English | Telugu

బిగ్ బాస్ నుంచి మాన‌స్ ఔట్‌! అత‌ని దృష్టిలో స‌న్నీ విన్న‌ర్‌!!

ఐదుగురు ఫైన‌లిస్టుల్లో మొద‌ట సిరి ఎలిమినేట్ అయ్యాక మిగిలిన న‌లుగురిలో ఎవ‌రు ముందుగా బ‌య‌ట‌కు వెళ్తారా అని వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఎక్స్ కంటెస్టెంట్స్‌తో పాటు వీక్ష‌కులు ఆత్రుత‌గా ఎదురుచూస్తుండ‌గా, మాన‌స్ ఎలిమినేట్ అయ్యి, బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అత‌డిని హౌస్ నుంచి శ్యామ్ సింగ రాయ్ హీరో హీరోయిన్లు.. నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి తీసుకువ‌చ్చారు. ఆడియెన్స్ పోల్ ప్ర‌కారం టాప్ 4 ఫైన‌లిస్టుల్లో ముందుగా ఎలిమినేట్ అయిన ఒక‌రిని హౌస్ నుంచి బ‌య‌ట‌కు తెచ్చే బాధ్య‌త‌ను వారికి అప్ప‌గించారు హోస్ట్ నాగార్జున‌.

Also read:శ్రీ‌రామ‌చంద్ర‌ను గెలిపించ‌మంటూ ఆటో తోలిన ర‌వి! వీడియో వైర‌ల్‌!!

హౌస్‌లోకి మొద‌ట సాయిప‌ల్ల‌వి, కృతిల‌కు పంపారు నాగ్‌. ఆ ఇద్ద‌రూ వెళ్లి కంటెస్టెంట్ల‌తో మాట్లాతుండ‌గా, నాని చేతికి ఒక మ‌నీ బాక్స్ ఇచ్చి అత‌డిని కూడా హౌస్‌లోకి పంపారు. న‌లుగురిలో ఎవ‌రైనా ఆ బాక్స్‌లోని డ‌బ్బును తీసుకొని వెళ్ల‌వ‌చ్చ‌ని నాని ఆఫ‌ర్ చేశాడు. ఎలిమినేష‌న్‌కు గుర‌య్యేవారికి ఇచ్చే డ‌బ్బు కంటే అందులో ఎక్కువ ఉంటుంద‌ని కూడా చెప్పాడు. కానీ న‌లుగురిలో ఎవ‌రూ ఆ బాక్స్‌ను అందుకోవ‌డానికి ముందుకు రాలేదు.

Also read:నాగ్.. విన్న‌ర్‌గా అత‌న్నే చూడాల‌నుకుంటున్నారా?

అప్పుడు నాగ్ వారికి ఓ టాస్క్ ఇచ్చాడు. నాలుగు గేట్‌ల‌ను పెట్టి వాటిని లాగ‌మ‌ని ఒక్కో కంటెస్టెంట్‌కు చెప్పారు. మొద‌ట స‌న్నీ లాగ‌గా, అత‌డు సేఫ్ అయ్యాడు. త‌ర్వాత ష‌ణ్ముఖ్ కూడా సేఫ్ అయ్యాడు. దాంతో మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర ఇద్ద‌రినీ ఒకేసారి గేట్లు లాగ‌మ‌ని చెప్పారు నాగ్‌. ఆ ఇద్ద‌రూ గేట్లు పుల్ చేయ‌గా, మాన‌స్ బొమ్మ కింద‌ప‌డిపోయింది. దాంతో అత‌ను ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్ అనౌన్స్ చేశారు. అత‌న్ని తీసుకొని గెస్టులు ముగ్గురు.. సాయిప‌ల్ల‌వి, కృతి, నాని బ‌య‌ట‌కు వ‌చ్చారు.

Also read:సోహైల్ ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో చెప్పేశాడు

ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌ని అనుకుంటున్నావ‌ని మాన‌స్‌ను నాగ్ ప్ర‌శ్నించ‌గా, అత‌ను స‌న్నీ పేరు చెప్పాడు. ఎందుక‌ని నాగ్ అడిగితే, అత‌నిలో ఆ ప‌ట్టుద‌ల‌, క‌సి ఎక్కువ‌గా ఉన్నాయ‌ని జ‌వాబిచ్చాడు మాన‌స్‌.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.