English | Telugu

ఎలిమినేట్ అయిన సిరి.. హౌస్ బ‌య‌ట‌కు తెచ్చిన ర‌ష్మిక‌-దేవి!

బిగ్ బాస్ 5వ సీజ‌న్ తుది అంకానికి వ‌చ్చింది. ఇవాళ ఐదుగురు ఫైన‌లిస్టుల్లో విజేత ఎవ‌రో తేల‌నున్నారు. అంద‌రికంటే ముందుగా ఫైన‌లిస్టుల్లో ఉన్న ఒకే ఒక అమ్మాయి సిరి హ‌న్మంత్ ఎలిమినేట్ అయ్యింది. ఆమెను హౌస్ నుంచి బ‌య‌ట‌కు తెచ్చిందెవ‌రో తెలుసా? యువ‌త‌రం క‌ల‌ల‌రాణి ర‌ష్మికా మంద‌న్న‌, రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్‌. ఆడియెన్స్ పోల్ ప్ర‌కారం ఫైన‌లిస్టుల్లో ముందుగా ఎలిమినేట్ అయిన ఒక‌రిని హౌస్ నుంచి బ‌య‌ట‌కు తెచ్చే బాధ్య‌త‌ను ర‌ష్మిక‌, దేవికి అప్ప‌గించారు హోస్ట్ నాగార్జున‌.

Also read:నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం?

హౌస్‌లోకి ర‌ష్మిక‌, దేవి వెళ్ల‌గాను 'పుష్ప' మూవీలోని "సామి సామి" పాట‌ను ప్లే చేశారు. దానికి ర‌ష్మిక‌తో పాటు సిరి, మిగతా కంటెస్టెంట్లు డాన్స్ చేశారు. ఐదుగురు కంటెస్టెంట్ల‌ను ఒక‌చోట నిల‌బెట్టారు. పైనుంచి ఐదు డ్రోన్లు ఎగురుకుంటూ హౌస్‌లోకి వ‌చ్చాయి. ఒక్కో డ్రోన్‌కు ఒక్కో కంటెస్టెంట్ ఫొటో ఉంది. నాలుగు డ్రోన్లు అక్క‌డే ఉండ‌గా, సిరి ఫొటో ఉన్న డ్రోన్ హౌస్ బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. దాంతో ఆమె ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్ ప్ర‌క‌టించారు.

Also read:శ్రీ‌హాన్ ని తిట్టి అడ్డంగా బుక్కైన ష‌ణ్ముఖ్

అయితే దీన్ని ముందుగానే ఊహించిన‌ట్లు సిరి ఎక్కువ ఎమోష‌న్ కాలేదు. స్పోర్టివ్‌గా తీసుకొని, తోటి కంటెస్టెంట్ల‌కు వీడ్కోలు ప‌లికి, ర‌ష్మిక‌-దేవితో పాటు బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న చిన్న‌త‌నంలోనే తండ్రి చ‌నిపోవ‌డంతో అమ్మే క‌ష్ట‌ప‌డి పెంచింద‌నీ, అయితే ఆమె బిజినెస్ చేసుకుంటూ ఉండ‌టంవల్లా ఆమెతోనూ తాను స‌న్నిహితంగా గ‌డ‌ప‌లేద‌నీ చెప్పింది సిరి. అందువ‌ల్లే ఎవ‌రైనా త‌న‌తో ప్రేమ‌గా మాట్లాడితే, వారికి స‌న్నిహిత‌మైపోతాన‌ని తెలిపింది. ఫైన‌లిస్టుల్లో ఒక‌రిని అవుతాన‌ని ముందుగా తాను ఊహించ‌లేద‌నీ, ఇక్క‌డిదాకా రావ‌డ‌మే త‌న‌కు పెద్ద అచీవ్‌మెంట్ అనీ చెప్పింది సిరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.