ఇంటర్ సెకండియర్ ఫలితాలు: కృష్ణా జిల్లా టాప్

      ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11:30నిమిషాలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో గవర్నర్ సలహాదారుడు సలావుద్దీన్ అహ్మద్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ సెకండియర్ ఫలితాలలో 82శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలువగా, 49 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా ఇంటర్ ఫలితాలలో బాలికలే పై చేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 69.52 కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 61.87. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 2 శాతం పెరిగింది. మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు ఈ నేల 9 అలాగే రీ కౌంటింగ్, రీ వాల్యూవేషన్ కూడా తొమ్మిది లోపు దరఖాస్తు చేసుకోవాలి.

కుదుటపడని రోజా ఆరోగ్యం

      ఈ ఎన్నికలలో సినీ నటి రోజా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో వున్న విషయం, శుక్రవారం నాడు ఎండలో తిరుగుతూ ప్రచారం చేస్తూ వడదెబ్బకి గురైన విషయం తెలిసిందే. అయితే నిన్నంతా చికిత్స చేసినప్పటికీ వడదెబ్బ నుంచి రోజా కోలుకోనట్టు తెలిసింది. ఈసారి అయినా గెలుస్తానా లేదా అనే భయంతో రోజా ఎండని కూడా లెక్క చేయకుండా టూమచ్‌గా ప్రచారం చేయడంతో సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయిన రోజాని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు శ్రమపడి రోజాని స్పృహలోకి తెచ్చారు. వడదెబ్బ కారణంగా రోజా బాగా బలహీనమైపోయారని, ఇంకో రెండు మూడు రోజులైనా ఆస్పత్రిలో వుండక తప్పదని వైద్యులు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే రోజా ప్రచారంలో వెనుకబడిపోతానని, అంచేత బయటకి వెళ్ళి ప్రచారం చేస్తానని పట్టుబట్టగా, ట్రీట్‌మెంట్ పూర్తి కాకుండా బయటకి వెళ్ళి ప్రచారం చేస్తే అంతే సంగతులని వైద్యులు హెచ్చరించడంతో రోజా ఆస్పత్రిలోనే వుండటానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

      ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ విడుదల చేశారు. ఈ సంవత్సరం మొత్తం 65.57 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు.  వీళ్ళలో బాలుర శాతం 61.87 . బాలికల ఉత్తీర్ణత శాతం 69.52. గత ఏడాది కన్న ఈ ఏడాది స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం.    ఎస్ఎంఎస్ ద్వారా ... 1. BSNL users Inter <space><Roll No. > to  53346. 2.All users IPE2<space> <Hall Ticket No> to 54242 for General results; IPEV2 <space><Hall Ticket No> to 54242 for Vocational results. 3. All users<Hall Ticket>to 57272; 4. All users IPEG2<space> <Hall Ticket No> to 5676750 for General results; and IPEV2 <space><Hall Ticket No> to 5676750 for Vocational results; 5.  All users AP12<Hall Ticket No> to 58888; 6. Airtel users AP12<Hall Ticket No>to 52070; 7. All users APJI <space> <Hall Ticket No> to 56767999 To know results from the websites: * http://examresults.ap.nic.in * http://results.cgg.gov.in * www.apit.ap.gov.in * www.results.educationandhra.com * www.resumedropbox.com, * www.indiaresults.com * www.vidyavision.com * www.ExamResults.net * www. nettlinxresults.net * www.manabadi.com * www.manabadi.co.in * www.results.manabadi.co.in * www.schools9.com * www.exametc.com * http://results.webdunia.com * www.bharatstudent.com * www.kabconsultants.com * www.educationgateway.com * www.AndhraEducation.net * www.results.andhraeducation.net * www.educationandhra.com * www.betechs.com * www.koshercomm.in * www.resultsindia.in * www.educationplus.co * www.PsddOrFail.in * www.asmalldream.org * www.manachaduvu.com * www.vidyavision.co.in * www.vnssolutions.in * www.iitjeeforum.com 

సోనియా సభపై వెంకయ్య ఎద్దేవా

      దేశంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే రోజు దగ్గరపడి౦దని, అందుకే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ మీద విచారణకు ఆదేశాలు జారీ చేశారని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వం దిగిపోయే ముందు మోడీపై విచారణకు ఆదేశాలు జారీ చేసే అధికారం హోంమంత్రికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీమాంధ్రలో సోనియా సభ జనం లేక వెల వెల బోయిందని, బీజేపీ సవాళ్లకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత విమర్శలకు దిగుతుందని వెంకయ్యనాయుడు మండిపడ్డారు. గుంటూరు ఎన్నికల సభకు వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీ ఖాళీ కుర్చీలకు తన సందేశం ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆ ఖాళీ కుర్చీలను చూసి సోనియాగాంధీకి కూడా దేశంలో తమ పార్టీ పరిస్థితి ఏమిటో అర్ధమయ్యేవుంటుందని అన్నారు.

నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు

      ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు నేడు ఉదయం 11.30 గంటలకు విడుదలచేయనున్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ ఫలితాల సీడీని విడుదల చేస్తారు. అనంతరం మార్కులు, గ్రేడులను కూడా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను కొన్ని వెబ్‌సైట్లలోనూ చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఎస్ఎంఎస్ ద్వారా ... 1. BSNL users Inter <space><Roll No. > to  53346. 2.All users IPE2<space> <Hall Ticket No> to 54242 for General results; IPEV2 <space><Hall Ticket No> to 54242 for Vocational results. 3. All users<Hall Ticket>to 57272; 4. All users IPEG2<space> <Hall Ticket No> to 5676750 for General results; and IPEV2 <space><Hall Ticket No> to 5676750 for Vocational results; 5.  All users AP12<Hall Ticket No> to 58888; 6. Airtel users AP12<Hall Ticket No>to 52070; 7. All users APJI <space> <Hall Ticket No> to 56767999 To know results from the websites: * http://examresults.ap.nic.in * http://results.cgg.gov.in * www.apit.ap.gov.in * www.results.educationandhra.com * www.resumedropbox.com, * www.indiaresults.com * www.vidyavision.com * www.ExamResults.net * www. nettlinxresults.net * www.manabadi.com * www.manabadi.co.in * www.results.manabadi.co.in * www.schools9.com * www.exametc.com * http://results.webdunia.com * www.bharatstudent.com * www.kabconsultants.com * www.educationgateway.com * www.AndhraEducation.net * www.results.andhraeducation.net * www.educationandhra.com * www.betechs.com * www.koshercomm.in * www.resultsindia.in * www.educationplus.co * www.PsddOrFail.in * www.asmalldream.org * www.manachaduvu.com * www.vidyavision.co.in * www.vnssolutions.in * www.iitjeeforum.com  

పవన్ దెబ్బ రుచి చూడబోతున్న బొత్స

  ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు అత్యంత ప్రజాధారణ గల పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు తెలపడంతో కాంగ్రెస్ చావుకొచ్చినట్లయింది. రాష్ట్ర విభజన వ్యవహారంతో ఖాళీ అయిపోయిన పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులు, సభలకు జనాలు దొరక్క నానా అవస్థలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం మూలిగే ముసలి నక్కపై తాటి పండు పడినట్లయింది కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఎక్కడ ఎన్నికల ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరుగులు పెడుతున్నాయి.   ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు గనుక సీబీఐ పుణ్యమాని పదవి పోగొట్టుకొని జగన్ పంచన చేరిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సోనియాగాంధీకి దాసోహమంటూ రాష్ట్ర విభజనను సమర్దించిన కేంద్రమంత్రి కిల్లి కృపారాణీ ఇరువురుకీ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చవి చూడబోతున్నారు. ఇక పవన్ తన ప్రియ శత్రువు బొత్ససత్యనారాయణపై ప్రత్యేక శ్రద్ద వహిస్తారని చెప్పనవసరం లేదు. గతంలోనే అనేకమార్లు బొత్స అవినీతి గురించి విమర్శలు చేసారు. ఈరోజు విజయనగరం నడిబోడ్డులో నిలబడి పవన్ కళ్యాణ్ బొత్సపై విమర్శలు గుప్పిస్తే, ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును. పాపం బొత్స!

సానుభూతికి సాక్షి

  జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిళ ముగ్గురూ కలిసి గత ఐదేళ్ళుగా జనంలో వైయస్ మరణం తాలూకు సానుభూతి కరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొస్తున్నారు. ఇప్పడు దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవలసిన సమయం ఆసన్నమయింది. వారు ముగ్గురూ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. చేతిలో ఒక పేపరు, న్యూస్ ఛానల్ ఉంటే అది ఎంత ఉపయోగకరమో ఇప్పటికే సాక్షి మీడియా చూపింది. ఇక కీలకమయిన ఈ సమయంలో ఇప్పుడు దానిని నూటికి రెండువందల శాతం ఏవిధంగా ఉపయోగించుకోవచ్చునో అది మరొకసారి చూపుతోంది. గత రెండు రోజులు సాక్షి టీవీ ఛానల్లో ఆనాడు వైయస్స్ హెలికాఫ్టర్ లో బయలుదేరేముందు మాట్లాడిన మాటలు, ఆయన ప్రయాణిస్తున్నహెలికాఫ్టర్ జాడ తెలియనప్పుడు విజయమ్మ, ప్రజలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అందరూ స్పందించిన తీరు, ఆయన మరణ వార్త తెలిసిన తరువాత ప్రజల స్పందన ఇత్యాది సంఘటనలన్నిటినీ చూపుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన వర్ధంతి కాదు జయంతి కాదు. మరి ఎన్నికలకు ఇంకా కేవలం మూడు రోజుల ముందే ఎందుకు అవ్వనీ చూపుతున్నారు? అంటే సమాధానం అందరికీ తెలిసిందే.   తండ్రి చనిపోయిన తరువాత ఇంకా అంత్యక్రియలు కూడా జరపకుండానే తను ముఖ్యమంత్రి అయ్యేందుకు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంతకంటే మరింత దిగజారిపోయి, తన తండ్రి మరణాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్లు మరొకమారు చూపించి వారి సానుభూతిని ఓట్లుగా మలచుకోవాలనుకోవడం చాలా దారుణమయిన ఆలోచన. ఇది జగన్మోహన్ రెడ్డిలో ముఖ్యమంత్రి కావాలనే కాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెపుతోంది.   జగన్ తన పార్టీని బలోపేతం చేసుకొని, తన పార్టీ సిద్దాంతాలు, మ్యానిఫెస్టో గురించి ప్రచారం చేసుకొని ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ తండ్రి మరణాన్ని, దానిపై ప్రజలలో ఉన్న సానుభూతిని పెట్టుబడిగా చేసుకొని ముఖ్యమంత్రి అయిపోవాలని ఆలోచించడం చాలా దారుణం.   ఇటీవల ఆయన సోదరి షర్మిళ బాలకృష్ణపై విమర్శలు గుప్పిస్తూ ‘బాలకృష్ణ మంచి నటుడు అనిపించుకోగలిగేడేమో కానీ ఒక మంచి కొడుకు అని మాత్రం అనిపించుకోలేకపోయాడు,’ అని ఎద్దేవా చేసారు. ఇప్పుడు అవే మాటలను ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తింపజేయవచ్చేమో!

కాంగ్రెస్ సభలకు జనాలు కావలెను

  గుంటూరులో మొన్నమిట్ట మధ్యాహ్నం నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి నిర్వహించిన సభకి భగభగ మండుతున్న ఎండలని కూడా లెక్క చేయకుండా జనం పోటెత్తారు. అది చూసి మోడీ కూడా చాలా ఆశ్చర్యపోయారు. సభకు వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పుకొని తనపై ఇంత ఆప్యాయత చూపుతున్న సీమాంధ్ర ప్రజల ఋణం తప్పకుండా తీర్చుకొంటానని హామీ ఇచ్చారు. ఈరోజు అదే ప్రాంతంలో సోనియాగాంధీ సభ కూడా జరిగింది. జనాలకి ఎండ వేడి తగలకుండా షామియానాలు వేసారు. సుఖంగా కూర్చొనేందుకు కుర్చీలు వేసారు. దాహం తీర్చుకోవడానికి చల్లటి నీళ్ళ ప్యాకెట్లు కూడా అందించారు. కానీ పాపం జనాలే లేరు. మహా అయితే ఓ రెండు వేలమంది హాజరయి ఉంటారేమో! వారిలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నేతలె ఎక్కువగా కనబడ్డారు. మిగిలిన వారిలో రోజుకూలి లెక్కన వచ్చిన వారే అధికంగా కనిపించారు. సభలో దాదాపు మూడొంతులు కుర్చీలు ఖాళీగ కనబడ్డాయి. కాంగ్రెస్ నేతలు ప్రసంగిస్తుంటే వాటి మధ్య చిన్న పిల్లలు పరుగులు తీస్తూ హాయిగా ఆడుకోవడం నయనానందకరంగా ఉంది. బహుశః ఆ ఖాళీ కుర్చీలను చూసి సోనియాగాంధీకి కూడా రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి అర్ధమయిందేమో అందుకే "రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రజలను ఎంతగా బాధించిందో అర్ధమైందని"  అన్నారు.    చిరంజీవి ప్రసంగం మొదలు పెట్టె ముందు జనాలు కొంచెం హుషారుగా ఈలలు, కేకలు వేసారు. కానీ ఆ తరువాత ఆయన ప్రసంగిస్తునంత సేపు చీమ చిట్టుకుమంటే ఒట్టు. ఇక సోనియా ప్రసంగిస్తుంటే ఉన్న జనాలు కూడా మెల్లగా జారుకోవడం కనబడింది. ప్రజాభిప్రాయాన్ని, స్వంత పార్టీ నేతలనీ ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన చేసి, ప్రజలను, స్వంత పార్టీలో సీనియర్ నేతలను కూడా వదులుకొన్నాక, ఇప్పుడు ప్రజలను రమ్మంటే ఎందుకు వస్తారు? ఇది స్వయంకృతాపరాధమే.

పరిటాల శ్రీరామ్ కు 14 రోజుల రిమాండ్

      అనంతపురం జిల్లా రాప్తాడు శాసన సభ్యురాలు, టిడిపి నేత పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ను శుక్రవారం ఉదయం పోలీసులకు లొంగిపోయారు. శ్రీరామ్‌ను ధర్మవరం కోర్టుకు తరలించడంతో కోర్టు ఈనెల 6 వరకు రిమాండ్ విధించింది. దీంతో అధికారులు శ్రీరామ్‌ను ధర్మవరం సబ్ జైలుకు తరలించారు. శీరామ్ అరెస్ట్‌పై పరిటాల సునీత మాట్లాడుతూ తన కుమారుడు ఎలాంటి తప్పుచేయలేదన్నారు. శ్రీరామ్ విడుదల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం కనగాలపల్లి మండలం ఎలకుంట్లలో జరిగిన ప్రచార కార్యక్రమంలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జేడీ శీలం అనువాదం సూపర్

      గతంలో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా వస్తే వారి ప్రసంగాలను ఉండవల్లి అనువదించేవారు. ఇప్పుడు ఉండవల్లి జై సమైక్యాంధ్ర అనడంతో ఢిల్లీవాళ్ళ ప్రసంగాలు అనువదించేవారు లేకుండా పోయారు. మొన్నామధ్య తెలంగాణలో సోనియా, రాహుల్ సభలు జరిగినప్పుడు సరైన అనువాదకుడు లేక తల్లీకొడుకు ఇద్దరూ హిందీలోనే మాట్లాడారు.   ఇప్పుడు సీమాంధ్రలో సోనియా, రాహుల్ పర్యటిస్తున్నారు. గుంటూరు సోనియా సభలో ఆమెకి కేంద్ర మంత్రి జేడీ శీలం అనువాదకుడిగా వ్యవహరించారు. ఆయన సోనియా ప్రసంగాన్ని సూపర్‌గా అనువదించారు. సోనియాగాంధీ పావలా అంత మేటర్ చెబితే, శీలం ఆ మేటర్ని పది రూపాయలంత సాగదీసి అనువదించారు. సోనియా మాట్లాడని మాటలు కూడా శీలం జతచేసి చెప్పేశారు. అసలే సీమాంధ్రలో ఓడిపోతామన్న భయంలో వున్న సోనియాగాంధీ చాలా ఎక్కువసేపు ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని జేడీ శీలం మరింత సాగదీసి అనువదించారు. సోనియాగాంధీ మాట్లాడుతూ వుండగానే ఉన్న కొద్దిమంది జనం కూడా సభలోంచి వెళ్ళిపోతున్నా కూడా సోనియాగాంధీ, జేడీ శీలం తమ ప్రసంగాలను ముగించకుండా మాట్లాడుతూనే వున్నారు. సభలో వున్న జనం సోనియాగాంధీ ప్రసంగం మహా బోర్ కొట్టేసిందని అనుకుంటూ వుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం సోనియా సభ సూపర్ సక్సెస్ వాళ్ళ భుజాలను వాళ్ళే తట్టుకుంటూ సంబరపడిపోతున్నారు.

గుంటూరులో సోనియా సభ.. కుర్చీలు ఖాళీ

      రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిన సోనియాగాంధీ ఎలాంటి అపరాధ భావం లేకుండా సీమాంధ్రలోని గుంటూరులో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సీమాంధ్రులు కోలుకోలేని విధంగా అన్యాయం చేసిన సోనియాగాంధీని సీమాంధ్రకు తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు అనుకోవడం ఒక మైండ్ లేని పని అయితే, తగుదునమ్మా అని సోనియాగాంధీ రావడం కూడా అలాంటి పనే. అందుకే గుంటూరు జనం తగిన శాస్తి చేశారు.   సోనియా గాంధీ సభకి కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప మరెవరూ రాలేదు. సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. నలుగురు మనుషులు మాత్రమే కూర్చోవడానికి అనుకూలంగా వున్న ఒంటిస్థంభం మేడలాగా కట్టిన  వేదిక కూడా చాలా విచిత్రంగా కనిపించింది. సోనియాతోపాటు మరో ముగ్గురు తప్ప మిగతావారందరూ నిల్చునే వున్నారు. సోనియా మాట్లాడినంతసేపూ  సభలో వున్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మన్నుతిన్న పాముల్లా కూర్చున్నారు తప్ప సోనియా ప్రసంగానికి ఎంతమాత్రం స్పందించలేదు.  

సువార్త సభల్లో వైకాపా జెండాలు

      రాజకీయాలని, మతాన్ని కలపడంలో జగన్ ఫ్యామిలీ ఎప్పుడో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ఇలాంటి మత రాజకీయాలకు వైకాపా మరింత ఉత్సాహంగా పాల్పడుతోంది. ప్రస్తుతం సీమాంధ్రలో ఎక్కడ క్రైస్తవ సభలు జరిగినా అక్కడకి వైకాపా నాయకులు ప్రత్యక్షమైపోతున్నారు. మనం మనం ఒకటి అంటూ ఓట్లు అడుగుతున్నారు. ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటూ వుంటే మధ్యలో మీ రాజకీయాల గోలేంటని క్రైస్తవులు విసుక్కుంటున్నా వినకుండా వైకాపా వర్గాలు భక్తిబాటలో ఓట్ల వేటకి వెళ్తున్నారు. లేటెస్ట్ గా కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని అద్దాడలో జరుగుతున్న సువార్త సభల్లోకి జగన్ బావమరిది బ్రదర్ అనిల్, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కల్పన వచ్చారు. అక్కడ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎవరో అడిగితే మేం ప్రచారానికి రాలేదు ప్రార్థన చేయడానికి వచ్చామని చెప్పారు. అయితే వీళ్ళంతా వచ్చిన వాహనాకు వైసీపీ జెండాలున్నాయి. ఇలా జెండాలతో రావడం ఎన్నికల ప్రచారం కిందే వస్తుందని ఎవరో అనడంతో అందరూ అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

డిగ్గీ, అమృత భలే పోజులిచ్చారు

      కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ నెత్తిన గుదిబండలా మారిన దిగ్విజయ్ సింగ్ అమృతారాయ్ అనే టీవీ యాంకర్‌తో గత కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీళ్ళ సంబంధం గురించి తెలిసిన అమృతారాయ్ భర్త ఆమె నుంచి విడాకులు కోరుకున్నాడు. వీళ్ళు ఏకాంతంగా వున్న సమయంలో ముచ్చటపడి తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ కావడం, దాంతో వీళ్ళిద్దరూ పెళ్ళి బాట పట్టడం ఈ పాయింట్లన్నీ రెండు రోజులుగా మీడియాలో నానుతూనే వున్నాయి.   అయితే ఇప్పుడు ఈ అంశాన్ని జనం మరో కొత్త కోణంలో చూస్తు్న్నారు. ఆ కోణం ఏమిటంటే, బయటకు లీక్ అయన ఫొటోల్లో దిగ్విజయ్, అమృత సూపర్‌గా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారని, ఈ ఎక్స్ ప్రెషన్లు ఏ సినిమా  హీరో హీరోయిన్లకి అయినా తీసిపోకుండా వున్నాయని. ఎంతో సంతోషంగా వున్న ఫేస్‌తో దిగ్విజయ్ భుజం మీద చేయి వేసిన అమృత.. హాయిగా కళ్ళు మూసుకుని ఏదో తన్మయత్వంలో వున్న దిగ్విజయ్ సింగ్. ఈ ఫొటోలలో వీళ్ళిద్దరి పోజులను చూసి జనం ముచ్చటపడుతున్నారు. సినిమాల్లో నటించే హీరో హీరోయిన్లు ఎక్స్ ప్రెషన్లు ఎలా ఇవ్వాలో వీళ్ళిద్దరిని చూసి నేర్చు్కోవాలని అంటున్నారు. దీనిమీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు. ఫొటోల్లో వీళ్ళిద్దరి ఎక్స్ ప్రెషన్లు చూస్తుంటే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా హీరో హీరోయిన్లని చూసినట్టు అనిపించిందని వర్మ కామెంట్ చేశాడు. దిగ్విజయ్, అమృత ఏదైనా సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తే ఎలా వుంటుందంటారు?  

గూగుల్ మీద కేసు

      ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు విశేష సేవలు అందిస్తూ, ఇంటర్నెట్ ప్రకటనల రంగంలో కూడా అగ్రస్థానంలో వున్న గూగుల్ మీద కేసు నమోదైంది. ఇంటర్నెట్ సెర్చింగ్ రంగంలో, మొబైల్ సెర్చ్ రంగంలో గూగుల్ ఆక్రమంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని కేసు నమోదైంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ముందుగానే యాప్ప్ లోడ్ చేయడం ద్వారా అనేక మోబైల్స్ లో తనకు సంబంధించిన గూగుల్, యూ ట్యూబ్ లాంటి వెబ్ సైట్లకి ప్రాధాన్యం వుండేలా గూగుల్ చూసుకుంటుందనేది ఈ కేసు సారాంశం. ఇలా చేయడం మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలకు వ్యతిరేకమని ఆ కేసులో పేర్కొన్నారు. నార్త్ కాలిఫోర్నియాలోని డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కేసు నమోదైంది. నోకియా వ్యాపార ప్రత్యర్థులు ఈ కేసు పెట్టారు.

రోజాకి వడదెబ్బ.. ఆస్పత్రిలో చికిత్స

      నగరి నుంచి పోటీ చేసీ చేసీ ఓడిపోతూ వస్తున్న రోజా మరోసారి నగర నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో వున్నారు. ఈసారి కూడా రోజా గెలిచే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో రోజా ప్రచారం చేస్తున్నారు. భగభగ మండుతున్న ఎండని కూడా లెక్క చేయకుండా రోజా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శుక్రవారం నాడు నియోజవర్గం పరిధిలోని ఏకాంబరకుప్పంలో ప్రచారం చేస్తున్న రోజాకి భారీ స్థాయిలో వడదెబ్బ తగిలింది. దాంతో ఆమె అక్కడికక్కడే కళ్ళు తిరిగిపడిపోయింది. రోజాకి వడదెబ్బ తగిలిన విషయాన్ని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు ఆమెను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్న ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు.

ప్రధానిగా మోడీకే నా మద్దతు: ప్రీతీజింటా

      బాలీవుడ్ అందాల భామ, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రాంచైజీ ప్రీతీజింటా ప్రధానమంత్రిగా నరేంద్రమోడీకే తన మద్దతు అని స్పష్టంగా ప్రకటించేసింది. నరేంద్రమోడీ ఎంపీగా పోటీ చేస్తున్న హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిని శుక్రవారం నాడు ప్రీతీజింటా సందర్శించింది. కాశీ విశ్వనాథుడిని దర్శించిన అనంతరం ప్రీతీజింటా మీడియాతో మాట్లాడింది. తాను నరేంద్రమోడీని ఎంతగానో అభిమానిస్తానని, మోడీ మన దేశానికి ప్రధానమంత్రి కావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, ఆయనకి ప్రజల్లో మంచి ఆదరణ వుందని ప్రీతీజింటా చెప్పింది. మోడీకి అనుకూలంగా మీరు ఎన్నికలలో ప్రచారం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రీతీజింటా అవుననకుండా, కాదనకుండా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. మోడీకి ఇప్పుడు ప్రచారం అవసరమే లేదని అంది.

జగన్ పార్టీ ఒక సైకో పార్టీ: చంద్రబాబు

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సైకో పార్టీ అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఇటు జగన్‌ మీద, అటు కాంగ్రెస్ అండ్ బొత్స మీద చీపురు తిరగేశారు. సోనియా ఆటలు ఇటలీలో సాగుతాయి కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కాదని అన్నారు. చీపురుపల్లిలో బొత్సకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. వైకాపా సైకో పార్టీల మారిపోయిందని, ఇతర పార్టీల నాయకుల మీద వరుసగా దాడులు చేస్తూ తన సైకో బుద్ధిని బయటపెట్టుకుంటోందని అన్నారు. వైకాపా మంచినీళ్ళలా డబ్బు ఖర్చు పెడుతోందని, ఆ డబ్బు ఎక్కడిదని ప్రశ్నించినవారి మీద దాడులు జరుపుతోందని విమర్శించారు. జగన్ పత్రిక సాక్షికి ఆ పేరు తప్పుగా పెట్టారని, ‘అవినీతి’ అని పెడితే బాగుండేదని బాబు ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అని అరిచినట్టు, అవినీతిలో మునిగిపోయి వున్న సాక్షి పేపర్ తనమీద అవినీతి కథనాలు రాయడం విచిత్రంగా వుందని అన్నారు.

బీజేపీ కండువా వద్దన్న పవన్ కళ్యాణ్

      ‘జనసేన’ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆ పార్టీల కండువాలు కప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ కండువాలను, ఈ పార్టీ నాయకులు ఆ పార్టీ కండువాలను కప్పుకుంటూ వున్నారు. అయితే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మాత్రం ఏ పార్టీ కండువానీ కప్పుకోకుండానే వేదికల మీద ప్రసంగిస్తున్నారు. వేదికల మీద ఏ పార్టీ కండువానీ తన మెడలో వేయడానికి ప్రయత్నించవద్దని పవన్ కళ్యాణ్ మొదట్లోనే రెండు పార్టీల అగ్ర నాయకులకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన మెడలో ఇంతవరకు ఏ పార్టీ కండువా కనిపించలేదు. అయితే భీమవరంలో మోడీతో కలసి పాల్గొన్న సభలో ఒక బీజేపీ నాయకుడు అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ మెడలో బీజేపీ కండువా వేయబోయాడు. అయితే పవన్ కళ్యాణ్ వెంటనే తల బీజేపీ కండువాకి దూరంగా జరిపేశాడు. తల అడ్డంగా ఊపుతూ తనకు కండువా వేయొద్దన్న సంజ్ఞ చేయడంతో సదరు అత్యుత్సాహ బీజేపీ నాయకుడు నాలుక్కరుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన దిగ్విజయ్ ప్రియురాలు

      కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రియురాలు దిగ్విజయ్ సింగ్ కంటే తెలివైనదిలా కనిపిస్తోంది. ఎంచక్కా దిగ్విజయ్‌సింగ్‌తో సరస సల్లాపాలు ఆడుతూ, వాటిని ఫొటోలు తీసుకుని కంప్యూటర్లో, ఈ మెయిల్స్‌ లో పెట్టింది. మరి ఆ ఫొటోలని బయటకి అమృతే లీక్ చేసిందో మరెవరో చేశారోగాని ఫొటోలు బయటపడ్డాయి. దాంతో దిగ్విజయ్ అమృతని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించక తప్పలేదు. ఎన్నో సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని పెళ్ళితో చట్టబద్ధం చేసుకోక తప్పలేదు. సరసపు ఫొటోలు తీసుకుంది దిగ్విజయ్, అమృత జంట. వాటిని కంప్యూటర్‌లో పెట్టుకుంది ఆ జంటే. ఇప్పుడు సదరు ఫొటోలు లీకైతే ఆ విషయాన్ని పరిశోధించే బాధ్యత మాత్రం పోలీసుల మీద పడింది. తన కంప్యూటర్ని, ఈమెయిల్ని హ్యాక్ చేసింది ఎవరో పరిశోధించి చెప్పాలని అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిపోయిన దిగ్విజయ్, అమృత బాగానే వున్నారు. పోలీసులకే కొత్త తలనొప్పి వచ్చి పడింది.