English | Telugu

అప్పుడు క్రష్ ఇప్పుడు అక్క.. ఇద్దరి మధ్య రివేంజ్ నామినేషన్!

బిగ్ బాస్ సీజన్ -8 లో యష్మీ పాపకి ఉనంత క్రేజ్ మరి ఎవరికి లేదు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా యష్మీ ని నామినేట్ చేసాడు గౌతమ్. మిమ్మల్ని మేడమ్ అనొచ్చా అని గౌతమ్ మొదలెట్టగా.. కాల్ మీ యష్మీ అని తను అంటుంది. నువ్వు ఒక్కో చోట ఒక్కోలాగా మాట్లాడావ్.. ఫ్లిప్ అయ్యావని గౌతమ్ అనగా.. మరి నువ్వు కాదా.. ఒకసారి క్రష్ అంటావ్ మరోసారి అక్క అంటావ్.. నువ్వు ఫ్లిప్ అవ్వడం లేదా అని యష్మీ అంటుంది.

ఆ తర్వాత యష్మీ ని రోహిణి నామినేట్ చేస్తుంది. గంగవ్వ కూడా యష్మీ నే నామినేట్ చేసి.. నువ్వు నీకు నచ్చినట్టు జరిగితే ఒకలా లేదంటే చిరాకుగా ఉంటావని అర్ధం వచ్చేలా గంగవ్వ అంటుంది. నువ్వు ఆ ప్రేరణ కలిసి గౌతమ్ పిలగాడి మీద పడతారు. ఏం అంటుండు ఆ పిలగాడు.. నువ్వు ఒక్కరితోనే ఉంటావని నామినేట్ చేస్తుంది.

ఆ తర్వాత గౌతమ్ ని రివెంజ్ నామినేషన్ చేస్తుంది యష్మీ.. వీకెండ్ లో ఏదో జరిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చి అక్క అంటూ మాట్లాడడం నాకు నచ్చలేదు. అక్క అనే ఎమోషనల్ అక్కడ లేదు కాబట్టి నాకు ఇష్టం లేదని యష్మీ అంటుంది. ప్లీజ్ అక్క అనకు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. గౌతమ్ నామినేషన్ అంగీకరించి కలర్ నీళ్ళు పోసుకొని వస్తాడు. నేను అక్క అంటే ఇంత మంది హర్ట్ అవుతున్నారా సారీ అని గౌతమ్ అందరికి చెప్తాడు. గౌతమ్ కి యష్మీ టవల్ ఇస్తూ.. ఇక మన మధ్య ఏం గొడవలు వద్దని చెప్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.