డైరెక్టర్ లారెన్స్... చీటింగ్ కేసు
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ మీద, ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాజ్కుమార్ మీద గురువారం నాడు జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ప్రభాస్, తమన్నా నటించిన రెబల్ సినిమాకు లారెన్స్ దర్శకుడు. ఆ సినిమా నిర్మాతలకు, లారెన్స్కి సినిమా ప్రారంభానికి ముందే ఒప్పందం కుదిరింది. 23 కోట్ల రూపాయలతో సినిమాను పూర్తి చేస్తానని, ఒకవేళ అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే తానే భరిస్తానని లారెన్స్ ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించి నిర్మాతలు పుల్లారావు, భగవాన్తో ఒప్పందం కుదిరింది. అయితే లారెన్స్ అనుకున్న దానికంటే ఐదు కోట్లు ఎక్కువ ఖర్చు చేశారు. దాంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 5 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్మాతలు ఇద్దరూ లారెన్స్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఒక్కపైసా కూడా ఇవ్వనని లారెన్స్ మొండికేశారు. దాంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు లారెన్స్ మీద, అతని కార్యదర్శి మీద 420 కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం జూబిలీహిల్స్ పోలీసులు వీళ్ళిద్దరి కోసం గాలిస్తున్నారు.