ఏపీ వ్యవసాయ బడ్జెట్ విశేషాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ సమర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రసంగంలో విశేషాలివి.
* 2015-16 వ్యవసాయ బడ్జెట్ అంచనా రూ.14,184 కోట్లు
,
మొదటి దశ రుణమాఫీకి 40.50 లక్షల ఖాతాలకు రూ.4,689 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
* రెండో దశ కింద 42.16 లక్షల ఖాతాలకు వర్తింపు,
* ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రాథమిక రంగ మిషన్,
* ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం పెంపు రూ. 1.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు,
* భూసార పటిష్టతకు రూ. 90/95 కోట్లు,
* విత్తన మార్పిడికి రూ. 80 కోట్లు,
* ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ 50 శాతం నుంచి 70 శాతానికి పెంపు,
* యాంత్రీకరణకు రూ. 141.63 కోట్లు,
* శాటిలైట్ ఇమేజనరీకి రూ. 81.21 కోట్లు,
* పొలం బడి కార్యక్రమానికి రూ. 1.46 కోట్లు,
* వడ్డీలేని రుణాల కోసం రూ. 172 కోట్లు,
* పావలా వడ్డీకి రూ. 10 కోట్లు,
* రాష్ట్ర కృషి వికాస్ యోజనకు రూ. 513.21 కోట్లు,
* ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 367.73 కోట్లు,
* ఉద్యాన వన శాఖకు రూ. 210 కోట్లు,
* ఉద్యాన అభివృద్ధి మిషన్కు రూ. 100 కోట్లు,
* క్షేత్రస్థాయి నీటి నిర్వహణకు రూ. 144 కోట్లు,
* పట్టు పరిశ్రమకు రూ. 93.61 కోట్లు,
* వైఎస్ఆర్ హార్టీ కల్చర్ యూనివర్శిటీకి రూ. 53.01 కోట్లు,
* పశు సంవర్థక శాఖకు రూ. 672.73 కోట్లు,
* ఉపాధి హామీకి నిధులు పెంపు,
* వ్యవసాయరంగంలో ప్రయివేటుకు పెద్దపీట,
* త్వరలో వ్యవసాయ విస్తరణాధికారులుగా 6,354 మంది నియామకం,
* ఉచిత విద్యుత్కు రూ.3,000 కోట్ల కేటాయింపు,
* హుద్హుద్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ.140 కోట్లు,
* వెంకటేశ్వర పశువైద్య కళాశాలకు రూ.124 కోట్లు,
* మత్స్యశాఖకు రూ.187 కోట్లు,
* భూసార పటిష్టత మ్యాపుల తయారీ,
* వడ్డీ రాయితీ రూ.182 కోట్లు,
* సహకార శాఖకు రూ.7.88 కోట్లు,
* అనంతపురంలో వేరుశెనగ పంటను కాపాడేందుకు సామూహిక స్ప్రింక్లర్ల ఏర్పాటు,
* సేద్యపు ఖర్చులు తగ్గించడానికి చర్యలు,
* ఎరువుల సరైన సరఫరాకు రూ.60 కోట్లు,
* లక్షలోపు రుణాలకు వడ్డీ రాయితీ,
* లక్ష నుంచి 3లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ.