English | Telugu

ఆలోచ‌న‌లో ప‌డ్డ రిషి, వ‌సు.. ఏం జ‌రుగుతోంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న ఫ్యామిలీ డ్రామా `గుప్పెడంత మ‌న‌సు`. వ‌సుధార‌, రిషి జంట నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ రోజు రోజుకీ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగేలా క‌నిపిస్తోంది. గ‌త కొన్ని ఎపిసోడ్‌లుగా త‌న ప్రేమ‌ని వ‌సుధార‌తో చెప్ప‌డానికి ఇబ్బందులు ప‌డిన రిషి మొత్తానికి త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్టేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా శుక్ర‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిగా సాగ‌బోతోంది. రిషి త‌న గ‌దిలో ఒంట‌రిగా కూర్చొని వ‌సుధార అన్న మాట‌ల‌ని గుర్తుచేసుకుంటూ వుంటాడు. ఇదే స‌మ‌యంలో రిషి రూములోకి వ‌చ్చిన తండ్రి మ‌హేంద్ర రిషి మ‌న‌సులో ఏముంది? .. వ‌సుధార గురించి త‌ను ఏమ‌నుకుంటున్నాడ‌ని ఆరాతీసే ప్ర‌య‌త్నం చేస్తాడు. కానీ రిషి మాత్రం ఎక్క‌డా బ‌య‌ట‌ప‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాడు.

ఇదే క‌ర్మంలో వ‌సుధార ఆరోగ్యం గురించి తెలుసుకోమ‌ని జ‌గ‌తికి ఫోన్ చేయ‌మంటాడు రిషి దాంతో మ‌హేంద్ర .. జ‌గ‌తికి ఫోన్ చేసి వ‌సుధార ఆరోగ్యం గురించి తెలుసుకుంటాడు. క‌ట్ చేస్తే క్యాలేజ్ క్యాబిన్‌లో జ‌గ‌తి, మ‌హేంద్ర కూర్చుని రిషి, వ‌సుధార‌ల గురించి మాట్లాడుకుంటుంటారు. ఇంత‌లో అక్క‌డికి రిషి వ‌స్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? రిషి .. జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల‌ని ఏమ‌డిగాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది ఈ రోజు ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.