English | Telugu

రౌడీ రోహిణి ప్రెగ్నెంట్ ... బాబును కూడా కన్నది.

బుల్లితెర మీద లేడీ కమెడియన్స్ లో రౌడీ రోహిణి ఫుల్ ఫేమస్. అసలు రోహిణి షో స్టేజి మీదకు వచ్చిందంటే చాలు ఆడియన్స్ పడీ పడీ నవ్వాల్సిందే. ఇక ఇప్పుడు రోహిణి గర్భిణీ ఐన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకు రోహిణి గర్భిణీ అయ్యిందా చూద్దాం. రాబోయే జబర్దస్త్ ప్రోమోలో రోహిణి గర్భిణీగా నటించింది. అందులో కమెడియన్ సన్నీ భర్తగా నటించాడు. ఐతే 9 నెలలతో గర్భంతో రోహిణి నొప్పులు పడుతుంటే పక్కనే సన్నీ కూడా పడుతూ ఉన్నాడు. "నాకంటే నొప్పులు మొదలయ్యాయి. నీకేమయ్యింది.

నొప్పులు పడుతున్నావ్ " అని అడిగింది రోహిణి. "నీకు నెలలు నిండాయి . నాకు సంవత్సరాలే నిండాయి కదే" అన్నాడు కామెడీగా సన్నీ. ఈ గ్యాప్ లో రోహిణికి బాబు కూడా పుట్టేస్తుంది. ఇంతలో పక్కింట్లోంచి ఆటో రాంప్రసాద్ తన బిడ్డను తీసుకుని వచ్చాడు. "ఇంతకు మీ బాబుకు ఎం పెట్టారు" అని రోహిణిని అడిగాడు. "రాజు" అని పెట్టాను అని చెప్పేసరికి "అదేం పేరండి చూడండి మా పాపకు ఎం పేరు పెట్టానో గుడుగుడు గుంజం" అన్నాడు ఆ పేరుకు షాక్ అయ్యింది రోహిణి. "నా మాట విని అప్పడప్పడ తాండ్ర"| అని పెట్టండి అని రాంప్రసాద్ సలహా ఇచ్చాడు. రోహిణి కూడా అదేదో గొప్ప పేరన్నట్టు నామకరణం చేసి పిలవడం స్టార్ట్ చేసింది. అలా ఈ జబర్దస్త్ ఎపిసోడ్ రోహిణి గర్భిణీ అయ్యింది బాబును కూడా కన్నది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.