ఎమ్మెల్సీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన కొండా మురళీ.. టీఆర్ఎస్ బోణీ..
posted on Dec 10, 2015 @ 2:16PM
వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక స్థానానికి గాను కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి నామినేషన్లు వేసిన ఐదుగురు అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను అని అన్నారు. కాగా జిల్లాలో మొత్తం 859 మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు ఓట్లు ఉన్నాయి. వీరిలో పార్టీల వారీగా బలాబలాలు చూస్తే తెరాసకు 509 కాంగ్రెస్ కు 215 టీడీపీ కూటమికి 201 ఇతరులకు 30 ఓట్లు ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లన్ని కలిపినా కూడా అధికార పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. ఆ రకంగా చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీకే స్థానం దక్కే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పోటీ జరుగుతుండగా ఎలాంటి ఎన్నికలు లేకుండా అప్పుడే టీఆర్ఎస్ బోణి కొట్టడం ఆపార్టీకి శుభపరిణామమే.