English | Telugu

సిరి, ష‌న్ను రిలేష‌న్ పై స‌న్నీ కామెంట్

క‌ప్పు ముఖ్యం బిగులూ.. అప్నా టైమ్ ఆయేగా.. అమ్మ‌కు క‌ప్పు బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని మాటిచ్చా.. అంటూ వీక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న వీజే స‌న్నీ అలియాస్ అరుణ్ రెడ్డి అన్న‌ట్టుగానే బిగ్‌బాస్ సీజ‌న్ 5 విజేత‌గా నిలిచాడు. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో విజేత ఎలా వుండాలో చూపించి ఫైన‌ల్ గా క‌ప్పు కొట్టాడు. ప్రైజ్ మ‌నీనీ కూడా భారీగానే ద‌క్కించుకుని అంద‌రి చేత ఔరా అనిపించుకున్న స‌న్నీ స్టేజ్ పై చెప్పిన మాట‌లు అంద‌రిని క‌దిలించాయి.

ఇక హౌస్ లో స‌రి, స‌న్నీల మ‌ధ్య జ‌రిగిన స‌న్నివేశాల‌ని, వారి మ‌ధ్య వున్న అనుబంధంపై వ‌స్తున్న ఊహాగాల‌కు క్లారిటీ ఇచ్చాడు. ఈ జ‌ర్నీలో త‌న‌ని సిరి, ష‌న్ను వాంటెడ్ గా ఇంబ్బందుల‌కు గురిచేసినా.. అత‌న్ని విల‌న్ గా చిత్రీక‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చేసినా వాట‌న్నింటినీ న‌వ్వుతూనే భ‌రించాడు.. మ‌ళ్లీ వాళ్ల స్నేహం కోసం త‌పించాడు. త‌న‌ని ఎంత దూరం పెట్టాల‌ని స‌రి - ష‌న్ను ప్ర‌య‌త్నిస్తే తాను వారికి అంత ద‌గ్గ‌ర‌య్యేందుకు తాప‌త్ర‌య‌ప‌డ్డాడు.. అక్క‌డే స‌న్నీ గెలిచాడు.

ఇక హౌస్ లో త‌న‌ని ఎంత‌గా అన్ పాపుల‌ర్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా వారి స్నేహం కోస‌మే ముందుకు వెళ్లిన స‌న్నీ గ్రాండ్ పినాలే సాక్షిగా వాళ్ల క‌ళ్లు తెరిపించే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం. త‌న‌ని ద్వేషించినా వారికి మంచే చేయాల‌న్న ఉద్దేశంతో స‌న్నీ.. సిరి - ష‌న్నుల బంధంపై వ‌స్తున్న కామెంట్స్‌కి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ష‌న్ను - సిరిల బంధం గురించి క్లారిటీ ఇవ్వాలి సార్ అని నాగ్ కు చెబుతూనే వారిది మాన‌స్ కు త‌న‌కు ఉన్న బంధం లాంటిద‌ని స్ప‌ష్టం చేశాడు. అంతే కాకుండా సిరి - ష‌న్నుల పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఫైన‌ల్ స్టేజ్ పై స‌న్నీ అన్న మాట‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.