English | Telugu

జూన్ 13 నుంచి న్యూ సీరియల్ 'కోడళ్ళు మీకు జోహార్లు'

జీ తెలుగులో ప్రసారం కాబోయే కొత్త సీరియల్ "కోడళ్ళు మీకు జోహార్లు " టైమింగ్, లాంచింగ్ డేట్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3.30 గంటలకు రాబోతోంది. దీపావళి కొందరిని విడదీసింది.. కొందరిని కలిపింది. ఐతే అందర్నీ విడదీసిన దీపావళి 14 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపుతుందా.. సంతోషాన్ని పంచుతుందా చూడాల్సిందే అనే సీరియల్ ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

హీరోగా నాగార్జున యాక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇంతకుముందు 'కస్తూరి' సీరియల్ లో పరం అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సీరియల్ లో కనిపించబోతున్నాడు. హీరోయిన్స్ గా దుర్గశ్రీ, కౌస్తుభ మణి నటిస్తున్నారు. దుర్గశ్రీ ఇది వరకు ఉదయ టీవీలో ప్రసారమైన 'నేత్రావతి' అనే సీరియల్ లో నటించారు. ఇక కౌస్తుభ మణి కలర్స్ కన్నడలో 'నన్నరాసి రాధే' అనే సీరియల్ లో ఇంచరా అనే పాత్రలో యాక్ట్ చేశారు.

ఈ సీరియల్ లో ఇంకా చరణ్ రాజ్ ఒక పాత్రలో కనిపించనున్నాడు. అతను 'వదినమ్మ' సీరియల్ లో భరత్ అనే పాత్రలో యాక్ట్ చేశారు. 'నిన్నే పెళ్ళాడతా', 'స్వర్ణ పేలెస్' అనే సీరియల్స్ లో నటించిన జయరాం పవిత్ర ఈ సీరియల్ లో అత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సీరియల్ లో మెయిన్ గా ఆనాటి అందాల నటి రాగిణి తల్లి కేరెక్టర్ లో కనిపించనున్నారు. ఈమె గురుంచి చెప్పాలంటే ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రేమ్ సాగర్ ఒక రోల్ లో నాగార్జునకు తల్లి పాత్రలో జానకి వర్మనటిస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.