English | Telugu

యష్మీకి వెన్నుపోటు పొడిచిన ప్రేరణ.. నామినేషన్లో బిగ్ ట్విస్ట్‌ ఇదే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎవరు ఊహించని విధంగా తొమ్మిదవ వారం నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో చెత్త రీజన్స్ తో విష్ణుప్రియ నామినేషన్ చేసింది. గౌతమ్, ప్రేరణ, తేజ, నయని, నబీల్‌లను తన కారణాలు చెప్పి నామినేట్ చేసింది విష్ణుప్రియ. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే బిగ్ బాస్ ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చాడు.

విష్ణుప్రియ నామినేట్ చేసిన వారిలో నుండి సేవ్ చేసే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ప్రతిసారి పోలీస్ సైరన్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్లి జైలు కీ ని పట్టుకుంటారో వాళ్లు జైల్లో ఉన్న ఒక సభ్యుడ్ని విడిపించి.. నామినేషన్స్ నుంచి సేవ్ చేసి బయట ఉన్న సభ్యుల నుంచి ఒకరిని నామినేట్ చేసి జైల్లోకి పంపించాల్సి ఉంటుంది.. ఒకసారి కీ సంపాదించిన సభ్యుడు మరోసారి పట్టుకోవడానికి వీల్లేదు.. మెగా చీఫ్ విష్ణుప్రియను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు.. అలానే విష్ణు ' కీ' కోసం పరిగెత్తకూడదంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ముందుగా సైరన్ మోగిన వెంటనే పృథ్వీ కీ తీసుకున్నాడు. వెంటనే నబీల్‌ని సేవ్ చేసి ఆ ప్లేస్‌లో అవినాష్‌ను నామినేట్ చేశాడు.. మీరు స్పీడుగా ఉన్నారు.. తర్వాత కీ తీసుకొని మా వాళ్లను నామినేట్ చేసే అవకాశం ఉంది.. అలానే నా పాయింట్ ఏంటంటే బిగ్‌బాస్ అంటే పిచ్చి అని చెప్పి మీరు బస్తా టాస్కులో వెంటనే గివ్ అప్ ఇచ్చినట్లు అనిపించింది.. అంటూ పృథ్వీ చెప్పాడు. సైరన్ మోగగానే ఈసారి కీ యష్మీ దక్కించుంది. దీంతో తన ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసి హరితేజను నామినేట్ చేసింది. మీ పర్ఫామెన్స్ తగ్గిపోయింది.. ఫైర్ పోయిందంటూ యష్మీ కారణాలు చెప్పింది. ఆ తర్వాత రోహిణి 'కీ' పట్టుకొని అవినాష్‌ను బయటికి తీసుకొచ్చి పృథ్వీ‌ని నామినేట్ చేసి జైలుకి పంపింది.

ఆ తర్వాత అవినాష్ 'కీ' దక్కించుకొని తేజను సేవ్ చేసి.. యష్మీని నామినేట్ చేసి లోపలికి పంపాడు. ఆ తర్వాత ప్రేరణ 'కీ' తీసుకుంది. ఇక అందరు తను యష్మీనే సేవ్ చేస్తుందని అనుకున్నారు. కానీ పృథ్వీని బయటికి తీసుకొచ్చింది ప్రేరణ. ఇది ఊహించని పృథ్వీ.. థాంక్యూ మమ్మీ అంటూ ప్రేరణకి హగ్ ఇచ్చాడు. ఇక పృథ్వీ ప్లేస్‌లో టేస్టీ తేజ‌ను స్వాప్ చేసింది ప్రేరణ. మరో రౌండ్ ఉంటుంది అప్పుడు యష్మీని సేవ్ చేస్తుంది తమ క్లాన్ అని ప్రేరణ అనుకుంది. కానీ ఇంతటితో నామినేషన్స్ ప్రక్రియ ముగిసిందంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో తనని కాపాడిన యష్మీని సేవ్ చేయలేకపోయానని ప్రేరణ ఏడ్చేసింది. గౌతమ్, నయని, హరితేజ, యష్మీ, టేస్టీ తేజ మొత్తం ఐదుగురు సభ్యులు ఈ వారం నామినేషన్స్‌ లో ఉన్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.