ముంబైకి చుక్కలు చూపించిన వినయ్
posted on Apr 5, 2013 6:52AM
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ X ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపిఎల్-6 రెండవ మ్యాచ్ శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఉత్కంఠభరితమైన ఆఖరి ఓవర్లో 10 పరుగులు కావాల్సి ఉండగా బౌలింగ్ కు దిగిన వినయ్ కుమార్ మంచి ఊపుమీదున్న దినేష్ కార్తీక్ ను క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపించాడు. మరుసటి బంతికే అంబటి రాయుడును కూడా అవుట్ చేసి కేవలం ఎదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో బెంగళూరు రాయల చాలెంజర్స్ రెండు పరుగులతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. ముందుగా ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్ చాలెంజర్స్ ఓపెనర్ గా బరిలోకి దిగిన క్రిస్ గేల్ 58 బంతుల్లో 92 పరుగులు సాధించాడు. దీంట్లో 11 బౌండరీలు 5 సిక్సర్లు ఉన్నాయి. దిల్షాన్ 0 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కొద్దిసేపు మెరుపులు మెరిపించినా 14బంతుల్లో 24 పరుగులు 4 ఫోర్లు, 1సిక్సర్ చేసినా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబదలేకపోయాడు. వికెట్ కీపర్ అరుణ్ కార్తీక్ అండగా క్రిస్ గేల్ నిలకడగా ఆడాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 5వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జన్ ప్రీత్ బూమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగిన రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ తొలి వికెట్ కు 52 పరుగులు జోడించారు. లేని పరుగుకు ప్రయత్నించిన సచిన్ టెండూల్కర్ 23 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. రికీ పాంటింగ్ 28 పరుగులు చేసి మురళీ కార్తిక్ అద్భుత బౌలింగ్ లో స్టంపౌట్ అయి పెవిలియన్ చేరుకున్నాడు. రాణిస్తాడనుకున్న రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 11 పరుగులు చేసి వినయ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దినేష్ కార్తీక్, రాయుడు చక్కటి భాగస్వామ్యంతో స్కోరును పెంచుతూ వెళ్ళారు. దినేష్ కార్తీక్ 37 బంతుల్లో 60 పరుగులు (3ఫోర్లు 4సిక్సర్లు) చేశాడు. కానీ ఆఖరి ఓవర్లో వినయ్ కుమార్ వేసిన చక్కటి బౌలింగ్ తో ముంబై ఇండియన్స్ రెండు మూడు పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓడిపోయింది.