సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రమాణం
భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్. దత్తు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 14 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగే 63 సంవత్సరాల దత్తు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికంటే సీనియర్. ఈయన 2015 డిసెంబర్ 2వ తేదీ వరకు సీజేగా కొనసాగుతారు. దత్తు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈ స్వల్ప కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ టి.జె.కురియన్, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, వెంకయ్య నాయుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, విపక్ష పార్టీ తరపున కాంగ్రెస్ నేతలు అభిషేక్ సింఘ్వీ, రాజీవ్ శుక్లాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.