కేసీఆర్ మీద గవర్నర్కి టీ టీడీపీ కంప్లయింట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి, ఆశ్రిత పక్షపాత మీద తెలంగాణ టీడీపీ నాయకులు గురువారం నాడు గవర్నర్ నరసింహన్కి ఫిర్యాదు చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వంలో టీటీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ని కలిశారు. గవర్నర్కి కేసీఆర్ మీద కంప్లయింట్ చేసిన అనంతరం ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ వ్యవహార శైలి, ఆశ్రిత పక్షపాతం మీద గవర్నర్కి ఫిర్యాదు చేశాము. అక్రమ భూబదలాయింపులను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాము. అలాగే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచేలా ఆదేశాలని కోరాము. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఇప్పుడు రైతాంగం, విద్యుత్, విద్యార్థి, సంక్షేమ పథకాలకు నిధుల సమస్యతో ఇబ్బంది పడుతోంది. మెట్రో అంశం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఆటంకం కలిగించింది. ఇటువంటి సమస్యలన్నిటినీ చర్చించి పరిష్కారాలు కనుగొనడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరపాలి’’ అని ఎల్.రమణ అన్నారు.