English | Telugu

బిగ్‌బాస్ : ఈ రోజు ర‌చ్చ అంత‌కు మించి

మొత్తానికి విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 ప‌ద‌వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. కంటెస్టెంట్‌ల విష‌యంలో ఇప్ప‌టికే ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తూనే వున్నారు. సీజ‌న్ 4తో పోలిస్తే తాజా సీజ‌న్ అన్ని విష‌యాల్లోనూ తేలిపోయింద‌ని, కంటెస్టెంట్‌ల పెర్ఫార్మెన్స్ ఏమంత‌గా లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నెటిజ‌న్స్ తాజాగా శ‌నివారం ఎపిసోడ్ విష‌యంలో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగ్ తీరుపై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ప‌ద‌వ వారం వ‌ర్టిగో వ్యాధి కార‌ణంగా బాధ‌ప‌డుతున్న జెస్సీ ఆరోగ్య‌కార‌ణాల వ‌ల్ల హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. దీంతో అత‌ని స్థానంలో బ‌య‌టికి వెళ్లాల్సిన కాజ‌ల్ మొత్తానికి సేఫ్ అయిపోయింది. ఇదిలా వుంటే సోమ‌వారం నామినేష‌న్‌ల ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో హౌస్ మ‌రోసారి ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో హీటెక్క‌బోతోంది. అంద‌రికి మ‌న‌సులో వున్న నిజాల‌ని బ‌య‌ట‌పెట్టే ధైర్యం వుండ‌దు. నిజాల‌ని నిర్భ‌యంగా నిల‌దీసే అవ‌కాశ‌మే ఈ రోజు జ‌రిగే నామినేష‌న్ ప్ర‌క్రియ అంటూ బిగ్‌బాస్ హౌస్ మెంబ‌ర్స్ మ‌ధ్య కొచ్చ చిచ్చుకు తెర‌లేపాడు.

దీంతో సోమ‌వారం రోజు ర‌చ్చ అంత‌కు మించి వుండేలా క‌నిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `నీ త‌ప్పు నీకు చెబితే నీకు నేను ఫేక్ ఎలా అనిపించానో నాకు అర్థం కాలేదు మామా అంటూ స‌న్నీని ఉద్దేశించిన ర‌వి అన‌డం.. అంద‌రి ముందు నాది బ్యాడ్ బిహేవియ‌ర్ అన‌డం .. ఆ వ‌ర్డ్‌ని నేనే తీసుకోలేక‌పోయాను మామ‌` అని స‌న్నీ స‌మాధానం చెప్ప‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ర‌చ్చ‌కు దారి తీసింది. ఇదిలా వుంటే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ష‌న్నూ .. కాజ‌ల్‌ని నామినేట్ చేయ‌డం.. ఇంటి నుంచి నువ్వు బ‌య‌టికి వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని నా ఫీలింగ్ అని చెప్ప‌డం.. ఇదే క్ర‌మంలో స‌న్నీ కార‌ణంగా మాన‌స్‌, ష‌న్నూల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో ఈ సోమ‌వారం ఎపిసోడ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.