English | Telugu

సిరికి ద‌క్కింది ఎంతో తెలుసా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 మొత్తానికి ముగిసింది. ఈ సీజ‌న్‌లో అంతా ఊహించిన‌ట్టుగానే వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. క‌ప్పు ముఖ్యం బిగులూ అంటూ గ‌త కొన్ని వారాలుగా సంద‌డి చేసిన స‌న్నీ అన్న‌ట్టుగానే క‌ప్పు ని ద‌క్కించుకున్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ప్రైజ్ మ‌నీ కింద భారీ మొత్తమే ద‌క్కింది. విజేత‌గా 50 ల‌క్ష‌ల ప్ర‌నైజ్ మ‌నీన‌ని సొంతం చేసుకున్న స‌న్నీ 15 వారాల‌కు గానూ మ‌రో 25 ల‌క్ష‌లు.. సువ‌ర్ణ కుటీర్ వారు అందించే 300 గ‌జాల ఫ్లాట్.. టీవీఎస్ బైక్ ల‌ని ద‌క్కించుకుని దాదాపు కోటికి మించి అందుకున్నాడు.

దీంతో ఫైన‌ల్ వ‌ర‌కు వున్న వారు ఎంత గెలుచుకుని వుంటార‌నే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. స‌న్నీ బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని, 300 గ‌జాల ఫ్లాట్ ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ తో పాటు 15 వారాల‌కు గానూ 25 ల‌క్ష‌ల‌ని కూడా ద‌క్కించుకుని అంద‌రికి షాకిచ్చాడు. గ‌త సీజ‌న్ కంటెస్టెంట్ ల‌తో పోలిస్తే స‌న్నీ భారీగా సొంతం చేసుకోవ‌డంతో ఇత‌ర స‌భ్యుల ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది.

చివ‌రి వ‌ర‌కు నిలిచిన టాప్ 5లోని కంటెస్టెంట్ ల గురించి ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. వీరికి 15 వారాల‌కు గాను ద‌క్కింది ఎంత అన్న‌ది ఇప్పుడు హాట్ న్యూస్‌. చివ‌రి వ‌ర‌కు నిలిచిన వ్య‌క్తులు శ్రీ‌రామ‌చంద్ర‌, మాన‌స్ , సిరి. ఈ ముగ్గురిలో సిరి సొంతం చేసుకున్న రెమ్యున‌రేష‌న్ బ‌య‌టికి వ‌చ్చింది. గ్రాండ్ ఫినాలే ప్రారంభం కాగానే ముందు ఎలిమినేట్ అయిన వ‌క్తి సిరి. ఆమెకు 15 వారాల‌కు గాను 25 ల‌క్ష‌లు ద‌క్కిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వారానికి 1.5 ల‌క్ష‌ల నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోషికంగా నిర్ణ‌యించాయ‌ర‌ట‌. ఆ లెక్కల ప్ర‌కారం సిరికి 25 ల‌క్ష‌లు ద‌క్కింద‌ని చెబుతున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.