, స్మృతి, అక్ష‌ర్‌

అంత‌ర్జాతీయ క్రికెట్ సంస్థ ఐసిసి ప్ర‌తీ నెలా ప్ర‌క‌టించే ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డుకి భార‌త్ మ‌హిళా క్రికెట్ స్టార్లు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, స్మృతి మంధ‌నా, పురుషుల జ‌ట్టు నుంచి స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ పేర్లు నామినేష‌న్‌లో ఉన్నాయి.  భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌, వైస్ కెప్టెన్ స్మృతి మంధ‌నా పేర్లు  అధికారుల‌ దృష్టిలోకి రావడం ఇదే మొద‌టిసారి. ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో ముగిసిన వ‌న్డే, టీ-20 సిరీస్‌ల్లో వారిద్ద‌రూ అద్భుతంగా ఆడారు. కౌర్ మూడు ఓడిఐల్లో అత్య‌ధికంగా 221ప‌రుగులు చేయ‌డంలో గొప్పబ్యాటింగ్ నైపు ణ్యం ప్ర‌దర్శించి అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంది. 1999 త‌ర్వాత భార‌త్ మ‌హిళ‌ల జ‌ట్టు ఇంగ్లండ్‌లో ఆ జ‌ట్టును ఓడించడంలో ఆమె అస‌మాన ప్ర‌తిభ ప్ర‌ద‌ర్శించి 143 ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా సిరీస్ గెలిచి చ‌రిత్రసృష్టించింది. సెప్టంబ‌ర్‌లో ఇంగ్లండ్తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో కెప్టెన్ తో స‌మానంగా ఉన్న‌త‌ స్థాయి బ్యాటింగ్ నైపుణ్యం ప్ర‌ద‌ర్శించిన స్టార్ బ్యాట‌ర్ మంధ‌న‌. గ‌తేడాది ఆమె ఐసిసి రేచ‌ల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందుకున్న భార‌త్ స్టార్‌. వైట్‌బాల్  టీ20 సిరీస్‌లో డెర్బీలో 79 ప‌రుగులు చేసి జ‌ట్టును ఆదుకుం ది, అలాగే క్యాంట‌ర్‌బ‌రీలో జ‌రిగిన వ‌న్డేలో అత్య‌ధికంగా 91 ప‌రుగులు చేసి జ‌ట్టు విజ‌యానికి ఎంతో స‌హ‌క‌రించింది. అమె ఇన్నింగ్స్‌ను అక్క‌డి ప‌త్రిక‌లో ఎంతో మెచ్చుకున్నాయి. మంధ‌న సెప్టెం బ‌ర్‌లో ముగిసిన రెండు సిరీస్‌ల్లోనూ 50 యావ‌రేజ్‌తో ఉన్న‌ది. ముఖ్యంగా టీ20ల్లో ఆమె స్ట్ర‌యిక్ రేట్ 137 ఉంది. అలాగే, బంగ్లాదేశ్ కెప్టెన్ నిగ‌ర్ సుల్తానా కూడా ఐసిసి అవార్డు పోటీలో మూడ‌వ స్థానంలో నిలిచింది.  కాగా , అక్ష‌ర్ ప‌టేల్ ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా టీ 20 సిరీస్‌ల్లో గొప్ప‌గా రాణించాడు. ఐసిసి ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ పురుషుల విభాగంలో భార‌త్ నుంచి అత‌ని పేరును లెక్క‌లోకి తీసుకున్నారు.  అక్ష‌ర్ 11.4 యావ రేజ్‌తో ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుత బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న తో జ‌ట్టు విజ‌యానికి తోడ్ప‌డ్డాడు.  ఆసీస్ స్టార్ ప్లేయ‌ర్  గ్రీన్‌, పాకిస్తాన్ కీప‌ర్ రిజ్వాన్ ఇద్ద‌రూ కూడా  ఐసీసీ అవార్డు పోటీలో ఉన్నారు. 

జెండా ఏది ?.. అజెండా ఎక్కడ ?

అయిపొయింది. మూడు ముళ్ళు పడిపోయాయి. కానీ, అసలు తంతు మాత్రం ఇంకా మిగిలే వుంది. అవును, తెలంగాణ  రాష్ట్ర సమితి (తెరాస) పేరు మారింది. మారింది అంటే, మారింది అనేందుకు కూడా లేదు. ఇంకా ఆ వ్యవహారంకూడా పూర్తి కాలేదు. తెరాస పేరు మార్పు ప్రతిపాదనను ఆమోదిస్తూ పార్టీ కార్యవర్గం ఆమోదించిన తీర్మానం కాపీ, ఇంకా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరలేదు. నిజానికి, ఇది కేసీఆర్ అనుకుంటున్నట్లుగా  అంత తేలిగ్గా  చిటికలో అయిపోయే వ్యవహారం కాదని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం ఎప్పుడొస్తుందో, ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు. ఇలాంటి అభ్యర్ధనలను కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్దుష్ట కాల పరిమితిలో పరిష్కరించాలానే నియమం ఏదీ లేదని,  గతంలో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ విషయంలో ఈసీ నెలల సమయం తీసుకుందని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఆయినా ఎందుకో కానీ ఏదో తరుముకు వస్తోంది అన్నట్లుగా ఆ క్రతువు అయిందని అనిపించారు.  కానీ, ఈ తంతుకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు, అనుమానాలు ఇంకా అలాగే మిగిలిపోయాయి. అలాగే కొన్ని కొత్త ప్రశ్నలు తెలేత్తాయని అంటున్నారు.  తెరాస రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొన్న కార్యక్రమంలో, పార్టీ ముఖ్యుల్లో ముఖ్య నాయకురాలు, కేసేఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎందుకు కనిపించలేదు. ఆమె ఎక్కడున్నారు? ఆమె ఎందుకు దూరంగా ఉన్నారు?  ఢిల్లీ లిక్కర్ మరకల కారణంగా పెద్దలు ఆమెను పక్కన పెట్టారా? జాతీయ మీడియా కంట పడకుండా ఉండేందుకు ఆమె తెర చాటున ఉండి పోయారా? ఇ లా ఒక్క కవిత విషయంలోనే కాదు, ఇంకా డిఫరెంట్ కోణాల్లోనూ నేరుగా కేసీఆర్ డిఫెన్సులో పడ్డారని, అంటున్నారు. సరే ఆవిషయం ఎలా ఉంచినా, జాతీయ పార్టీ, జెండా, ఎజెండా అంటూ, ముందు నుంచి ఏదో మహాద్భుతం జరగబోతోందని ప్రచారం జరిగింది. అదే గులాబీ జెండా, అదే కారు గుర్తు. మధ్యలో తెలంగాణ మ్యాప్ స్థానంలో భారత దేశం మ్యాప్. వస్తుందని ఎవరో చెప్పడమే కానీ, తెరాస/ బీఆర్ఎస్ అధ్యక్షడు, ముఖ్యమంత్రి ముఖతః అలాంటి  ప్రస్తావన వచ్చినట్లు లేదు.  నిజానికి, తెరాస పేరు మార్పు  క్రతువు వ్యవహారానికి సంబంధించి బయట కనిపించిన హడావిడి, ఆర్భాటం లోపల కనిపించలేదని, లోపలి నాయకులే పెదవి విరిచేస్తున్నారు.  పార్టీ జెండా,ఎజెండాతో పాటుగా అనేక విషయాలకు సంబంధించి కేసీఆర్ క్లారిటీ ఇస్తారని ఆశించారు. అయితే, ముఖ్యమంత్రి పొడి పొడిగా మాట్లాడిన మాటల్లోపెద్దగా స్పష్టత లేదనే అభిప్రాయమే అందరిలో వ్యక్తమౌతున్న పరిస్థితి. అలాగే, ఈ ‘వేడుక’ లో పాల్గొనేందుకు ఎవరెవరో వస్తారని ప్రచారం జరిగినా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామీ, ఆయన వెంట వచ్చిన  ముగ్గురు  నలుగురు ఎమ్మెల్యేలు మినహా  నలుగురికీ తెలిసిన, మరో ముఖం కనిపించలేదు. రైతు నాయకులు కొద్ది మంది వచ్చినట్లున్నారు, కానీ, అందులో చాలావరకు సంభావనకు వచ్చిన పంతులు గార్లే కానీ,  మంత్రం ముక్క వచ్చిన పండితుల్లా అయితే లేరని అంటున్నారు. అలాగే  వచ్చిన రైతు నాయకులలో కూడా రాకేశ్ తికాయత్ వంటి గుర్తింపు ఉన్న నాయకులు ఎవరూ లేరు. నిజానికి, తికాయత్ ఒకసారి కాదు, రెండు  మూడు సార్లు నేరుగా ప్రగతి భవన్ కు వచ్చి మంతనాలు సాగించారు. నిజా నిజాలు ఎలా ఉన్నా తికాయత్  ఎక్కడికి, ఎలా వచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం వట్టి చేతులతో వెళ్ళరని అంటారు.  నిజానికి, నెల రోజుల క్రితం 20 వరకు రాష్ట్రాల నుంచి వచ్చి రెండు మూడు మూడు రోజులు ప్రగతి భవన్ ఆతిధ్యం అద్నుకున్న రైతు నాయకులలో సగం మంది కూడా ఈ వేడుకు రాలేదని, అంటున్నారు.   నిజానికి  కేసేఆర్ జాతీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి ఆశించిన విధంగా  అడుగులు పడ లేదు. ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోందనే అంటున్నారు.ఇప్పుడు పేరు మార్పు ప్రహసనంలోనూ కేసేఆర్ ఆశించింది ఒకటైతే, జరిగింది మరొకటి అని అంటున్నారు. అందుకే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ  నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వస్తానన్నా తానే వద్దన్నానని కేసేఆర్ ఒక  విధంగా సంజాయిషీ ఇచ్చుకున్నారని అంటున్నారు. అందుకే, కేసేఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానంలో ఇది మరో ముందగుడు అవుతుందో, వెనకడుగు అవుతుందో చూడవలసిందే, అంటున్నారు.

జేఈఈ మెయిన్స్ కే దిక్కులేదు.. ఈవీఎంలు భద్రమేనా?

గడపగడపకూ లో గడపగడపనా వ్యతిరేకత కనిపిస్తోంది. విమర్శలు, వ్యతిరేకతా తప్ప ఎక్కడా ఆదరణ కనిపించిన దాఖలాలు లేవు. అయితే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ, ప్రతి సభలోనూ రాష్ట్రంలో 175 కు 175 స్థానాలలోనూ విజయం తథ్యం అంటున్నారు. గెలిచి తరాలి, గెలిచి తీరుతాం అంటున్నారు. ఆయన మాటలను ఆయన తప్ప ఎవరూ నమ్ముతున్నట్లు కూడా కనిపించడం లేదు. చివరికి సొంత పార్టీలోనే 175కు 175 స్థానాల్లో విజయం అన్న జగన్ మాటలపై సెటైర్లు పేలుతున్నాయి. విపక్షాలైతే ముందు పులివెందులలో విజయాన్ని ఖాయం చేసుకోండి.. మిగిలిన నియోజకవర్గాల సంగతి తరువాత అంటున్నాయి. ఇక జగన్ స్వయంగా చేయించుకున్న సర్వేలు సమా అన్నిటిలోనూ కూడా వైసీపీ గ్రాఫ్ పడిపోతున్నదనే తేల్చాయి. ఈ విషయాన్ని జగన్ స్వయంగా గడపగడపకు వర్క్ షాపులో వెల్లడించి.. అందుకు కారణం సరిగా పని చేయని మంత్రులు, ఎమ్మెల్యేలేనని చెప్పారు. అంతే కాదు.. తాను చెప్పినట్లు పని చేస్తే సరే సరి.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వను అంటూ హెచ్చరించారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదని కూడా విస్పష్టంగా చెప్పేశారు. కొత్త వాళ్లని నిలబెట్టి గెలిపించుకుంటానని చెప్పారు. గ్రాఫ్ పడిపోయింది ఎమ్మెల్యేలు, మంత్రులదే తప్ప తనది కాదని ఆ వర్క్ షాపులో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతటా వ్యతిరేకత వ్యక్తమౌతున్నా..  జగన్ లో అదే విశ్వాసం కనిపించడానికి కారణాలేమిటన్నది అర్ధం కావడం లేదు. తనదైన ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారా? అని నిన్న మొన్నటి వరకూ తన, పర అన్న బేధం లేకుండా జోకులు వేసుకున్నారు. సామాజిక మాధ్యమంలో అయితే జగన్ విశ్వాసంపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. అయితే జేఈఈ మెయిన్స్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోనికి వచ్చిన తరువాత జగన్ విశ్వాసానికి కారణం ఏమిటన్నది బోధపడుతున్నదన్న భావన పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలలోనూ ఈవీఎంలపై అనుమానాలు, సందేహాలూ వ్యక్తమయ్యాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సులభమన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. పలు రాజకీయ పార్టీలు ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. కొందరైతే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చని సోదాహరణంగా చెప్పారు. సరే ఈసీ ఆ ఆరోపణలను ఖండించింది అది వేరే సంగతి.  ఇప్పుడు దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలో చీటింగ్ జరిగింది.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఈ చీటింగ్ వ్యవహారంలో ఒక రష్యాన్ హ్యాకర్ హస్తం ఉన్నట్లు తేల్చింది.  జేఈఈ మెయిన్స్ లో 820 మంది  చీటింగ్ చేయడానికి రష్యన్ హ్యాకర్ మిఖైల్ షార్జిన్ దోహదపడినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. అంతే కాదు.. ఆ హ్యాకర్ ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకుంది.  గత నెలలో జరిగిన జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ టెస్ట్ కు దేశ వ్యాప్తంగా దాదాపు తొమ్మది లక్షల మంది హాజరయ్యారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రిస్ట్రిక్టడ్డ్ కంప్యూటర్‌లలో మాత్రమే నిర్వహించినా  రష్యన్ హ్యాకర్  ఈ వ్యవస్థనూ హ్యాక్ చేసినట్లు సీబీఐ దర్యాప్తు నిగ్గు తేల్చింది. రష్యన్ హ్యాకర్ సహకారంతో ఓ 920 మంది విద్యార్థులు తమ సహచరులతో  రిమోట్ యాక్సెస్ చేసుకుని ఎంట్రన్స్ లో లబ్ధి పొందారు. అంటే రిమోట్ యాక్సెస్ ద్వారా ఈ విద్యార్థులు తమ పరీక్షను వేరే చోట కూర్చున్న వారి చేత రాయించారన్న మాట. అంటే పరీక్ష హాల్లో ఈ విద్యార్థుల కంప్యూటర్లను హ్యాక్ చేసిన రష్యన్ హ్యాకర్ ఆ యాక్సెస్ ను ఈ విద్యార్థుల తరఫున పరీక్ష రాయడానికి వేరే ఎక్కడో సిద్ధంగా ఉన్న వారికి ఇచ్చేశాడన్న మాట.  ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ 24 మందిని అరెస్టు చేశారు.   సోనిపాట్‌లోని ఓ ఎగ్జామ్ సెంటర్‌లో ఈ రిమోట్ యాక్సెస్ జరిగినట్టు విసీబీఐ చెబుతోంది.  కంట్రోల్ రిస్ట్రిక్టడ్ కంపూటర్లనే ఓ పాతికేళ్ల రష్యన్ ఐటీ నిపుణుడు హ్యాక్ చేసి.. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే జేఈఈ మెయిన్స్ ను అభాసుపాలు చేసేశాడు. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకే ససాక్ష్యంగా చెబుతోంది. అటువంటప్పుడు ఈవీఎంలు హ్యాకింగ్ కు గురికావన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యార్థుల యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని హ్యాక్ చెయ్యగలిగినప్పుడు.. ఒక్కో నియోజకవర్గంలో కొన్ని ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదా? సాధ్యం కాదని ఎలా చెప్పగలుగుతారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య ఈవీఎంలే కావాలన్న పట్టుదల ఎందుకు? పలు దేశాలు ఈవీఎంలు భద్రమైనవి కావని నిర్ధారణకు వచ్చి బ్యాలెట్ వైపు మళ్లినప్పుడు, దేశంలో అలా ఎందుకు చేయరు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనా, కేంద్ర ఎన్నికల సంఘం పైనా ఉందనడంలో సందేహం లేదు.  

గాంబియాలో 66 మంది పిల్ల‌లు మృతి...భార‌త్‌కు డ‌బ్ల్యుహెచ్ ఓ హెచ్చ‌రిక‌

గాంబియాలో 66 మంది పిల్లల మరణానికి కారణమైన నాలుగు దగ్గు సిరప్‌ల గురించి డబ్ల్యూహెచ్‌ఓ భారత్ ను హెచ్చరించిన 1.5 గంటల్లోనే సిడిఎస్ సి ఓ  డ‌బ్యూహెచ్ ఓ  కి ప్రతిస్పందించింది. భారతీయ దగ్గు సిరప్ విషయంలో ప్రపంచఆరోగ్యసంస్థ ఇంకా ఖచ్చితమైన కారణమేమిట‌న్న‌ది ఇంకా అందించ లేదు, 66 మంది మరణాలకు కారణమయిన  నాలుగు భారతీయ దగ్గు సిరప్‌లకు వ్యతిరేకంగా డ‌బ్యూ హెచ్ ఓ  హెచ్చరించింది.  గాంబియాలో పిల్లలు. దగ్గు సిరప్‌లను హర్యానా కు చెందిన  మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమి టెడ్ ఉత్పత్తి చేస్తుంది. నివేదిక ప్రకారం, డ‌బ్యూహెచ్ ఓ  ఇంకా లేబుల్స్ ఉత్ప‌త్తుల  వివరాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కం ట్రోల్ ఆర్గనైజేషన్‌తో పంచుకోలేదు. వివరాలను పంచుకున్న తర్వాత, ఉత్పత్తుల తయారీ  గుర్తింపు మూలం నిర్ధారిస్తారు. అవసరమైన అన్నిచర్యలు తీసుకున్న‌ప్పటికీ, ఒక బలమైన నియంత్రణ అధికా రిగా, సందేహాస్పదమైన వైద్యఉత్పత్తులు, లేబుల్స్/ఉత్పత్తుల ఫోటోగ్రాఫ్‌లతో మరణాలకు కారణ సంబంధాన్ని ఏర్పరచడంపై నివేదికను వీలైనంత త్వరగా సిడిఎస్‌సిఓ తో పంచుకోవాలని డ‌బ్యూహెచ్ ఓ కోరిందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 29న, గాంబియాలో జరిగిన మరణాల గురించి డ‌బ్యూహెచ్ ఓ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు తెలియజేసింది  డైథైలీన్ గ్లైకాల్/ఇథిలిన్ గ్లైకాల్‌తో  కలుషితమైన మందులను ఉపయోగిం చడం వల్ల మరణాలకు గణనీయమైన దోహదపడే అంశం అనుమానించబడింది. డ‌బ్యూహెచ్ ఓ అందు కున్న తాత్కాలిక ఫలితాల ప్రకారం, పరీక్షించిన 23 నమూనాలలో నాలుగు డైథిలిన్ గ్లైకాల్ / ఇథిలిన్ గ్లైకాల్ కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. సిడిఎస్‌సిఓ 1.5 గంటల్లో డ‌బ్యూహెచ్ ఓ కి ప్రతిస్పందించింది రాష్ట్ర నియంత్రణ అధికారంతో విషయాన్ని తీసుకుంది. ఇంకా, హర్యానా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ తో కలిసి ఈ విషయం, వాస్తవాలు, వివరాలను నిర్ధారించడానికి వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించినట్లు నివేదిక పేర్కొంది. ప్రాథమిక విచారణలో, మైడెన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, సోనేపట్, హర్యానా, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ ద్వారా సూచించిన ఉత్పత్తుల కోసం లైసెన్స్ పొందిన తయారీదారు అని, ఈ  ఉత్పత్తులకు  తయారీ అనుమతిని కలిగి ఉందని తేలింది. కంపెనీ వీటిని తయారుచేసి ఎగుమతి చేసింది. ఇప్పటివరకు గాంబి యాకు మాత్రమే ఉత్పత్తులు ఉన్నాయ‌ని  నివేదిక తెలిపింది. డ‌బ్యూహెచ్ ఓ  హెచ్చరిక నాలుగు ఉత్పత్తులను ..ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ న్ కోల్డ్ సిరప్..పేర్కొన్న‌ది. కొన్ని నెలల క్రితం కిడ్నీ సమస్య లతో డజన్ల కొద్దీ పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. వైద్య అధికారులు జూలైలో అలారం పెంచారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులలో మరణాలు సంభవించాయని, వారందరూ మరణా నికి మూడు నుండి ఐదు రోజుల ముందు స్థానికంగా విక్రయించే పారాసెటమాల్ సిరప్‌ను తీసుకున్నారని ఒక నమూనా ఉద్భవించింది. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాలను నిషే ధించినట్లు గాంబియా ఆరోగ్య సేవల డైరెక్టర్ ముస్తఫా బిట్టాయే తెలిపారు.

అపారం ఉమ ఔదార్యం.. జీజీహెచ్‌కు రూ.20 కోట్ల విరాళం

అదృష్టం వ‌రించి లాట‌రీ త‌గిలి  ల‌క్ష‌లు వ‌స్తేనే కాళ్లు భూమ్మీద ఉండ‌వు.  ఒక్క రూపాయి ఎవ‌రియినా ఇవ్వాల‌న్నా, ఏద‌న్నా వ‌స్తువు కొనివ్వాల‌న్నా బొత్తిగా మ‌న‌సొప్ప‌దు. అదే చిత్రం డ‌బ్బులేని స‌మ‌యం, ధ‌నికుడైపోయాక మారే స్థితి. కానీ చాలా త‌క్కువ‌మందే గుప్త‌దానాల‌తో ప్ర‌సిద్ధుల‌వుతారు. అదుగో అలాంటి  గొప్ప దాత డాక్ట‌ర్ ఉమా గ‌వివి. ఆమె 20కోట్ల ఆస్తిని గుంటూరులోని జీజీహెచ్ ఆస్ప‌త్రికి  విరా ళంగా ఇచ్చేశారు. ఇది లోకం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం. ఇక్క‌డ చ‌దువుకుని విదేశాల్లో ఉన్న‌తోద్యోగాల్లో, ఉన్న‌తస్థాయిల్లో ఉన్న‌వారు చాలామంది తాము చ‌దువు కున్న పాఠ‌శాల‌కో, కాలేజీకో విరాళాలుగా ఒకేసారి లేదా ప్ర‌తీ ఏడూ ఎంతో కొంత విరాళంగా పంప‌డం జ‌రు గుతోంది. అది వారి సంస్కారం. ఎప్పుడ‌న్నా వ‌చ్చిన‌పుడు ఆ విద్యాసంస్థ‌ల‌కు వెళ్లి బాల్యా న్ని గుర్తు చేసుకుని ఆనందాన్ని మూట‌గ‌ట్టుకు వెళుతూంటారు. కానీ ఉమా గ‌విని మాత్రం జీవి తాంతం స‌రిప‌డా గొప్పఆనందాన్ని, సంతృప్తిని మూట‌గ‌ట్టుకున్నారనాలి. 20 కోట్ల ఆస్తిని ఒక్క‌సా రిగా అమాంతం వ‌దులు కునే ఆలోచ‌న‌, ధైర్యం, మ‌న‌సు ఆమెది వెల‌గ‌ట్ట‌లేని ఔదార్యం. డాక్ట‌ర్ ఉమా గుంటూరు జీజీహెచ్‌లోనే చ‌దువుకున్నారు. ఇక్క‌డ కొత్త‌గా నిర్మిస్తున్న మాతాశిశు సంక్షేమ భ‌వ‌నానికి విరాళంగా ఆమె ఆ మొత్తాన్ని ఇచ్చేరు. ఆమె అమెరికాలో ఇమ్యునాల‌జిస్ట్‌, ఎల‌ర్జీ స్పెష‌లిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి.. స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. తాను మెడిసిన్‌ చేసిన జీజీ హెచ్‌కు భారీ విరాళం ఇవ్వాల న్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు. డాక్ట‌ర్ ఉమ భ‌ర్త  డాక్టర్‌ కానూరి రామచంద్ర రావు ఈమ‌ధ్య‌నే మృతి చెంద‌డం. డాక్టర్‌ రావు కర్ణాటకలోని గుల్బర్గా లో మెడిసిన్‌ చేసి, ఎనస్థటిస్ట్ గా  సేవలు అందించారు. ఆమెకు వార‌సులు ఎవ్వ‌రూ లేరు. ఆమె ఇన్నాళ్లు గా సంపా దించి ఆస్తి మొత్తం ఇలా విరాళంగా ఇవ్వ‌డం ప‌ట్ల అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నా రు.  ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు సూచించారు.  కానీ, ఈ ప్రతి పాదనను ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. చివరికి డాక్టర్‌ ఉమా భర్త పేరు ను ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు.  జింకానా రీ యూనియన్‌ సమావేశాల్లో డాక్టర్‌ ఉమా గవిని రగిల్చిన స్ఫూర్తితో ఇతర వైద్యులు సైతం ముం దుకు వచ్చారు. 

జోడు వాదాలు జంట పదవులు.. బీఆర్ఎస్ ప్రస్థానం సాధ్యమేనా?

అనుకున్నట్లే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) భారత రాష్ట్ర  సమితి (బీఆర్ఎస్) గా పేరు మార్చుకుంది. జాతీయ పార్టీగా ఎదిగే దిశగా తొలి అడుగు వేసింది. తెరాస /బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు 68 ఏళ్ల వయసులో తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అయితే, పేరు మారినా, ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా కొత్తగా ప్రస్థానం మొదలు పెట్టినా, పార్టీ కార్యక్షేత్రం మార లేదని, కొత్త, పాత పార్టీల వ్యవస్థాపక అధ్యక్షుడి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  స్పష్టం చేశారు. భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నాన్నామని చెప్పారు. అంతే కాదు, ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే, దేశమంతా పర్యటిస్తానని కేసేఆర్ స్పష్టం చేశారు. అలాగే, కార్యక్షేత్రం వదిలేది లేదని  ఈ విషయంలోనూ  ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని  చెప్పారు.  అయితే నిజంగానే కేసీఆర్ ఎప్పటిలా జోడు పదవుల్లో కొనసాగుతారా? సమయం సందర్భం చూసుకుని, ముఖ్యమంత్రి పదవిని మరొకరికి అప్పగిస్తారా అనేది చూడవలసి వుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి స్వయంగా కేసీఆర్ చేసిన నిన్నటి (బుధవారం) ముగింపు ప్రకటన వరకు ఆయనే తెరాస  పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే, 2014 నుంచి ఈ రోజు వరకు పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ  జోడు పదవులలో కొనసాగుతున్నారు. అఫ్కోర్స్, కుమారుడు కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా  చేదోడు వాదోడుగా ఉన్నారనుకోండి  అది వేరే విషయం.  అయితే రాష్ట్ర  స్థాయిలో సాధ్యమైన జోడు పదవుల స్వారీ జాతీయ స్థాయిలో సాధ్యమవుతుందా? ఈ ఏర్పాటు ఎంత కాలం కొనసాగుతుంది? అనేది ఇప్పుడే తెలిసే విషయం కాదు. నిజమే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవితో పాటు, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా జోడు పదవులు తనకే కావాలని కోరుకున్న ఆ రాష్ట ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక గెహ్లాట్ కు ఎదురైన అవరోధాలు, అడ్డంకులు, కేసేఆర్ కు లేవు. కాంగ్రెస్ పెట్టుకున్న ఒక వ్యక్తికి ఒకే పదవి నియమం తెరాస  పెట్టుకోలేదు. అంతేకాదు, అది తెరాస అయినా బీఆర్ఎస్ అయినా గులాబీ పార్టీ కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే కాబట్టి రాజస్థాన్ పరిణామాలను ఇప్పటి కిప్పుడు తెలంగాణలో ఉహించలేము.   కానీ కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పును అధికారికంగా గుర్తించి తెరాస అధ్యక్షుడు కేసేఆర్, బీఆర్ఎస్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత  సంస్థాగత మార్పులు చేపట్టక తప్పక పోవచ్చును. అలాగే అలాంటి ఆలోచన గులాబీ బాసుకు లేక పోలేదని అంటున్నారు. అయితే తెరాస పేరు మార్పు అనుకున్నట్లుగా ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుందా  లేదా అనేది, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని  సో అంత వరకు  సంస్థాగత మార్పులు ఉండవనే అంటున్నారు. అదలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వంక జాతీయ వాదాన్ని ఎత్తు కుంటూనే, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదాన్ని వదిలేది లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ తనకున్న అనుభవంతో జోడు పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించ వచ్చునేమో కానీ, జోడు విధానాలను, జోడు వాదాలను ఎలా, సమన్వయ పరచు కుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుందని అంటున్నారు. రెండు దశాబ్దాల తెరాస చరిత్ర కేసీఆర్ రాజకీయ జేవిత చరిత్ర మొత్తం తెలంగాణ కేంద్రంగానే సాగిందనేది కాదన లేని నిజం.    కేసేఅర్ కు జాతీయ స్థాయిలో ఏదైనా గుర్తింపు ఉందంటే, అది తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ అస్తిత్వ వాదంతో ముడిపడి ఉన్నగుర్తింపే  కానీ మరొకటి కాదు. అయితే, ఆ ప్రస్తావన ఎక్కడా రాకుండా, ఎనిమిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలనే జాతీయ ఎజెండాలో చేర్చారు. అందులోనూ ప్రధానంగా సంక్షేమ పధకాలను, మరీ ముఖ్యంగా కౌలు రైతలకు కాదని, వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఆస్తులు ఉన్న మంత్రి మల్లారెడ్డి వంటి భూస్వాములు, రాజకీయ, వ్యాపార రంగాలలో స్థిరపడిన ధనినికులు, ప్రభుత్వ ఉద్యోగులకు సహా భూస్వాములకు ప్రజల సొమ్మును దోచి పెడుతున్నారనే ఆరోపణలున్న రైతు బంధు, ఇంకా రాష్ట్ర్రంలోనే పూర్తి స్థాయిలో పట్టాలేక్కని  దళిత బంధు, గిరిజనబంధు వంటి పథకాలనే తెలంగాణ మోడల్ గా ప్రముఖంగా పేర్కొంటున్నారు. ఈ ఎజెండాను దేశ ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ఎలా ఉన్నా, జంట పదవులు, జోడు వాదాలలో బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ముందుకు సాగుతుంది అనేది, చూడవలసి ఉందని అంటున్నారు.

రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన ప్రభాస్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన  ప్రభాస్ క్రేజ్ అలా ఇలా లేదు.    దేశ వ్యాప్తంగా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దక్షిణాది హీరోల్లో  హీరోల్లో ప్రభాస్ కచ్చితంగా ముందుంటారు. అందుకే రావణ దహన కార్యక్రమానికి మన రెబల్ స్టార్‌కు ఆహ్వానం అందింది. విజయదశమి సందర్భంగా దిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొని రావణ దహనం చేశారు.  ఈ కార్యక్రమమంలో ప్రభాస్ ధనస్సుతో బాణాన్ని విడిచి రావణుడిని దహనం చేశారు. ఈ సమంయలో అభిమానులు పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో రామ్ లీలా మైదానం మార్మోగింది.  భారత సంస్కృతి పట్ల ప్రభాస్‌కు ఉన్న అంకిత భావం చూసే ఆయనను ముఖ్య అతిథిగా పిలిచినట్లు లవ్ కుశ్ రామ్ లీలా కమిటీ తెలిపింది. ఏటా దసరా రోజున ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో విజయదశమి వేడుకలు చాలా చాలా ఘనంగా జరుగుతాయి.   కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా   రావణ దహనం కార్యక్రమం జరగలేదు. దీంతో ఈసారి ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరైనా ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేశారు. దేశం నలుమూలల నుంచీ 22 మంది సెలబ్రిటీలను ఆహ్వానించారు. వారిలో ప్రభాస్ ఒకరు. కాగా రామ్ లీలా మైదానంలో జరిగిన రావణ దహనం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలు దేశాల రాయబారులు హాజరయ్యారు.  ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ఆయన రాముడిగా నటించిన ఆదిపురుష్ టీజర్ విడుదలైంది.  రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. టీజర్ లో రావణుడు, హనుమంతుడి ఆహార్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నా.. ఆది పురుష్ టీజర్  100మిలియన్స్‌కి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఆదిపురుష్ లో రాముడిగా నటిస్తున్నందునే ప్రభాస్ కు రామ్ లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమానికి హాజరై రావణ దహనం చేసే అవకాశం దక్కిందని అంటున్నారు. 

ప్రజాశాంతి గూటికి ప్రజాయుద్ధ నౌక.. మునుగోడులో పాల్ పార్టీ అభ్యర్థిగా గద్దర్!

ప్రజా గాయకుడు,   ప్ర‌జా యుద్ధ నౌక‌గా తెలంగాణ‌లో ఎంతో గుర్తింపు పొందిన గద్ద‌ర్‌.. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ స‌మ‌క్షంలో ఆ పార్టీ గూటికివ చేరిన గ‌ద్ద‌ర్ వ‌చ్చే నెల‌లో జ‌రగనున్న మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జా శాంతి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరిన సందర్భంగా విలేకరులతో మాట్లాడిన గద్దర్.. మునుగోడులో పోటీ చేయనున్నట్లు చెప్పారు. గురువారం (అక్టోబర్ 6) నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు గద్దర్ తెలిపారు. మ‌రో వైపు  అక్టోబర్  2న గాంధీ జయంతి సందర్భంగా తలపెట్టిన పీస్ మీటింగ్ కు పోలీసులు అనుమ‌తి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ దీక్షను కేఏ పాల్ బుధవారం (అక్టోబర్ 5) విర‌మించారు.  గ‌ద్ద‌రే ఆయనకు నిమ్మ‌రసం ఇచ్చి దీక్ష విర‌మింపజేశారు. ఇక గద్దర్ విషయానికి వస్తే.. కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం  గ‌ద్ద‌ర్ త‌న పాట‌ల‌తో తెలంగాణ స‌మాజాన్ని ఉర్రూతలూగించారు. తెలంగాణ ఉద్య‌మంలో సైతం ఆయ‌న పాట‌లు ఎందరిలోనో స్ఫూర్తిని ర‌గిలించాయి. అయితే, ఇటీవలి కాలంలో ఆయన పంథాలో, ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల, ఎన్నికల పట్ల నమ్మకం లేదని చెబుతూ, గతంలో గ‌తంలో ఎప్పుడూ ఓటు హ‌క్కు వినియోగించుకోని గ‌ద్ద‌ర్ ఇటీవలి కాలంలో ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఓటు వేశారు. అలాగే, హైద‌రాబాద్ లో జ‌రిగిన న‌రేంద్ర మోదీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రయ్యారు.  అలాగే, గాంధీ భ‌వ‌న్ కు కూడా వెళ్లారు. ఆయన రాజకీయాలలో ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనీ, అయితే కాంగ్రెస్, లేదా బీజేపీలో చేరడం ఖాయమనీ కూడా వార్తలు వినవచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయన కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు.

తెరాస ఇక గతం..!

రాజకీయ పార్టీగా తెరాస (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇక లేదు. ఉద్యమ పార్టీగా అవతరించి.. రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెరాస ఇక కనుమరుగైపోయింది. తెరాస స్థానంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అవతరించింది. ఈ మేరకు దసరా రోజున (అక్టోబర్5) తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ, ఆ పార్టీకి భారత్ రాష్ట్ర సమితిగా నామకరణం చేస్తూ తెరాస ఏకగ్రీవంగా తీర్మానించింది. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  తెరాస ఆవిర్భావ కార్యక్రమానికి కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెచ్ డి కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు   హాజరయ్యారు. ప్రస్తుతం జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు కేసీఆర్‌ వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత సంతకాలు చేశారు. అయితే కార్యవర్గ సమావేశం చేసిన తీర్మానం మేరకు టీఆర్ఎస్ ఇక లేదు. బీఆర్ఎస్ ఆవిర్భవించింది.   అయితే ఇందుకు ఈసీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దాంతో ఈ తీర్మానంతో .. టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లింది. ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పించి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును  భారత రాష్ట్ర సమితిగా మార్పు చేయిస్తుంది.  కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర పడేంత వరకూ మాత్రమే టీఆర్ఎస్ అధికారికంగా ఉనికిలో ఉంటుంది. ఆ తరువాత తెరాస ఇక ఉండదు.  

విక్టోరియా కామన్వెల్త్ గేమ్స్ 2026 కీ  ఇదే జ‌ట్టు

ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ క్రికెట్‌ వసీంఖాన్‌ మహిళా క్రికెట్‌ అభి వృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియా బుధవారం చేసిన ప్రకటనల ప్రకారం, 2022లో పోటీ  అపార మైన విజయాన్ని అనుసరించి, మహిళల టీ20 క్రికెట్ ఆస్ట్రేలి యాలో జరిగే 2026 కామన్వెల్త్ క్రీడలకు తిరిగి వస్తుంది. 23వ కామన్వెల్త్ గేమ్స్‌లో 20 క్రీడలు ఉంటాయి, పోటీలు అనేక విక్టో రియా రాష్ట్ర స్థానాల్లో జరుగు తాయి. గోల్ఫ్, బిఎంఎక్స్‌, కోస్టల్ రోయింగ్‌ల కోసం ప్రారంభమైన బహుళ-క్రీడా పోటీకి సంబంధిం చిన పూర్తి షెడ్యూల్‌ని ఆవిష్కరించారు. ఐసిసి జనరల్ మేనేజర్ క్రికెట్, వసీం ఖాన్, మహిళల క్రికెట్ అభివృద్ధి పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు, ఒలింపిక్ క్రీడలలో చేర్చాలనే దాని ఆశయాలను నెరవేర్చడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. విక్టోరియాలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ భాగమవుతుందని తెలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. బర్మింగ్‌హామ్‌తో సహా ఇటీవలి సంవత్సరాలలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఇది క్రీడకు మరో ముఖ్యమైన మైలురాయి గా నిలుస్తుంది. మహిళల ఆట రెండింటిలోనూ నిరంతర వృద్ధి మరియు ఉన్నత పథం మరియు టీ20 క్రికెట్ మా దీర్ఘకాలిక ఆశ యాలకు సరిగ్గా సరిపోతుంది, ఇందులో ఒలింపిక్ క్రీడలలో భాగం కూడా ఉంటుంది" అని అతను చెప్పాడు. "మహిళల క్రికెట్ పెరుగుతున్న ప్రమాణాలు, వేగంగా పెరుగుతున్న అభిమానుల సంఖ్యతో పదునైన పైకి వంగి ఉంది. ఐసిసి మహిళల టీ20 ప్రపంచ కప్ 2020  ఫైనల్ కోసం మెల్‌బోర్న్‌లో 86,174 మంది అభిమానుల వీక్షణ ఇప్పటికీ మా జ్ఞాపకా లలో బలంగా ఉంది కాబట్టి మేము చేయలేము. మహిళల ఆటను ప్రదర్శించడానికి మరొక అవకాశం కోసం వేచి ఉండండి, ఈసారి 2026లో విక్టోరియాలో," అని ఖాన్ జోడించారు. బర్మింగ్‌హామ్‌లో గెలిచి, ఆగస్ట్‌లో ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌ను తొమ్మిది పరుగుల తేడాతో ఓడించిన తర్వాత, మహిళల టీ20 పోటీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ బంగారు పతక విజేతగా నిలిచింది. కేవలం 12 ఓవర్లలో ఆతిథ్య జట్టు స్కోరు 110 పరుగులను ఛేదించడం ద్వారా న్యూజిలాండ్ కాంస్య పతక పోరులో ఇంగ్లండ్‌ను ఓడించింది. బల్లారట్, బెండిగో, గీలాంగ్ , గిప్స్‌ల్యాండ్‌లో నాలుగు ప్రాంతీయ కేంద్రాలతో, విక్టోరియా 2026 మార్చి 17-29, 2026 వరకు జరుగుతుంది.

నోబెల్ శాంతి  పోటీదారులలో భార‌త్‌ ఆల్ట్‌న్యూస్ ద్వ‌యం

2022 నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీలో ఉన్న 343 మంది అభ్యర్థులలో ఫ్యాక్ట్-చెక్ సైట్ ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకులు ఉన్నారు. 2022 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకునే పోటీదారులలో ఫ్యాక్ట్-చెకర్లు మహమ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హా ఉన్నారు. నార్వేజియన్ చట్టసభ సభ్యులు, పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓస్లో (పిఆర్ ఐఓ) ద్వారా బహిరంగపరచబడిన నామి నేషన్ల ఆధా రంగా బహుమతిని గెలుచుకునే పోటీదారులలో ఫాక్ట్ చెక‌ర్‌ సైట్ ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకులు  సిన్హా, జుబైర్ ఉన్నారు. ఢిల్లీ పోలీసు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) ప్రకారం 2018లో "అత్యంత రెచ్చగొట్టే  విద్వేష భావాలను  రెచ్చగొట్టడానికి సరిపోయేంత కంటే ఎక్కువ చేసిన ట్వీట్ కోసం మిస్టర్ జుబైర్ ఈ ఏడాది జూన్‌లో అరెస్టయ్యాడు. మత ప్రాతిపదికన వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకున్నందుకు ఢిల్లీ పోలీ సులు అతనిపై అభియోగాలు మోపారు. నిజ-పరిశీలకుడి అరెస్టు ప్రపంచ ఆగ్రహాన్ని రేకెత్తించింది, జర్నలిస్టులను రక్షించడానికి అమెరికన్ లాభాపేక్షలేని కమిటీ ఒక ప్రకటనను విడుదల చేయడానికి ప్రేరేపించింది, భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు మరో తక్కువ, ప్రభుత్వం పత్రికా రిపోర్టింగ్ సభ్యులకు ప్రతికూలమైన, అసురక్షిత వాతావరణాన్ని సృష్టించింది. సెక్టారియన్ సమస్యలపై. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన  నెల తర్వాత జుబైర్ తీహార్ జైలు నుండి బయటకు వచ్చాడు. దాదాపు 343 మంది అభ్యర్థులు ఉన్నారు - 251 మంది వ్యక్తులు, 92 సంస్థలు - 2022 నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీలో ఉన్నారు. నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకు లేదా అభ్యర్థులకు ప్రకటించనప్పటికీ, రాయిటర్స్ సర్వేలో బెలా రసియన్ ప్రతిపక్ష రాజకీయవేత్త స్వయాట్లానా సిఖానౌస్కాయ, బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ అటెన్‌బరో, వాతావరణ కార్యకర్త గ్రేటా థన్‌ బర్గ్, పోప్ ఫ్రాన్సిస్, టువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫే, మయన్మార్నే షనల్ యూనిటీ ప్రభుత్వం నార్వే చట్ట సభలచే నామినేట్ చేయబడిన వాటిలో ఉన్నాయి. నామినేటర్ల పేర్లు లేదా నోబెల్ శాంతి బహుమతికి నామినీల పేర్లు ఒక నిర్దిష్ట బహుమతిని ప్రదానం చేసిన 50వ వార్షికోత్స వాన్ని గుర్తుచేసే సంవత్సరం ప్రారంభం వరకు బహిర్గతం చేయబడవని నోబెల్ కమిటీ శాంతి బహుమతికి నామినేషన్లపై నియ మాలు ప‌రిశీలిస్తున్నాయి. సిన్హా, జుబైర్‌తోపాటు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడోమిర్ జెలెన్స్కీ, యుఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరియు రష్యా అసమ్మతివాది,  వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవాల్నీ కూడా శాంతి బహుమతికి పోటీదారులు. 2022 నోబెల్ శాంతి బహుమతి విజేతలను ఓస్లోలో అక్టోబర్ 7న ప్రకటిస్తారు.

ఇక జాతీయ రాజ‌కీయాల్లో  కేసీఆర్, బీఆర్ ఎస్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ  కొత్త వెర్షన్  భారత రాష్ట్ర సమితిని ప్రారంభించడం ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే తన చిరకాల కలను నిజం చేసుకున్నారు. ఈ శుభ ముహూ ర్తాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ద్వారా ఎవరైనా ఒక సందేశాన్ని తీసుకోగలిగితే, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీ ఆర్ కు జాతీయ పార్టీ చాలా ముఖ్యమైనదని చెప్పడం తప్పు కాదు. తెలంగాణను దాటి ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో కేసీఆర్ ను విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ వరంగల్‌కు చెందిన పార్టీ నాయకుడు 200 మంది కార్యకర్తలకు కోళ్లు, మద్యం పంపిణీ చేయడంతో ప్రారంభానికి ముందు టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొంది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, విడుతలై చిరు తైగల్ కట్చి (వీసీకే) అధ్యక్షుడు తొల్కప్పియన్ తిరుమావళవన్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. తిరుమావళవన్ చిదంబరం నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు మరియు ప్రముఖ దళిత నాయకుడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో విజయం సాధించిన వెంటనే, కేంద్రంలోని అధికార బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయం కోసం రావు చురుకుగా ఆలోచిస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా తన రాజకీయ పోరాటాన్ని వేగవంతం చేయడానికి రావు యొక్క ఎత్తుగడ ఎన్నికల సంఘం తెలంగాణ లోని మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో సమానంగా ఉంది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. బిజెపి తన రాజకీయ సౌలభ్యం కోసం మతతత్వ భావాలను ఉపయోగించుకుంటు న్నం దున, దేశ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ రాజకీయాల్లో పార్టీ కీలక పాత్ర పోషించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దాని వ్యవస్థాపక దినో త్సవ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ తీర్మానించింది. తెలంగాణా రాజకీయాల్లో భాజపా పుంజుకుంటున్న సమయంలోనే జాతీయ పార్టీని ప్రారంభించడం కూడా జరిగింది. 2020లో, హైదరాబాద్ నగరపాలక ఎన్నికలలో బిజెపి ఒక శక్తిగా ఉద్భవించింది మరియు హుజూరాబాద్‌తో సహా సెగ్మెంట్‌లకు జరిగిన ఉప ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా గెలుచుకుంది. దేశంలోని దక్షిణాది ప్రాంతాల్లో పార్టీ తన అడుగుజాడలను విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ నేతలు తెలంగాణపై తీవ్రంగా దృష్టి సారించారు. తన పార్టీ కొత్త దశకు మద్దతు కూడగట్టేం దుకు కేసీఆర్‌ గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక పాలనకు స్వస్తి పలికేందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాలని టీఆర్‌ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు రావుల గత నెలలో పిలుపునిచ్చారు. ఇటీవల పాట్నాలో తన బీహార్ కౌంటర్ నితీష్ కుమార్‌ను కలిసిన రావు, దేశాన్ని పీడిస్తున్న అనేక రుగ్మతలకు కేంద్రంలోని జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని నిందిస్తూ “బిజెపి ముక్త్ భారత్” (బిజెపి రహిత భారతదేశం) కోసం పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6న నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో రావుల మాట్లాడుతూ.. ప్రజలు నన్ను జాతీయ రాజకీయాల్లోకి పిలు స్తున్నారు. మీ (ప్రజల) ఆశీస్సులతో అక్కడికి వెళ్తున్నాను. బీజేపీ-ముక్త్ భారత్ కోసం పోరాడాలి. 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభు త్వం అధికారంలోకి వస్తుంది. మన రాష్ట్రం అభివృద్ధి చెందినట్లే దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.  తమ తమ రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ ప్రాంతీయ పార్టీల సమ్మేళనం కొత్త సంస్థగా ఉంటుందని జెడి (ఎస్) నాయ‌కులు అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలనే ఆలోచన ఉంది. ప్రాథమికంగా, ఇది వివిధ ప్రాంతీయ పార్టీల కలయిక, వారు తమ రాజకీయ విభేదాలను అధిగమించి కలిసి రావాలని కోరుకుంటారని జెడి (ఎస్) నాయకుడు అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని సెప్టెంబర్ 5న రావు ప్రకటించారు. అతను సమాజంలోని బలహీన వర్గాల హక్కుల కోసం కూడా పోరాడాడు. దళితులు, బల హీనవర్గాలు, మహిళలకు చేసిందేమీ లేదు. దేశంలోని అన్ని రంగాల్లో కేంద్రం విఫలమైందన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎంతకాలం పోరాడాలి? ప్రజలు ఆలోచించాలి. మాకు మార్పు కావాలి, అని అతను చెప్పాడు. సెప్టెంబర్ 12న ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడుతూ తొలిసారిగా ప్రతిపాదిత జాతీయ పార్టీపై కొన్ని సూచనలు చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం, దళిత బంధు (ఏదైనా వ్యాపారం లేదా వ్యాపారం ప్రారంభించడానికి ప్రతి దళిత ఇంటికి రూ. 10 లక్షల గ్రాంట్) వంటి సంక్షేమ పథకాలపై టీఆర్‌ఎస్ దృష్టి సారిస్తుందని పార్టీ వర్గాలు పిటిఐకి తెలిపాయి. జాతీయ స్థాయిలో ఇలాంటి పథకాలు రూపొందించబడలేదు, అమలు చేయబడలేదు. బిజెపి సంక్షేమ కార్యక్రమాలను ఉచి తాలు అని కూడా పేర్కొంది. దేశవ్యాప్తంగా, అన్ని గ్రామాలకు కరెంటు ఇవ్వలేదని, కేంద్రంలోని అధికార పార్టీని బట్టబయలు చేసేందుకు ఇలాంటి అన్ని అంశాలను ప్రచారంలో తీసుకుంటామని సంబంధిత వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో రావు తొలిసారిగా కనిపించడం ఏంటంటే, తెలంగాణ సీఎం డిసెంబర్ 9న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

2జి స్కామ్.. సిబిఐ  ఛార్జిషీట్..మాస్టర్ మైండ్ గా ఎ. రాజా 

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) 2జి స్కామ్‌పై తన మొదటి ఛార్జిషీట్‌లో మాజీ కేంద్ర మంత్రి, డిఎంకె నాయకుడు ఎ. రాజా ఈ కుట్రకు 'మాస్టర్ మైండ్' అని ఆరోపించింది. కార్పొ రేట్ కంపెనీలు --రిల యన్స్ టెలికాం, స్వాన్ టెలికాం, యునిటెక్ వైర్ లెస్‌తో పాటు ఎని మిది మంది వ్యక్తు లను ఈ కేసులో సహనిందితులుగా అభియోగాలు మోపారు. మాజీ టెలికాం సెక్రటరీ సిద్ధార్థ బెహూరా, యూనిటెక్ చీఫ్ సంజయ్ చంద్ర, డీబీ రియాల్టీ బాస్, దాని ఎండీ వినోద్ గోయెంకా, స్వాన్ టెలికాం ఎండీ షాహి ద్ బల్వాలపై చార్జ్ షీట్‌లో పేర్లు ఉన్నాయి. 2008-2జి కేసు అనేది టెలికమ్యూనికేషన్స్ బ్యాండ్‌విడ్త్‌ను ఎంపిక చేసిన సంస్థలకు ఆస్థి వాస్తవ మార్కెట్ విలువను తక్కువ ధరలకు విక్రయించడం. రాజా టెలికమ్యూనికేషన్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖకు నేతృత్వం వహించినప్పుడు ఈ విక్రయం జరిగిందని పేర్కొన్నారు; ఇది దేశ చరిత్రలో దాదాపు రూ. 1.76 లక్షల కోట్ల రాజకీయ అవినీతి కేసుగా పరిగణిస్తారు. డిసెంబరు 21, 2017న 2జి స్పెక్ట్రమ్ కేటాయింపు కేసులో రాజా, డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి సహా నిందితులందరినీ ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో పేర్కొన్న 33 మంది వ్యక్తులపై అభియోగాలను రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాలను అందించడంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విఫలమయ్యాయని, ప్రాసిక్యూషన్ ఎవరిపైనైనా ఎలాంటి అభియో గాలను రుజువు చేయడంలో ఘోరంగా విఫలమైందని కోర్టుకు ఎలాంటి సందేహం లేదని ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ అన్నారు. న్యాయమూర్తి తన 1,552 పేజీల తీర్పులో, టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ వివ‌ధ‌ చర్యలు  నిరుప‌యోగం వలన ఏర్పడిన గందరగోళం ఏదీ లేని చోట అందరూ చూసే భారీ కుంభకోణంగా మారింది. ప్రాసిక్యూషన్ చక్కగా రూపొందించిన ఛార్జిషీట్‌లో చాలా వాస్తవాలు తప్పుగా ఉన్నాయని ఆయన అన్నారు. నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన సంబంధిత మనీలాండరింగ్ కేసులో రాజా, కనిమొళి సహా 19 మంది నిందితులను కూడా కోర్టు విడుదల చేసింది.

మత ఆధారిత జనాభా అసమతుల్యతను విస్మరించలేం.. మోహ‌న్ భ‌గ‌త్‌

జనాభా నియంత్రణ కోసం భారత దేశానికి ప్రభుత్వ విధానం అవస రమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అలాంటి అవ సరమైన చర్యలు తీసుకోకపోతే దేశం విడిపోతుందనే భయాన్ని పెంచడానికి మత ఆధారిత అస మతుల్యత, బలవంతపు మార్పి డు లని ఉదహరించారు. అతను తూర్పు తైమూర్, కొసావో, దక్షిణ సూడాన్‌లను జనాభాలో మతాల మధ్య అస మతుల్యత కారణంగా ఉద్భవించిన కొత్త దేశాలను ఉదాహరణలుగా పేర్కొ న్నారు. అధికార బీజేపీ మెంటర్ సంస్థ ఆర్‌ ఎస్ఎస్ వార్షిక దసరా ర్యాలీలో ఆయన మాట్లాడారు. జనాభా నియంత్రణతోపాటు, మతప్రాతిపదికన జనాభా సమతుల్యత కూడా ముఖ్యమైన అంశం, దీనిని విస్మరించలేమని ఆయన  తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. జనాభాకు వనరులు అవసరం. వనరులను నిర్మించకుండా అది పెరిగితే అది భారం గా మారుతుంద‌ని ఆయన జోడించారు, జనాభాను ఆస్తిగా పరిగణించే మరొక అభిప్రాయం ఉంది. మేము రెండు అంశా లను దృష్టిలో ఉంచుకుని జనాభా విధానాన్ని రూపొందించాలి. ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల కీలకఎజెండాను పునరుద్ఘా టిస్తూ, జనన రేటు ఒక కారణం; బలవంతం, ఎర లేదా దురాశ చొరబాటు ద్వారా మతమార్పిడులు కూడా పెద్ద కారణాలని ఆయన అన్నారు. అయితే, జనాభా నియంత్రణచట్టాన్ని పార్టీసభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పదేపదే ప్రతిపా దించినప్ప టికీ, బిజెపి కేంద్ర ప్రభుత్వం దానితో ఏకీభవించడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో, అటువంటి చట్టం కోసం నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడు రాకేష్ సిన్హా బిల్లుపై చర్చలో, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ ఏమైనప్ప టికీ జనాభా స్థిరీకరణకు హామీ ఇచ్చాయని అన్నారు. మొత్తం సంతానోత్పత్తి రేటు దాదాపు 2%కి తగ్గింది..కుటుంబ నియం త్రణ మిషన్ విజయం దిశగా పయనిస్తోందని ఇది మాకు తెలియజేస్తుంద‌ని మంత్రి చెప్పారు. మిస్టర్ సిన్హా తర్వాత తన బిల్లు ను ఉపసంహ రించుకున్నారు. సంతానోత్పత్తి రేటు  ఒక మహిళ కలిగి ఉండగల పిల్లల సగటు సంఖ్య 2011 జనాభా లెక్కల తర్వాత భారతదేశం మొత్తంగా ఇప్పుడు 2.2 ఉంది, ఇది 1951లో 5.9కి తగ్గింది. 2.1 రేటు స్థిరమైన జనాభాను నిర్ధారించగలదని నిపుణులు అంటున్నారు. తద్వారా భారతదేశం ఆదర్శానికి దగ్గరగా ఉంది. యుఎస్‌, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలు దీని కంటే చాలా దిగువన ఉన్నాయి, అంతేగాక‌ వృద్ధాప్య జనాభాతో పోరాడుతున్నాయి. అసమతుల్యత అనే ప్రశ్నకు సంబంధించి, ఇటీవలి పరిశోధనలు విభజన (1947) నుండి భారతదేశం  మతపరమైన జనాభా వృద్ధిరేటులో కొన్నితేడాలు ఉన్నప్పటికీ, చాలా స్థిరంగా ఉన్నట్లు చూపిస్తుంది. దేశంలోని ప్రధాన మైనారిటీ సమూహం అయిన ముస్లింలలో సంతానోత్పత్తి రేటు అన్ని ప్రధాన కమ్యూనిటీలలో అత్యధి కంగా ఉంది కానీ వేగంగా క్షీణిస్తోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ గత సంవత్సరం నివేదిక ప్రకారం ఇది ఇప్పుడు దాదాపు హిందువులతో సమానంగా ఉంది. 1951, 2011 మధ్య, ముస్లింలు జనాభాలో 4 పాయింట్లకు పైగా పెరిగి 14.2 శాతానికి చేరుకున్నారు. హిందువులు దాదా పుగా క్షీణించి 79.8 శాతానికి చేరుకున్నారు. అయితే గత రెండు దశాబ్దాలుగా రెండూ ఒకే వృద్ధిరేటు దిశగా సాగుతున్నా యి. 1992 నుండి 2015 వరకు కేవలం రెండు దశాబ్దాలలో - ముస్లిం సంతానోత్పత్తి రేటు 4.4 నుండి 2.6 కి తగ్గింది. హిందు వులకు 3.3 నుంచి 2.1కి తగ్గింది. దేశంలోని మత సమూహాల మధ్య పిల్లలను కనడంలో అంతరాలు గతంలో కంటే చాలా తక్కు వగా ఉన్నా య‌ని పరిశోధన పేర్కొంది. సంతానోత్పత్తి రేటును ప్రభావితం చేసే ప్రధాన అంశం కూడా మతం కాదని నొక్కి చెప్పింది ప్రాంతీయ, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థి తులు పెద్ద పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, దక్షిణాదితో పోలిస్తే మధ్య, ఉత్తరాది రాష్ట్రాల్లోని మహిళలు ఎక్కువ మంది పిల్ల లను కలిగి ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కూడా ఈరోజు ప్రస్తావించిన మూడుఅంశాలైన సంతానోత్పత్తి, వలసలు, మార్పి డులను నివేదిక పరిశీలించింది. ఇది నమోదుకాని వలసదారులప‌రంగా ప్ర‌పంచదేశాల‌ సంఖ్యలకు ఎటువంటి ఆధారా లు కనుగొన లేదు, భారత్ మొత్తం మేకప్ పై మార్పిడుల గణనీయమైన ప్రభావాన్ని చూడలేదు.

ప్రియ‌మైన మృత్యువా...!

ఎంత క‌ర‌డుగ‌ట్టిన మ‌నిష‌యినా, ఏదో ఒక సంద‌ర్భంలో త‌ను చేసిన దారుణాలు గుర్తుచేసు కుని త‌న‌ని తాను అస‌హ్యిం చుకుంటాడు. అప్పుడు మారే మ‌నిషిమంచి మ‌న‌సుతో స‌మా జంలో బ‌తికేందుకు అర్హుడ‌న‌ని భావిస్తాడు. చాలామంది బ‌య‌ టికి  చెప్పుకోలేని బాధ‌ల్ని డైరీ లుగా రాసుకున్నారు. యాసీ ర్ అహ్మ‌ద్ కూడా రాశాడు. జ‌మ్ము కాశ్మీర్ డీజీ(ప్రిజ‌న్స్‌) హేమంత్ లోహియా హ‌త్య‌ కేసు లో అను మానితునిగా పోలీసు లు అరెస్టు చేశారు. డిజీ లోహియా ఇంట్లో అహ్మ‌ద్ ప‌నివాడిగా ఆరు నెల‌ లుగా ప‌నిచేస్తున్నాడు. ఏ కార‌ ణం చేత‌నో ఆయ‌న్ను హ‌త్య‌చేసి శ‌వాన్ని త‌గ‌ల‌బెట్టాడు. ముందు గా ఆయ‌న గ‌దిలో లోప‌ల గ‌డియ‌ పెట్టి, ఆయ‌న్ను కుర్చీలో క‌ట్టేసి నూనె శ‌రీర‌మంతా రాసి క‌చెప్ సీసా పెంకుతో ఆయ‌న గొంతు కోశాడు. ఆ త‌ర్వాత దిండును కాల్చి ఆయ‌న మీద ప‌డేయ‌డంతో ఆయ‌న శ‌రీరం కాలిపోయింద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. ఆ సంఘ‌ట‌న తర్వాత‌నే అహ్మ‌ద్ పారిపోయాడు. అత‌న్ని కీల‌క స‌స్పెక్ట్ గా పోలీసులు ప‌ట్టుకున్నారు.   జైల్లో యాసిర్ అహ్మ‌ద్ చాలా దిగులుగా గ‌డిపాడన్న‌ది అత‌ను రాసిన డైరీ వివ‌రాలే చెబుతున్నాయ‌ని పోలీసులు అంటు న్నారు. ఇంత‌కీ డైరీలో ఏం రాశాడో తెలుసా..23 ఏళ్ల అహ్మ‌ద్ జీవితంలో ఏదో ఘోర త‌ప్పిద‌మే చేశాన‌ని గ్ర‌హించి బాధ‌తో కుమి లిపోయాడ న్న‌ది అర్ధ‌మ‌వుతుంది. చిత్రంగా అందులో బాలీవుడ్ పాట‌ల‌ను కూడా రాశాడు! ఇలా రాశాడు... ప్రియ‌మైన మృత్యువా, నా జీవితాన్ని అస‌హ్యించుకుంటున్నాను, నేను నీ కోస‌మే ఎదురు చూస్తున్నాను. భులా దేనా ముఝే, హై అల్విదా తుఝే  అంటూ ఆషికీ 2 సినిమాలోని పాట‌లో ఒక పంక్తిని రాశాడు. అలాగే, నా జీవితాన్ని తిరిగి కొత్త‌గా ఆరంభించాల‌నుకుంటున్నాను అని రాశాడు. జింద‌గీతో బ‌స్ త‌క్లీఫ్ దేతీ హై, సుకూమ్ తో మౌత్ హీ దేతీ హై అని, రోజూ జీవితాన్ని ఎంతో ఆశ‌తో ఆరంభిస్తున్నాను, కానీ చాలా చెత్త అనుభ‌వంతోనే ముగుస్తోంది అనీ రాశాడు. అహ్మ‌ద్‌ను పోలీసు లు చాలా ప్ర‌య‌త్నాల త‌ర్వాత మంగ‌ళ‌వారం ప‌ట్టుకోగ‌లిగారు.    త‌న జీవితం 99 శాతం డిప్ర‌ష‌న్ తో నిండింద‌ని, కేవ‌లం ప‌ది శాత‌మే ఆనందంతో ఉన్నాన‌ని, ప్రేమ అస్స‌లు లేద‌ని, జీవిత‌ మంత ఒత్తిడేన‌ని రాశాడు. జీవిత‌మంతా దుర్భ‌ర‌మ‌ని, అంతా క‌న్నీటితోనే సాగుతోంద‌ని చ‌నిపోవ‌డ‌మే మంచిద‌ని, ఆ త‌ర్వాత మంచి జీవితం ఆరంభించ‌డానికి వీల‌వుతుంద‌ని రాసుకున్నాడు. ఒక‌వేళ నిజంగానే యాసిర్ అహ్మ‌ద్‌కి జీవితం మీద ఇంత విర‌క్తే క‌లిగితే అత‌నిలో ఎంతో మార్పు నిజంగానే వ‌చ్చింద‌ని పోలీసులే కాదు అత‌ని చేతిలో చ‌నిపోయాడ‌ని అనుమానిస్తున్న హేమ‌త్ లోహియా కుటుంబీకులు క్ష‌మించేస్తారు. ఈ మార్పునే ఆశిద్దాం.

ఈసీ సూచ‌న చేదుగుళిక కాదేమో!

ఇంట్లోవాళ్లు ఎవ‌రు ఏం చేయాలి, ఎక్క‌డికి వెళ్లాలి, వెళ్ల‌కూడ‌దు, ఏం తినాలి.. వంటి ఆర్డ‌ర్ల‌తో పెద్దావిడ వేధించుకుతినేస్తోంద‌ని కోడ‌ళ్లు మండిప‌డుతున్నారు. ఆమె మీద కోప‌మంతా పిల్ల‌ల మీద ప్ర‌ద‌ర్శ‌స్తున్నారు. ఓ రోజు పెద్ద కోడ‌లు కూతురు వెళ్లి పెద్దామె కు చాలు నీ ఆధిప‌త్యం ర‌వ్వంత ఎక్కువే చేస్తున్నావు, త‌గ్గించుకోమంది. ఎవ‌రు ఏం చేయాలో అంద‌రికీ తెలుసునంది. ఇలా ఉంది ఎన్నిక‌లక‌మిష‌న్ మీద రాజ‌ కీయ‌పార్టీల తిరుగుబాటు. కేంద్ర‌ ప్ర‌భుత్వం ఆదేశాల‌తోనే పార్టీల ను అదుపులో పెట్టుకోవాల‌ని ఈసీ ఆదేశాలు జారీ చేయ‌డం ప‌ట్ల మండిప‌డుతున్నాయి.  ఎన్నికల వాగ్దానాలపై అన్ని వివరాలు ఓటర్లకు తప్పనిసరిగా తెలియాలని ఎన్నికల కమిషన్ చెప్పడాన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధంగా జోక్యం చేసుకునే అధికారం ఈసీకి లేదంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ ప్రతి పాదన చేసిందని మండిపడుతున్నాయి. రాజ‌కీయ‌పార్టీలు వాగ్దానాలు, వాటి అమ‌లుకు అవ‌స‌ర‌మైన ఆర్ధిక వ‌న‌రుల సంగ‌తి ఓట‌ర్ల‌కు ఖ‌చ్చితంగా తెలియాల‌ని ఈసీ పేర్కొన్న‌ది. ఎన్నికల ప్రణాళికలులో రాజకీయపార్టీలు చేసే వాగ్దానాలు, వాటి అమ లుకు ఆర్థిక వనరులు వంటి అంశాల గురించి ఓటర్లకు తెలియాలని, అన్ని వివరాలను తెలుసుకుని, తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఇది దోహదపడుతుందని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిపాదనపై అభిప్రా యాలను తెలియజేయాలని గుర్తింపుపొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయపార్టీలను కోరింది. దీనిపై స్పందించేందుకు ఈ నెల 18వరకు గడువు కూడా విధించింది. ఇందులో స్పందించ‌డానికేముంది..తాము చెప్పిన మాటే శాస‌నంగా అమ‌లు చేయాల‌ని, తోక‌ ఝాడిస్తే పార్టీ గుర్తుల‌కే దిక్కండ‌ద‌న్న హెచ్చ‌రిక‌లా రాజ‌కీయ‌పార్టీల‌కు తోచింది. అందుకే పార్టీలు మండిప‌డు తున్నాయి. ఈసీ ఇలాంటి కండిష‌న్లు ఎలా పెడుతుంద‌ని పార్టీలు ప్ర‌శ్నిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మీడియాతో మాట్లాడుతూ, ఇది ఎన్నికల కమిషన్ చేయవలసిన పని కాదన్నారు. పోటీతత్త్వ రాజకీయాల సారం, స్పూర్తిలకు ఇది విరుద్ధమని ఆరోపించారు. భారత దేశ ప్రజాస్వామ్యంలో ఇది మరొక పొరపాటు అవుతుందని చెప్పారు. గతంలో ఇలాంటి బ్యూరోక్రాటిక్ వైఖరి ఉండి ఉంటే, దశాబ్దాల నుంచి పరివర్తన తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలేవీ వాస్తవమయ్యేవి కాదన్నారు.   శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ,ఈడీ, సీబీఐ కార్యకలాపాలు గంపగుత్త తరహాకు మారు తున్నా యని, అదేవిధంగా ఎన్నికల ప్రజాస్వామ్యం, ఎన్నికల నిర్వహణ కూడా మసకబారుతోందని వ్యాఖ్యానించారు. ఓటర్లు తమ ఓటు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకుంటారని, ఆ ప్రభుత్వాలు అధికంగా ఖర్చు చేస్తే, తమ వాగ్దానాలను నిలుపుకోలేకపోతే, వాటిని ఆ ఓటర్లే గద్దె దించుతారని అన్నారు. ఇది కేవలం ఓటర్ల హక్కు అని చెప్పారు. ఈసీ తన బాధ్యతలను అతిగా నిర్వహి స్తోంద‌న్నారు. సుస్థిరమైన అంతర్జాతీయ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతో జోక్యం చేసుకుంటోందని మండి పడ్డారు.  అభివృద్ధి లక్ష్యాలపై గొప్పలు చెప్పుకుని అధికారం చేపట్టినవారిని, ఉద్యోగ కల్పన, అభివృద్ధిపై ఇచ్చిన హామీలను నెరవేర్చ డానికి బదులుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని రోజులను పెంచినవారిని, ఉచిత రేషన్ స్కీమ్‌ను మరింత విస్తరించిన వారిని కూడా ఈసీ జవాబుదారీ చేయాలన్నారు. రాజ‌కీయ‌పార్టీలు అధికార దాహంతోనే ఉచితాలు ప్ర‌క‌టించ‌డం, ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవడంలో ఎడాపెడా హామీలు ఇవ్వ‌డంవ‌ల్ల ప్ర‌జ‌లు ముందు ఆయా పార్టీల వెంట ప‌డుతున్న‌ప్ప‌టికీ అధికారంలో ఉన్నంత‌ కాలం అది చెల్లుబ‌డి అవుతోంది. కానీ ఆర్ధిక మ‌ద్ద‌తు కోసం కేంద్రాన్ని వేడుకోవ‌డం వర‌కూ ప‌రిస్థితులు దిగ‌జార్చే హామీలు ఇవ్వ‌డం దేనిక‌న్న‌దే ఈసీ ప్ర‌శ్న‌. దీనికి రాజ‌కీయ‌పార్టీల నుంచి త‌గిన స‌మాధానం మాత్రం రావ‌డం లేద‌ని విశ్లేష‌కుల మాట‌. ఓట్ల‌ను అడిగేందుకు పార్టీలు, నాయ‌కులు చేసిన కార్య‌క్ర‌మాలు, పార్టీల అజెండాలో ప్ర‌త్యేక‌త‌ల్ని ప్రచారం చేసుకోవ‌డం కంటే ఉచితాల ప్ర‌క‌ట‌న‌ల మీద‌నే ఆస‌క్తి ఎక్కువ క‌న‌ప‌ర్చ‌డం ఆ త‌ర్వాత వాట‌ని స‌మ‌ర్ధించుకోలేక వెనుక‌బ‌డి ప్ర‌జ‌ల దృష్టిలోనూ ప్ర‌తిష్టతో పాటు అధికారం కోల్పోవ‌డం జ‌రుగుతోంది. త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాల మీద‌కూడా వారి భారం ప‌డుతోంది. చాలా సంద‌ర్భాల్లో కొత్త‌గా ప్ర‌భుత్వంలోకి వ‌చ్చి న పార్టీలు అంత‌కు ముందు పార్టీలు, ప్ర‌భుత్వాలు ఇచ్చిన అర్ధంలేని ప‌థ‌కాల హామీలు అమ‌లు చేయడానికి ఎంతో ఆలోచిం చాల్సివ‌స్తోంది. కానీ ఇపుడు ఈసీ చేసిన హెచ్చ‌రిక మాత్రం చేదుగానే రాజ‌కీయ‌పార్టీలు భావిస్తున్నాయి. 

మునుగోడులో బీఆర్ఎస్సా టీఆర్ఎస్సా?

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 14న నామినేషన్ల దాఖలుకు తుది గడువు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత దృష్టి అంతా తాను విజయదశమి నాడు ( అక్టోబర్ 5) ప్రారంభించబోతున్న జాతీయ పార్టీ పైనే ఉంది. చాలా ఆర్భాటంగా, హడావుడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మునుగోడుపై ఆయన దృష్టి సారించారా? అంటే టీఆర్ఎస్ శ్రేణుల నుంచే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మరో వైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమతమ అభ్యర్థులను ఖరారు చేసి ప్రచార పర్వంలోకి దిగిపోయాయి. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమని తేలిన తరువాత మొట్టమొదటిగా మునుగోడులో సభ పెట్టి ప్రచార శంఖారావం మోగించింది కేసీఆర్. అయితే ఆ తరువాత క్రమంగా మునుగోడు కంటే జాతీయ రాజకీయాలపైనే ఆయన ఎక్కవగా దృష్టి పెట్టారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా పార్టీలో అసమ్మతి భగ్గుమనడంతో.. ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది.   ఒకవైపు టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించే ప్రక్రియలో బిజీబిజీగా  ఉన్న కేసీఆర్.. ఇప్పుడు మునుగోడులో  నిలబెట్టబోయే అభ్యర్థి బీఆర్ఎస్ తరఫున నిలబడతారా, టీఆర్ఎస్ తరఫున నిలబడతారా అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి.     నవంబర్ 3న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుంది.  ఈనెల 14న నామినేషన్ల దాఖలుకు చివరితేదీ.   కొత్తగా ఏర్పాటయ్యే బీఆర్ఎస్ కు ఆ లోగా కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరణ వస్తే, టీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున పోటీకి దిగే అవకాశాలే ఎక్కువ ఉన్నఉన్నాయి.   తెరాస స్థానంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పు నిర్ణయంపై చేసిన తీర్మానం ప్రతితో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పార్టీ తెలంగాణ భవన్ కార్యాలయ ఇన్ ఛార్జి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.  నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా లోపు ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వారు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే ఇక టీఆర్ఎష్ కాదు బీఆర్ఎస్ పోటీలో ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలోని జాతీయ పార్టీ   బీఆర్ఎస్ ఎదుర్కొనే తొలి పరీక్ష ఇదే కానుంది. తొలి పరీక్షలో విజయం సాధించి శుభారంభం చేయాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.