పవన్ మౌనం వెనుక అర్దం ఏంటో....?

  ప్రశ్నిస్తాను... ప్రశ్నిస్తాను అని అదేంటో కరెక్ట్ గా ప్రశ్నించే టైం వచ్చేసరికి సలైంట్ అయిపోతాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో ఎక్కడాలేని డౌట్లు వస్తుంటాయి. 2018-19 సంవత్సరానికి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎప్పటిలాగే కేంద్ర రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించారు. తమకు కావాల్సిన చోట్ల... కావాల్సిన రాష్ట్రాలకు మాత్రం విచ్చలవిడిగా నిధులు కేటాయించుకున్నారు. కేంద్రం చేసిన ఆపనికి ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలు, రాజకీయనాయకులు, రాజకీయ విశ్లేషకులు, మీడియా రోజూ విమర్సలు గప్పిస్తూనే ఉన్నాయి. ఆఖరికి మిత్రపక్షంగా ఉన్న టీడీపీసైతం కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతుంది.   ఇక్కడి వరకూ ఓకే కానీ ఈ విషయంలో పవన్ మాత్రం..ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రశ్నిస్తానన్న 'పవన్‌కళ్యాణ్‌' ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్న ఆయన అభిమానులతో పాటు..అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలోనే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకటే హడావుడి చేసిన 'పవన్‌' ఇప్పుడు నోరెత్తకపోవడంపై పలు సందేహాలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని...ఆ స్థానంలో ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం అప్పుడెప్పుడో ప్రకటన చేసినప్పుడు 'పవన్‌కళ్యాణ్‌' ఆవేశంగా స్పందించారు. పాచిపోయిన లడ్డూలంటూ కౌంటర్లు కూడా విసిరారు. అయితే అప్పటికి ఇంకా క్రియాశీల రాజకీయాల్లోకి రానేలేదు పవన్. కానీ ఇప్పుడ పరిస్థితి మారింది. తాను సినిమాలకు గుడ్ బై చెప్పి... పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన పవన్.. ఇంతటి కీలకమైన విషయంపై ఎందుకు నోరెత్తడం లేదన్న ప్రశ్న మొదలవుతుంది. ఆంధ్రాకు, తెలంగాణాకు అన్యాయం జరిగిందని లోకమంతా కోడై కూస్తున్నా...ఎందుకు 'పవన్‌' మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.   ఆయన సీరియస్‌ రాజకీయాలకు పనికిరారని, పనిలేనప్పుడు ఆయన రాజకీయాలను వేదికగా చేసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు..'పవన్‌' బడ్జెట్‌ వచ్చిన రోజే స్పందిస్తే..ఆయనకు మైలేజ్‌ వచ్చేది కదా..అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై అధికారికంగా స్పందించలేదు.. అప్పుడు 'పవన్‌' దాన్ని వినియోగించుకుని ఉంటే...ఆయనకు ప్రజల్లో గ్రాఫ్‌ పెరిగేది. కానీ..ఆయన దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో స్థిరంగా రాణించాలనే భావనతో ఉన్నవారు ఇటువంటి అవకాశాలను వదులుకోరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి పవన్ మౌనం వెనుక ఉన్న అర్దం ఏంటో... బడ్జెట్ పై ఆయన ఎప్పుడు స్పందిస్తాడో...చూద్దాం...

రాజస్థాన్ రిజల్టే రిపీటవుతుంది..?

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నితంగా తన మిత్రపక్ష వైఖరిని నిరసించారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి సాగరని వస్తున్న ఊహాగానాలకు ఏమాత్రం బలాన్ని ఇవ్వకుండా.. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.    ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది కాంగ్రెస్ కాబట్టి.. గత ఎన్నికల్లో అది భూస్ధాపితం అయ్యిందని.. తెలంగాణలో కేసీఆర్‌ను.. ఏపీలో జగన్‌ను నమ్మి.. తరతరాలుగా అండగా నిలుస్తూ వస్తోన్న ప్రజలను నట్టేటముంచినందుకు కాంగ్రెస్ తగిన మూల్యాన్ని చెల్లించుకుందని సీఎం గుర్తు చేశారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగమని నమ్మి 2014  ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని.. రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రజలకు గడచిన నాలుగు సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని.. తాజా బడ్జెట్‌ కూడా చాలా దారుణంగా ఉందన్నారు..   కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లకు బాగానే కేటాయింపులు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్ప చూపు ప్రదర్శించడం ఎందుకని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అసలు ఏమీ చేయకుండానే అన్నీ చేశామనే భావనలో వారున్నారని.. తన దృష్టికి వచ్చిందన్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. ఒకటి మాత్రం నిజం పరిపాలన బాగోలేకపోతే ప్రజలు ఉపేక్షించరు అనడానికి తాజాగా ముగిసిన రాజస్థాన్ ఉప ఎన్నికలే నిదర్శనమని సీఎం హెచ్చరించారు.

బీజేపీ పతనం మొదలయిందా...?

  బీజేపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇప్పటివరకూ ఉత్తరాదిన విజయాలను మూటగట్టుకున్న బీజేపీకి ఇప్పుడు పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘోరంగా పరాజయం పాలయింది. 'అజ్మీర్‌, ఆల్వార్‌ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. రెండు చోట్లా లక్షకు పైగా మెజార్టీ సాధించింది. అదే విధంగా 'మండల్‌ఘర్‌' అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అధికార బిజెపి అభ్యర్థిపై 10వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.   దీంతో బీజేపీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఎంటో అర్ధంచేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికల్లోనే బీజేపీపై ఉన్న వ్యతిరేకత అర్ధమైంది. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చింది. ఇక బీజేపీ చచ్చీ చెడీ గెలిచింది. అప్పుడే బీజేపీ పతనం ఇక మొదలైంది అనుకున్నారు. ఇప్పుడు రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ద్వారా అది నిజమని రుజువైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జిఎస్‌టి, నోట్ల రద్దు వంటి అంశాలు ప్రజల్లో బిజెపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈరోజు బడ్జెట్ చూసిన తరువాత బీజేపీపై ఇంకా మండిపడుతున్నారు. ముఖ్యంగా కామన్ మెన్ కు ఈ బడ్జెట్ వల్ల ఒరిగింది ఏం లేదు.   ఇక రెండు తెలుగు రాష్ట్రాల గురించి అయితే ఈ బడ్జెట్ లో ఎలాంటి ఊసెత్తలేదు. ఆంధ్రుల రాజధాని  అమరావతికి కోసం కానీ, మెట్రో రైలుకు కానీ..వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ..ఎటువంటినిధులు ఇవ్వలేదు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఇచ్చిన హామీల్లో బడ్జెట్‌లో ఎటువంటి హామీలు ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా బడ్జెట్‌లో హామీలు ఇవ్వలేదు. ఆంధ్రా దాదాపు 12500కోట్లు ఇవ్వాలని కోరితే...వంద కోట్లు మాత్రమే కేటాయించింది. తెలంగాణ పెట్టుకున్న ఆశలూ నెరవేరలేదు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలు ఫలించలేదు. ఇక మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో నిరాశ ఎదురైంది. మరి ఓట్లు రానిచోట..ఎందుకు నిధులు ఇవ్వడం ఎందుకని అనుకున్నారనుకుంటా.. మళ్లీ రెండు రాష్ట్రాలపై చిన్నచూపు చూపించింది కేంద్రం. తెలంగాణలో అయితే బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు... ఇక ఏపీలో టీడీపీతో మిత్రపక్షం కాబట్టి ఆ నాలుగు సీట్లయినా దక్కాయి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక టీడీపీ కూడా బీజేపీ చేసిన పనికి.. ఆపార్టీతో తెగదెంపులు చేసుకునే ఛాన్సులే ఎక్కువ కనిపిస్తున్నాయి. టీడీపీ లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసు. మొత్తానికి బీజేపీ పతనం మొదలైనట్టే కనిపిస్తోంది..

ఇన్‌కమ్‌ ట్యాక్స్ ఎంత కట్టాలంటే..?

  సాధారణంగా బడ్జెట్ అనగానే అందరూ ఎదురుచూసేది ఇన్‌కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచారా..? తగ్గించారా..? ఏ వస్తువుల రేట్లు పెరుగుతాయి.. వేటికి తగ్గుతాయి అన్న దాని గురించే. మరి 2018-19 వార్షిక బడ్జెట్‌లో అరుణ్‌జైట్లీ వేటి మీద పన్నులు వేశారు..? వేటి మీద తగ్గించారో చూస్తే: * వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. * వేతన ఉద్యోగులకు రూ.40వేల వరకు ప్రయాణ, వైద్య ఖర్చులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ వర్తింపు. * సీనియర్‌ సిటిజన్లకు వైద్య ఖర్చులకు అదనపు రాయితీ. దీనివల్ల 2.5కోట్లమందికి లబ్ధి. * చిన్న తరహా పాదరక్షలు, తోలు ఉత్పతుల తయారీ సంస్థల లాభాలపై ఆదాయ పన్ను రాయితీ. * సహకార సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పాదక సంస్థలకు నూరుశాతం పన్ను రాయితీ. * సీనియర్ సిటిజన్ల బ్యాంకు డిపాజిట్ల ఆదాయంపై పన్ను పరిమితి పెంపు.. రూ.50వేల వరకూ పన్ను వర్తించదు. * సీనియర్‌ సిటిజన్ల వైద్య ఖర్చులకు అదనపు రాయితీ రూ.60వేల నుంచి రూ.లక్షలకు పెంపు. * వయో వృద్ధుల ఎఫ్‌డీ, పోస్టాఫీస్‌ డిపాజిట్లపై టీడీఎస్‌ ఉండదు. 50 వేల వరకు పన్ను వర్తించదు. * కార్పొరేట్‌ ట్యాక్స్‌ 25శాతానికి పెంపు * ఆదాయ పన్ను పరిధిలోకి కొత్తగా ఐదు లక్షల మంది * కొత్తగా 81లక్షల ఐటీ రిటర్న్స్‌ దాఖలు * వైద్య, విద్య సెస్సు 4శాతానికి పెంపు * మొబైల్‌ ఫోన్ల దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీ 15నుంచి 20శాతానికి పెంపు. * ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించే రంగాల్లో సర్కార్ చెల్లించే ఈపీఎఫ్‌ 8.33 శాతం నుంచి 12శాతానికి పెంపు. పెంచిన ఈపీఎఫ్‌ మూడేళ్ల పాటు అమలు.  

పవన్ ను తక్కువ అంచనా వేశారా...?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పర్యటనలు ప్రారంభించారు. మూడు రోజులు తెలంగాణలో.. మూడు రోజులు ఏపీలో పర్యటన చేసి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక పవన్ పర్యటనలు చేసినా కానీ ఆయనకు ఇంకా క్లారిటీ లేదని.. ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదని...ఒక్కరే బరిలో దిగుతారా.. లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా.. అన్న విషయాలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. ఏది ఏమయినా ప్రస్తుతం పార్టీని అయితే జనాల్లోకి తీసుకెళ్లడానికి పర్యటనలు చేశారు.   ఇక ఈ పవన్ పర్యటనలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించిన సంగతి కూడా తెలిసిందే. పవన్ ను అభినందించిన వాళ్ల కంటే... ఆయన్ని తిట్టిన వాళ్లే ఎక్కువ. కానీ పవన్ కు అనూహ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుండి ఫోన్ వచ్చిందట. తెలుగు రాష్ట్రాల్లో పవన్ చేసిన యాత్రను ఆయన  అభినందించారట. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులను చర్చించడానికి ఈ మేరకు ఢిల్లీ వచ్చి తనతో కలవవలసినదిగా పవన్ ను అమిత్ షా ఫోన్లో ఆహ్వానించారట.   ఆశ్చర్యం ఏంటంటే.. అమిత్ షా ఆహ్వానాన్ని పవన్ తిరస్కరించారట. ఆయన ఆహ్వానముపై  సమాధానమిస్తూ తాను త్వరలోనే ఢిల్లీ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై ప్రధాని మోడీతో చర్చిస్తానని, అప్పుడు మిమ్ములను కలుస్తానని చెప్పాడట. అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడం వెనక ఏదో భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. అయితే అమిత్ షా పట్ల పవన్ వ్యవహరించిన తీరు అందరికి నవ్వు పుట్టిస్తుంది. ఏకంగా జాతీయ అధ్యక్షుడే పిలిచినా పవన్ వెళ్లలేదంటే...పవన్ కు ఉన్న స్టామినా ఏంటో మరోసారి చూపించారు. మరి పిలవగానే పేరంటానికి వెళ్లినట్టు అందరి నాయకుల్లా పిలిచి వెంటనే పరుగు పరుగున వెళతారని అనుకున్నారేమో అమిత్ షా.

రాధాకు టీడీపీ ఆఫర్... ఓకే చేస్తాడా...?

  ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ గురించే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా వంగవీటి రాధా వైసీపీ అధినేత జగన్ పై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీని వీడి...టీడీపీ చేరుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాధా ఏదో పైకి మాత్రం తాను టీడీపీలో చేరేది లేదని చెబుతున్నా.. ఆయన పార్టీ మార్పుపై మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు  రాధా కోరుకుంటోన్న సెంట్ర‌ల్ సీటునే మ‌రో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కూడా కోరుతున్నారు. జగన్ కూడా ఆ సీటు విష్ణుకే ఇవ్వడానికి మొగ్గుచూపుతుండటంతో..  సెంట్ర‌ల్ సీటు విష్ణుకే ఇచ్చి రాధాకు పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు ఏ ఎమ్మెల్సీనో ఇచ్చేసి స‌రిపెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు కూడా రాధాకు పార్టీ నుంచి లీకులు రావడంతో... రాధా ఇంకా అసంతృప్తికి గురవ్వడం... దానికి తోడు పాదయాత్రలో జగన్ పక్కన గౌతంరెడ్డి ఉన్న ఫొటోలు బయటకు రావడంతో ఇక రాధా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.   మరోవైపు టీడీపీ కూడా రాధాను పార్టీలోకి తీసుకురావడానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా చంద్రబాబే.. రాధాను కూడా త‌మ పార్టీలోకి లాగేసుకుంటే ద‌క్షిణ కోస్తాలో బ‌ల‌మైన కాపు సామాజిక‌వ‌ర్గాన్ని మొత్తం టీడీపీ వైపున‌కు తిప్పుకున్న‌ట్టే అవుతుంద‌ని ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం... కొంద‌రు టీడీపీ కాపు నేత‌ల ద్వారా రాధాకు పార్టీలో చేర‌మ‌ని చంద్రబాబు కబురు కూడా పంపించారట. ఏపీలో ఇప్ప‌టికే కాపుల‌ను త‌న వైపున‌కు తిప్పుకోవ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయిన ఆయన.. రాధాను కూడా త‌మ పార్టీలోకి లాగేసుకుంటే ద‌క్షిణ కోస్తాలో బ‌ల‌మైన కాపు సామాజిక‌వ‌ర్గాన్ని మొత్తం టీడీపీ వైపున‌కు తిప్పుకున్న‌ట్టే అవుతుంద‌ని ప్లాన్ చేస్తున్నారు. విజయవాడలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌క‌పోయినా రాధా ఒప్పుకుంటే మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి ఆయన్ని పోటీ చేయించడానికి రెడీ అంటోందట టీడీపీ. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే రాధాకు ఎక్క‌డో ఓ చోట నుంచి అసెంబ్లీ సీటు ఇచ్చేలా...లేని ప‌క్షంలో కాపులు బ‌లంగా ఉన్న మ‌చిలీప‌ట్నం నుంచి ఆయ‌న్ను ఎంపీ బ‌రిలోకి దించాల‌న్న‌దే టీడీపీ ప్లాన్‌. మరి ఇప్పటికే వైసీపీ తీరుతో విసుగుపోయిన రాధా టీడీపీలో చేరుతారా..? టీడీపీ ఆఫర్ ను రాధా స్వీకరిస్తారా...? అన్నది చూడాలి.. ఏం జరుగుతుందో...?

రాజుగారు ఇప్పుడైనా తగ్గితే మంచిది....

  గత కొద్దికాలంగా ఏపీ బీజేపీ నేతల్లో అందరి సంగతేమో కానీ... ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే కదా. సందు దొరికితే చాలు టీడీపీ పై విరుచుకుపడటం.. మిత్రపక్షం అని కూడా చూడకుండా రెచ్చిపోయి మాట్లాడటం.. ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్నారు. అంతేకాదు వైసీపీ నేతలతో కూడా ఆయన బాగానే రాసుకుపూసుకు తిరుగుతున్నారు. దీంతోరాజుగారి వైఖరి వల్ల సొంత పార్టీనుండే గట్టి షాక్ తగిలింది. సొంతపార్టీ నేతలే అధిష్టానానికి మొత్తం సోము వీర్రాజు ఎపిసోడ్ అంతటినీ తీసుకొని వెళ్లి ప్రదర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి వద్దకు వెళ్లి... పేపర్లలో, టీవీల్లో కనిపించడం కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ పార్టీ పరువును తీస్తున్నాడని ఫిర్యాడు చేశారట.   ఈ సందర్బంగా ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉంగరాల చినబాబు మాట్లాడుతూ....వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు రింగు తిప్పినట్టు ఇప్పుడు అలాంటి పప్పులు ఉడకవు అక్కడ ఉన్నది వాజ్ పేయి కాదు అని సోము వీర్రాజు అనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అసలు సోము వీర్రాజుకు వాజ్ పేయి పేరెత్తే అర్హత లేదని... వైసీపీతో సోము వీర్రాజు సంబంధాలే కాదు ఇంకా చాలా చాలా సంబంధాలు ఉన్నాయని అవన్నీ ఎప్పుడు, ఎక్కడ ఎలా బయటపెట్టాలో త్వరలోనే అవన్నీ చేస్తామని తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. మరి తాడి తన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు అన్న సామెత ప్రకారం... సోము వీర్రాజుగారు ఏదో చేద్దామనుకొని ఆఖరికి సొంత పార్టీనేతలనుండి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. మరి అమిత్ షా సోము వీర్రాజు పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇక రాజుగారు ఇప్పుడైనా నోటిని కంట్రోల్ లో పెట్టుకుంటారో...? లేదో..? చూద్దాం...

రాధా మంటలో ఆజ్యం పోస్తున్న జగన్....

  అగ్నికి ఆజ్యం పోసినట్టు అన్న సామెత తెలుసుకదా...ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇంతకీ ఎవరి మంటలో జగన్ ఆజ్యం పోస్తున్నాడనుకుంటున్నారా...? ఎవరో కాదు విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా విషయంలో. అసలు సంగతేంటంటే...గతంలో వంగవీటి రాధాకి, అదే పార్టీకి చెందిన గౌతంరెడ్డికి మధ్య వార్ జరిగిన సంగతి గుర్తుంది కదా. వంగవీటి కుటుంబసభ్యులపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను.. వంగవీటి రాధా అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది అప్పట్లో. దీనికి గాను జగన్... గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ ప్రకటించింది.   అయితే ఆతరువాత కొద్ది రోజులకే గౌతంరెడ్డి పార్టీ నేతలతో కలవడం.. భేటీ అవ్వడంతో రాధా మళ్లీ ఆగ్రహానికి గురయ్యారు. అప్పటినుండి జగన్ పై పార్టీపై రాధా అసంతృప్తితోనే ఉన్నారు. దానికితోడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడడంతో రాధా పుల్ ఫైర్ మీద ఉన్నారు. దాంతో రాధా వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో మారబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక జగన్ ఆయన్ను బుజ్జగిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.   ఇవన్నీ ఇలా జరుగుతుంటే... ఇప్పుడు జగన్ పాదయాత్రలో భాగంగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఈఫొటో ఇప్పుడు పెద్ద చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందనుకుంటున్నారా...? ఆ ఫొటోలో జగన్ తో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసిన గౌతంరెడ్డి కూడా ఉన్నాడు. గౌతంరెడ్డి ప్రజా సంకల్పయాత్రలోనే జగన్ ను కలవడంతో ప్రస్తుంతం సంచలనంగా మారింది. దీంతో గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ డ్రామా ఆడినట్టు ఇప్పుడు నిజం బయటపడింది అంటున్నారు. కేవలం అప్పట్లో రాధాను బుజ్జగించటానికే అప్పట్లో డ్రామా ఆడారు అనే విషయం ఇప్పుడు తేలిపోయింది...అంతేకాదు...రాధా ఇక మన మాట వినడు అని, జగన్ కు అర్ధమై పోయిందో ఏమో కాని, రంగాను అన్ని బూతులు తిట్టిన గౌతం రెడ్డిని, బహిరంగంగా కలిసి, తనతో పాటు నడిపించుకుని, రాధా ఉంటే ఎంత పొతే ఎంత అనే సంకేతం జగన్ ఇచ్చారు అని పరిశీలకులు అంటున్నారు. మరి ఇప్పుడు దీనిపై రాధా, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జగన్ చేసిన ఈ పనికి రాధా ఇక పార్టీ మారడం ఖాయమేనేమో అనిపిస్తుంది.. చూద్దాం ఏం జరుగుతుందో...

టీడీపీ ని వదలొద్దు... బీజేపీ నేతల్లో అసంతృప్తి...

  ఏపీ రాజకీయాలు ఇప్పుడు మరింత వేడిగా తయారయ్యాయి. ఎప్పుడూ లేనిది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం...వాళ్లు వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటాం అని చెప్పడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. ఇక బీజేపీ, టీడీపీ స్నేహానికి బీటలు వారినట్టే అని కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఎప్పటినుండో వార్తలు వస్తున్న బీజేపీ-వైసీపీ పొత్తు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు బీజేపీ నేత సోము వీర్రాజు.. మళ్లీ రెచ్చిపోవడం...చంద్రబాబుపైనే విమర్సలు చేయడం..దీనికి తోడు సోము వీర్రాజు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి కలిసి ఒకే పూజలో పాల్గొనడం.. ఇవన్నీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.. అందుకే టీడీపీని లెక్కచేయడం లేదు అన్న వాదనలు కూడా విసిపిస్తున్నాయి. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొత్త పొత్తులకు అవకాశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.   ఇదిలా ఉంటే.. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. టీడీపీతో విడిపోవడం కొంతమంది బీజేపీ పెద్దలకే నచ్చడంలేదట. టీడీపీని వదలుకోవాలని చూస్తున్న బీజేపీ నేతల ఆలోచనను తప్పుబడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం  దేశవ్యాప్తంగా బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పొచ్చు. గతంలో పొత్తు పెట్టుకున్న పార్టీలు దాదాపు బీజేపీ వైఖరి నచ్చక విడిపోతున్నాయి. ఆఖరికి రెండున్నర దశాబ్దాలకు పైగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్న మహారాష్ట్రలోని శివసేన పార్టీ కూడా మోదీ వైఖరి నచ్చక సొంతంగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. బీజేపీతో విడిపోతున్నట్టు ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీతో ఏ రాష్ట్రంలోనూ పొత్తులు పెట్టుకోవడానికి పార్టీలు ముందుకు రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీని కూడా వదులుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలపై కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అంతేకాదు ఆ పార్టీ అగ్రనేత అద్వానీ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని… కాకపోతే తన మాటకు విలువలేని చోట ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. టీడీపీతో తెగదెంపులు చేసుకుంటుందో... లేక మూసుకుపోయిన కళ్లు తెరుచుకుంటుందో...

మిత్రధర్మం అంటే ఇదేనా...!

  మిత్రధర్మం అంటే కొత్త అర్దం నేర్పుతుంది బీజేపీ పార్టీ. ఇటీవల సీపీఐ నేత రామకృష్ణ బీజేపీ వ్యవహరిస్తున్న తీరును చూసి.. మోడీకి టీడీపీ కట్టుకున్న పెళ్లం.. వైసీపీ ఉంచుకున్న పెళ్లం అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చూడబోతే అది నిజం చేసేలాగే ఉంది బీజేపీ. నిజానికి బీజేపీ-టీడీపీ మిత్రపక్షమని అందరికీ తెలిసిందే కదా. కానీ గత కొద్దికాలంగా ఈరెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిన నిజమే. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు విడిపోవచ్చని.. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చన్న వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు... ఈ క్రమంలోనే బీజేపీ-వైసీపీ పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.   అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజమనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. బీజేపీ నేత సోము వీర్రాజు.. వైసీపీ నేత విజయ సాయిరెడ్డి కి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో సోము వీర్రాజు ఒకపక్క.. విజయసాయిరెడ్డి మరోపక్క మద్యలో  జగన్ పార్టీ ఆస్థాన స్వామీజీ కూర్చొని ఉన్నారు. దీంతో రెండు పార్టీల డ్రామా మరోసారి బయటపడింది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. స్వామిజీ ఏం చెబుతున్నారో తెలియదు కానీ... ఇద్దరూ చాలా శ్రద్దగా వింటున్నారు. అంతేకాదు... జగన్ ను సియంని చేసే పూజలో, విజయసాయి కేంద్ర మంత్రి అయ్యే పూజలో, వీర్రాజు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యే పూజలో ఏం చేస్తున్నారో అని కామెంట్లు కూడా విసురుకుంటున్నారు.   ఏదీ ఏమైనా ఇప్పుడు ఈ ఫొటోలు బయటపడటంతో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ పవిత్ర కలియిక , ఇప్పడు హైలైట్ అయ్యింది. ఒకపక్క తెలుగు దేశంతో మిత్రపక్షంలో ఉండి.. మిత్రధర్మ పాటిస్తున్నాం అని ఎగిరెగిరి పడే సోము వీర్రాజు.. టీడీపీ తో మిత్రపక్షంలో ఉండగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏదైనా అంటే...టీడీపీపై చంద్రబాబుపై విమర్సలు గుప్పించడం. ఇక టైం వచ్చేసింది అనుకున్నారో ఏమో, నెమ్మదిగా అసలు రంగులు బయట పెట్టేస్తున్నారు... కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కలిసి పూజలు చేస్తున్నారు. మరి దీనికి బీజేపీ ఏం సమాధానం చెబుతుందో... లేకపోతే ఎలాగూ నిజం బయటపడింది ఏమన్నా లైట్ తీసుకుంటారో చూద్దాం ఏం జరుగుతుందో... ఏదేమైనా బీజేపీ మిత్రధర్మ అంటే కొత్త అర్ధాన్ని చెప్పింది. ఇదే "కొత్త మిత్ర" ధర్మం..

అంత ధైర్యం ఎవరిచ్చారు....?

  ఏంతో సహనంగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆఖరికి బీజేపీ నేతల వైఖరి నచ్చక ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. అయినా కూడా బీజేపీ నేతలు తమ వైఖరి మార్చుకోనట్టే కనిపిస్తోంది. ఇన్ని రోజులు బీజేపీ మిత్రపక్షం కదా అని.. ఆ పార్టీ నేతలు ఎన్ని విమర్శలు గుప్పించినా.. చూసి చూడనట్టు వదిలేసి... టీడీపీ నేతను తిరిగి బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నా వారిని వారించి.. సర్థిచెప్పిన చంద్రబాబు ఓపిక నశించి.. పొత్తు వద్దనుకుంటే మా దారి మేము చూసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు.   అయితే చంద్రబాబు ఇంత మాట అన్నారంటే ఎందుకో అని ఆలోచించాల్సిన బీజేపీ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సోము వీర్రాజు లాంటి నేతలు. రాజుగారు మాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు మేము లేకపోతే టీడీపీయే లేదు.. మావల్లే టీడీపీ గెలిచింది అన్న రేంజ్ లో మాట్లాడుతారు. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా టీడీపీపై విమర్శలు గుప్పించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసిందని... మోసాన్ని మేం మర్చిపోమని అన్నారు. అక్కడితో ఆగకుండా... మేం కూడా మిత్రధర్మమే పాటిస్తున్నామని, టీడీపీయే పాటించడం లేదు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్న విషయాన్ని గుర్తించాలి... రాష్ట్రంలో నిధుల సేకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు.   ఇక చంద్రబాబే మా దారి మేం చూసుకుంటాం అని అన్న తరువాత... ఇంక పార్టీ నేతలు ఊరుకుంటారా..? రాజుగారికి గట్టి కౌంటరే ఇచ్చారు. మంత్రి సుజయ కృష్ణ రంగారావు రాజుగారి మాటలకు స్పందించి.. " ఆ రోజు ఎవరైతే ఇండిపెండెట్స్‌గా నిలిచారో వారిని పూర్తిగా దూరం పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సీఎం స్థాయి చంద్రబాబు నాయుడే పార్టీ కేడర్‌కు ఆదేశాలివ్వడం జరిగింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి లేకుండా పోటీ చేసిన వారిని పూర్తిగా తొలగించడం జరిగింది. కాబట్టి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? బీజేపీ ఇలా మాట్లాడటం సబబుకాదు" అని మంత్రి ఘాటుగా స్పందించారు...   మరి బీజేపీ వైఖరి చూస్తుంటే వీరికి తెలుగుదేశంతో పొత్తు ఉండటం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కాస్త సంయమనం పాటించాల్సిన టైంలో కూడా, రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తూ, ఏకంగా చంద్రబాబునే అంటున్నారు. అంతేకాదు ఏ ధైర్యం చూసుకొని రెచ్చిపోతున్నారు అని కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి చూడపోతే... టీడీపీ-బీజేపీ ఇంకెన్నో రోజులు కలిసిఉండనట్టే కనిపిస్తోంది. మరి ఇంక వచ్చే ఎన్నికల్లో పొత్తు సంగతి దెవుడికెరుక...

కేసీఆర్ డేంజర్ డెసిషన్...విమర్శిస్తే అంతే సంగతి...

  ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై నియంత పాలన అన్నముద్ర పడింది. ఆయన పాలన వల్ల ఇప్పటికే చాలామాంది కేసీఆర్ కు వ్యతిరేకమయ్యారు..వ్యతిరేకమవుతున్నారు. అంతేకాదు ఉద్యమ సమయంలో కేసీఆర్ తో కలిసి కీలక పాత్ర పోషించిన కోదండరాం కూడా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకమయ్యారు. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఓ కొత్తపార్టీనే పెట్టేందుకు సిద్దమయ్యారు. దీనికి కారణం కేసీఆర్ గారి చేస్తున్న కొన్ని పనులు నచ్చకపోవడమే. అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొని పెద్ద దుమారమే రేపుతున్నారు కేసీఆర్.   రాజకీయాల్లో ఒకపార్టీపై మరొకపార్టీ విమర్సలు గుప్పించుకోవడం కామన్ థింగ్. రాజకీయాలే కాదు సామాన్య ప్రజలు కూడా కాస్త కోపం వచ్చిందంటే... తిట్టుకుంటారు... దూషించుకుంటారు. మరి అలాంటిది.. విమర్శలు చేయోద్దు అంటే కుదురుతుందా. అలానే ఉంది ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే.. ఎదుటివారిని దూషించినా, అభ్యంతరకరంగా మాట్లాడినా, పోలీసులు ఎవరి అనుమతి లేకుండానే కేసు పెట్ట్టుకోవచ్చట. ఇప్పటివరకు కోర్టు అనుమతితోనే కేసు పెట్టాలి. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రభుత్వం అవసరం అనుకుంటే అనుమతి తీసుకోవచ్చు, తీసుకోకుండా కూడా ముందుకు పోవొచ్చట. దీనికి సంబందించిన పైల్ పై ఆయన ఈరోజే సంతకం చేశారు.   దీంతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద చర్చే జరుగుతుంది. అంతేకాదు కేసీఆర్ ఈ నిర్ణయం ప్రతిపక్షాలను ఉద్దేశించే తీసుకున్నట్టు ఉన్నారు అని మాట్లాడుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఇదేదో.. ప్రతిపక్షాన్ని నియంత్రించడానికి తెచ్చినట్టుగా ఉంది అని రాజకీయాల్లో చర్చకు వస్తుంది. అంతేకాదు... గతంలో అనేక మారులు ప్రభుత్వంపై రుజువులు లేకుండా విమర్శలు చేస్తే కేసులు పెడతాం అని హెచ్చరించారు...ఇప్పుడు ఆయన చెప్పినట్టే చేశారు అని ముచ్చటించుకుంటున్నారు. ఇక కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ రూల్ ప్రకారం కేసులు పెట్టాల్సివస్తే ముందు పెట్టాల్సిందే కేసీఆర్ మీదేఅని ఆయన వాడినటువంటి అభ్యంతరకర బాషా ఇది వరకు ఎప్పుడు తెలుగు రాజకీయాలలో ఎవరు వాడలేదని అని కామెంట్ విసిరారు. మరి ముఖ్యమంత్రి గారిపై కేసు పెట్టే ధైర్యం ఉంటుందా....? మొత్తానికి కేసీఆర్ మరో ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆయనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది... ఈ నిర్ణయం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి చూద్దాం...

బాబుగారు నో టెన్షన్... లగడపాటి భరోసా...

  ఒకపక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే నాయకులు సర్వేలు చేస్తూ తమ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక్కోసారి సర్వేలు తమకు అనుకూలంగా వచ్చినా... ఒక్కోసారి మాత్రం షాకులిస్తూనే ఉంటాయి. ఇక ఈ సర్వేలకు తోడు ఈ మధ్య జాతీయ మీడియాలు కూడా సర్వేలు మొదలుపెట్టాయి. తెలంగాణ సంగతేమో కానీ.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే... వైకాపాకు ఎక్కువ సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవి  చెప్పుకొచ్చింది.   ఇక ఈ సర్వే ఫలితాలు విన్నవాళ్లు ఒక్కసారిగా షాక్ గురైనంత పనైంది. ఎందుకంటే ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటో తెలుసు. ఒకపక్క వైసీపీ ఎన్నికల వ్యూహకర్త సర్వేలు చేస్తూ జగన్ కు షాకిస్తూనే ఉన్నాడు. అలాంటిది..  ఉన్నఫళంగా వైకాపా ఎలా బలపడిందో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. మరోవైపు కొంతమంది అయితే ఆ సర్వేచూసి నవ్వుకుంటున్నారు కూడా. ఇక ఇప్పుడు తాజాగా ఈ సర్వేలపై లగడపాటి రాజగోపాల్ కూడా స్పందించారు. అసలే ఇలాంటి సర్వేలకు లగడపాటి పెట్టింది పేరు. ఆయన చెప్పిన సర్వేలు దాదాపు నిజమయ్యాయి కూడా అందుకే ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సర్వేలపై లగడపాటిని అడిగారట.   దీంతో ఈ సర్వేలను అస్సలు పట్టించుకోవక్కర్లేదని లగడపాటి చంద్రబాబుకి భరోసా ఇచ్చారట.  అంతేకాదు...ఇప్పటికిప్పుడు జరిగితే 2014 కంటే గణనీయమైన స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందని చెప్పారట. దానికి కారణం 2014 కంటే రాయలసీమలో టీడీపీ బలపడటమే. అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో మాత్రం ఇప్పటికి బలహీనంగానే ఉందని.. అదే విధంగా కాపు ఉద్యమం ఎలా ఉన్న గోదావరి జిల్లాలలో టీడీపీ తన పట్టును నిలబెట్టుకోనుందని చెప్పారట. ఇక పొత్తులు విషయానికి వస్తే బీజేపీతో కలిసి వెళ్లకపోతే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని... మరోవైపు జనసేన విషయానికి వస్తే పొత్తు ఉంటే టీడీపీకి ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పారట. అంతేకాదు..జనసేన సొంతంగా గెలిచే అవకాశం పెద్దగా లేకపోయినా కొన్ని చోట్ల గణనీయమైన ఓట్లు రాబడుతుందని లగడపాటి చెప్పారట. మొత్తానికి జాతీయ మీడియా సర్వే చంద్రబాబును భయపెట్టినట్టుంది. మరి లగడపాటి ఇచ్చిన భరోసాతో బాబు కాస్త నెమ్మదించి ఉంటారు...

అరెరె... శశికళ ముందే జగన్ కు ఈ సలహా ఇవ్వాల్సింది....

  వైసీపీ జగన్మోహన్ రెడ్డికి శశికళ సలహా ఇచ్చిందట. అదేంటీ... శశికళ ఏంటీ.. జగన్ కు సలహా ఇవ్వడం ఏంటీ అనుకుంటున్నారా...? జగనేమో ఒకపక్క ప్రజా సంకల్ప పాదయాత్రతో కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.. మరోపక్క శశికళ అవినీతి కేసులో జైలులో శిక్ష అనుభవిస్తుంది... అలాంటిది... జగన్ కు శశికళ సలహా ఎప్పుడు ఇచ్చింది..? ఎలా ఇచ్చింది అనుకుంటున్నారా..? అయితే డైరెక్ట్ కాదులేండి.. ఇన్ డైరెక్ట్గ్ గా.. అసలు సంగతేంటంటే...   తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం శశికళ నిత్యం వార్తలో ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు శశికళ, ఆమె కుటుంబసభ్యలపై ఐటీ అధికారులు వరుస పెట్టి దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ దాడుల్లో కోట్ల కొద్ది ఆస్తులు బయటపడుతున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ దాడుల్లో భాగంగనే అధికారులు ఇటీవల పొయెస్ గార్డెన్‌లోని ‘అమ్మ’ జయలలిత నివాసంలో సోదాలు జరిపారు. ఇక ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. కీలక పత్రాల ఆధారంగా ఈ స్కాం బయట పడింది.  నిషేధిత గుట్కా విక్రయాలకు వీరు అవకాశం కల్పించినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో విచారణకు వచ్చే నెల 10న హాజరు కావాలని శశికళకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. ఈ నోటీసులు అందుకున్న శశికళ.. ఐటీ అధికారులకు ఓ సమాధానం పంపారు. ఆ సమాధానం చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఇంతకీ శశికళ చెప్పిన ఆసమాధానం ఏంటనుకుంటున్నారా..?   తాను మౌన వ్రతంలో ఉన్నానని, విచారణకు హాజరు కాలేనని.. వచ్చే నెల 20 వరకు మౌన వ్రతంలో ఉంటానని చెప్పారు. ఈ సమాధానంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అవాక్కయ్యారు. అయితే ఇప్పుడు.. శశికళ సమాధానాన్ని జగన్ కు లింక్ పెట్టి పలు సెటైర్లు వేస్తున్నారు. శశికళ కు తెలివి జగన్ కు లేదు..శశికళ ఈ ఐడియా ముందే జగన్ కు ఇచ్చుంటే బావుండేది... జగన్ కూడా ప్రతి శుక్రవారం నాకు, మౌన వ్రతం అని చెప్పి విచారణని తప్పించుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్ట్ లు పెడుతున్నారు.. మరి అధికారులు ఇలాంటి వాటిని పట్టించుకుంటారా..? ఇలాంటి సాకులను నమ్ముతారా...? చూద్దాం ఏం జరుగుతుందో...

కేసీఆర్ పై పవన్ పగ తీర్చుకున్నాడా...?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇప్పటికీ ముడేళ్లు అవుతున్నా గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కానీ ఈ సారి మాత్రం ప్రత్యక్షంగా రాజకీయ బరిలోకి దిగుతున్నారు. ఇక రాజకీయాలు అన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్. అలాగే ఎప్పుడైతే పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడైతే అనుకున్నారో.. అప్పటినుండి ఇక పవన్ పై కూడా విమర్శలు మొదలుపెట్టారు. అందులో పవన్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి పవన్ జనంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకే ఆయనపై కాస్త ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు.   అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికి రాడని... రాజకీయాలు వేస్ట్ అని.. పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఎలాంటి దిశా నిర్దేశం లేదు.. ఒక క్లారిటీ లేదు... అబ్బో ఇలా ఒకటా... రెండా.. ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తెలంగాణలో పర్యటన కోసం వచ్చిన పవన్ ను అయితే కాంగ్రెస్ ఏకీ పారేసింది. అంతేకాదు ఒకప్పుడు పవన్ తెలంగాణ గురించి ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు.... అని తేడా చూపిస్తూ మరీ... విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేనా.. కేసీఆర్ ను పొగడటంపై కూడా కాంగ్రెస్ విరుచుకుపడుతుంది.   అయితే ఇక్కడే కొంతమంది పవన్ తెలివిని గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు శకుని రీతిలోపవన్, కెసిఆర్ మీద పగ తీర్చుకున్నాడని అనుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో, అంతకు ముందు కెసిఆర్ , పవన్ ల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. దాంతో పవన్ తెలంగాణకు వ్యతిరేకి అని జనాల్లోకి తీసుకెళ్లారు. ఇక అసలే ఫుల్ ఫైర్ మీద ఉన్న తెలంగాణ వాదులు దీన్ని నమ్మారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ ఏపీని వదిలేసి మరీ.. తెలంగాణలో పర్యటన మొదలుపెట్టేసరికి అందరూ షాకయ్యారు. ఇక ఈ పర్యటనలో పవన్ కేసీఆర్ పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. తనపాటికి తాను వచ్చి.. ఏదో సమావేశాలు పెట్టుకొని.. తన కార్యకర్తలతో ముచ్చటించి వెళ్లిపోయారు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది అంటున్నారు. ఏదో పైకి ఈ పర్యటన కెసిఆర్ కి అనుకూలంగా అనిపిస్తోంది... కానీ పవన్ మాటల వల్ల అయితేనేమి, కాంగ్రెస్ ప్రచారం వల్ల గానీ జనసేన మీద కెసిఆర్ అనుకూల ముద్ర పడింది అంటున్నారు. కానీ నిజానికి పవన్ పర్యటనతో తెలంగాణ వ్యతిరేకులకు కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారన్న అభిప్రాయం కలిగింది. నిజానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సిన అవసరం పవన్ కు లేదు. ఈవిషయం పవన్ కు కూడా తెలుసు. అయినా పనిగట్టుకుని పర్యటన చేసి కెసిఆర్ వ్యతిరేకులకు తిరుగులేని అస్త్రం అందించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ శకుని టైపు లో కెసిఆర్ మీద పగ తీర్చుకున్నాడని అంటున్నారు.  మరి ఇందులో ఎంత నిజముందో... ఆ విషయం పవన్ కే ఎరుక...

చంద్రబాబుకి గుడి.. వెండి విగ్రహం..

  సాధారణంగా సినిమా వాళ్లకి అభిమానులు గుడి కట్టడం చూశాం. మన తెలుగులో తక్కువ కానీ..తమిళనాడులో ఖుష్బూకి దేవాలయం కట్టారు. ఆ తరువాత నమిత, నయనతారకు కూడా గుడి కట్టాలని అనుకున్నారు. అయితే ఇది సినిమా పరిశ్రమ వరకే సాధ్యం. కానీ రాజకీయాల్లో ఓ వ్యక్తికి గుడి కట్టాలని అనుకోవడం చాలా గొప్ప విషయమే. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబుకు గుడి కట్టేది ఎవరనుకుంటున్నారా..? వారెవరో కాదు హిజ్రాలు.. హిజ్రాలు ఏంటి.. చంద్రబాబుకు గుడి కట్టడం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే...   హిజ్రాలంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో వారిపై అందరికీ చిన్నచూపే ఉంటుంది. అందుకే వూరికే వారి మీద చిరాకు పడుతుంటారు. ఇక వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఆలోచిస్తుంటారు. అందుకే ఏం చేయలేక వారు అడుక్కునే పరిస్థితి వారిది. అలాంటి వారికోసం ఏపీ ప్రభుత్వం చేయూత నిచ్చింది. వారికోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. వారికి రేషన్ కార్డ్, ఇళ్లు, ప్రతి నెల రూ. 1500 పింఛను, చదువుకున్న హిజ్రాలు వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.   దీంతో చంద్రబాబుపై హిజ్రాలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం నాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం తమను మనుషులుగా గుర్తించిందని.. అందుకే ఆయనకు గుడిని నిర్మించాలనుకుంటున్నామని అన్నారు. నంద్యాల నుండి మహానంది వెళ్లే దారిలో గుడిని నిర్మించాలనుకుంటున్నామని... ఇప్పటికే స్థలం కూడా సేకరించామని.. ఆలయంలో వెండి విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. మొత్తానికి రాజకీయ నేతలంటే తమ స్వార్ధం మాత్రమే చూసుకుంటారు అన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో..  ఓ నేతకు గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి చంద్రబాబులాంటి వ్యక్తులు దానికి అతీతంగా ఉండటం ఆనందించాల్సిన విషయమే.

మోడీజీ.. ఈ మాత్రం అయినా చేస్తున్నారు...

  రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ ఏం చేసినా.. చేయక పోయినా ఓ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలకు కాస్త ఊరట కలిగించే పని ఒకటి చేయనున్నారు. ఇంతకీ అదేంటనుకుంటున్నారా...? అదే అసెంబ్లీ సీట్ల పెంపకం. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపకంపై ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై ఎన్నో సార్లు మోడీతో మన ఇద్దరు చంద్రులు గత కొద్దికాలంగా చర్చిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా  ఈ విషయంలో మొదటి అడుగు పడినట్టు తెలుస్తోంది.   తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన ఫైలు కేంద్ర హోం శాఖ కొంత సమాచారం కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తాజాగా పంపినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ఈసీ తన అభిప్రాయం చెప్పాలని అందులో కోరింది. ఇక దీనిపై ఎన్నికల కమిషన్‌ తన అభిప్రాయం 3-4 రోజుల్లో చెప్పనుంది. ఆ అభిప్రాయం వచ్చాక మరో 4 శాఖలకు కూడా హోం శాఖ ఇటువంటి లేఖలు రాయాల్సి ఉంది. వారి నుండి సమాధానాలు వచ్చాక అన్నిటినీ కలిపి ఓ నిర్ణయానికి వస్తారు. వాటిని ప్రధాని ఆఫీసు ఆమోదించాక దీనిని కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందు పెడతారు. ఒకసారి కేబినెట్‌ ఆమోదంతో అది పార్లమెంటు ముందుకు వెళ్తుంది. ఇక అక్కడ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఇద్దరు చంద్రుల కోరిక తీరినట్టే. మరి ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మరి కొంత సమయం పడుతుంది కదా. ఒకవేళ కేబినెట్ ఆమోదం లభించినా పార్లమెంట్లో ఆమోదం లభించాలి కదా..? మరి ఏం జరుగుతుందో.. వచ్చే ఎన్నికల లోపు ఈ ప్రక్రియ ముగుస్తుందో లేదో... చూద్దాం...

