మయన్మార్‌లో సూకీ పార్టీ ఘన విజయం

 

మయన్మార్‌లో జరిగిన ఎన్నికలలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆన్ సాంగ్ సూకీ నేతృత్వంలోని ఎల్ఎన్‌డీ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మయన్మార్‌లో ఎగువ, దిగువ సభలలో ఇప్పటి వరకు సూకీ పార్టీ 348 స్థానాలను గెలుచుకుందని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. 664 సీట్లున్న మయన్మార్ పార్లమెంట్‌లో అధికారంలోకి రావాలంటే 329 స్థానాలను గెలవాల్సి వుంటుంది. సూకీ పార్టీ ఇప్పటికే 348 స్థానాలను గెలిచింది. మరికొన్ని స్థానాల ఫలితాలు వెల్లడి కావల్సి వుంది. సైనిక ప్రభుత్వం ఓటమిని అంగీకరించి ప్రశాంతంగా అధికార బదలాయింపు చేసినట్టయితే మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడనుంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu