English | Telugu

Biggboss 8 Telugu: బజ్ ఇంటర్వ్యూలో మెహబూబ్ బయటపెట్టిన షాకింగ్ నిజాలివే!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది.‌ మెహబూబ్ ఎనిమిదో వారం ఎలిమినేషన్ అయ్యాడు. ఇక బిబి బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు మెహబూబ్.

నీకు దీపావళి అచ్చి రాలేదు అనుకుంటా.. ముందు సీజన్‌లో కూడా దీపావళి రోజే బయటికొచ్చావు. ఈ సీజన్‌లో కూడా దీపావళి రోజే బయటికొచ్చావు. దీపావళి నాకు అచ్చురాలేదని అనిపిస్తుందా అని యాంకర్ అడుగగా.. అదేం లేదని మెహబూబ్ అన్నాడు. సీజన్-4లో పది వారాలు ఉన్నావు. చాలా ఫేమ్ వచ్చింది. మళ్లీ ఎందుకు సీజన్ 8కు రావాలనుకున్నావని యాంకర్ అడుగగా.. నేను దీనిని ఒక అవకాశంలాగా చూశాను. ఇంకా ఎక్కువ ప్రేక్షకులకు తెలియొచ్చు అనుకున్నానని మెహబూబ్ అన్నాడు. తన నామినేషన్స్ గురించి అడిగాడు అర్జున్. మీరు ఈ వీక్ సేఫ్ అయ్యింటే వచ్చేవారం ఎవరిని నామినేట్ చేసేవారు’’ అని అడిగాడు అర్జున్. ‘‘నయని ప్రతీ గేమ్ నేను ఆడతాను అనేది’’ అని కారణంతో సహా తననే నామినేట్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు మెహబూబ్.

టీమ్‌కు కావాల్సిన పాయింట్స్ నేను తెప్పిస్తున్నాను’’ అని గర్వంగా చెప్పాడు మెహబూబ్. ఏ కంటెస్టెంట్ గురించి అడిగినా పాజిటివ్‌గానే ఎందుకు చెప్తున్నావని అడుగగా.. పాజిటివ్, నెగిటివ్ రెండూ చూస్తానని మెహబూబ్ చెప్పాడు. అవకాశం వచ్చాక ఆరుబయట కూర్చున్నాడంట. అవకాశం రాలేదని చెప్పి మంచమెక్కి కూర్చుంటా అన్నాడంట అని అర్జున్ ఓ సామెత చెప్పగానే.. నచ్చలేదనేట్టుగా కనిపించేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు‌ మెహబూబ్. ‌ఇంకా బజ్ ఇంటర్వ్యూ(Biggboss 8 Telugu Buzz) లో హౌస్ లో తనకి ఎవరు బెస్ట్.. ఎవరు వరెస్ట్.. ఎలా ఉంటుందో అన్నీ చెప్పుకొచ్చాడు మెహబూబ్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.