ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ద్వారం కూల్చివేత
ఆంద్రప్రదేశ్ శాసనసభకు అవమానం, అపచారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రవేశ ద్వారాన్ని ఒక వ్యక్తి పగులగొట్టాడు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, అసెంబ్లీ ద్వారాన్ని కూల్చివేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది.. ఇలాంటి చర్య చేయడానికి అతనిని ఎవరైనా ప్రేరేపించారా.. అనే ప్రశ్నలకు అతని నుంచి సమాధానం రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి, వారికి సంబంధించిన ఆస్తులకు, అంశాలకు రక్షణ కరవైందన్న ఆరోపణలు వినవస్తున్న తరుణంలో జరిగిన ఈ సంఘటన ఈ అంశంలో కేంద్రం మరింత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తోంది.