మోడీకి బాబు కట్టుకున్న పెళ్లాం.. జగన్ ఉంచుకున్న పెళ్లాం..

  బాబు కట్టుకున్న పెళ్లాం.. జగన్ ఉంచుకున్న పెళ్లాం.. అదెంటీ అనుకుంటున్నారా...? సీపీఐ నేత రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకుంటే.. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-టీడీపీ మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే రెండు పార్టీలు మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ.. ఈ రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పొత్తుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇక ఎప్పుడు టీడీపీ పక్కకు తప్పుకుంటుందా.... ఎప్పుడు మధ్యలో దూరదామా అని వైసీపీ పార్టీ చూస్తుంది.   అంతేనా ఇప్పటికే వైసీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. గతంలో జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి... చంద్రబాబుకు ఇవ్వనప్పుడే ఈ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నంద్యాల, కాకినాడ ఎన్నికల తరువాత బీజేపీకి ఉన్న పొగరు కాస్త దిగిపోయి...జగన్ తో పొత్తుకు కాస్త వెనుకడుగు వేసిందనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఏదో బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నా ఎన్నికల సమయం దగ్గరకొస్తున్న కొద్దీ ఈ స్నేహం ఎంతవరకూ ఉంటుందో తెలియని స్థితి ఉంది. దీనిపై చంద్రబాబు సడెన్ గా నిర్ణయం తీసుకునే స్థితిలో కూడా లేరు.   ఇక ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే.. కేంద్రంతో సఖ్యతగా ఉందామని ఆ పార్టీ అధినేత వైఎఎస్ జగన్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి టీడీపీ వేరయితే తాను ఆ స్థానం భర్తీ చేయాలన్న ఆలోచన కూడా వైసీపీలో కనిపిస్తోంది. అందుకే రాష్ట్రపతి ఎన్నిక వంటి వాటిలో ఏమాత్రం మొహమాటం లేకుండా బీజేపీకి మద్దతిచ్చింది. దీనికి కారణం ఆయనపై ఉన్న కేసుల నుంచి బయటపడాలని చూడటమే. ఎలాగోలా బీజేపీ మెప్పు పొందాలని కేంద్రంలో ఉన్న బీజేపీని మచ్చిక చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమోనన్నది ఆయన ఆలోచన.   ఈ క్రమంలో జగన్, చంద్రబాబు వైఖరిపై విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో స్నేహం కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని సీపీఐ పార్టీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత రామకృష్ణ మాట్లాడుతూ....ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు కట్టుకున్న పెళ్లాంలా వ్యవహరిస్తుంటే.. వైఎస్ జగన్ ఉంచుకున్న పెళ్లాంలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తుంటే.. ఇక చంద్రబాబును నోటుకు ఓటు కేసు భయపెడుతోందని ఆయన అన్నారు. మరి చూద్దాం ఎన్నికల సమయానికి ఎవరు ఎవరితో దోస్తీ కడతారో..? ఎవరు సింగిల్ గా బరిలోకి దిగుతారో..?

ఎప్పుడూ అదే ఏడుపా...

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును ఎప్పుడైతే తెరపైకి తీసుకువచ్చారో అప్పటినుండి.. ఈరోజు వరకూ దానిపై ఏడుస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్. ఏదో ఈ ప్రాజెక్ట్ ద్వారానే కోట్లకి కోట్లు నొక్కేశారు అన్నట్టు మాట్లాడుతుంటారు ఎప్పుడు చూసినా. అసలు వాళ్లకి పట్టిసీమ ప్రాజెక్ట్ మీద కోపమా...లేక చంద్రబాబు మీద కోపమా.. లేక రైతుల మీద కోపమా...? వారికే తెలియాలి. ఎందకంటే ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే లాభాలేంటో తెలిస్తే ఇలా మాట్లాడరు.   ఈ రోజున, కృష్ణా డెల్టా రైతులు కాని, గుంటూరు, ప్రకాశంలో కొంత లెక్క రైతులు కాని సంతోషంగా ఉన్నారు అంటే, నాలుగు ముద్దలు తింటున్నారు అంటే అది పట్టిసీం చలవే అని చెప్పొచ్చు. నాగార్జున సాగర్ నుండి ఎంత నీరు వస్తుందో... అది రైతులకు ఎలా ఉపయోగపడుతుందో కాస్త పరిజ్ఞానం ఉన్నవాళ్లకి ఎవరికైనా అర్ధమవుతుంది. అయినా ఇప్పటికీ ఇప్పటికీ పట్టిసీమ దండుగ అంటాడు జగన్. ఇప్పుడు ఆయనతో పాటు వైసీపీ నేత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా తయారయ్యాడు. అసలు కృష్ణ, గోదావరి డెల్టా రైతుల కోసం పట్టిసీమ ద్వారా ఇంత ఖర్చు అవసరమా? అని ప్రశ్నించాడు... ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు... ఈ పట్టిసీమ అసలు ఎందుకు కట్టారో చెప్పండి అంటూ అర్ధంలేని ప్రశ్నలు వేశాడు.   ఇక ఈయన మాటలకు నవ్వుకోవాలో.. కోప్పడాలో కూడా తెలియటం లేదు అంటున్నారు కొంతమంది. అంతేకాదు... అయ్యా రాజేంద్ర ఆ ఖర్చు కేవలం డెల్టా రైతుల కోసమే పెట్టలేదు, దానివల్ల ఆదా అయిన నీటిని రాయలసీమ జిల్లాకే తరలించారు.... షుమారు 150 టియంసి నీరు సీమ రైతాంగంకి ఇచ్చారు అని అంటున్నారు. అంతేకాదు... మీ నాయకుడు పాదయాత్ర చేస్తున్నారు కదా. అక్కడ పచ్చని పొలాలు చూస్తుంటే కూడా అర్ధమవ్వడంలేదా..   మూడేళ్ళు అయినా, మీకు ఇప్పటికీ పట్టిసీమ అంటే ఏంటో తెలియకపోవటం దురదృష్టకరం అంటున్నారు. మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ.. ఇలా విషయం తెలుసుకోకుండా.. ఎంతసేపు ఇంతలా రైతులని ఆదుకున్న పట్టిసీమ మీద, నిత్యం ఏడుస్తూనే ఉంటే ఏం ఉపయోగం ఉండదు.