పార్లమెంటు క్యాంటిన్లో ఫుడ్డు.. యాక్..!
పార్లమెంటు క్యాంటిన్లో ఆహార పదార్థాలు ఎంతమాత్రం బాగోవట్లేదని, క్యాంటిన్లో నిల్వ వున్న ఆహారం ఇస్తున్నారని, ఆ ఆహారం పాచికంపు కొడుతోందని, ఆ ఆహారం తిని తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని పలువురు రాజ్యసభ సభ్యులు స్పీకర్కి ఫిర్యాదు చేశారు. జేడీయూ ఎంపీ కేసీ త్యాగి, సమాజ్ వాది పార్టీ ఎంపీలు రాంగోపాల్ యాదవ్, జయాబచన్ స్పీకర్కి పార్లమెంటు క్యాంటిన్లో ఆహారం బాగాలేందంటూ ఫిర్యాలు చేసిన వారిలో వున్నారు. పార్లమెంటులో తిన్న ఆహారం కారణంగా తమ ఆరోగ్యాలు ఇప్పటికే పాడయ్యాయని, ఇప్పటికైనా పార్లమెంటు క్యాంటిన్ను సంస్కరించాలని వారు స్పీకర్కి విజ్ఞప్తి చేశారు.