English | Telugu

కన్ఫెషన్ రూమ్ లో ప్రేరణ రివీల్ చేసిన సీక్రెట్ అదే!

బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఆట స్వభావమే మారిపోయింది. ప్రతి సీజన్ లో గాసిప్ చెప్పుకోవడానికి ఒకరుంటారు. అది అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఒక విషయం ఒక అమ్మాయికి తెలిస్తే ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కక్కరిగా అందరికి తెలుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో గాసిప్ క్వీన్ ఎవరు అంటే హరితేజ అని తెలుస్తోంది.

హరితేజ సైలెంట్ గా ఉంటూ అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు ఎవరితో ఉన్నారు.. ఏం మాట్లాడుతున్నారంటూ అంతా కనిపెడుతూ ఉంటుంది. విష్ణుప్రియ, పృథ్వీలు టాస్క్ అనంతరం.. విష్ణుప్రియ భుజాలపై పృథ్వీ చెయ్యి వేస్తుంది. అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత హరితేజ వేరేవాళ్ళతో మాట్లాడుతు.. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. విష్ణు, పృథ్వీలు గంటలు గంటలు మాట్లాడుకుంటారు కదా అసలేం మాట్లాడుకుంటారని అంటున్నారు. నిజంగానే వాళ్ళ మధ్య ఏమైనా నడుస్తుందా.. అది ఎక్కడి వరకు వెళ్తదని తేజ వాళ్ళు అనుకుంటున్నారు. మనం హౌస్ లోకి వచ్చినపుడు మన గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి బెన్ఫిట్ తప్ప ఏం లేదని మళ్ళీ హరితేజ డ్యూయెల్ గా మాట్లాడుతుంది.

ఆ తర్వాత ప్రేరణని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి కేక్ ముందు పెట్టి.. అది కావాలంటే హౌస్ గాసిప్ చెప్పండి అని బిగ్ బాస్ అంటాడు. యష్మీ పట్ల నిఖిల్ కి ఏం లేదు అంటున్నాడు కానీ ఉంది బయటపడట్లేదని ప్రేరణ చెప్తుంది. హౌస్ లో ఎవరికి వారే లవ్ ట్రాక్ నడుపుతూ గాసిప్ కి ఛాన్స్ ఇస్తున్నారనేది అందరికి తెలిసిందే. మరోవైపు హౌస్ లో అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ఎంటర్‌టైన్మెంట్ కావాలన్న ప్రతీసారీ తమ సత్తా చాటుతున్నారు.‌ ఇక హౌస్ లో ఏ గేమ్ లోనైనా బాయ్స్ తో పోటీగా ప్రేరణ పుడింగిలా ఆడుతుంది. ఈ వీక్ ఎవరు మెగా ఛీఫ్ అవుతారో చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.