రాజుగారు కాస్త తగ్గండి...
ఒకపక్క అందరూ కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందని మాట్లాడుకుంటుంటే.... బీజేపీ తీరును ఎండగడుతుంటే మరోపక్క బీజేపీ నేత సోము వీర్రాజు గారు మాత్రం ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడంలేదు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు కేంద్రం ఏపీకి మొండిచేయి చూపించిందని రాజకీయ నాయకులతోపాటు అటు సామాన్యప్రజలు కూడా బీజేపీపై రగిలిపోతున్నారు. గుజరాత్ లో బీజేపీ గెలుస్తుంది అని తెలుస్తున్న టైంలోనే, ప్రెస్ మీట్ పెట్టి, నేను గుజరాత్ లో బీజేపీని గెలిపించా అన్నంత హడావిడి చేసారు... అలాగే కేంద్ర బడ్జెట్ పై కూడా వెంటనే స్పందిస్తారు అని అందరూ అనుకున్నారు... ఒక పక్క తెలుగుదేశం విమర్శలు చేస్తున్నా, వీర్రాజు మాత్రం, బయటకు రాలేదు...అయితే ఏ చిన్న విషయమైనా హంగామా చేసే వీర్రాజు గారు మాత్రం కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన మూడు రోజుల వరకూ మీడియా ముందుకు రాలేదు. పోనీ వచ్చి ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పకపోయినా.. అలాంటి మాటలు నాలుగు మాటలు మాట్లాడినా బాగానే ఉండేది. అది కాకుండా... ఏదేదో మాట్లాడుతున్నాడు పాపం.
ఒకపక్క అమిత్ షా ఏపీ ప్రజల కోపాన్ని పోగొట్టడానికి.. పోలవరం ప్రాజెక్ట్ పక్కగా జరుగుతుంది అని, నవయుగ వచ్చిన తరువాత పనులు స్పీడ్ అందుకుంటాయని, నవయుగని మేమే తెచ్చాం అని కవరింగ్ ఇస్తుంటే, ఇక్కడ వీర్రాజు మాత్రం, పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో ఎంతమేర పనులు జరిగాయని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పజెప్పేస్తామని ప్రకటించిన చంద్రబాబు... ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెస్తున్నారని సందర్భంలేకుండా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి కాని, విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. ఒక పక్క, అమిత్ షా, ఢిల్లీ నుంచి కంట్రోల్ కంట్రోల్ అంటుంటే, సోము వీర్రాజు మాత్రం, వీర ప్రతాపం చూపిస్తున్నారు. మరి రాజుగారు ఇలా మాట్లాడితే పార్టీ పెద్దలనుండే ఆయనకు వార్నింగ్ లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు...